త్వరలో మధ్యంతర ఎన్నికలు రానున్నాయా?

Publish Date:Jan 17, 2013

Advertisement

 

రాష్ట్ర విభజన సమస్య పై తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న ఈ సమయంలో మధ్యంతర ఎన్నికల గురించి ఆలోచన అసంబద్ధంగా అనిపించవచ్చును. గానీ, ప్రస్తుత పరిణామాలను బట్టి కేంద్రం ఈ సంవత్సరం జూన్ నెల లోపుగానే మధ్యంతర ఎన్నికలకి వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి.

 

ఈ నెల 28వ తేదీతో తెలంగాణా అంశంపై కేంద్రం తాడో పేడో తేల్చక తప్పదు. ఇప్పటివరకూ అందుతున్న సంకేతాలను బట్టి కేంద్రం రాష్ట్ర విభజనకే మొగ్గు చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఒకవేళ రాష్ట్రాన్ని విభజించడమే జరిగితే, ఆ ప్రయోజనాన్ని కాంగ్రెస్ స్వంతం చేసుకోవాలని ఆలోచించడం సర్వ సాధారణ విషయం. తెలంగాణా ప్రకటించక ముందే తెరాసను తనలో కలిపేసుకోవచ్చును. అదే జరిగితే, వెంటనే ఎన్నికలకి వెళ్లకపోయినట్లయితే మళ్ళీ తెరాస కొత్త పేచీలు మొదలు పెట్టి, ఏవో కుంటి సాకులు చెప్పి కాంగ్రెస్ పార్టీకే హస్తం ఈయక మానదు. అలా జరగకూడదంటే, తెలంగాణా ప్రకటన జరిగిన రెండు, మూడు నెలలలోపే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్ళాల్సిఉంటుంది.గానీ సాంకేతికంగా ఆ అవకాశం లేదు గనుక మరొక్క రెండు నెలల తరువాతనయిన ఎన్నికలకి వెళ్ళవచ్చును.

 

తెలంగాణా ఇచ్చిన ఆనందంలోనే ప్రజలు కాంగ్రేసుకు ఓటేసే అవకాశం ఉంటుంది కనుక, వీలయినంత తొందరగా ఎన్నికలకి వెళ్ళాల్సిఉంటుంది. తెలంగాణా ప్రకటించినప్పటికీ, తరువాత ఏర్పడే వివాదాల కారణంగా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణా ఇచ్చిన ఫలితం దక్కకపోగా, రాష్ట్రంలో ఏకాకిగా మారిపోయే ప్రమాదం ఉంది. గనుక, సమస్యలేవీ తలెత్తక మునుపే కాంగ్రెస్ ఎన్నికలకి వెళ్ళక తప్పదు. తెలంగాణాలో అధికారం సంపాదించగలిగితే చాలావరకు సమస్యలను అదుపుచేసే అవకాశం కూడా కాంగ్రెస్ కు ఉంటుంది.

 

ఇక, తెలంగాణా కాక వేరే ఏరకమయిన ఆలోచన చేసినా కూడా తెలంగాణాలో కాంగ్రెస్ మట్టికరవడం ఖాయం. తెలంగాణా ఇచ్చి ఒక చోటయిన గెలిచే అవకాశం ఉంది. గానీ, తెలంగాణా ఈయకపోయినా, సీమాంధ్రాలో కాంగ్రేసుకు గెలిచే అవకాశాలు లేవు.

 

ఒకవైపు జగన్ పార్టీ, మరో వైపు తెలుగుదేశం పార్టీ రెంటికీ కూడా ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య వంటివి గనుక, ఆ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీని గెలవనిస్తాయని అనుకోలేము. కేవలం ప్రముఖ కాంగ్రెస్ నేతలు లగడపాటి, రాయపాటి, కావూరి, బొత్స వంటి పెద్ద తలకాయలు మాత్రమే సీమంధ్రలో గెలిచే అవకాశం ఉంది.

 

ఒకవేళ సీమంద్రాలో కూడా ఎలాగయినా గెలిచి తీరాలని కాంగ్రెస్ భావిస్తే, ఎన్నికలు ప్రకటించక ముందే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా తనలో కలిపేసుకొనో లేదా జగన్ మోహన్ రెడ్డితో ఎన్నికల ఒప్పందం చేసుకొనో అతనిని జైలు నుండి విడుదల చేసే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే, కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో గెలిచే అవకాశాలు బాగా మెరుగు పడతాయి.  

 

అలా వీలుకాని పక్షంలో, తెలంగాణా ఇచ్చి ఒకచోటయిన గెలవడమే మంచిదని కాంగ్రెస్ భావించే అవకాశం ఉంది. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ రెంటికీ చెడిన రేవడి అవుతుంది.
 

ఇక, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సబ్సిడీ సిలిండర్లు 6 నుండి 9కి పెంచేందుకు పెట్టిన ముహూర్తం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. జనవరి నుంచే ఇచ్చే అవకాశం ఉన్నపటికీ అది ఏప్రిల్ 1వ తేది ముహూర్తం ఎంచుకోవడం చూస్తే, అది ఆ వెంటనే మధ్యంతర ఎన్నికలు ప్రకటించి ప్రజల ఓట్లు దండుకొనే ప్రయత్నం చేయవచ్చునని పిస్తోంది.

 

ఇది గాక, నగదు బదిలీ పధకాన్ని ఓట్ల వేటలో తన ముఖ్యమయిన అస్త్రమని బహిరంగంగానే ప్రకటించుకొన్న కాంగ్రెస్ పార్టీ, దానిలో ఎన్ని లోటుపాట్లు ఉన్నపటికీ దానిని వెంటనే అమలుచేయడానికి పడుతున్న తొందర చూస్తే, మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తున్నట్లే కనిపిస్తుంది. మరో ఏడాది తరువాతనో మరెప్పుడో వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ అంత తాపత్రయపడవలసిన అవసరం లేదని గ్రహిస్తే, కాంగ్రెస్ త్వరలోనే ఎన్నికలకి సిద్ధం అవుతోందని అర్ధం అవుతుంది.

 

ఈ నెల 28వ తేదీన తెలంగాణా ప్రకటన లేదా మరే ప్రకటన చేసిన వెంటనే, రాష్ట్రంలో లేదా రెండు రాష్ట్రాల్లో సమర్దులయిన కొత్త నాయకులని ఎంచుకొని పరిస్థితులు తనకు అనుకూలంగా ఉన్నాయని నమ్మకం కుదరగానే కాంగ్రెస్ పార్టీ మధ్యంతర ఎన్నికలు ప్రకటించావచ్చును. బహుశః జూన్ లేదా జులై నెలాకరులోగా ఎప్పుడయినా ఆ ప్రకటన చేయవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.