ఎన్నికల వేళ రెండో రాజధాని రగడ!

Publish Date:Jun 18, 2023

Advertisement

దేనిని అయితే చూసుకొని కన్నూ మిన్నూ కానకుండా మిడిసి మిడిసి పడుతున్నారో.. దానిని వారి వద్ద నుంచి బలవంతంగానో.. ఎలాగోలా.. లాగేసుకొంటే.. ఆ తర్వాత వారి పరిస్థితి.. అనంతరం చోటు చేసుకొనే పరిణామాలు అందరికీ తెలిసినవే. చూడబోతే అలాంటి ప్రయత్నానికి కేంద్రంలోని మోదీ సర్కార్ శ్రీకారం చుట్టిందనే ఓ చర్చ అయితే తాజాగా పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా యమ రంజుగాసాగుతోంది. 

గులాబీ బాస్ కేసీఆర్‌ను దెబ్బ కొట్టి.. తెలంగాణలో పాగా వేయాలి.. అలాగే పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రజల మనస్సులను చొరగొనాలి.. ఆ క్రమంలో అందుకు తగ్గట్లు కేంద్రంలోని మోడీ సర్కార్ వ్యూహాత్మకంగా ప్రణాళికలు సిద్దం చేసుకొని.. ఆ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తుందా?.. అందులోభాగంగానే  కేంద్ర మాజీ మంత్రి, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగరరావు ఆకస్మాత్తుగా తెరపైకి వచ్చి దక్షిణాదిలోని హైదరాబాద్‌ మహానగరం దేశానికి రెండో రాజధాని కావాల్సిన అవసరం ఉంది.. అంతేకాదు దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని అయి.. తీరుతోందని ఆయన స్పష్టం చేయడం.. అంబేద్కర్ స్మాల్ స్టేట్స్ పుస్తకంలో హైదరాబాద్ రెండో రాజధాని అని ప్రస్తావించిన అంశాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేయడం.. అదే విధంగా ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీలు చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలంటూ సన్నాయి నొక్కులు నొక్కడం చూస్తుంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏదో మతలబు తెరపైకీ తీసుకు వచ్చేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తోందన్న ప్రచారం జోరందుకుంది.  

అదీకాక గవర్నర్ గిరి పూర్తి అయిన తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్‌గా ఉన్న సిహెచ్ విద్యాసాగరరావు.. ఇలా ఒక్కసారిగా తెరపైకి వచ్చి మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ  ప్రకంపనలు సృష్టిస్తోంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  విభజన జరిగి.. తెలంగాణలో దశాబ్ది ఉత్సవాలు వేడుకలు ఘనంగా జరుగుతోన్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోవడంతో.. ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. 

అలాంటి వేళ.. ఇటువంటి నిర్ణయం అయితే అందరికీ శ్రేయస్కరమనే భావనలో మోడీ ప్రభుత్వం ఉందని.. అదీకాక హైదరాబాద్ మహానగరం నుంచి పన్నుల రూపంలో లక్షల కోట్ల రూపాయిల ఆదాయం వస్తుందని.. దీనిని చూసి కేసీఆర్ అండ్ కో.. కేంద్రంతో డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోందని,  ఆ క్రమంలో భాగ్యనగరాన్ని దేశానికి రెండో రాజధానిగానే కాకుండా..  రెండు తెలుగు రాష్ట్రాలకు రాజధానిగా చేయడం..  అలాగే కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే.. దీంతో బీజేపీకే కాదు.. తెలుగు రాష్ట్రాల ప్రజల అన్ని సమస్యలకు జిందా తిలిస్మాత్ లా ఔకటే ఔషదం అన్నట్లుగా అవుతోందని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ  వైరల్ అవుతోంది. 

అదీకాక దశాబ్దాల కింద కాకినాడ వేదికగా జరిగిన సభలో ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానం చేసిన కమలనాథులు.. మళ్లీ తాజాగా దేశానికి రెండో రాజధానిగానే కాకుండా... రెండు రాష్ట్రాలకు ఒకటే రాజధాని.. అదీ హైదరాబాద్ అని మోడీ సర్కార్ ప్రకటిస్తే సరిపోతుందనే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   అలా అయితేనే   అనుకున్నది  అనుకున్నట్లుగా సాధించగలుగుతామని.. మరోవైపు జమ్ము కాశ్మీర్‌లో గతంలో నిత్యం కాల్పులు, బాంబు దాడులు, కిడ్నాపులు వార్తలతో నిండిపోయి ఉండేదని.. కానీ ఆర్టికల్ 370 రద్దు తర్వాత సదరు రాష్ట్ర పరిస్థితి ఎలా మారిపోయిందో అందరికీ తెలిసిందేనని .. అదే విధంగా మోదీ సర్కార్.. హైదరాబాద్‌పై ఇటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

ఒకవేళ అలా చేస్తే.. తెలంగాణలో చక్రం తిప్పుతోన్న కేసీఆర్ అండ్ కో.. తమ వ్యూహాలకు మరింత పదును పెట్టి.. కార్యక్షేత్రంలోని దూకుతొందనడంలో ఎటువంటి సందేహం లేదనే చర్చ సైతం నడుస్తోంది. అదీకాక. . విభజనతో ఆంధ్రప్రదేశ్ తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతే.. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ సైతం దశాబ్ది వేడుకల సాక్షిగా లక్షల కోట్ల ఆప్పులో మునిగిపోయింది. అలాంటి వేళ.. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్‌ను కేంద్రం ఎంపిక చేస్తే.. ప్రజలు సైతం సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయనే చర్చ సైతం సాగుతోంది.  అదీకాక.. హైదరాబాద్ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రాహావిష్కరణ సందర్బంగా ఆయన మనవడు ప్రకాశ్ అంబేద్కర్ సైతం తన తాత గారు దేశనికి రెండో రాజధానిగా హైదరాబాద్ ఉండాలని ఆకాంక్షించారని గుర్తు చేశారు. ఇదే సభా వేదికపై తెలంగాణ సీఎం కేసీఆర్ పక్కనుండగానే ప్రకాశ్ అంబేద్కర్ ఈ వ్యాఖ్యలు చేయడం కోసమెరుపు.

By
en-us Political News

  
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
ఆ సందర్భంగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గాన్ని మంగళగిరికి దీటుగా అభివృద్ధి చేస్తానన్నారు.
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.