ఏడుకొండల పైన కొత్తా దేముడు.. ఎవరో తెలుసా?

Publish Date:Apr 27, 2023

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ వ్యతిరేకి అయినా కాకున్నా, హిందువు అయితే కాదు.  ఇది జగమెరిగిన సత్యం. ఆయన కుటుంబ చరిత్రే అందుకు సాక్ష్యం. అయితే ఆయన దేవుని పాలనలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి అనేందుకు సందేహించవలసిన అవసరం లేదు  అని హిందూ ధార్మిక సంస్థలు, స్వాములు, స్వామీజీలు ఎప్పటినుంచో చెపుతున్న మాట చేస్తున్న ఆరోపణ.

ఒక విధంగా హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న   ధర్మాగ్రహం. ఇప్పుడు, ఆ ధర్మాగ్రహ వాణిలో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీ  సైతం గొంతు కలిపారు.  సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై స్వామీజీ ఆగ్రహం వ్య్తక్తం చేశారు. నాజీవితంలో ఇలాంటి చందనోత్సవాన్ని చూడలేదన్నారు. సంప్రదాయాన్ని మంట గలిపేసారని స్వామిజీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 
నిజానికి స్వామీజీ ఇప్పుడే ఆగ్రహం వ్యక్తపరిచినా, జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటన ఇదొకటే కాదు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం.

వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న  నిర్ణయాల వరకు టీటీడీ  అపచారాలకు లెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని భక్తులు, హిందూ ధర్మ సంస్థలు ఎన్నో మార్లు ఆరోపించాయి. ఆగ్రహం వ్యక్తం చేశాయి. 
అంతే కాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులు పదే పదే వ్యక్తపరుస్తూనే ఉన్నారు.

ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో టీటీడీ దోపిడీకి పాల్పడుతోందని, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది,  దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు.
నిజానికి, ఒక్క ఏడు కొండలవాడి విషయంలోనే కాదు అప్పన్న దేవుని విషయంలోనూ అపచారాలకు కొదవలేదని అంటున్నారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులకు సరైన సదుపాయలు కల్పించక పోవడం, అందుకు సంబదించి శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకెత్తు అయితే, ఇక్కడా ఆగమ శాస్త్ర ఉల్లంఘన జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

అప్పన దేవుని నిజరూప దర్శనం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆగమ శాస్త్రానుసారం స్వయంభూ మూర్తుల వీడియో, ఫొటో తీయకూడదు. అయితే  గత సంవత్సరం ఆ తప్పు జరిగింది. అదే తప్పు ఈ సంవత్సరం మళ్ళీ జరిగింది. గత ఏడాది ఘటనపై దేవస్థానం అధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటించినా దర్యాప్తు జరిగిన దాఖలాలు లేవు. ఈ అలసత్వం వల్లే ఈ ఏడాది కూడా అదే అపచారం పునరావృతమైందని దేవస్థానంలో చర్చ జరుగుతోంది.

ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక పరుస్తున్నారు. వెంకన్న  స్వామి మీద భక్తి విశ్వాసాలతో కొండెక్కిన భక్తులకు కొత్తా దేవుడు (మా నమ్మకం నువ్వే జగనన్న) స్టిక్కర్లు దర్శనం  ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవుని పట్ల అపరాధం మాత్రమే కాదు, చట్టరీత్యా నేరమని అంటున్నారు. రాజకీయ పార్టీల జెండాలు, నినాదాలు రాసున్న స్టిక్కర్లు, చివరకు రాజకీయ పార్టీల గుర్తులున్నచేతి సంచీలు, రాజకీయ ప్రచార సామాగ్రి ఏదీ కొండమీదకు తీసుకురరాదని, టీటీడీ నియమాలే ఘోషిస్తున్నాయి. అందుకే ఇంతవరకు ఎన్నికల సమయంలోనూ తిరుమల కొండలపై ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ గుర్తులతో ప్రచారం చేసిన సందర్భం లేదు. కానీ ఇప్పడు ఏకంగా  మా నమ్మకం నువ్వే జగనన్న  స్టిక్కర్లు అంటిస్తున్నారు. అయినా టీటీడీ అధికారులు, పోలీసులు, విజిలెన్స్అధికారుల ఎవరూ పట్టించుకోవడం లేదు.ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు.

మరో వంక ఇది ఇలాగే సాగితే రేపు మాడ వీధుల్లో, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట ఇలా ఎక్కడంటే అక్కడ రాజకీయ జెండాలు, నినాదాలు దర్శననమిస్తాయని హిందూ ధార్మిక సంస్థలు అంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యమత వ్యాప్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారని హిందూ ధార్మిక సంస్థలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకురుస్తోందని,ఇప్పటికైనా ప్రభుత్వం, టీటీడీ కళ్ళు తెరవక పోతే, వైసీపీని ఏ దేవుడు రక్షించలేరని ... భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

By
en-us Political News

  
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.
ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం.
2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.
ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.