నేటికి సరే... రేపటికి ఏమో....!
Publish Date:Oct 3, 2012
Advertisement
దేశ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ పుట్టింది. ఆ పార్టీ పేరు త్వరలో వెల్లడికానుంది. అయితే ఆ పార్టీ పెట్టింది ఎవరో కాదు అవినీతిపై అన్నా హజారేతో కలసి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో విస్తృతంగా పాల్గొన్న ఆయన బృందంలోని ప్రముఖులు అరవింద్ కేజ్రీవాల్. ఆయనతో పాటు మరికొందరు కలిసి ఇంకా పేరునిర్ణయించని పార్టీని పెట్టారు. భవిష్యత్ ఎన్నికల్లో పోటీచేస్తుందని, అన్నాహాజారేకు తనకు మధ్య విభేదాలు లేవని, మంచి అభ్యర్ధులకు మద్దతిస్తానని హజారే చెప్పారన్నారు. దీనిపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. ‘క్రేజీవాల్ కొత్తపార్టీని ప్రారంభించారని మీడియా పేర్కొంటోంది. కాని ఇది నా పార్టీ కాదు. మీ పార్టీ... ఇది ప్రజల పార్టీ. అన్నారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెబుతూ ‘గెలుస్తామా ఓడిపోతామా అన్నది నాకు తెలియదు. కానీ ఇప్పుడు నేను పోరాడకపోతే ఒక అవకాశాన్ని వృధాచేశానని భవిష్యత్లో నా పిల్లలు నిందిస్తారు’ అన్నారు. ప్రజలకు నిస్వార్ధంగా, నిజాయితీగా, అవినీతిరహితంగా పనిచేసే పార్టీ అవసరం. ఇప్పటివరకు అవినీతిపై నిస్వార్ధంగా హజారేతో కలిసి పోరాడి ఇప్పుడు రాజకీయపార్టీ పెట్టిన క్రేజీవాల్ ఓ రాజకీయపార్టీ అధినేతగా అదే అవినీతిపై ఎంతవరకు పోరాడగలరన్నది సామాన్యులను సైతం వేధిస్తున్న ప్రశ్న! రాబోయే కాలంలో ఈ పార్టీ మిగతా అన్ని పార్టీల్లా కాకుండా తన ప్రత్యేకతను నిలుపుకుంటుందో... ఆ పార్టీల సరసన చేరుతుందో... రాబోయే ఎన్నికల దాని భవితవ్యం నిర్ణయిస్తాయి. నేటి రాజకీయాలు వీరే గనుక ఇప్పుడుంటే... ధర్మరాజును అవినీతిమంతునిగా చేయగల నేర్పు, హరిశ్చంద్రచక్రవర్తితో సైతం అలవోకగా అబద్ధాలు ఆడిరచగల చాకచక్యం ఈనాటి రాజకీయాలకు ఉన్నాయి. అందుకే రాబోయే పార్టీపై సామాన్యుడి సందేహం..
http://www.teluguone.com/news/content/new-political-party-24-17869.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





