ఈ సృష్టి ఏటు దారితీసేనో....
Publish Date:Oct 3, 2012
Advertisement
లడఖ్లోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై ఆల్టిట్యూట్ రిసెర్చ్ (డిఐహెచ్ఎఆర్) తీవ్ర చలిలోను తట్టుకోగల కొత్త సంకరజాతి ఆవులను, మేకలను అభివృద్ది చేసింది. అవసరాలకు తగినట్లుగా, సైనికులకు పుష్కలంగా మాంసాహారం, పాల ఉత్పత్తులను అందించే లక్ష్యంతో వీటిని వృద్ధి చేసింది. లడఖ్, హిమాలయాలు ఇతర చలి ప్రాంతాల్లో ఉన్న వాతవరణాన్ని ఇవి సమర్ధవంతంగా తట్టుకోగలవు. ఈ సంకరజాతి ఆవులు 25 లీటర్లపాలను ఇచ్చే సామర్ధ్యం ఉందని తెలిపింది. దీనివల్ల సైనికులు స్థానిక ప్రాంతాలపై ఆధారపడటం 25శాతం తగ్గిపోతుందని తెలిపింది. చాలా బావుంది. ఇప్పటికే వ్యవసాయానికి సంబంధించి ఎన్నిటినో సంకరంచేశారు. దీనివల్ల మిశ్రమ ఫలితాలు వచ్చాయని ఎంతోమంది అభిప్రాయపడ్డారు. ఇప్పుడు సంకరజాతి ఆవులు. ప్రయోగాలు చేయడం అధిక దిగుబడుల పేరుతో సంకరజాతి ఉత్పత్తులను సృష్టించడం. వాటిని సామాన్యులు వినియోగించడం. కొంతకాలం తర్వాత వాటి ఉత్పత్తులపై అనుమానాలు, పరిశోధనలు. ఈ ప్రయోగాల ఫలితాలు అన్నిటా మంచి ఫలితాలను ఇస్తే అందరికి సంతోషమే.. అలాకాకుండా కొద్దికాలమనంతరం వాటి ప్రభావం చూపితే అప్పటి పరిస్థితి ఏమిటి! ఇప్పటికే వ్యవసాయంలో సంకరజాతి విత్తనాలను వాడి, ఉపయోగించకూడని ఎరువులను వాడి భూమిలో సారం, పంటల దిగుబడి తగ్గిపోయింది. అటువంటిదే వీటి విషయంలోనూ జరిగితే... అన్నదే అన్నది సామాన్యుడి ప్రశ్న!
http://www.teluguone.com/news/content/defence-institute-of-high-altitude-research-(dihar)-24-17868.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





