స్టాండప్ కమెడియన్ అనుదీప్ అరెస్టు

Publish Date:Apr 15, 2026

Advertisement

తెలుగు హీరోలపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన నేపథ్యంలో స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలను పోలీసులు అరెస్టు చేశారు.  మూడు రోజుల క్రితం జరిగిన ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో తెలుగు హీరోలను కించపరుస్తూ అనుదీప్ వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యాఖ్యలతో షోకు హాజరైన కొందరు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనుదీప్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి దాడి చేసేందుకు ప్రయత్నించారు.   పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అనుదీప్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

ఈ ఘటన తర్వాత రెండు రోజులకే, తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ అనుదీప్ ఒక వీడియో విడుదల చేశారు. అయితే వివాదం ఇక్కడితో ఆగలేదు. అతని వ్యాఖ్యలు  రాజకీయ రంగు పులుముకున్నాయి.  తన కుటుంబాన్ని కలిసేందుకు ప్రయాగ్‌రాజ్ వెళ్లిన   అనుదీప్ కటికలను మంగళవారం (ఏప్రిల్ 14) ఆంధ్రప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ పోలీసులు ప్రత్యేక బృందాలతో అతని ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసి మంగళవారం (ఏప్రిల్ 14)   తన తండ్రితో కలిసి ఒక పార్కులో ఉన్న సమయంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం  కాకినాడకు తరలించినట్టు తెలుస్తోంది.

ఇటీవల నిర్వహించిన స్టాండ్-అప్ కామెడీ షోలో టాలీవుడ్ నటులు, అభిమాన సంస్కృతిపై అనుదీప్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆరోపిస్తూ జనసేన పార్టీకి చెందిన ఓ నాయకుడు కాకినాడలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.  ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. 

By
en-us Political News

  
ఏపీ సి ఐ డి తన విచారణ లో భారీ స్థాయిలో అక్ర మాలు జరిగినట్లు నిర్ధారించడంతో ఈడీ చర్యలు మరింత వేగం పుంజుకు న్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు హైదరా బాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్70లో ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో నగరం లోని మరికొందరు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో కూడా అధికారులు రికార్డులు, డిజిటల్ పరిక రాలు, ఆర్థిక లావాదే వీలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇండియాలోనూ రోబోల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తమిళనాడులోని కాంచీపురంలో దేశంలోనే మొట్టమొదటి డార్క్‌ ఫ్యాక్టరీని పాలిమాటెక్అ నే సంస్థ ప్రారంభించింది.
గత మార్చిలో భారత్ రష్యా నుండి రోజుకు సుమారు 2.25 మిలియన్ బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకుంది, ఇది ఇప్పటివరకు నమోదైన గరిష్ట స్థాయి. ఈ నెలలో ఏప్రిల్ మాసంలో కూడా రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్ల సరఫరా కొనసాగుతుందని అంచనా. ప్రస్తుతం భారత మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా దాదాపు 50 శాతానికి చేరుకుంది. తక్కువ ధరకు లభిస్తున్న ఈ చమురు.. దేశ ఇంధన బిల్లు భారాన్ని గణనీయంగా తగ్గిస్తోంది.
భారత్, రష్యా నౌకలకు రక్షణ నష్టపరిహార కవరేజీ ఇవ్వగల ఆమోదిత బీమా సంస్థల సంఖ్యను 11కి పెంచింది. వీటిలో గాజ్ప్రోమ్ ఇన్సూరెన్స్, రోస్గోస్స్ట్రాఖ్ ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయి.ఈ ఇన్సూరెన్స్ కవరేజి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ చెల్లుబాటు అవుతుంది. అలాగే బ్యాలెన్స్ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ చెల్లుబాటు ఈ ఏడాది ఆగస్టు 19 వరకూ ఉ:టుంది. సోగ్లాసీ, స్బేర్బ్యాంక్ ఇన్సూరెన్స్, ఉగోరియా, ఏఎస్టికె ఇన్సూరెన్స ల కవరేజీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 20 వరకూ, అలాగే.. విఎస్కె, సోగాజ్, అల్ఫాస్ట్రాఖోవానియే, ఇంగోస్స్ట్రాఖ్ ల కవరేజీ కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకూ పొడిగించింది.
ఈ బిల్లులోని నిబంధనలు అత్యంత కఠినంగా ఉన్నాయి. ప్రస్తుతం ఏటా అందుబాటులో ఉన్న 65,000 హెచ్-1బీ వీసాల సంఖ్యను 25,000కు కుదించాలని బిల్లే పేర్కొంది. అంతేకాకుండా.. ప్రస్తుతం అమల్లో ఉన్న లాటరీ పద్ధతిని రద్దు చేసి, కేవలం అత్యధిక వేతనం పొందే నిపుణులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెమూడో రోజుకు చేరుకుంది. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే తమ సహచర కార్మికుడు మరణించాడని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకర్‌గౌడ్ మృతితో కార్మికుల నిరసనలు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం వంటి ప్రాంతాల్లో కూడా కొందరు కార్మికులు నిరసనగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు.
ఓపెనర్‌గా వచ్చిన సంజు శాంసన్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 54 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 101 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ 22, డెవాల్డ్ బ్రెవిస్ 21 పరుగులు చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తూ స్పందించింది.
దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ కాళింగిరి శాంతికి సంబంధించి విజయవాడ ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని బండి సంజయ్ మండిపడ్డారు.
తమిళనాడు మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సాయంత్రంతో ముగిసింది.
రాష్ట్రంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
చాయ్ అంటే ప్రాణం పెట్టే నగరం హైదరాబాద్. ఉదయం కప్పు నుంచి అర్ధరాత్రి స్టాల్ వరకూ చాయ్ లేకుండా రోజే కదలదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.