Publish Date:Feb 20, 2026
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అజ్ణాతంలోకి వెళ్లారా? ఎవరికీ ఫోన్ లో కూడా అందుబాటులో లేకుండా, తన గన్ మెన్ లను సైతం వదిలేసి అజ్ణాతంలోకి వెళ్లారా అంటే ఔననే సమాధానమే వస్తున్నది. డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న అనంతబాబు శుక్రవారం (ఫిబ్రవరి 20) శాసనమండలి సమావేశం నుంచి అర్ధంతరంగా ఎవరికీ సమాచారం కూడా ఇవ్వకుండా అర్ధంతరంగా వెళ్లిపోయారు. డ్రైవర్ హత్య కేసులో అనంతబాబు భార్య లక్ష్మీదుర్గకు ప్రమేయం ఉందని సిట్ నిర్ధారించింది.
ఆమె హత్యకు ప్రేరేపించడమే కాకుండా, నేరంలో భర్తకు సహకరించినట్లు దర్యాప్తులో తేలిన నేపథ్యంలో దీంతో ఆమె అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ అనంతబాబు కూడా తన గన్మెన్లు, వ్యక్తిగత సిబ్బందిని వదిలేసి ఒక్కడే మండలి సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోవడంతో ఆయన కూడా అజ్ణాతంలోకి వెళ్లారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. సుప్రీం కోర్టు ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసులో పోలీసుల జాప్యంపై శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సాధ్యమైనంత త్వరగా కేసు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అనంతబాబు ఎవరికీ అందుబాటులోకి రాకుండా అజ్ణాతంలోకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mlc-anantha-babu-underground-36-214393.html
జాబిల్లి యాత్రలో ఐఫోన్ల సందడి.. అంతరిక్షంలో ఆపిల్ స్మార్ట్ఫోన్ల ప్రయోగం సక్సెస్!
అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిస్వా శర్మ భార్యపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల
రేణుక, మంద కృష్ణ ఇద్దరూ ఫైర్ బ్రాండ్లు కులం మెచ్చిన సామాజిక వీరులు
సోషల్ మీడియా వేదికలో అభ్యంతరకరంగా, దూషణాత్మకంగా వ్యాఖ్యలు పోస్టు చేసిన వ్యక్తిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.
హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది.
మాములుగా దక్షిణాదిలో అత్యంత సంపన్న పొలిటీషియన్లలో విజయ్ కూడా ఒకరు.
20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా.
ఇప్పుడు అమరావతికి చట్టబద్ధత విషయంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీ మౌనంగానే ఉండిపోయి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఎందుకంటే.. అమరావతిని రాజధానిగా జగన్ వ్యతిరేకిస్తున్నారు కనుక. సపోజ్ ఫర్ సపోజ్ రేపు ఆయన అధికారంలోకి వస్తే అమరావతికి మద్దతుగా మాట్లాడిన వారిపై ప్రతీకార చర్యలకు దిగుతారన్న భయమే అందుకు కారణంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కేరళ నుంచి కర్ణాటకకు వచ్చి ట్రెక్కింగ్ చేస్తూ తప్పిపోయిన జీఎస్ శరణ్య మిస్టరీలో నిజమెంత?
కృత్రిమ మేధ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఓపెన్ ఏఐ సంస్థ ఇప్పుడు ఉద్యోగ విధానాల్లోనూ సంచలన మార్పులకు తెరలేపుతోంది.
ఆర్ఆర్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఏపీలో వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.