రాష్ట్రపతి ముర్మును కలిసి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి లోకేశ్

Publish Date:Apr 13, 2026

Advertisement

 

కూటమి ఎంపీలతో కలిసి ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా అమరావతి చారిత్రక, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని రాష్ట్రపతికి లోకేశ్ వివరించారు.

 

 

అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి లోకేశ్‌తో పాటు ఎన్డీయే ఎంపీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయంతో రాజధాని రైతులు, రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆమెకు వివరించారు.

 

 

ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోకేశ్, ఎంపీలతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనను ఇంటెలిజెంట్, విజనరీ నాయకుడిగా అభివర్ణించారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలు ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. అందుకు కృషి చేసిన చంద్రబాబు నాయుడిని అభినందించారు.

 

 

రాష్ట్రపతిని కలిసేందుకు మంత్రి నారా లోకేశ్ బృందం ఆదివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకోగా, సోమవారం ఆమెతో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. భేటీ అనంతరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ, అమరావతి బిల్లుకు ఆమోదం తెలిపినందుకు రాష్ట్రపతికి కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని రాష్ట్రపతి ప్రశంసించారని తెలిపారు.ఇక ఢిల్లీలో ఈ నెల 30 నుంచి మే 10 వరకు నిర్వహించనున్న శ్రీవేంకటేశ్వర స్వామివారి దేవస్థాన బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించాలని టీటీడీ అధికారులకు మంత్రి సూచించారు.
 

By
en-us Political News

  
వెనిజులాలో రాజకీయ మార్పులు అక్కడి నుంచి చమురు సరఫరా అంతరాయం. ఇరాన్ లో ఘర్షణలు, చమురు ఎగుమతులు దెబ్బతినడం. రష్యాపై ఆంక్షలు, సరఫరా పరిమితి, సౌదీ ఉత్పత్తి తగ్గుదల, ధరలు పెరుగుదల. వీటి ఫలితంగా.. చైనా రోజువారీ చమురు దిగుమతుల్లో 20 శాతం తగ్గుదల. ఇది చైనా ఆర్థిక ఇంజిన్ కు పెద్ద దెబ్బ.
కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.
రోహిత్ , రితేష్ బ్యాంక్ ఖాతా నుంచి కేదార్‌కు రూ.25 లక్షలు బదిలీ అయినట్టు గుర్తించారు. ఈ భారీ లావాదేవీపై విచారణ జరిపినప్పుడు.. కేదార్‌తో ఉన్న సంబంధాలపై రోహిత్ రెడ్డి, రితేష్ ఇచ్చిన సమాధానాలు ఒకదాని కొకటి పొంతన లేకుండా ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఈ కేసులో కీలక వ్యక్తిగా ఉన్న మధు అప్రూవర్‌గా మారి వెల్లడించిన విషయాలు సంచలనంగా మారాయి. మంగ్లీకి ఈ వ్యవహా రంతో ఎలాంటి సంబంధం లేదని మధు స్పష్టంగా పేర్కొన్నాడు. అసలు మోసం చేసిన వ్యక్తి హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపించారు. కంపెనీలో పెట్టిన దాదాపు రూ.20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించారు.
ఐపీఎల్ వంటి అగ్రశ్రేణి వేదికపై ఒక్క రాత్రిలో స్టార్లుగా మారే ఆటగాళ్ల వెనుక ఎన్నో కన్నీటి గాథలు, కఠిన శ్రమ దాగి ఉంటాయి.
ఐఎంఎఫ్ గణాంకాల ప్రకారం, 2027, 2028 ఆర్థిక సంవత్సరాలకు గాను భారతదేశ జీడీపీ 6.5 శాతం స్థాయిలో నమోదు కానుంది. ప్రపంచంలోని ఇతర దిగ్గజ దేశాలతో పోలిస్తే ఇది అధికం. ముఖ్యంగా చైనా 4.4 శాతం వృద్ధికే పరిమితం అవుతుందని, అగ్రరాజ్యం అమెరికా సైతం 2.3 శాతం వృద్ధికి మాత్రమే పరిమితమౌతుందని ఐఎంఎఫ్ నివేదిక అంచనా వేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత పవన్‌ ఖేరాకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
ప్రపంచ చమురు రవాణాలో 20శాతం కంటే ఎక్కువ భాగం హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే ఇరాన్, ఆ తరువాత అమెరికా అమెరికా నావికాదళ దిగ్బంధన ఆదేశాల కారణంగా గ్లోబల్ మార్కెట్లలో అస్థిరత నెలకొంది. అయితే ఈ పరిస్థితులలో కూడా భారత్ వృద్ధి అంచనాను ఐఎమ్ఎఫ్ పెంచడం సానుకూల సంకేతమనే చెప్పాలి.
ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్ లు ఆడింది. అయితే ఒక్క మ్యాచ్ లో కూడా విజయం సాధించలేదు. నాలుగు మ్యాచ్ లలో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఒక మ్యాచ్ వర్షార్పణమైంది. దీంతో పాయింట్ల పట్టికలో అడుగు నుంచి తొలి స్థానంలో నిలిచింది.
ఎండీ జాకీర్ ఉస్మాన్, బషీర్‌బాగ్‌కు చెందిన జువెలర్ సుఖేష్ గుప్తా కలిసి నిజాం కాలం నాటి విలువైన ఆభరణాల్లో వాటా ఇస్తామని చెప్పి తన నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారని అగర్వాల్ ఆరోపిస్తున్నారు. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ నెల 9న కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
చిన్న వయస్సులోనే కాలేయ సమస్యల బారిన పడటం వల్ల వారి ఉత్పాదకత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. అయితే కాలేయ వ్యాధులు ప్రారంభంలోనే గుర్తిస్తే 90 శాతం వరకు తిరిగి నయం చేసుకునే అవకాశం ఉంది. దీనికి ఖరీదైన మందుల కంటే క్రమశిక్షణతో కూడిన జీవనశైలే ప్రధానమైన పరిష్కారం.
1990 నుంచి 2023 వరకు దేశంలో ఫ్యాటీ లివర్ వ్యాధి విస్తరణలో 23% పెరుగుదల ఉంది. అధ్యయనాల ప్రకారం, భారతదేశంలో ఫ్యాటీ లివర్ కేసులు 23% కంటే ఎక్కువగా పెరిగాయి. నగర ప్రాంతాల్లో ఇది 9 నుంచి 32 శాతం పెరుగుదల ఉండగా, రాష్ట్రాల్లో అయితే ఏకంగా 60శాతం వరకూ చేరినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ నెల 19 నుండి వచ్చే నెల 31 వరకు ఎండల తీవ్రత విపరీతంగా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.