Publish Date:Mar 27, 2025
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్వల్ప ఊరట కలిగించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిపై ఏప్రిల్ 3వ తేదీ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దని సీఐడీకి ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ ససింది. ఈ కేసు తదుపరి విచారణను వాయిదా వేసింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచార జరిగిన సంగతి తెలిసిందే.
కోట్లాది రూపాయల మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని ఈ కేసు ఏపీ సీఐడీ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మిథున్ రెడ్డి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఈ కేసులో తుది తీర్పు వెలుువడే వరకూ అంటే ఏప్రిల్ 3 వరకూ ఎంపీ మిథున్ నెడ్డిపై ఎటువంటి చర్యలూ తీసుకోవద్దనీ, అరెస్టు చేయవద్దనీ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కాగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం అంశాన్ని తెలుగుదేశం ఎంపీ లావు కృష్ణదేవరాయులు లోక్ సభలో లేవనెత్తారు. ఏపీ మద్యం కుంభకోణంలో పోలస్తే డిల్లీ లిక్కర్ స్కామ్ చాలా చిన్నదన్న ఆయన ఈ విషయంలో మనీ ల్యాండరింగ్ కూడా జరిగిందని ఆరోపిస్తూ ఈడీ దర్యాప్తునకు డిమాండ్ చేశారు.
దీనిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మిధున్ రెడ్డిని పార్లమెంటు ఆవరణలోని తన కార్యాలయానికి పిలిపించుకుని మరీ ఈ కుంభకోణంపై ఆరా తీశారు. హోంమంత్రితో భేటీ అనంతరం హుటాహుటిన అమరావతికి వచ్చిన ఎంపీ కృష్ణ దేవరాయులు, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ మద్యం కుంబకోణం కేసులో ఈడీ దర్యాప్తు చేపట్టే అవకాశాలున్నాయని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/mithunreddy-gets-respite-in-highcoutr-39-195072.html
యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు రోడ్డెక్కుతున్నారు.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడ అధికారులు తెలిపారు.
మొహర్రం సందర్బంగా హైదరాబాద్లోని డబీర్ పురాలోని బీబీకా ఆలంను ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్ సందర్మించారు. ఈ సందర్బంగా బీబీకా ఆలయంలో మంత్రులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ల గత కొద్ది కాలంగా బీఆర్ఎస్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అసలే గత ఎన్నికలలో పరాజయంపాలై, అధికారానికి దూరమై నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ కవిత ధిక్కార ధోరణితో ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
రైతు సంక్షేమంపై ఎక్కడైనా చర్చకు సిద్దమని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
గూగుల్ మ్యాప్ సాయంతో కారులోవెళ్తున్న ప్రయాణికుల కారు వాగులో పడిపోయింది. జనగామ జిల్లా వడ్లకుంటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నాగ్పూర్ నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెంట్రిక్ గానే జరిగింది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ నెల 2న ఆయన అనారోగ్యం కారణంగా సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే.
చిత్తూరు జిల్లా మామిడి వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పొలిటికల్ టర్న్ తీసుకుంది. జూలై 9న జగన్ బంగారుపాలెం మార్కెట్ యార్డ్ కి వచ్చి ఇక్కడి రైతులను పరమార్శించనున్నారు. కారణం ఈ రైతులకు తగిన ధర లేక అవస్థ పడుతున్నారని తెలియడమే. అలా తెలియడంతో ఇలా వారి కోసం ఓదార్పుయాత్రకు వచ్చేస్తున్నారు.
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్ న్యస్ చెప్పింది. ఇక జాతీయ రహదారులపై టోల్ ఫీజ్ సగానికి సగం తగ్గనుంది. ఔను కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల టోల్ ఫీజు నిబంధనల్లో చేసిన మార్పుల కారణంగా ఇది భారీగా తగ్గే అవకాశం ఉంది.
బేసిగ్గా జేపీ నడ్డా అధ్యక్ష పదవీ కాలం 2023 జనవరితోనే ముగిసింది. అయితే 2024 లో ఎన్నికల కారణంగా జూన్ వరకూ పొడిగించారు. అప్పటికీ ఏడాది గడచిపోయింది. ఇప్పుడు పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం అనివార్యం.
తెలంగాణలో ఇప్పటికే జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో అన్ని పార్టీలూ అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు చేస్తున్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దింపి సత్తా చాటాలన్న వ్యూహాలు, ప్రణాళికలలో నిమగ్నమయ్యాయి.
అమరనాథ్ యాత్ర కొనసాగుతోంది. గురువారం (జూలై) ప్రారంభమైన ఈ యాత్ర 38 రోజుల పాటు సాగుతుంది. శనివారం (జులై 5) మూడో రోజు యాత్ర కొనసాగుతోంది.