నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు ప్రారంభం

Publish Date:Dec 27, 2012

Advertisement

 

  

 

 

 తిరుపతి వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. గవర్నర్ నరసింహన్,, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పలువురు మంత్రులు ఈ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా ప్రముఖ గాయనిలు సుశీల, రావు బాలసరస్వతి మాతెలుగు తల్లి పాటను పాడగా, తెలుగు భాషపై ప్రత్యేకంగా రచించిన, బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను సభలో వినిపించారు. ఆనారోగ్య కారణాల వల్ల ఆయన ప్రత్యక్షంగా పాడలేకపోతున్నట్లు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. మరోవైపు తెలుగు మహాసభల సందర్భంగా తిరుపతిలో తెలుగుదనం ఉట్టిపడుతోంది. కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో వేడుకలలో సందడి నెలకొంది. కొన వూపిరితో ఉన్న తెలుగు బాషకు పూర్వ వైభవం కల్పించడమే ఈ మహాసభల అసలు లక్ష్యం.

 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగును ‘అధికార బాష’ గా నిలబెట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సందర్భంగా చర్చిస్తారు. తెలుగు బాషకు చెందిన భాషా వేత్తలు, పలు రంగాల ప్రముఖులు ఈ దిశగా తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తారు. తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే అంశంఫై ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇదే వేదికగా ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. సాహిత్యం, లలిత కళలు, సంగీత రంగాలకు ప్రత్యేకంగా అకాడమీలను ఏర్పాటు చేసే విషయం గురించి కూడా ముఖ్య మంత్రి తన అభిప్రాయాన్ని తెలియజేస్తారు.

 

గ్రామ, మండల, జిల్లా,రాష్ర స్థాయిల్లో క్రమంగా తెలుగు బాషను అమల్లోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు సమాచారం. ఈ అంశంఫై కూడా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా పుణ్య క్షేత్రం తిరుపతి లో తెలుగు వైభవం ఉట్టి పడుతోంది. దీనిని పురస్కరించుకొని తిరుపతి నగర పాలక సంస్థ ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది. ఈ సభా ప్రాంగణంలో ఐదు ఉప వేదికలను ఏర్పాటు చేశారు. ఈ ఐదు వేదికల్లో సాహిత్యం, జానపదం, రంగ స్థలం, సంగీతం, నృత్యం రంగాలకు సంభందించిన కార్యక్రమాలు జరుగుతాయి.

 

ఈ సభల సందర్భంగా, అధికార బాషా సదస్సు, విదేశాలు, ఇతర రాష్ట్రాల్లో ఉండే తెలుగు వారు, సాహిత్య వేదిక, చరిత్ర, లలితా కళలు, ప్రగతి రంగం వంటి అంశాల్లో చర్చలు జరుగుతాయి. సుమారు రూ. 50 కోట్ల వ్యయంతో జరుగుతున్న ఈ సభలకు సుమారు 40 వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అలాగే, తిరుపతి నగరంలో ఆసక్తి ఉన్నవారంతా ఈ సభలకు హాజరయ్యేందుకు కూడా అవకాశం కల్పించారు.

 

ఈ సందర్భంగా రాష్త్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా 14 మంది తెలుగు ప్రముఖులకు సన్మానం జరగనుంది. డాక్టర్ సి.నారాయణరెడ్డి (సాహిత్యం), సిఆర్.రావు (శాస్త్రం), యామినీ కృష్ణమూర్తి (నృత్యం), అక్కినేని నాగేశ్వరరావు (చలనచిత్రం), ఆచంట వెంకటరత్నంనాయుడు (నాటకం), చుక్కా సత్తయ్య (జానపదం), బాపు (కళలు), ఎస్వీ రామారావు (చిత్రకళ), ముఖేష్ (క్రీడలు), అజారుద్దీన్ (క్రీడలు)లతోపాటు విదేశాల్లో ఉన్న తెలుగు ప్రముఖులు చివుకుల ఉపేంద్ర (న్యూజెర్సీ), గుజ్జుల రవీంద్ర (జర్మనీ), ఎం. శ్రీనివాసరెడ్డి (శాస్త్రవేత్త, అమెరికా), భాట్టం శ్రీరామమూర్తిలు ఈ జాబితాలో ఉన్నారు.

 

మొదటి ప్రపంచ తెలుగు మహా సభలు 1975 లో హైదరాబాద్ లోని లాల్ బహదూర్ స్టేడియం లో అప్పటి ముఖ్య మంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో వారం రోజుల పాటు జరిగాయి. ఇక మిగిలిన రెండు సభలు విదేశాల్లోనే జరిగాయి. రెండవ సభలు 1981 ఏప్రిల్ లో మలేషియాలో ఐదు రోజుల పాటు జరిగాయి. మూడో ప్రపంచ తెలుగు మహా సభలు 1990లో మారిషస్ లో జరిగాయి. ఈ సభల కోసం ప్రభుత్వం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఏడుగురు ఎస్ పి స్థాయి అధికారుల పర్యవేక్షణలో మొత్తం ఆరు వేల మంది పోలీసులు ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.