కొత్తగూడెం ఎమ్మెల్యే విషయంలో కెసీఆర్ కు తలనొప్పి
Publish Date:Jul 28, 2023
Advertisement
కొత్త గూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో బిఆర్ఎస్ అధిష్టానానికి కొత్త చిక్కులు మొదలయ్యాయి. మరో వైపు జలగం వెంకట్రావ్ కాళ్లకు బొంగరం కట్టుకుని తిరుగుతున్నారు. తీర్పును అమలు చేయాలని ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రదానాధికారి, ముఖ్యమంత్రిని వేడుకుంటున్నారు. వనమా వెంకటేశ్వర రావ్, జలగం వెంకట్రావ్ ఇద్దరూ ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు. ఒకరు ఎమ్మెల్యే.. ఆయన నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పి మరొకర్ని ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పుడు ఇద్దరూ కలిసి న్యాయం మీరే చెప్పాలని కేసీఆర్ దగ్గరకు వెళ్తున్నారు. ఎవరి వైపు నిలబడితే మరొకరు అసంతృప్తి కి గురవుతారు. అందుకే… ఏటూ తేల్చుకోలేకపోతున్నారు. 2014 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు లేకపోతే.. జలగం వెంకట్రావు ముందుకు వచ్చి పోటీ చేశారు. బీఆర్ఎస్కు బలం ఏమీ లేనప్పుడు వ్యక్తిగత బలంతో ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా నుంచి ఒక్కరే గెలిచినా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదు. అయినా జలగం పట్టించుకోలేదు. 2018 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వనమా గెలిచారు. తర్వాత వనమాను బీఆర్ఎస్ లో చేర్చుకున్నారు. జలగం ను పట్టించు లేదు. కానీ వనమా ఎన్నిక అక్రమం అని జలగం కోర్టు గడప తొక్కారు. విచారణ జరిపి అసలు 2018 నుంచే జలగంను ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు నేపథ్యంలో అమలు చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై పడింది. తీర్పు కాపీ పట్టుకుని వెంటనే జలగం.. సీఎస్ శాంత కుమారిని కలిశారు. ఎన్నికల ప్రధానిధికారిని కూడా కలిశారు. తనతో ప్రమాణ స్వీకారం చేయించాలని స్పీకర్ ను కూడా కోరారు. కానీ స్పీకర్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. వనమా.. తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని పిటిషన్ వేశారు. కానీ తీర్పు రిజర్వ్ అయింది. వనమా కాంగ్రెస్ లోనే ఉంటే… జలగంతో ఈ పాటికి ప్రమాణం చేయించేవారు. కానీ ఆయన కూడా బీఆర్ఎస్ లో ఉన్నారు. జలగం కావాలా… వనమా కావాలో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో బీఆర్ఎస్ హైకమాండ్ పడిపోయింది. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని జలగం వెంకట్రావ్ చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-troubles-for-kottegudem-mla-isue-25-159141.html





