Publish Date:Feb 27, 2026
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తాజా చార్జిషీట్ లో పేర్కొన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరు? మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారడంలోనూ, ఆ నిధులను సేకరించడం, కమిషన్లు రాబట్టడం వంటి విషయాల్లో కలక సూత్రధారిగా సిట్ పేర్కొన్న ముప్పిడి అవినాష్ రెడ్డి ఎక్కడి వాడు? అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని అంటున్నారు. మద్యం కుంభకోణానికి సంబంధించి కమిషన్లను సేకరించడమే కాకుండా వాటిని భద్రంగా సిండికేట్ కు అందించడంలోనూ ముప్పిడి అవినాష్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ చెబుతోంది. మొత్తం సిండికేట్కు అవినాష్రెడ్డే కీలకమని సిట్ తన చార్జిషీట్ లో పేర్కొంది. నిధులను దారి మళ్లించి.. సిండికేట్ లోని కీలక వ్యక్తులకు చేరవేయడం అవినాష్ రెడ్డి చేతుల మీదుగానే జరిగిందన్న ఆరోపణలు ఉన్న సంగతి విదితమే.
అలాగే ఎవరైతే ఎక్కువ కమీషన్లు ఇవ్వడానికి ఓకే అన్నారో.. వారికి మాత్రమే ఆర్డర్లు దక్కేలా చక్రం తిప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ముప్పిడి అవినాష్ రెడ్డి అత్యంత కీలకంగా మారారని సిట్ పేర్కొంది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ముప్పిడి అవినాష్ సిట్ అధికారుల ముందు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కొరునప్పటికీ.. కోర్టు నిరాకరించడంతో అవినాష్ రెడ్డి లొంగిపోక తప్పలేదు. ఇక రిమాండ్ రిపోర్టులో అవినాష్ రెడ్డి మద్యం తయారీ కంపెనీల నుంచి 3500 కోట్ల రూపాయల ముడుపులు సేకరించినట్లు సిట్ పేర్కొంది. ఈ సొమ్మును 2024 అసెంబ్లీ ఎన్నికలకు వినియోగించే విషయంలోనూ అవినాష్ రెడ్డే కీలకంగా వ్యవహరించారనీ సిట్ రిమాండ్ రిపోర్టు పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/muppidi-avinash-reddy-surrendered-36-214742.html
సైబర్ క్రైమ్ బృందం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, ఐఎంఈఐ ట్రేసింగ్ వంటి పద్ధతులను వినియోగించి ఈ ఫోన్లను గుర్తించి స్వాధీనం చేసుకుంది.
గోదాములో ఉన్న ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు, థర్మాకోల్ సామాగ్రి పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ కొద్దిసేపటికే గోదాం పక్కనే ఉన్న నివాస గృహానికి కూడా వ్యాపించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
మొజ్తబా ఖమేనీ.. కుటుంబంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అత్యంత విషాదకరంగా, గందరగోళంగా ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న సమాచారాన్ని బట్టీ చూస్తే.. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో.. ఇరాన్ సీనియర్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. చనిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ గా ఖమేనీ కుమారుడు మోజ్తబా ఖమేనీ ఉన్నారు. అయితే ఆయన ప్రస్తుతం కోమ్ నగరంలోని ఒక ఆస్పత్రిలో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది.
ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బుధవారం (ఏప్రిల్ 8) రాష్ట్ర సచివాలయంలో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా ఆ బృందం అమరావతి నిర్మాణ ప్రగతిని ప్రశంసించింది.
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.