మంత్రి గుడివాడతో ముద్రగడ భేటీ..వైసీపీలోకి కన్ఫర్మ్?

Publish Date:Jul 28, 2023

Advertisement

ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు సెగలు రేపుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పై చేయి సాధించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. సామజిక వర్గాల లెక్కలేసుకొని  మరీ రాజకీయంగా అడుగులేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఇప్పుడు కాపు సామజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకొనేందుకు తెలుగుదేశం, వైసీపీ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం-జనసేన పొత్తుగా వెళ్తాయనే ప్రచారం గట్టిగా జరుగుతున్న  సంగతి తెలిసిందే. అధికారికంగా ఈ వ్యవహారం ఇంకా తేలలేదు కానీ.. అటు టీడీపీ, ఇటు జనసేన పార్టీ వర్గాలు పొత్తు ఖరారైనట్లేనని భావిస్తున్నాయి. ఇరు పార్టీల శ్రేణులూ క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేస్తున్నాయి కూడా.  దీంతో వైసీపీ కాపు సామాజిక వర్గాన్ని టీడీపీ-జనసేన వైపు వెళ్లకుండా ఉండేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ప్రయత్నంలో భాగమే ముద్రగడ పద్మనాభంను మళ్ళీ ఫోకస్ లోకి తేవడం.

కాపు రిజర్వేషన్ల సాధన సమితి నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈ మధ్య కాలంలో మళ్ళీ యాక్టివ్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రతో గోదావరి జిల్లాలలో పర్యటిస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభం తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి నాతో పోటీ చెయ్ అని పవన్ కు ముద్రగడ సవాల్ కూడా విసిరారు. ఇక రెండు సార్లు బహిరంగ లేఖలు  రాసారు. ముద్రగడ వ్యాఖ్యలు, లేఖలపై విరుచుకుపడిన జనసేన కార్యకర్తలు, కాపు సామాజికవర్గ ప్రజలు ముద్రగడ మీద తీవ్ర విమర్శలు గుపపించారు. అంతేకాదు  కాపు ఉద్యమం సమయంలో ద్వారంపూడి టిఫిన్లు పెట్టించారని ముద్రగడ పేర్కొంటే.. జనసేన కార్యకర్తలు ఇదిగో మీ ఉప్మా డబ్బులు అంటూ మనీ ఆర్డర్లు చేసి మరీ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఇంకా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వారాహి యాత్ర మొదలు పెట్టారో ముద్రగడ అటాక్ అప్పుడే మొదలైంది. ముద్రగడ వాయిస్ ఎప్పుడైతే రైజ్ చేయడం మొదలు పెట్టారో.. వైసీపీ నేతలు ముద్రగడతో సమావేశమవ్వడం మొదలు పెట్టారు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వైసీపీ నేతల తాకిడి ఎక్కువైంది. ఇప్పటికే వైసీపీ నేతలు ఎంపీ మిధున్ రెడ్డి, కాకినాడ  ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు వంటి నేతలు ముద్రగడను కలవగా.. ఇప్పుడు హఠాత్తుగా విశాఖకు వచ్చిన ముద్రగడ.. గాజువాకలో మంత్రి గుడివాడ అమరనాధ్ తో భేటీ అయ్యారు. అమరనాధ్ తో ముద్రగడ భేటీ వివరాలేవీ వైసీపీ నేతలు  బయటకి రాకుండా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే ఈ భేటీ వెనక ముద్రగడ రాజకీయ పునఃప్రవేశం, వచ్చే ఎన్నికలలో వైసీపీ నుండి పోటీకి దిగడం వంటి రాజకీయాలు అంశాలే ఉన్నాయని రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతున్నది. 

ముద్రగడ తెలుగుదేశం హయాం నుంచే వైసీపీకి టచ్ లో ఉన్నట్లు గోదావరి జిల్లా రాజకీయాలలో ఎప్పటి నుండో వినిపిస్తున్న టాక్ కాగా.. ఇక ఇప్పుడు ఆయన  ఓపెన్ అయిపోయారనీ, ఇక  వైసీపీలోకి జంప్ చేయడానికి రెడీ అయిపోయారనీ తెలుస్తున్నది. ఇప్పటికే ముద్రగడను కలిసిన వైసీపీ నేతలు ఈ మేరకు రాయబారం కూడా నడిపినట్లు చెబుతున్నారు. ఇప్పుడు గుడివాడ అమర్నాధ్ తో భేటీ వెనక కూడా కారణం ఇదే అయి ఉండవచ్చని చర్చ జరుగుతున్నది. నిజానికి ముద్రగడ,గుడివాడ కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్ళుగా సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో కాపు ఉద్యమానికి మద్దతుగా గుడివాడ అమరనాధ్ తండ్రి, మాజీ మంత్రి దివంగత గుడివాడ గురునాధరావు నిలిచారు. ఆయనకూ ముద్రగడకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో స్నేహితుని కుమారుడు మంత్రి అయిన గుడివాడను ఇప్పుడు ముద్రగడ కలిశారు. ఇక ముద్రగడ వైసీపీలోకి వస్తే పిఠాపురం సీటు ఇస్తారని తెలుస్తున్నది. ఎలాగో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబుకు ప్రజలలో పెద్దగా పాజిటివ్  ఇమేజ్ లేదనీ,  దీంతో ఆయన్ని సైడ్ చేసి ముద్రగడని నిలబెడతారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. పిఠాపురం కాకపోతే  కాకినాడ నియోజకవర్గం నుంచి ముద్రగడను ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం కూడా ఉందని అంటున్నారు.   ఒకవేళ ముద్రగడ పోటీ కి విముఖత చూపితే.. కుమారుడిని రంగంలోకి దింపే అవకాశాలున్నాయని అంటున్నారు.  మొత్తానికి ముద్రగడ వైసీపీలోకి రావడం ఖాయమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

By
en-us Political News

  
తెలుగు రాష్ట్రాల్లోనూ పొలిటికల్ పార్టీలకు ఫండ్స్ బాగానే గిట్టుబాటయ్యాయి. అయితే.. ఏపీలో పవర్‌లో ఉన్న టీడీపీ, జనసేన కంటే వైసీపీ కలెక్షన్లే ఎక్కువగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది.
అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్ పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు.
ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.
రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి. సరే జనం విషయం గుర్తించి 2019లో తాము కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు.
ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.
సోషల్ మీడియాలో జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు ఓ రేంజ్ లో కనిపిస్తున్నాయి. అవన్నీ పక్కన పెడితే తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద వెలసిన ఓ భారీ కటౌట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో చేరారు.
భారతదేశం మత సామరస్యానికి ప్రతీక అన్న విజయసాయి.. అటువంటి దేశంలో ఉంటూ.. బంగ్లాలో హిందువులు లక్ష్యంగా సాగుతున్న దాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ దాడులకు ఖండించని వారు దేశ భక్తులే కాదని విజయసాయి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంటూ కోర్టుకు వెడదామా? అంటే..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించలేదు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం అంటూ జీవోలోనే స్పష్టంగా పేర్కొంది. దీంతో ఆ పాయింట్ మీద కోర్టుకు వెళ్లడం ఎలా అన్నది అర్ధం కాక వైసీపీ మల్లగుల్లాలు పడుతోందని పరిశీలకులు అంటున్నారు.
తాను ప్రత్యక్ష ఎన్నికలో పోటీ చేసిన తొలి సారే పరాజయం పాలైన సంగతిని గుర్తు చేసుకున్న ఆయన, ఆ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని, ఓడిన చోటే గెలవాలన్న పట్లుదలతో పని చేసి ఫలితం సాధించానని లోకేష్ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.