తెదేపా సువర్ణావకాశం చేజార్చుకొందా?

Publish Date:Dec 27, 2012

Advertisement

 

నిన్నఅహ్మదాబాద్ లో ఘనంగాజరిగిన నరేంద్రమోడీ ప్రమాణస్వీకార సభకి బాలయ్యబాబుని వెళ్ళనీయకుండా అడ్డుపడి తెలుగుదేశంపార్టీ ఒకసువర్ణావకాశాన్ని చేజేతులావదులుకొందా అనే అనుమానం ఆపార్టీశ్రేణుల్లో వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

 

గుజరాత్ ఎన్నికలలో వరుసగా మూడవసారి విజయం సాదించిన నరేంద్రమోడీ రానున్నఎన్నికలలో భారతీయపార్టీ తరపున ప్రధానమంత్రి అభ్యర్దిగా పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం నేపద్యంలో, అతని ఆహ్వానం మన్నించి దేశం నలుమూలలనుండీ వచ్చిన అతిరధ,మహారధులు నిన్నఆయన సభకు హాజరవడం ద్వారా ఆయనతో, అయన ప్రాతినిద్యం వహిస్తున్నభారతీయపార్టీతో రానున్న ఎన్నికలలో చేతులు కలిపి పనిచేసేందుకు సముఖంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

 

ప్రస్తుత పరిస్తితిలో కేంద్రంలో, రాష్ట్రంలో కూడా అధికారం కోరుకొనే ప్రతీ ప్రాంతీయ రాజకీయపార్టీ కూడా, కాంగ్రేసుతో కలవడమో లేక దానికి ప్రత్యమ్నాయం కోసం చూడకతప్పని పరిస్తితి. కాంగ్రేసును వ్యతిరేకిస్తున్నవారు, కాంగ్రేసుపార్టీకి జాతీయస్థాయిలో ఏకైక ప్రత్యమ్నాయంగా నిలిచిన భారతీయపార్టీనే ఆశ్రయించక తప్పని పరిస్తితుల్లో, నిన్న మోడీ సభలో పాల్గొని నరేంద్రమోడీ చాచిన స్నేహహస్తం అందుకొనే ప్రయత్నం చేసారు.

 

గతంలో, యన్.డి.యే. కు మద్దతు ప్రకటించి భారతీయపార్టీకి పరోక్షంగా కలిసి పనిచేసిన తెలుగుదేశంపార్టీ, నేడుకూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంది. అటువంటప్పుడు, మోడీ సభకి బాలయ్యను కనీసం వ్యక్తిగత హోదాలోనయినా పాల్గొననీయకుండా చేసి ఒక సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకోందని ఆపార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది.

 

ఒకవేళ, మోడీ అందిస్తున్న స్నేహ హస్తాన్ని వై.యాస్సార్.కాంగ్రెస్ పార్టీ గానీ, తెరాసగానీ అందుకొంటే అప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ పరిస్తితి చాలా దారుణంగా మారవచ్చును. కాంగ్రెస్ పార్టీ వల్లనే జైలు జీవితం గడువలసి వస్తోందని ఆవేదన చెందుతున్న జగన్ మోహన్ రెడ్డి, తన విడుదలకు భారతీయజనతా పార్టీ గానీ ఏమాత్రమయినా ఉపయోగపడగలదని నమ్మినట్లయితే అతను తప్పకుండా ఆపార్టీ చేయందుకోవచ్చును. అతని ప్రస్తుత పరిస్తితిపట్ల సానుభూతి చూపుతున్న క్రిస్టియన్ మరియు రెడ్డి వర్గాలకు చెందినవారు కూడా, అతను భారతీయజనతా పార్టీతో చేతులుకలిపినా, దానిని అతను ఆఊబిలోంచి బయటపడేందుకు చేసే ప్రయత్నంగా అర్ధంచేసుకొని అతనికే తమ మద్దతు ప్రకటించే అవకాశం ఎక్కువగా ఉంది.

 

ఇక, కేవలం భారతీయజనతాపార్టీ మాత్రమే తెలంగాణా ఇవ్వగలదని ఇప్పటికే పలుమార్లు ఆ పార్టీ స్పష్టంగా ప్రకటించిన నేపద్యంలో, కాంగ్రేసు పార్టీ తెలంగాణా విషయంలో అనుసరిస్తున్న సాచివేత వైఖరితో విసిగెత్తిపోయున్నతెరాస రాష్ట్ర సాధనకోసం భారతీయజనతాపార్టీతో ఎన్నికలపొత్తులకు సిద్దమయినా ఆశ్చర్య పోనవసరం లేదు.

 

ఒకవేళ, ఈ రెండు పార్టీలతో భారతీయజనతాపార్టీ గానీ సంబందాలు కలుపుకోగాలిగితే, అప్పుడు రాష్ట్రంలో అవి ఒక బలమయిన కూటమిగా ఏర్పడి, అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు తెలుగుదేశం పార్టీకి కూడా అసలుకే మోసం తెచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

 

ఇటువంటి నేపద్యంలో, నరేంద్ర మోడీ సభకు వెళ్ళకుండా తెలుగుదేశంపార్టీ పెద్ద తప్పే చేసిందని అనుకోవచ్చును. అయితే, తెరాస., వై.యస్సార్.కాంగ్రెస్ పార్టీలు చొరవ చూపక ముందే తెలుగుదేశం పార్టీ మేల్కొంటుందా లేక మతతత్వ పార్టీ అనే ఆలోచనతో భారతీయజనతాపార్టీకి దూరంగా ఉండి, ఏటికి ఎదురీదాలని అనుకొంటుందో తానే తెలియజెప్పాలి.

 

ఒకవేళ మళ్ళీ యన్.డీ.యే. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేసే అవకాశం ఏర్పడితే, అప్పుడు తెలుగుదేశంపార్టీ దానితో కలిసే ఆలోచనగాని ఉంటే, ఆపనేదో ఇప్పుడే చేయడం ద్వారా రాష్ట్రంలో తన పరిస్తితి చేజారకుండా చుసుకొంటూనే, మరో వైపు మళ్ళీ కేంద్రంలో చక్రం తిప్పే అవకాశం కూడా పొందవచ్చును. అయితే, మతతత్వపార్టీతో అంటకాగితే తన మైనార్టీ ఓట్లన్నీ ఇతర పార్టీల ఖాతాలోకి జమా అయిపోతాయని గానీ ఆ పార్టీ ఆలోచిస్తూ కూర్చొంటే, అప్పడు ముందే చెప్పినట్లు మిగిలిన రెండు పార్టీలు గానీ , లేదా వాటిలో ఏ ఒక్కటయినా గానీ భారతీయజనతా పార్టీతో కలిస్తే, అప్పుడు తెలుగుదేశం పార్టీకి అసలుకే మోసం వస్తుంది.

 

ఇది గాకుండా, తెలంగాణా అంశంవల్ల కూడా తెలుగుదేశంపార్టీకి రానున్న ఎన్నికలలో భారీనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు ప్రస్తుతం తెలంగాణాలో ఎన్ని పాదయాత్రలు చేసినప్పటికీ, ఎన్నికల సమయంలో తెలంగాణా సమస్యని లేవనెత్తి తెలంగాణా ప్రజల భావోద్వేగాలు రెచ్చగొట్టగల నేర్పరి అయిన కేసిర్ అక్కడ తెలుగుదేశంపార్టీని గెలవనిస్తాడని అనుకోలేము.

 

అదేవిదంగా, ఇప్పుడు జైల్లో ఉన్నపటికీ వివిధ పార్టీల నేతలని ఆకర్షిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా రాబోవు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఒక పెనుసవాలు కాబోతున్నడని చెప్పవచ్చును.

 

ఈ నేపద్యంలో భారతీయజనత పార్టీ చేయందుకోవాలా, వద్దా అనే మీమాంసలో ఎంతకాలం వృధాచేస్తే అంత ఆపార్టీకే ప్రమాదం అని చెప్పవచ్చును. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోగల నేర్పు తెలుగుదేశం పార్టీకి ఉందో లేదో త్వరలోనే తేలిపోవచ్చును.

 

కొసమెరుపు: మోడీ నుండి ఆహ్వానం అందుకొన్న తెరాస అధ్యక్షుడు కే.చంద్రశేకర్ రావు, పిలుపు అందగానే అయన సభకు వెళ్లి ఊహించని విమర్శలు ఎదుర్కోవడం ఇష్టం లేకపోయినా, ఎందుకయినా మంచిదని ముందు జాగ్రత్తగా తాము అఖిలపక్ష సమావేశం హాడావుడిలో ఉన్నందున మీ ప్రమాణస్వీకారసభకు రాలేకపోతున్నామని. తెరాస తరపున అభినందనలు అని లేఖ వ్రాసి, భారతీయజనతాపార్టీతో పొత్తులకు తలుపులు తెరిచే ఉంచుకొని జాగ్రత్త పడ్డారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.