గుమ్మడికాయల దొంగ అంటే...

Publish Date:Jun 12, 2015

Advertisement

 

 

పద్దెనిమిది మంది భారతసైనికులను పొట్టన పెట్టుకొన్న నాగా ఉగ్రవాదులు పొరుగు దేశమయిన మయన్మార్ అడవులలో తలదాచుకొన్నట్లు తెలియగానే భారత ప్రభుత్వం తన ఆర్మీ కమెండోలను పంపించి భారత సరిహద్దుకి అవతల దాగి ఉన్నవారినందరినీ మట్టు బెట్టించి ప్రతీకారం తీర్చుకొంది. ఇంత కాలంగా ఉగ్రవాదులు భారత్ పై దాడులు చేస్తున్నా, సరిహద్దుల వద్ద పాక్ సైనికులు మన సైనికుల తలలు నరికి తీసుకుపోతున్నా ఇంతవరకు అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం కేవలం వాటిని ఖండించడమే తప్ప ఏనాడు ఈవిధంగా ప్రతిచర్యలు చేప్పట్టలేదు. కానీ ప్రధాని మోడీ అనుమతించడంతో భారత కమెండోలు తమ సహచరులను పొట్టనపెట్టుకొన్న ఉగ్రవాదులను వేటాడి మట్టుబెట్టారు. అందుకు భారతీయులు అందరూ చాలా సంతోషిస్తున్నారు.

 

మయన్మార్ దేశంలో జరిపిన ఈ సైనిక చర్య గురించి రక్షణ శాఖా మంత్రి మనోహర్ పారికర్ మీడియాకు క్లుప్తంగా వివరిస్తూ “ఇది మనపై దాడులు చేయాలని చూస్తున్న పొరుగుదేశాలకు ఒక హెచ్చరిక వంటిది. ప్రభుత్వ ఆలోచనా విధానంలో కలిగిన మార్పు ప్రకారం భారత సైనికులు కూడా అందుకు అనుగుణంగా వ్యవహరించారు. కనుక భారత్ పై దాడులు చేద్దామని ఆలోచిస్తున్న పొరుగు దేశం ఈ మార్పును గుర్తిస్తుందని ఆశిస్తున్నాము,” అని అన్నారు.

 

ఆ మాటలు పాకిస్తాన్ ఉద్దేశ్యించి చేసిన హెచ్చరికలేనని వేరేగా చెప్పనవసరం లేదు. అందుకే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకొన్నట్లుగా పాకిస్తాన్ మాత్రమే స్పందించింది. “అటువంటి పనులు మయన్మార్ చేయవచ్చునేమో కానీ పాక్ భూభాగంలో సాధ్యం కాదని భారత్ గుర్తిస్తే మంచిది,” అని పాక్ ఘాటుగా బదులిచ్చింది.

 

దానికి మళ్ళీ మనోహర్ పారికర్ “మయన్మార్ లో జరిగిన సైనిక చర్యను చూసి ఉలిక్కిపడి భయపడినవారే స్పందించారు” అని పాకిస్తాన్ ప్రభుత్వానికి చిన్న చురక వేసారు.

 

పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన మంత్రివర్గాన్ని సమావేశపరిచి “భారత్ చేస్తున్న ప్రకటనలు చాలా కవ్వించేవిగా ఉన్నాయి. దాని వలన ఇరుదేశాల మధ్య శాంతి ప్రక్రియకు భంగం కలుగుతోంది. భారతదేశంతో సహా అన్ని ఇరుగుపొరుగు దేశాలతో పాక్ చక్కటి స్నేహ సంబంధాలే కోరుకొంటోంది. కానీ భారత్ పెద్దన్న పాత్ర పోషిస్తూ మామీద కర్రపెత్తనం చేయాలని ప్రయత్నిస్తోంది. పాక్ సార్వభౌమత్వాన్ని భారత్ సవాలు చేస్తే సహించబోము,” అని ఒక తీర్మానం చేసి ఆమోదించుకొన్నారు. అది పాక్ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి చెప్పుకోవడానికి ఉపయోగపడవచ్చునేమోగానీ, భారత్ దానిని పరిగణనలోకి తీసుకోదని వారికీ తెలుసు. ఎందుకంటే నవాజ్ షరీఫ్ ఈ శాంతి సందేశం మీడియా ముందు చదువుతున్న సమయంలోనే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల వద్ద పాక్ సేనలు భారత సైనికులపై కాల్పులు జరుపుతున్నాయి.

 

ఇప్పుడు భారత ప్రభుత్వ ఆలోచనా విధానం మారింది కనుక ఇదివరకులా భారత్ చేతులు ముడుచుకొని కూర్చోదని, పాక్ చేసే ప్రతీ చర్యకి భారత్ నుండి ప్రతిచర్య తప్పనిసరిగా ఎదుర్కోవలసి ఉంటుందని రక్షణమంత్రి మనోహర్ పారికర్ ప్రకటించడం తప్పు కాదు. ఎవరిపైనా కర్ర పెత్తనం చేయాలనే ఉద్దేశ్యంతో చేసినదీ కాదు. పాక్ భూభాగంలో భారత్ సేనలు ప్రవేశిస్తే ఎదుర్కొంటామని ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏవిధంగా చెప్పారో అదేవిదంగా భారతదేశంలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించాలని చూసే ఉగ్రవాదుల పట్ల తాము చాలా కటినంగా వ్యవహరిస్తామని మనోహర్ పారికర్ కూడా చెప్పారు. అందుకు పాక్ ఆ విధంగా ప్రతిస్పందించడం ఊహించదగ్గదే.

 

కానీ ‘అత్త కొట్టినందుకు కాదు ఏడ్చింది తోడి కోడలు నవ్వినందుకే ఏడ్చానన్నట్లు’ పారికర్ మాటలకి పాకిస్తాన్ తో బాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఉలిక్కిపదినది. దేశంపై ఉగ్రవాదులు, పాక్ సైనికులు దాడులు చేస్తున్నా యూపీయే ప్రభుత్వం చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చొందని, తమదొక చేతకాని అసమర్ధ ప్రభుత్వమని, దేశభద్రత విషయంలో కూడా రాజీపడిందని, మనోహర్ పారికర్ దేశ ప్రజలకు చెపుతున్నట్లుగా ఆ పార్టీ అర్ధం చేసుకొని ఆయనపై తీవ్రంగా విరుచుకుపడింది.

 

కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మీడియాతో మాట్లాడుతూ, “రక్షణమంత్రి పారికర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడటం అలవాటు చేసుకొంటే మంచిది. ఆయనతో సహా మరికొందరు మంత్రులు, అధికారులు తామేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు దీని గురించి చాలా గొప్పలు చెప్పుకొంటున్నారు. అటువంటి వారందరికీ ప్రధాని మోడీ అదుపు చేస్తే బాగుంటుంది. నేపాల్ దేశంలో భూకంపం వచ్చినప్పుడు, ఇటువంటి గొప్పలకు పోవడం వలననే ఆ దేశానికి సహాయపడటానికి వెళ్ళినపుడు భారత్ కు చేదు అనుభవం ఎదురయిందని గుర్తుంచుకొంటే ఈవిధంగా మాట్లాడరు,” అని ఘాటుగా విమర్శించారు.

 

దట్టమయిన మయన్మార్ అడవులలో ప్రవేశించి భారత సైనికులు ప్రదర్శించిన ఆ అపూర్వ సాహాసాన్ని భారత ప్రజలు అందరూ ప్రశంసిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం విమర్శిస్తోంది. ప్రభుత్వాన్ని మెచ్చుకాకపోయినా కనీసం ఆ వీర సైనికులను మెచ్చుకొన్నా వారు సంతోషించేవారు. కానీ ఆవిధంగా చేస్తే తన అసమర్ధతను తనే స్వయంగా ఒప్పుకొన్నట్లవుతుందని, ఇప్పటికే ఈ చర్యతో మోడీ గురించి ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకొంటుంటే, తాము కూడా ఆయన గొప్పదనాన్ని అంగీకరించినట్లవుతుందని కాంగ్రెస్ పార్టీ భావించిందే తప్ప ఒక్క చిన్న అభినందనతో భారత సైనికుల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించవచ్చని ఆలోచించలేదు.

 

బిన్ లాడెన్ పాకిస్తాన్ భూభాగంలో తలదాచుకొన్నాడని పసిగట్టిన అమెరికా, తన కమెండోలని పంపించి అతనిని మట్టుబెట్టినప్పుడు యావత్ ప్రపంచ దేశాలు దాని గురించి ఎంతో గొప్పగా కధలుకధలుగా వర్ణించి చెప్పుకొన్నాయి. అమెరికా దేశంలో ప్రతీ పౌరుడు కూడా తమ దేశంపై దాడి చేసి వేలాది ప్రజలను పొట్టనబెట్టుకొన్న ఆ ఉగ్రవాదిని స్వయంగా తన చేతులతో చంపినంతగా ఆనందపడ్డాడు. అమెరికాలో అధికార, ప్రతిపక్షాలన్నీ పండగ చేసుకొన్నాయి.

 

కానీ భారత సైనికులను పొట్టనబెట్టుకొన్న నాగా ఉగ్రవాదులను భారత కమెండోలు వెంటాడి మట్టుబెడితే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది! తనకు చేతకాని పనిని మోడీ ప్రభుత్వం చేసి చూపుతోందనే అసూయే అందుకు కారణమని అర్ధమవుతోంది. అయితే పార్టీ రాజకీయ ప్రయోజనాలు, వ్యూహాలు, ప్రభుత్వాలను పాలించే వ్యక్తుల కీర్తి ప్రతిష్టలన్నిటి కంటే కూడా దేశ ప్రయోజనాలు, దేశ సార్వభౌమత్వమే మిన్న దానికే అందరూ ప్రాధాన్యం ఇవ్వాలి. అందులో భిన్నాభిప్రాయలకి తావు లేదు, ఉండకూడదని ఇంతకాలంగా దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడమే చాలా విచిత్రం. చాలా దురదృష్టకరం.

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.