త్వరలో గవర్నర్ మార్పు..నరసింహన్ తెలంగాణాకే పరిమితం?

Publish Date:Jun 11, 2015

Advertisement

 

రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా వ్యవహరిస్తున్న నరసింహన్ తెలంగాణా ప్రభుత్వం వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారని ఆంద్రప్రదేశ్ మంత్రులలో చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన అనేక వినతి పత్రాలపై ఆయన ఎటువంటి చర్య చేప్పట్టకపోవడమే కాకుండా తెలంగాణా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కొందరు మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెదేపాకు చెందిన యంయల్యేలను ముఖ్యమంత్రి తెరాసలోకి ఆకర్షించి వారిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటివారికి మంత్రి పదవులు కట్టబెడుతుంటే, అటువంటి రాజ్యాంగ విరుద్దమయిన చర్యలను గవర్నర్ అడ్డుకోకపోగా వారిచేత ప్రమాణస్వీకారం కూడా చేయించడాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.

 

విభజన బిల్లులో సెక్షన్ 8 ప్రకారం ఆయన ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్ని ప్రభుత్వ వ్యవస్థలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. కానీ తెదేపా యంయల్యే రేవంత్ రెడ్డిపై ఎసిబి నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ గురించి ఆయనకి ఎటువంటి ముందస్తు సమాచారం లేనట్లు తెలుస్తోంది. అదే విధంగా ఆ తరువాత బయటపడిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి కూడా ఆయనకు ఇంతవరకు సమాచారం లేకపోవడంతో ఆయనకు హైదరాబాద్ నగరంలో ఏమి జరుగుతోందనే విషయంపై సరయిన సమాచారం కానీ, అవగాహన గానీ లేదనే విషయం రుజువయిందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

గవర్నర్ నిర్లిప్తత పట్ల ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసంతృప్తిగా ఉన్నారనే విషయం నిన్న మొట్టమొదటిసారిగా బయటపడింది. తమ పార్టీ యం.యల్యేగా కొనసాగుతున్న తలసానికి ఆయన ఏవిధంగా పదవీ ప్రమాణం చేయించారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఉమ్మడి రాజధానిలో సంపూర్ణాధికారాలు గవర్నర్ కే కట్టబెట్టాలని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నప్పటికీ ఆయనను మార్చితే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వం వద్ద అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ పరిస్థితులలో మరి ఆయనని మార్చుతుందో లేకపోతే ఆయనను తెలంగాణాకు పరిమితం చేసి ఆంధ్రాకు మరో గవర్నర్ నియమిస్తుందా? లేక ఆయననే కొనసాగిస్తుందా...అనేది త్వరలోనే తెలియవచ్చును. కానీ నిన్న హోంమంత్రి రాజ్ నాద్ సింగ్ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు తారసపడినప్పుడు, ఆయనని పిలిచి మరీ ఫోటో తీయించుకొన్నారు ఎందుకో...? ఆయన హైదరాబాద్ లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు నిత్యం ఏదో ఒకపని మీద వచ్చి కలుస్తూనే ఉంటారు. అలా కలిసినప్పుడల్లా మీడియా వాళ్ళు నిత్యం వారి ఫోటోలు తీస్తూనే ఉంటారు. మరి అటువంటప్పుడు డిల్లీలో చంద్రబాబు ఎదురపడినప్పుడు పనిగట్టుకొని ఆయనతో ఫోటో ఎందుకు తీయించుకొన్నారనే సందేహం కలగడం సహజం. బహుశః కేంద్ర ప్రభుత్వం ఆయనని మార్చబోతున్నట్లు ఏమయినా సంకేతాలు ఇచ్చినందునే ఆయన ఫోటో దిగారా? లేక కేవలం యాదృచ్చికంగానే ఆవిధంగా చేసారా? అనే విషయం కూడా త్వరలోనే తెలియవచ్చును.

 

ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాల మధ్య ప్రస్తుతం నెలకొన్న యుద్ద వాతావరణ గురించి మీడియా అడిగిన ఒక ప్రశ్నకు ఆయనిచ్చిన సమాధానం చాలా ఆసక్తికరంగా ఉంది. ‘త్వరలోనే అన్నీ సర్దుకొంటాయి,’ అని చెప్పారు. ఆయన జవాబు వింటే ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య కేంద్ర ప్రభుత్వం రాజీ కుదుర్చుతుందని సూచిస్తున్నట్లుంది. లేకుంటే ఇంతవరకు వచ్చిన తరువాత అన్నీ త్వరలోనే సర్దుకోవడం అసంభవమని అందరికీ తెలుసు. ఏమయినప్పటికీ మరొక్క వారం రోజులలోనే కేంద్రప్రభుత్వం తన వైఖరిని మెల్లగా బయటపెట్టవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

By
en-us Political News

  
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.