పాకిస్తాన్లో అశాంతికి మూల్యం చెల్లిస్తున్న భారత్

Publish Date:Mar 16, 2013

Advertisement

 

రెండు నెలల క్రితం పాకిస్తానీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ వద్ద భారత సరిహద్దులలోకి జొరబడి ఇద్దరు భారత జవాన్లను క్రూరంగా చంపడమే కాకుండా, వారిలో హేమంత్ అనే ఒక సైనికుడి తల నరికి తీసుకుపోయినప్పుడు మన జాతీయ రాజకీయపార్టీలన్నీ చాలా హడావుడి చేసాయి. కానీ, ఆ తరువాత ఆ సంగతిని పక్కన పడేసారు. మళ్ళీ మొన్న ఉగ్రవాదులు ఏకంగా మన సైనికుల శిభిరం మీదనే దాడి జరిపి ఐదుగురు సైనికులను పొట్టన బెట్టుకొన్నారు. మళ్ళీ మన రాజకీయ పార్టీలు అంతే హాడావుడి చేసాయి.

 

మన పార్లమెంటు మీద దాడికేసులో అఫ్జల్ గురూను ఉరితీయడాన్ని ఖండిస్తూ పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ ఈ నెల 14న ఏకగ్రీవ తీర్మానం చేసింది. అంతే గాకుండా, అతని శవాన్ని అతని కుటుంబ సభ్యులకు ఇవ్వాలని మరొక తీర్మానం కూడా చేసింది.

 

మన దేశం మీద దాడిచేసే ఉగ్రవాదులను తన గడ్డపై అనుమతించడమే కాకుండా, వారి దాడిలో అనేక మంది అమాయకులయిన ప్రజలను ప్రాణాలు కోల్పోతుంటే, అటువంటి వారిని పట్టుకొని దండించకపోగా, వారికి ఆశ్రయం కూడా ఇస్తూ, తిరిగి భారత్ ను తప్పు పడుతోంది. గత మూడు దశాబ్దాలలో పాకిస్తాన్ దుశ్చర్యలు నానాటికీ పెరుగుతున్నాయే తప్ప, ఎన్నడూ తగ్గుముఖం పట్టలేదు. భారత్ ఆ దేశంతో ఎంత సంయమనంగా ప్రవర్తిస్తున్నపటికీ, దానిని అలుసుగా తీసుకొని పాకిస్తాన్ పదే పదే ఇటువంటి కవ్వింపు చర్యలకు ప్రయత్నిస్తోంది.

 

భారత్ లో జరిగిన ప్రతీ ఉగ్రవాద దాడికీ మూలాలు పాకిస్తాన్ లో ఉండటం, ఇక్కడ దాడులకు పాల్పడిన వారు నేరుగా ఆ దేశానికి పారిపోయి అక్కడ నిర్భయంగా ప్రజల మధ్య సంచరించడం వంటివి గమనిస్తే, పాకిస్తాన్ కి మన దేశంపట్ల ఎటువంటి ఆలోచనలు ఉన్నాయో స్పష్టం అవుతుంది.

 

నిన్న జరిగిన పార్లమెంటు సమావేశాలలో ఉభయ సభలు కూడా పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ, భారత్ అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించాయి. అంతే కాకుండా, ప్రస్తుతం పాకిస్తాన్ అధీనంలో ఉన్న పాక్ ఆక్రమిత కాశ్మీరు కూడా భారతదేశానిదేనని ఏకగ్రీవ తీర్మానం చేసాయి. పాకిస్తాన్ మన కాశ్మీరులో కొంత భాగం ఆక్రమించుకొన్న తరువాత కూడా అవకాశం దొరికినపుడల్లా అంతర్జాతీయ వేదికల మీద కాశ్మీర్ సమస్యను లేవనెత్తే ప్రయత్నం చేస్తూనే ఉంది. కానీ, ఇంతవరకూ దానిని ఖండించడంతోనే సరిపెడుతున్న భారత్, మొట్టమొదటిసారిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మాదేనని నిర్ద్వందంగా ప్రకటన చేయడం ఆ దేశానికి ఒక హెచ్చరిక వంటిది. అయితే, ఇటువంటి హెచ్చరికలకు భయపడితే అది పాకిస్తాన్ దేశం ఎందుకవుతుంది? మాటకు మాట ఇచ్చేందుకు ఎన్నడూ వెనుకాడని పాకిస్తాన్ త్వరలోనే భారత పార్లమెంటు చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ మరో తీర్మానం చేయవచ్చును.

 

వీటివల్ల ఉభయ దేశాలకు ఒరిగేదేమీ లేకపోయినా, అంతంత మాత్రంగానే ఉన్న సంబంధాలు మరింత చెడుతాయి. పాకిస్తాన్ కు కూడా ఆసంగతి బాగానే తెలిసినప్పటికీ, నాటికి ఆ దేశంలో క్షీణిస్తున్న పరిస్థితుల నుండి ప్రజల దృష్టి మళ్ళించి తాత్కాలిక ఉపశమనం పొందేందుకు ఇటువంటి చవకబారు ప్రయత్నాలు చేస్తుంది.

 

ఒకవైపు తాలిబాన్లు బాంబులు పేల్చుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తుంటే, మరో వైపు ఆ తాలిబాన్లను వేటాడే మిషతో అమెరికా తన డ్రోన్ విమానాలతో పాక్ ప్రజల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది. అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. ప్రభుత్వాధీనంలో ఉండవలసిన సైనికాధికారులే ప్రభుత్వాన్ని తమ కనుసన్నలలో నడిపిస్తున్నారు. అవినీతికి, అసమర్ధతకు మారుపేరుగా మారిన ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజలు వీదులకేక్కి నిరసనలు తెలియజేయడం అక్కడ నిత్య కృత్యంగా మారిపోయింది. నానాటికి పెరుగుతున్న ద్రవ్యోల్భణం, దిగజారుతున్న ప్రజల జీవన పరిమాణాలు అన్నీ కలిపి ఆదేశాన్ని 'అశాంతి నిలయం'గా మార్చాయి. ఈ సమస్యల నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు భారతదేశాన్నిబూచిగా చూపిస్తూ పాకిస్తాన్ చేస్తున్న ఇటువంటి ప్రయత్నాలకు భారత్ మూల్యం చెల్లించుకోవలసి రావడం చాల విచారకరం.

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.