LATEST NEWS
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. రాష్ట్ర మంత్రివర్గం నుంచి మంత్రి కొండా సురేఖను తప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకే క్యాబినెట్ నుంచి ఆమెను బర్తరఫ్ చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా రాజ్‌భవన్‌కు అధికారిక లేఖ పంపించారు. తాజా సమాచారం ప్రకారం, ముఖ్యమంత్రి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు సీఎస్ హుటాహుటిన గవర్నర్‌కు సమాచారం అందించారు. ఈ లేఖ ప్రస్తుతం గవర్నర్ పరిశీలనలో ఉంది. మంత్రి సురేఖ తొలగింపు ప్రతిపాదనపై గవర్నర్ అతి త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాలనా యంత్రాంగంలోనూ, పలు కీలక పదవుల్లోనూ ప్రభుత్వం పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న జి. చిన్నారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని నూతన వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్ర మహిళా కమిషన్ నూతన అధిపతిగా నేరెళ్ల శారదకు కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో మహిళల రక్షణ, వారి సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు శారదను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ వరుస నియామకాలతో కాంగ్రెస్ వర్గాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. పాలనాపరమైన శైలిని వేగవంతం చేయడంతో పాటు, పార్టీలోని పలు కీలక సమీకరణాలను దృష్టిలో ఉంచుకునే సర్కార్ ఈ సంచలన నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ స్థానంలో ఎవరికి చోటు దక్కుతుందనే అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో విపరీతమైన చర్చ మొదలైంది. కొద్ది రోజులుగా మంత్రుల తీరు మరియు పార్టీ అంతర్గత రాజకీయాలపై విస్తృత చర్చలు జరుగుతున్న నేపథ్యంలో, సీఎం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా బీసీ నేతలపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు సాగుతున్నాయి. రాజ్‌భవన్‌ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ ఆమోదముద్ర పడిన వెంటనే కొత్త మంత్రి వర్గ విస్తరణపై ప్రకటన వెలువడే సూచనలు కనిపిస్తున్నాయి. రాబోయే గంటల్లో తెలంగాణ రాజకీయాల్లో మరిన్ని సంచలన పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.     (Konda Surekha Bartaraf, CM Revanth Reddy, Telangana Cabinet, Telangana Politics, Revanth's Sensational Decision)
తెలంగాణలో ముఖ్యమంత్రి పదవి ఖాళీగా ఉందా? లేక ఖాళీ అవ్వబోతోందా? అన్న అనుమానాలు రేకెత్తేలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన తాజాగా తాను తెలంగాణ సీఎం కావడం ఖాయం, దానిని ఎవరూ అడ్డుకోలేరంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అంతే కాకుండా ఆయన వ్యాఖ్యలు తెలంగాణ అధికార కాంగ్రెస్ లో  అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయన్న విషయాన్నీ బహిర్గతం చేశాయి.  దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  తమ కుటుంబం ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉందనీ,  పార్టీ కోసం కష్టపడిన అసలు సిసలైన నాయకులకు  గుర్తింపు దక్కాల్సిన అవసరం ఉందన్నారు.  అంతే కాకుండా  తాను   రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతానని, ఆ పదవిని తాను కచ్చితంగా చేపడతానని విస్పష్టంగా చెప్పారు.  ప్రజా సేవలో  శ్రమిస్తున్న తమ లాంటి నాయకులకు ప్రజల మద్దతు ఉన్నంతవరకు  పదవులు దక్కకుండా ఎవరూ అడ్డుకోలేరన్న కోమటిరెడ్డి..  తెలంగాణలో కొందరు నేతలు పార్టీని తమ గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను సహించేది లేదని హెచ్చరించారు.  గత కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు, సీఎం మార్పు చర్చల నేపథ్యంలో  రాజగోపాల్ రెడ్డి  వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  పార్టీలో తొలి నుంచీ ఉన్న నాయకులు, మధ్యలో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరి కీలక స్థానాలలో కొనసాగుతున్న నాయకుల మధ్య ఆధిపత్య పోరు అంటూ జరుగుతున్న ప్రచారానికి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వ్యాఖ్యలు బలం చేకూర్చేలా ఉన్నాయి.  సొంత పార్టీ నాయకత్వ శైలిని ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు  రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను ఒక్కసారిగా పెంచేశాయి. ఓ వైపు కొండా సురేఖ వ్యవహారం హాట్ టాపిక్ గా కొనసాగుతున్న తరుణంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో తేటతెల్లం చేశాయి.  రానున్నరోజులలో కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరింత పెచ్చరిల్లే అవకాశాలున్నాయని పరిశీలకులు రాష్ట్ర పార్టీలో ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను ఉటంకిస్తూ విశ్లేషిస్తున్నారు.   [Sensation in Telangana Politics, Komatireddy, CM Comments, Telangana CM, Telugu One]
  తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు మంత్రి కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఏమిటన్న దానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇందుకు బుధవారం (సెప్టెంబర్ 2) రోజంతా ఢిల్లీ వేదికగా జరిగిన హై డ్రామాయే కారణం. కొండా సురేఖ వ్యవహారంపై  హస్తినలో బుధవారం (సెప్టెంబర్ 2) కీలక పరిణామాలు జరిగాయి. ఒక వైపు ఇదే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో చర్చించారు. మరో వైపు కొండా సురేఖ కోరినప్పటికీ వారి అప్పాయింట్ మెంట్ ఆమెకు దొరక లేదు. దీనిని బట్టే కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనూ కాకుండా పరిశీలకుల్లో సైతం వ్యక్తమైంది. అయితే ఈ విషయంలో  కొండా సురేఖ.. హైకమాండ్ నిర్ణయంతో సంబంధం లేకుండా సొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విష్లేసిస్తున్నారు. ఇందుకు ఆమె మీడియా ఎదుట చేసిన వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతున్నారు. హస్తిన వేదికగా మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఆమె నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైనే విమర్శనాస్త్రాలు సంధించారు. అలాగే మంత్రి పొంగులేటి సుధాకరరెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సతీమణిలపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ హైకమాండ్ తీరునూ నిలదీశారు. హైకమాండ్ బీసీలపై ఆరోపణలు వస్తే ఒకలాగా, ఇతరులపై ఆరోపణలు వస్తే మరొకలాగా స్పందిస్తారా అని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ పేరెత్తకుండానే నిలదీశారు.  ఇక తన భవిష్యత్ కార్యాచరణపై మాట్లాడుతూ.. పార్టీ తీసుకునే నిర్ణయంపైనే తన కార్యాచరణ అధారపడి ఉంటుందని అన్యాపదేశంగా ఒక వేళ తనను కేబినెట్ నుంచి తొలగిస్తే.. పార్టీకి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని చెప్పారు.  ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది. ఈ పరిణామం నిస్పందేహంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు ఎదురుదెబ్బగా పరిణమిస్తుందని అంటున్నారు.  చూడాలి మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం నిర్ణయిస్తుందో.. కొండా సురేఖ ఏ నిర్ణయం తీసుకుంటారో? [Konda Surekha Goodbye to Congress, Resign, MLA, Warangal East, By Election, Telangana Politics, Telugu One]
  నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..! తనను వద్దు అని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం..! ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనపై చర్యలు తీసుకోవద్దని కోరారు. మహిళలు స్వతంత్రంగా బతకాలని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, తన కుమార్తె మాట్లాడిన అంశానికి తనను బాధ్యురాలిని చేయడం సరికాదని అన్నారు. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. “నా బిడ్డ మాట్లాడితే నాకు ఎందుకు శిక్ష వేస్తారు..? నా కూతురు మాట్లాడిన దానికి నాపై చర్యలు తీసుకోవద్దు” అని ఆమె పేర్కొన్నారు. నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది. ఆమెను వద్దని చెప్పే అధికారం నాకు లేదు.. తన జీవితం తన ఇష్టం అని మంత్రి కొండా సురేఖ అన్నారు. తాను బీసీ మహిళా మంత్రినని.. తన భర్త మున్నూరు కాపు, తాను పద్మశాలి కులానికి చెందినవారినని తెలిపారు. తమ కులానికి 16 శాతం ఓట్లు ఉన్నాయని పేర్కొన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని స్పష్టం చేశారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండానే తన శాఖను సమర్థంగా నిర్వహిస్తున్నానని అన్నారు. ఒకవైపు కర్ణాటక కాంగ్రెస్‌లో ఒక్క మహిళా ఎమ్మెల్యే కూడా లేరంటూ ఆందోళన జరుగుతోందని.. మరోవైపు తనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తనపై ప్రెస్‌మీట్లు పెట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని కొండా సురేఖ అన్నారు. అధిష్ఠానం కూడా ఈ విషయాలను ఆలోచించాలని సూచించారు. మీనాక్షి మేడంకు తాను చెప్పాల్సిందంతా చెప్పానని తెలిపారు. తనకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం తప్పని అన్నారు. తనపై ఏమైనా చర్యలు తీసుకోవాలంటే ఏఐసీసీనే తీసుకోవాలని.. తాను ఏఐసీసీ సభ్యురాలినని కొండా సురేఖ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కే.సీ. వేణుగోపాల్‌ అపాయింట్‌మెంట్‌ తనకు దొరకలేదని తెలిపారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశానని, తనపై వచ్చిన అంశాలపై ఆయనకు వివరణ ఇచ్చానని చెప్పారు.“ నాపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి” అని కొండా సురేఖ అన్నారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్‌రెడ్డి ఎలా చెబుతారని ప్రశ్నించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భట్టి విక్రమార్క భార్యకు సంబంధించిన కమీషన్ల అంశాలపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.  “ఆ ఫిర్యాదులపై ఎందుకు మాట్లాడటం లేదు?” అని ప్రశ్నించారు. చాలామంది రెడ్లు మాట్లాడిన సందర్భాల్లో వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కొండా సురేఖ ప్రశ్నించారు. తన విషయంలో మాత్రమే చర్యల అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఏమిటని ఆమె నిలదీశారు. మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలపై మరోసారి చర్చకు దారితీశాయి.   Konda Surekha Delhi visit, CM Revanth Reddy, Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news, K.C. Venugopal, Meenakshi Natarajan
  ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..! మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రి అని రేవంత్ చెప్పుకోవడం మంత్రులు, నేతలు అసంతృప్తిగా ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయం ఒక్కసారిగా ఢిల్లీ హస్తిన వీధులకు చేరింది. కొండా సురేఖ ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యాఖ్యల దుమారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం  పార్టీ క్రమశిక్షణపై సుస్మిత చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ వివాదంపై స్పష్టత నిమిత్తం సురేఖకు ఇప్పటికే నోటీసులు జారీ చేసి, నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సుమారు 60 నిమిషాల (1 గంట) పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. పార్టీ నియమావళిని దాటి వ్యవహరించే నేతలపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వానికి మరియు పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. అయితే ఊహించని మలుపు తిరుగుతూ మంత్రి కొండా సురేఖ కూడా హుటాహుటిన ఢిల్లీకి చేరుకోవడంతో వరంగల్ రాజకీయాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లోనూ తీవ్ర కలకలం రేగింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, కొండా సురేఖ అత్యంత ఘాటుగా స్పందించారు. "నన్ను అధిష్టానం పిలవలేదు, నేనే స్వయంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అపాయింట్‌మెంట్ అడిగి ఢిల్లీకి వచ్చాను. పార్టీలో ఉన్నది మాట్లాడితే చర్యలు ఎందుకు తీసుకుంటారు?" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం సృష్టించాయి. పార్టీ శ్రేణుల సంక్షేమం మరియు ప్రాంతీయ సమతుల్యత కోసమే తమ అభిప్రాయాలను వ్యక్తం చేశామని, నిజ నిజాలు చెప్పడం క్రమశిక్షణా ఉల్లంఘన కిందకు ఎలా వస్తుందని ఆమె ప్రశ్నించడం గమనార్హం. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షీ నటరాజన్, టీపీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీలో విడివిడిగా పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు. సెప్టెంబర్ 7వ తేదీ నుంచి తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ వివాదానికి వీలైనంత త్వరగా స్వస్తి చెప్పాలని అధిష్టానం భావిస్తోంది. మంత్రి వర్గంలో 100 శాతానికి పైగా క్రమశిక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా కుటుంబం తమ స్వరాన్ని బలంగా వినిపిస్తోంది. పార్టీ మూలాలకు హాని కలగకుండా, సురేఖ చేత మంత్రి పదవికి రాజీనామా చేయించి భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలా? లేక కేవలం వివరణతో సరిపెట్టి వ్యవహారాన్ని సర్దుమణిగేలా చేయాలా? అనే అంశంపై ఏఐసీసీ పెద్దలు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఒకవేళ తీవ్ర చర్యలు తీసుకుంటే ఉమ్మడి వరంగల్ పరిధిలోని దాదాపు 12 నియోజకవర్గాల్లో పార్టీ సమీకరణాలపై ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఢిల్లీ వేదికగా సాగుతున్న ఈ హైడ్రామాలో రాబోయే 24 గంటల్లో వెలువడే అధిష్టానం నిర్ణయమే మంత్రి కొండా సురేఖ భవిష్యత్తును నిర్ణయించనుంది.   Konda Surekha Delhi visit, Revanth Reddy Congress high command, AICC Mallikarjun Kharge, Konda Susmita comments, Telangana cabinet reshuffle 2026, Telangana politics news  
ALSO ON TELUGUONE N E W S
నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'ది ప్యారడైజ్'. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'ఏష నాగుల కట్ట మీద' పాట సంచలనాలు సృష్టిస్తోంది. టాలీవుడ్ చరిత్రలోనే యూట్యూబ్ లో వేగంగా 50 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా రికార్డు సృష్టించింది. కేవలం 4 రోజుల 15 గంటల్లోనే ఈ ఫీట్ ను సాధించడం విశేషం. 'చుట్టమల్లే' లాంటి బిగ్గెస్ట్ చార్ట్‌బస్టర్స్ సహా ఎన్నో పాటల రికార్డులను ఈ ఊరమాస్ జానపద పాట అధిగమించింది. ఆగస్టు 29న విడుదలైన ఈ ట్రాక్, రిలీజ్ అయిన క్షణం నుంచే శ్రోతలను తన వైబ్ తో కట్టిపడేసింది. అనిరుధ్ తన మార్క్ మాస్ టచ్ తో ఈ ఫోక్ సాంగ్ ను మరోస్థాయికి తీసుకెళ్లారు. తెలంగాణ మట్టివాసన కలిగిన జానపద గాయకులు ప్రభ బంగారిగళ్ళ, అడ్డుల జంగిరెడ్డి తమ గాత్రంతో ప్రాణం పోశారు. ఇక ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ ప్రతి ఒక్కరి నోటా నానుతూ, ప్రతీ రీల్‌కి పక్కా ఆడియోగా మారిపోయాయి. క్యాచీ హుక్ స్టెప్స్, ఈజీ డ్యాన్స్ మూవ్స్ ఉండటంతో ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లో ఎక్కడ చూసినా ఈ పాట మారుమోగిపోతోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా ఈ మాస్ వైబ్‌కి ఫిదా అయిపోయి స్టెప్పులేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ 'ఆయా షేర్' 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో నేషనల్ వైడ్‌గా దుమ్మురేపగా, ఇప్పుడు 'ఏష నాగుల' పాట దాన్ని మించిన జోరును ప్రదర్శిస్తోంది. ఈ రెండు పాటల సంచలనం చూస్తుంటే, సుధాకర్ చెరుకూరి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రంపై అంచనాలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న ఈ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 24న థియేటర్లలోకి రాబోతోంది.        [Yesha Nagula Song, The Paradise Movie, Aaya Sher Song, Natural Star Nani, Anirudh Ravichander, Keerthy Suresh, Srikanth Odela, Telugu Film News, Telugu News]  
  కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సంచలన సంఘటన చోటుచేసుకుంది. ప్రముఖ సినిమా పంపిణీదారుడు విలియమ్ అలెగ్జాండర్ (అలియాస్ అలెక్స్) ఓ మహిళ పట్ల అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తించినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా వైరల్ అవుతోంది. అందిన వివరాల ప్రకారం.. చెన్నైలోని ప్రతిష్టాత్మక టి.నగర్ తిరుమలై పిళ్లై రోడ్డులో ఉన్న ఒక ప్రముఖ హోటల్‌లో విలియమ్ అలెగ్జాండర్ బస చేశారు. ఆ సమయంలో అతనికి తెలిసిన ఒక వ్యక్తి ద్వారా మరో యువతి అక్కడికి వచ్చింది. అయితే, సదరు యువతితో అలెగ్జాండర్ అసభ్యకరంగా మాట్లాడటమే కాకుండా, ఆమె పట్ల చేతులు చాచి అనాగరికంగా ప్రవర్తించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆ యువతి వెంటనే బయటకు వచ్చి, సమీపంలోనే ఉన్న తన స్నేహితురాలికి విషయం తెలిపింది. బాధితురాలి స్నేహితురాలు వెంటనే హోటల్ గదికి వెళ్లి అలెగ్జాండర్‌ను నిలదీసింది. అయితే, ఏమాత్రం తగ్గకుండా ఆయన ఆ మహిళలతో కూడా తీవ్రంగా వాగ్వాదానికి దిగి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ బాధితులు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్ ప్రాంగణానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఘటనకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం, డిస్ట్రిబ్యూటర్ విలియమ్ అలెగ్జాండర్‌ను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యూడీషియల్ రిమాండ్‌కు తరలించింది. తమిళ చిత్రసీమలో పంపిణీదారుడిగా కొనసాగుతున్న అలెగ్జాండర్ పలు సినిమాల విక్రయాలు, ప్రమోషన్లలో కీలక పాత్ర పోషించారు. సినీ రంగానికి చెందిన వ్యక్తులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాకపోయినా, ఒక బాధ్యతాయుతమైన డిస్ట్రిబ్యూటర్ లాడ్జీలో మహిళలపై వేధింపులకు పాల్పడటం పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు, సినీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా మహిళల భద్రతపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎంత పెద్ద హోదాలో ఉన్నా సరే, ఇలాంటి అనాగరిక చర్యలకు పాల్పడితే చట్టం ముందు సమానమేనని కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలి కాలంలో వివిధ భాషా చిత్ర పరిశ్రమల్లో నటీనటులు, పంపిణీదారులు ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం చర్చింశనీయంగా మారింది. ఈ కేసులో పోలీసులు మరిన్ని వివరాలు సేకరించేందుకు విచారణ వేగవంతం చేశారు. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి.     [Film Distributor Alexander Arrested, Chennai T Nagar Incident, Tamil Cinema News, William Alexander Film Distributor, Kollywood Gossip Updates]
మలయాళంలో సంచలన విజయం సాధించిన నివిన్ పౌలీ, మమితా బైజు లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ 'బెత్లెహెం కుటుంబ యూనిట్' తెలుగు రిలీజ్ విషయంలో ఊహించని షాక్ తాగింది.  ప్రేమలు లాంటి సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ గిరీష్ నుంచి వస్తున్న సినిమా ఇది. మలయాళంలో ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. విపరీతమైన క్రేజ్ ఉండటంతో తెలుగు డబ్బింగ్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దక్కించుకుని తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో ఈ సినిమాకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. PVR, INOX, మిరజ్ లాంటి పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ చైన్స్ అన్నీ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను తమ థియేటర్లలో ప్రదర్శించడానికి నిరాకరించాయి. మల్టీప్లెక్స్ చైన్స్ స్క్రీన్స్ కేటాయించకపోవడంతో ఇప్పుడు ఈ సినిమా కేవలం లోకల్ మల్టీప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్స్ లో మాత్రమే రిలీజ్ కాబోతోంది. సాధారణంగా మల్టీప్లెక్స్ చైన్స్ రూల్స్ ప్రకారం ఏదైనా సినిమా థియేటర్లలో విడుదలైన తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల పాటు OTT లోకి రాకూడదు. కానీ బెత్లెహెం కుటుంబ యూనిట్ ఇప్పటికే ఆగస్టులోనే మలయాళంలో థియేట్రికల్ రిలీజ్ అయింది. దాంతో డిజిటల్ స్ట్రీమింగ్ గ్యాప్ చాలా తక్కువగా ఉండబోతోంది. అతి త్వరలోనే ఈ మూవీ OTT లోకి రానుండటంతో, మల్టీప్లెక్స్ చైన్స్ తమ నిబంధనలకు విరుద్ధంగా స్క్రీన్లు ఇవ్వలేమని స్పష్టం చేశాయి. మరి ఈ వివాదం నడుమ ఎక్కువగా సింగిల్ స్క్రీన్స్ లోనే విడుదలవుతున్న ఈ మలయాళ డబ్బింగ్ ఎంటర్‌టైనర్ తెలుగు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.       [Bethlehem Kudumba Unit, Telugu Release, Nivin Pauly, Mamitha Baiju, Premalu Director, Girish AD, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]  
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి గ్లామర్‌తో పాటు అద్భుతమైన నటన, పొడవైన పర్సనాలిటీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ప్రేక్షకుల మనసులను దోచుకున్న భామ ఫరియా అబ్దుల్లా. 'జాతిరత్నాలు' చిత్రంలో 'చిట్టి'గా అమాయకపు నటనతో అలరించిన ఈ హైదరాబాద్ బ్యూటీ, కేవలం నటనకే పరిమితం కాకుండా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఈ పొడుగుపాటి సుందరి తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేసిన ఒక గ్లామరస్ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తెల్లటి బికినీ తరహా డ్రెస్‌లో ఫరియా ఇచ్చిన కిల్లర్ పోజులు, హాట్ ఎక్స్‌ప్రెషన్లు కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఎప్పుడూ ట్రెడిషనల్ అండ్ బబ్లీ లుక్స్‌తో కనిపించే చిట్టిలో ఇంతటి హాట్ అండ్ బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ లేటెస్ట్ విజువల్స్ చూసిన నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. "ఫరియాలో స్టార్ హీరోయిన్‌కు కావలసిన అన్ని గ్లామర్ క్వాలిటీస్ ఉన్నాయని, టాలీవుడ్ దర్శకులు ఆమెలోని ఈ హాట్ యాంగిల్‌ను కూడా గమనించి పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇవ్వాలని" కోరుతున్నారు. మరికొందరు అభిమానులైతే ఏకంగా హాలీవుడ్ రేంజ్ కటౌట్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నటిగా మాత్రమే కాకుండా ఫరియా అబ్దుల్లాలో చాలా కోణాలు ఉన్నాయి. 'బంగార్రాజు'లో స్పెషల్ సాంగ్‌తో రచ్చ చేసిన ఈ భామ.. డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, గేయ రచయితగా, గాయకురాలిగా కూడా తన సత్తా చాటుకున్నారు. ఇటీవల వచ్చిన 'మత్తు వదలరా 2' చిత్రంలో నటిస్తూనే పాటలు పాడి, లిరిక్స్ అందించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఫరియా కెరీర్ విషయానికి వస్తే, వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ద్విభాషా యాక్షన్ థ్రిల్లర్ 'సిగ్మా'తో పాటు విజయ్ ఆంటోనీతో కలిసి ఓ కోలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. అలాగే సత్యదేవ్‌తో ఓ క్రేజీ ప్రాజెక్ట్, తిరువీర్ సరసన 'భగవంతుడు' అనే చిత్రంలోనూ నటిస్తూ ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. సినిమాలతో నిరంతరం బిజీగా ఉంటూనే, ఇలాంటి గ్లామరస్ వీడియోలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫరియా రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా రీచ్ అవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కొత్త గ్లామర్ లుక్ ఆమె కెరీర్‌కి మరిన్ని పెద్ద అవకాశాలను తెచ్చిపెడుతుందో లేదో వేచి చూడాలి.       [Faria Abdullah Glamorous Photos, Jathi Ratnalu Chitti Faria Abdullah, Faria Abdullah Latest Video Viral, Tollywood Heroine Faria Glam Look, TeluguOne Entertainment News]
    సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన మూవీ  జైలర్. దీంతో  సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'జైలర్ 2 ' పై ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు అయితే రిలీజ్ డేట్ కోసం ఎదురుచూపులు. ఇప్పుడు ఆ ఎదురుచూపులు ఫలించి రిలీజ్ డేట్ వచ్చేయడంతో వాళ్లంతా రజిని స్టైల్ ఆఫ్ మేనరిజమ్స్ తో బిజీగా ఉన్నారు. చేతిలో తుపాకీ పట్టుకుని ఉన్న రజినీకాంత్ పవర్‌ఫుల్ పోస్టర్‌ని విడుదల చేస్తూ, దసరా కానుకగా  ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15, 2026న థియేటర్లలోకి వస్తుందని స్పష్టంగా ప్రకటించింది. "అలప్పార కేలప్పరోమ్" అనే 'హుకుమ్' పాటలోని ఐకానిక్ క్యాచీ ట్యాగ్‌లైన్‌తో ఈ కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. టైగర్ ముత్తువేల్ పాండ్యన్ పాత్రలో రజినీకాంత్ ఇచ్చే ఎలివేషన్లు, ఆయన మానరిజమ్స్ ప్రేక్షకులను ఎలా కట్టిపడేస్తాయో మొదటి భాగంలో అందరూ చూశారు. ఇప్పుడు సీక్వెల్‌లో ఆ క్రేజ్‌ను మరింత తారాస్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకుడు నెల్సన్ అత్యంత ప్రతిష్టాత్మక కథనాన్ని సిద్ధం చేశారు. ఈసారి కేవలం రజినీకాంత్ విశ్వరూపం మాత్రమే కాకుండా, భారీ తారాగణం ఈ చిత్రంలో అలరించబోతోంది. విద్యాబాలన్, ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, రమ్యకృష్ణ మరియు యోగి బాబు వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. విజయ్ సేతుపతి ఒక ప్రత్యేక కామియో పాత్రలో మెరవనుండగా, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ మరియు హృతిక్ రోషన్ల మెరుపు నటన కూడా ఈ సీక్వెల్ స్థాయిని మరింత పెంచుతుందని టాక్ నడుస్తోంది. Also Read: రోమాంచకం మూవీపై మహేష్ బాబు షాకింగ్ రివ్యూ  మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ బాణీలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన 'అలా బొలేలో' ప్రమోషనల్ సాంగ్ మరియు అనౌన్స్‌మెంట్ టీజర్ సోషల్ మీడియాలో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచాయి.    [ RajiniKanth, jailer 2, Nelson DilpKumar, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews]
బుల్లితెరపై ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు 'శ్రీముఖి'. తనదైన వేగవంతమైన యాంకరింగ్, హుషారైన మాటలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ బుల్లితెర రాములమ్మ, సోషల్ మీడియాలోనూ అంతే ఆక్టివ్‌గా ఉంటారు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న ఓ మాస్ జానపద పాటకు శ్రీముఖి వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'ది ప్యారడైజ్' నుంచి విడుదలైన 'యేషనాగుల కట్టమీద' పాట ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఒరిజినల్ తెలంగాణ ఫోక్ వర్షన్‌ను ఈ చిత్రంలో రీమిక్స్ చేయడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతీ ఒక్కరూ ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీముఖి కూడా ఈ మాస్ ట్రెండింగ్‌లో భాగమై తన డ్యాన్స్ హంగామాతో అందరి దృష్టిని ఆకర్షించారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తూనే ఈ పాటకు శ్రీముఖి తనదైన శైలిలో డ్యాన్స్ చేశారు. వైట్ కలర్ టీషర్ట్, బ్లూ మినీ షార్ట్స్‌లో కనిపించిన ఆమె, పాటలోని ఊపుకు తగినట్లుగా మాస్ బీట్‌తో చెలరేగిపోయారు. "సెప్టెంబర్ ఎనర్జీ" అంటూ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయగా, అది షేర్ చేసిన కొద్ది సమయంలోనే వైరల్ ట్రెండింగ్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు శ్రీముఖి ఎనర్జీ లెవెల్స్‌కు ఫిదా అవుతున్నారు. "బుల్లితెర రాములమ్మ అసలైన మాస్ స్టెప్పులతో ఇరగదీసింది", "శ్రీముఖి ఎనర్జీ వేరే లెవెల్" అంటూ కామెంట్ల రూపంలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. పాటలోని జోష్‌కి ఆమె పర్ఫెక్ట్ టైమింగ్‌తో చేసిన డ్యాన్స్ ఎంతో ముచ్చటగా ఉందంటూ రీల్స్‌కి లైకుల వర్షం కురిపిస్తున్నారు. బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా బిజీగా ఉన్న శ్రీముఖి, పలు హిట్ టీవీ షోలు మరియు సినిమా ప్రి-రిలీజ్ ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ నిరంతరం అలరిస్తున్నారు. టీవీ ప్రసారాలతో పాటు వెండితెరపై కూడా మంచి పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ డ్యాన్స్ వీడియోతో శ్రీముఖి మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. మున్ముందు కూడా తనదైన ఎనర్జిటిక్ వీడియోలతో ప్రేక్షకులకు మరిన్ని సర్‌ప్రైజులు ఇస్తారని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. https://www.instagram.com/reel/DcwTIyYzono/?       [Anchor Sreemukhi Dance Video, Yeshanagula Kattameeda Song, Srimukhi Mass Dance Steps, Nani The Paradise Songs, TeluguOne Entertainment News]
    సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 'వారణాసి' తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇంత బిజీలో కూడా ఈ రోజు విడుదలైన 'రోమాంచకం' అనే సినిమా బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన పోస్ట్ ఇప్పుడు చిత్రసీమలోనూ, సోషల్ మీడియాలోనూ సంచలనంగా మారింది. సూపర్ స్టార్ నుండి వచ్చిన ఈ అనూహ్యమైన ప్రశంసతో 'రోమాంచకం' చిత్ర యూనిట్ అత్యంత ఆనందంలో మునిగి తేలుతోంది. సినిమా పరిశ్రమలో చిన్న చిత్రాలకు పెద్ద హీరోల మద్దతు లభిస్తే వచ్చే మైలేజ్ సాధించే విజయం ఎంతో ఘనంగా ఉంటుంది. సరిగ్గా అదే పరిస్థితి ఇప్పుడు ఈ చిన్న సినిమాకు దక్కింది. మహేష్ బాబు ఈ చిత్రాన్ని వీక్షించి, అందులోని మేకింగ్, నటీనటుల అద్భుతమైన ప్రదర్శన మరియు దర్శకత్వ శైలిని విపరీతంగా అభినందించారు. ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే కథాంశం, కామెడీ అండ్ హారర్ ఎలిమెంట్స్ చాలా సహజంగా కుదిరాయని ఆయన పేర్కొనడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై ఆసక్తి ఒక్కసారిగా రెట్టింపైంది. Also Read: ఎన్టీఆర్ తో సినిమాలు తెరకెక్కించిన నిర్మాతలు,చిరంజీవితో ఎందుకు సినిమాలు చేసారో తెలుసా!  నటీనటులు తమ క్యారెక్టర్లలో పూర్తిస్థాయిలో ఒదిగిపోయి అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందించారు. సాధారణంగా కంటెంట్ బలంగా ఉన్నప్పుడు సరైన ప్రచారం దక్కితే ఆ సినిమా రేంజ్ మారిపోతుంది. సూపర్ స్టార్ ఇచ్చిన ఈ ఒక్క ట్వీట్/పోస్ట్ తో సినిమాకు ఊహించని రేంజ్ లో పబ్లిసిటీ లభించింది. ఎంటర్ టైన్ మెంట్ పరంగా  పాజిటివ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ చిత్రం, ఇప్పుడు అన్ని కేంద్రాల్లోనూ థియేటర్ల సంఖ్యను మరియు షోల సంఖ్యను పెంచుకునే దిశగా వేగంగా వెళుతోంది.     [ Mahesh Babu, Roamchakam, Sumanth Prabhas, Sandeep Reddy Vanga, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews ]
  విశ్వ విఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్.. మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా నిద్రలో కూడా గర్వంగా చెప్పుకునే లెజండ్రిస్. తమకి మాత్రమే సాధ్యమయ్యే రీతిలో పెర్ ఫార్మ్ చేసి తెలుగు సినిమాకి గర్వాన్ని పరిచయం చేసారు. అందులో ఎన్టీఆర్ తొలి ఆద్యుడు కాగా చిరంజీవి మలి ఆద్యుడు. ఈ విషయాన్నీ ముందుగానే గమనించారేమో ఎన్టీఆర్  తో మాత్రమే సినిమాలు నిర్మిస్తూ ఎన్టీఆర్ నిర్మాతలుగా ముద్రపడిన వాళ్ళందరు చిరంజీవి తో ఆయన కెరీర్ స్టార్టింగ్ లో సినిమాలు తెరకెక్కించారు.   అందుకు రహస్యం ఏంటి అని విశ్లేషిస్తే, ప్రధానంగా రెండు అంశాలు కనిపిస్తాయి. మొదటిది: ఆ నిర్మాతలకు సినిమాలపై ఉన్న అపారమైన పిచ్చి. వర్ణించలేని ప్యాషన్. లాభనష్టాల లెక్కల కంటే, ప్రేక్షకులకు ఒక గొప్ప దృశ్యకావ్యాన్ని అందించాలనే తపన ఆ అందరిలో నరనరాన జీర్ణించుకుపోయింది. సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా కాకుండా ఒక పవిత్రమైన కళగా  భావించారు. ప్రతి సన్నివేశం, ప్రతి పాట, కథలోని ప్రతి మలుపు పర్ఫెక్ట్‌గా ఉండాలనే వారి కోరిక మరియు రాజీపడని నైజమే వారిని అగ్ర నిర్మాతలుగా నిలబెట్టింది. రెండవది: ఎన్టీఆర్ గారి క్రమశిక్షణ, కృషిని  సినీ డిక్షనరీగా భావించే ఆ నిర్మాతలు, చిరంజీవిలో కూడా సరిగ్గా అదే రకమైన అంకితభావాన్ని చూశారు. డ్యాన్స్, ఫైట్స్, నటన  ఇలా ఏ విషయంలోనూ చిరంజీవి షార్ట్‌కట్‌లు వెతకలేదు. స్వయంకృషినే నమ్ముకుని, ప్రతి సినిమా కోసం రాత్రింబవళ్లు శ్రమించే ఆయన తత్వానికి ఎన్టీఆర్ నిర్మాతలు ఫిదా అయ్యారు. చిరంజీవి పట్టుదల, నిర్మాతల నిర్మాణ ప్యాషన్ కలిసి తెలుగు సినీ రంగానికి మరచిపోలేని సువర్ణ అధ్యాయాలను, రికార్డు కలెక్షన్లని తెలుగు సినిమాకి, ప్రేక్షకులకి   కానుకగా ఇచ్చాయి. Also read: Romachakam Movie Review Telugu: రోమాంచకం మూవీ రివ్యూ  ఇద్దరి నిర్మాతల లిస్ట్ చూసుకుంటే పుండరీ కాక్షయ్య అట్లూరి, దేవీవరప్రసాద్, తాతినేని త్రివిక్రమ్ రావు, అశ్వనీ దత్, కెఎస్ రామారావు, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత  రామానాయుడు  ఇలా తదితర ఎన్టీఆర్ నిర్మాతలగా ముద్రపడిన వాళ్ళందరు చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో సినిమాలు చేసారు. Ntr, Chiranjeevi, ks RamaRao, DeviVaraprasad, Telugu Cinema, Telugu Cinema  News, Tollywood, Tollywoodnews
Cast: Sumanth Prabhas, Ananthika Sanilkumar, Upendra Limaye, Narendra Ravi, Venkatesh Kakumanu, Mani Agurla   Crew: Written and Directed by Venugopal Reddy Cinematography by Pawan Pappula Music by Vasuki Vaibhav Produced by Pranay Reddy Presented by Sandeep Reddy Vanga   Presented by Sandeep Reddy Vanga, the youthful drama Romanchakam featuring Sumanth Prabhas and Ananthika Sanilkumar has hit the screens today. Let us look at the review.   Plot: Anvesh (Sumanth Prabhas), a Gen-Z youngster from Hyderabad, falls in love with Mythili (Ananthika), a Telugu girl living in Chennai. After they get close, Mythili moves to a flat in Hyderabad. Things take a turn when she suddenly goes missing. A panicked Anvesh fears she might have gone to end her life. The film explores how they met, the truth behind their love, and the real reason for her sudden disappearance.   Analysis: The movie has a very simple plot that highlights modern-day relationships. While the character introductions are good, the first half soon feels routine. However, the comedy track involving friends saves the day and keeps things engaging. The interval twist lands well. The second half is completely driven by entertainment. Upendra Limaye’s police episode is a major highlight. However, the emotional reason behind the heroine leaving lacks the needed depth. Sumanth Prabhas performs much better than his previous outings. Ananthika gives a fine performance, acting expressively with her eyes. Narendra Ravi's comic timing is excellent. Director Venugopal Reddy succeeds more as a dialogue writer than a filmmaker. The songs are good, but the background score and production values are just average.   Positives: Performances by the lead cast Entertaining second half Engaging comedy episodes Good dialogues   Negatives: Direction lacks magic Confusion in the heroine's characterization Average background score and production values   Bottomline: Even though the main plot is weak, the movie offers decent laughs and entertainment throughout.   Rating: 2.5/5     Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
'ఆర్డీఎక్స్' (RDX) లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో, మలయాళ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఐయామ్ గేమ్' (I'm Game) ఈరోజే థియేటర్లలోకి వచ్చింది. దాదాపు మూడేళ్ళ గ్యాప్ తర్వాత దుల్కర్ నటించిన మలయాళ చిత్రం ఇది. దీనికి తోడు ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిన 40వ సినిమా కావడం, పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మరి గ్యాంబ్లింగ్, బెట్టింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో.. ట్విట్టర్ (X) లో జనాలు ఏమంటున్నారో చూద్దాం. దుల్కర్ సల్మాన్ డ్యాన్ జాన్ అనే కేర్‌లెస్ గ్యాంబ్లర్ పాత్రలో కనిపించారు. లక్ ని నమ్ముకుని బెట్టింగ్స్ వేసే ఒక కుర్రాడు అనుకోకుండా ఒక పెద్ద క్రైమ్ అండ్ ఫాంటసీ నెట్‌వర్క్‌లో ఎలా చిక్కుకున్నాడు అనేదే కథ. ప్రమోషన్స్ అండ్ ట్రైలర్‌లో ఎక్కడా రివీల్ చేయని సర్ ప్రైజింగ్ ఫాంటసీ ఎలిమెంట్స్ థియేటర్లో గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయని నెటిజన్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో వచ్చే ప్రతీ సీన్ చాలా రేసీగా, ఇంట్రెస్టింగ్‌గా సాగుతుందట. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దుల్కర్ వన్ మేన్ షో అనే చెప్పాలి. మాస్ అవతార్‌లో దుల్కర్ ఎనర్జీ వేరే లెవెల్. యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీలో దుల్కర్ విశ్వరూపం చూపించారు. ఇక ఆంటోనీ వర్గీస్ (పెప్పే) పాత్ర సినిమాకి మరో పెద్ద అసెట్. దుల్కర్, పెప్పేల కాంబినేషన్ సీన్స్, వారి మధ్య వచ్చే యాక్షన్ బ్లాక్స్ థియేటర్లను షేక్ చేస్తున్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ 'లూసర్' సాంగ్ థియేటర్‌లో పూనకాలు తెప్పిస్తున్నాయి. విజువల్స్ కూడా ఆకట్టుకున్నాయి అంటున్నారు. అయితే, సినిమాలో కొన్ని మైనస్‌లు కూడా ఉన్నాయంటున్నారు. సెకండ్ హాఫ్‌లో డ్రామా కొంచెం స్లో అవ్వడం, రన్ టైమ్ దాదాపు 2 గంటల 53 నిమిషాలు ఉండడం వల్ల అక్కడక్కడా కొద్దిగా సాగదీసినట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ, ఓవరాల్‌గా నహాస్ హిదాయత్ టేకింగ్, విఎఫ్‌ఎక్స్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. ఓవరాల్‌గా ట్విట్టర్ టాక్ చూస్తే.. 'ఐయామ్ గేమ్' మాస్ అండ్ ఫాంటసీ లవర్స్‌కి ఒక పక్కా థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ అభిమానులకు ఈ సినిమా ఒక సాలిడ్ విందు అని చెప్పవచ్చు.        [I'm Game Twitter Review, I'm Game Movie Review, I'm Game Review Telugu, Dulquer Salmaan, Im Game Review, Kayadu Lohar, Nahas Hidhayath, Telugu Film News, Telugu News]  
  మనదేశంలో చాలామందికి ఉదయాన్నే లేవగానే వేడివేడిగా ఒక కప్పు టీ పడాల్సిందే. అలసటను పారద్రోలి శరీరానికి, మనస్సుకు తక్షణ ఉత్సాహాన్ని ఇవ్వడంలో టీ కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు ఒకటి రెండు కప్పుల టీ తాగడం సాధారణ అలవాటు అయినప్పటికీ, చాలామంది రోజులో పదే పదే టీ తాగుతుంటారు. అయితే, ఇలా పరిమితికి మించి ఎక్కువ మొత్తంలో టీ తాగడం వల్ల ఎముకలు బలహీనపడతాయని, శరీరంలో కాల్షియం స్థాయిలు గణనీయంగా పడిపోతాయని సోషల్ మీడియాలో నిరంతరం వార్తలు ప్రచారమవుతుంటాయి. ఈ ప్రచారం వినగానే టీ ప్రేమికుల్లో తీవ్ర ఆందోళన మొదలవుతుంది. అసలు టీ తాగడానికి, ఎముకల ఆరోగ్యానికి మధ్య ఉన్న అసలు సంబంధం ఏమిటి? అతిగా టీ తాగడం వల్ల ఎముకల సాంద్రత తగ్గి ఆస్టియోపోరోసిస్ వంటి ప్రమాదకర సమస్యలు వస్తాయా? ఈ విషయాలపై వైద్య నిపుణులు మరియు పరిశోధకులు వెల్లడించిన శాస్త్రీయ నిజాలను వివరంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. పరిశోధనల ప్రకారం టీలో  కెఫిన్  అనే సమ్మేళనం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ప్రతి కప్పు టీలో దాదాపు 30 నుండి 50 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ ఉంటుంది. మనం అధిక మొత్తంలో కెఫిన్ తీసుకున్నప్పుడు, అది మూత్రపిండాల (కిడ్నీల) ద్వారా శరీరంలోని కాల్షియం మూత్రం రూపంలో బయటకు విసర్జించబడేలా చేస్తుంది. సాధారణంగా మనం ప్రతి 60 మిల్లీగ్రాముల కెఫిన్ తీసుకున్నప్పుడు, శరీరం నుండి సుమారు 1 నుండి 2 మిల్లీగ్రాముల కాల్షియం నష్టపోతామని వైద్య అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే రోజుకు 4 నుండి 5 కప్పుల కంటే ఎక్కువ మోతాదులో టీ తాగే వారిలో కాల్షియం లోపం ఏర్పడే అవకాశాలు స్వల్పంగా పెరుగుతాయి. ముఖ్యంగా, మనం తీసుకునే రోజువారీ ఆహారంలో కాల్షియం శాతం తక్కువగా ఉన్నప్పుడు, ఈ కెఫిన్ ప్రభావం ఎముకల ఆరోగ్యంపై స్పష్టంగా కనిపిస్తుంది. ఎముకల నుండి కాల్షియం కరిగిపోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ ఎముకలు లొసుగుబారి, త్వరగా విరిగిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అయితే ఇక్కడే మరొక ఆసక్తికరమైన సైంటిఫిక్ కోణం దాగి ఉంది. టీలో కేవలం కెఫిన్ మాత్రమే కాకుండా  ఫ్లేవనాయిడ్లు  (Flavonoids) మరియు  ఫైటోఈస్ట్రోజెన్లు  అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల క్షీణతను అడ్డుకోవడంలో మరియు ఎముకల సాంద్రతను (Bone Mineral Density) మెరుగుపరచడంలో ఎంతో సాయపడతాయి. ముఖ్యంగా గ్రీన్ టీ మరియు బ్లాక్ టీలలో ఉండే పాలిఫెనాల్స్ అనే కాంపౌండ్లు ఎముకలను పునర్నిర్మించే  ఆస్టియోబ్లాస్ట్  కణాల పనితీరును వేగవంతం చేస్తాయని, అదే సమయంలో ఎముకలను కరిగించే  ఆస్టియోక్లాస్ట్  కణాల చర్యలను అదుపు చేస్తాయని రీసెర్చ్‌లో తేలింది. కాబట్టి మిితంగా అంటే రోజుకు 2 నుండి 3 కప్పుల టీ తాగే వారిలో ఎముకలు బలహీనపడటం అటుంచి, పైగా ఎముకల ఆరోగ్యం మరింత బలపడుతుందని బహుళ అధ్యయనాలు నిరూపించాయి. మరి టీ తాగే అలవాటు ఉన్నవారు ఎముకల బలాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటిది టీ తాగే పరిమాణాన్ని రోజుకు 2 లేదా 3 కప్పులకు పరిమితం చేసుకోవడం చాలా మంచిది. రెండవది, టీ చేసేటప్పుడు అందులో తగినంత పాలు ఉపయోగించడం వల్ల, టీ ద్వారా కోల్పోయే స్వల్ప కాల్షియంను పాలలోని ఉత్కృష్టమైన కాల్షియం భర్తీ చేస్తుంది. భోజనం చేసిన వెంటనే లేదా ఐరన్, కాల్షియం సప్లిమెంట్లు తీసుకునే సమయంలో టీ తాగకపోవడం ఉత్తమం, ఎందుకంటే టీలోని టాన్సిన్లు పోషకాల శోషణను అడ్డుకుంటాయి. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, ఆకుకూరలు, రాగులు మరియు విటమిన్ డి లభించే పదార్థాలను సమృద్ధిగా చేర్చుకుంటే టీ వల్ల ఎముకలకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి టీని పరిమితంగా, సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే ఆరోగ్యానికి ఎలాంటి భయం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. How much tea is safe for bones,tea and bone health myths vs reality.
  మన శరీరం మన ఆరోగ్య స్థితికి సంబంధించి నిరంతరం అనేక రకాల సంకేతాలను ఇస్తూనే ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా శ్వాసకోశ వ్యవస్థలో ఉత్పత్తయ్యే శ్లేష్మం లేదా తెమడ (Phlegm) రంగును బట్టి మన ఊపిరితిత్తులు మరియు గొంతు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో చాలా సులభంగా అంచనా వేయవచ్చు. వర్షాకాలం, చలికాలం లేదా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు దగ్గుతో పాటు తెమడ రావడం సర్వసాధారణం. అయితే చాలామంది ఈ తెమడ రంగును ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. సైంటిఫిక్ అధ్యయనాల ప్రకారం శ్లేష్మం రంగు మన శరీరంలో ఏ రకమైన ఇన్ఫెక్షన్ లేదా వ్యాధి ముదిరిందో స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి తెమడ వేర్వేరు రంగుల్లోకి మారడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను, వైద్య సంకేతాలను ప్రతీ ఒక్కరూ అవగాహన చేసుకోవడం ఎంతైనా అవసరం. సాధారణంగా ఆరోగ్యకరమైన మనుషుల్లో తెమడ స్పష్టంగా, పారదర్శకంగా (Clear Phlegm) లేదా స్వల్పమైన తెలుపు రంగులో ఉంటుంది. నీరు, ప్రొటీన్లు, యాంటిబాడీలు మరియు లవణాలతో కూడిన ఈ పారదర్శక తెమడ శ్వాసకోశ మార్గాలను తేమగా ఉంచడానికి, బయటి నుండి వచ్చే దుమ్ము ధూళిని అడ్డుకోవడానికి సహజ రక్షణ కవచంలా పనిచేస్తుంది. అయితే ఒకవేళ ఈ తెమడ విపరీతంగా పెరిగితే అలర్జీలు లేదా ఎలర్జిక్ రినిటిస్ వంటి సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఇక తెమడ కాస్త చిక్కగా మారి తెల్లటి రంగులోకి (White Phlegm) మారితే, శ్వాసనాళాల్లో వాపు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయని సూచిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, బ్రోన్కైటిస్ లేదా నెమ్ము (Congestion) చేసినప్పుడు పిండం లాంటి చిక్కటి తెల్ల తెమడ రావడం కనిపిస్తుంది. అత్యంత సాధారణంగా చాలామందిలో కనిపిచేది పసుపు లేదా ఆకుపచ్చ రంగు తెమడ (Yellow or Green Phlegm). తెమడ పసుపు రంగులోకి మారడం అనేది మన నిరోధక వ్యవస్థ ఇన్ఫెక్షన్‌తో పోరాడటం ప్రారంభించిందనడానికి స్పష్టమైన సంకేతం. శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ (తెల్ల రక్త కణాలు) బాక్టీరియాతో పోరాడి చనిపోయినప్పుడు అందులోని మైలోపెరాక్సిడేస్ అనే ఎంజైమ్ వల్ల శ్లేష్మం పసుపు నుంచి క్రమంగా ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. ఇది తీవ్రమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, సైనసైటిస్, నిమోనియా లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులకు నిదర్శనం. కాబట్టి తెమడ ఆకుపచ్చగా మారి కొన్ని రోజులకు పైగా ఉంటే వెంటనే యాంటీబయోటిక్ చికిత్స కోసం డాక్టర్‌ను సంప్రదించాలి.       Blood in phlegm symptoms and lung health, phlegm color meaning and infection signs.
  నేటి ఆధునిక జీవనశైలిలో వేగంగా బరువు తగ్గడానికి మరియు పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వును కరిగించుకోవడానికి అనేకమంది ఆశ్రయిస్తున్న ప్రసిద్ధ పద్ధతుల్లో  డిటాక్స్ వాటర్  ఒకటి. నీళ్లలో నిమ్మకాయ ముక్కలు, దోసకాయ, అల్లం, పుదీనా, లేదా రకరకాల పండ్ల ముక్కలు వేసి నానబెట్టి, ఆ నీటిని రోజంతా తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు పోయి బరువు తగ్గుతారనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. అయితే డిటాక్స్ వాటర్ నిజంగానే బరువు తగ్గిస్తుందా లేక ఇదొక సాధారణ మార్కెటింగ్ భ్రమ మాత్రమేనా అనే అంశంపై ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు స్పష్టమైన సైంటిఫిక్ నిజాలను వెల్లడిస్తున్నారు. ఎలాంటి నిజాలు దాగి ఉన్నాయో శాస్త్రీయంగా తెలుసుకోవడం ఆరోగ్య స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం. ముందుగా డిటాక్స్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు లేదా టాక్సిన్లు దానంతట అవే బయటకు వెళ్తాయని అనుకోవడం ఒక పెద్ద పొరపాటు. మన మానవ శరీరంలో కాలేయం (లివర్) మరియు మూత్రపిండాలు (కిడ్నీలు) నిరంతరం పనిచేస్తూ వ్యర్థాలను బయటకు పంపే అద్భుతమైన సహజ సిద్ధమైన వ్యవస్థను కలిగి ఉన్నాయి. దీనికోసం ప్రత్యేకంగా ఎలాంటి డిటాక్స్ పానీయాలు తాగాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, క్రమం తప్పకుండా డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల శరీరానికి ఒక ప్రధానమైన మేలు జరుగుతుంది. అది నీటి శాతాన్ని పెంచడం లేదా హైడ్రేషన్‌గా ఉంచడం. సాధారణ నీటిని సరిగా తాగలేని వారు, పండ్లు మరియు మూలికల సువాసన ఉన్న ఈ నీటిని రుచికరంగా భావించి ఎక్కువ మొత్తంలో తాగుతారు. శరీరం సరిగ్గా హైడ్రేట్ అయినప్పుడు మెటబాలిజం అంటే జీవక్రియ రేటు స్వల్పంగా మెరుగుపడుతుంది, ఇది పరోక్షంగా కేలరీలను వేగంగా ఖర్చు చేయడానికి తోడ్పడుతుంది. డిటాక్స్ వాటర్‌లో వేసే నిమ్మకాయ, పుదీనా, అల్లం వంటి పదార్థాల వల్ల నీటికి విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు శోథ నిరోధక (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) గుణాలు లభిస్తాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి, కడుపు ఉబ్బరం తగ్గించడానికి మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి కొంతవరకు సహాయపడతాయి. ముఖ్యంగా భోజనానికి ముందు తగినంత నీరు తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి, ఆహారం తక్కువగా తింటారు. దీనివల్ల క్యాలరీల గ్రహంపు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. అంతే తప్ప, కేవలం ఈ నీరు తాగడం వల్లే పొట్టలోని కొవ్వు కరిగిపోతుందని భావించడం శాస్త్రీయంగా నిరూపించబడలేదు. నిలకడైన బరువు తగ్గుదల అనేది సరైన పోషకాహారం, శారీరక వ్యాయామంపై ఆధారపడి ఉంటుంది.       Detox drinks benefits and side effects guide, scientific truth about belly fat detox water.
అన్ని జీవరాశులకు ఆహారమే శక్తినవనరు. అయితే మనిషికి మాత్రం ఆహారంలో ఎన్నో ఛాయిస్ లు ఉన్నాయి. కానీ  ఏది పడితే అది, ఎలా పడితే అలా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. కొందరు అనారోగ్యం చేసినప్పుడు లేదా కొన్ని రకాల ట్రీట్మెంట్ లలో ఉన్నప్పుడు పత్యం చేయమని చెబుతారు.   పత్యం ఆహారంలో ఉన్నప్పుడు వంకాయను తినకూడదని చెబుతూ ఉంటారు.  సాధారణంగా  సాంప్రదాయ ఆయుర్వేదం, నాటు వైద్యంలో కొన్నిరకాల అనారోగ్య సమస్యలతో ఉన్నవారికి వంకాయ తినకూడదని సిఫారసు చేస్తారు.  సాధారణ రోజుల్లో వంకాయ రుచికరమైన, పోషకాలున్న కూరగాయ అయినప్పటికీ, పత్యం వేళల్లో దీనిని మినహాయించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వంకాయను పత్యం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదో వివరంగా తెలుసుకుంటే.. వంకాయ.. వంకాయను ఆయుర్వేదంలో వాత, పిత్త దోషాలను పెంచే ఆహారంగా పరిగణిస్తారు. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గి ఉన్నప్పుడు లేదా రోగ నివారణకు పత్యం ఉంటున్నప్పుడు వంకాయ తింటే వాత దోషం పెరిగి నొప్పులు, జాయింట్లలో ఇబ్బందులు వస్తాయి. వంకాయ విత్తనాల్లో , తోలులో కొన్ని రకాల సహజ కాంపౌండ్లు ఉంటాయి. ఇవి సున్నితమైన చర్మం ఉన్నవారిలో, లేదా ఇప్పటికే దద్దుర్లు, దురదలు, అలర్జీలతో బాధపడుతున్న వారిలో సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. ఔషధాల ప్రభావం సరిగ్గా పనిచేయాలన్నా చర్మ సంబంధిత పత్యంలో వంకాయకు దూరంగా ఉండాలి. వంకాయ అరుగుదలకు కాస్త సమయం తీసుకుంటుంది. శరీరంలో అనారోగ్యం ఉన్నప్పుడు జీర్ణక్రియ మందగిస్తుంది. అటువంటి సమయంలో సులభంగా అరగని వంకాయను తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో ఎక్కడైనా గాయాలు, పుండ్లు ఉన్నప్పుడు లేదా శస్త్రచికిత్సలు జరిగినప్పుడు నాటు వైద్యంలో ప్రత్యేక పత్యం సూచిస్తారు. వంకాయ శరీరంలో వేడిని,   దురదను పెంచి పుండ్లు త్వరగా మానకుండా అడ్డుకుంటుందని చెప్తారు. వంకాయ సోలనేసి కుటుంబానికి చెందిన కూరగాయ. ఇందులో సోలనైన్ అనే కాంపౌండ్ ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉన్నవారికి ఇది పెద్దగా ఇబ్బంది కలిగించకపోయినా, పత్యం చేసేవారిలో , మందులు వాడేవారిలో ఇది జీర్ణ వ్యవస్థపై , నాడీ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఈ కారణాల వల్లనే పత్యం సమయంలో శరీరం త్వరగా కోలుకోవడానికి, ఔషధాలు ఎలాంటి సమస్య లేకుండా పనిచేయడానికి వంకాయకు దూరంగా ఉండాలని పెద్దలు , ఆయుర్వేద వైద్యులు సలహా ఇస్తారు. పత్యం పూర్తయి శరీరం పూర్తి ఆరోగ్యాన్ని పుంజుకున్న తర్వాతే వంకాయను ఆహారంలో తిరిగి చేర్చుకోవడం మంచిది.                          *రూపశ్రీ.
నేటి డిజిటల్ యుగంలో ఆరోగ్య స్పృహ, ఫిట్‌నెస్ పట్ల శ్రద్ద పెరిగాయి. జిమ్‌లకు వెళ్లేవారు, బరువు తగ్గాలనుకునేవారు లేదా కండరాల పుష్టి కోసం ప్రయత్నం చేసేవారు ప్రోటీన్ షేక్స్, హెల్త్ సప్లిమెంట్లు, డిజైనర్ ప్రోటీన్ బార్ల వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ, మన తాతల తండ్రుల కాలంలో ఎలాంటి ప్రొటీన్ పౌడర్లు ఉండేవి కావు. అయినా వారు ఎంతో బలంగా, శక్తివంతంగా, దీర్ఘకాలిక ఆరోగ్యంతో జీవించారు. దానికి కారణం వారు రోజూ తీసుకునే సంప్రదాయ భారతీయ ఆహారమే! మన ప్రాంతీయ వాతావరణం, రుతుపవనాలు , పాతకాలపు వంట పద్ధతుల ఆధారంగా మన పళ్లెంలో చేరే రోజూవారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించేవి. ఆధునిక ఆహార అలవాట్ల వల్ల కాలక్రమేణా మనం మరచిపోయిన, కానీ మన తాతల కాలంలో క్రమం తప్పకుండా తిన్న 10 శక్తివంతమైన ప్రోటీన్ ఆహారాలు ఉన్నాయి.  నిజానికి ఇవన్నీ ప్రోటీన్ సూపర్ ఫుడ్స్.. అవేంటో తెలుసుకుంటే..  ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:  ఉలవలు.. ఒకప్పుడు పల్లెల్లో ప్రతి ఇంట్లో క్రమం తప్పకుండా వాడే ధాన్యాల్లో ఉలవలు ముఖ్యమైనవి. శాకాహారంలో ప్రోటీన్ అత్యధికంగా లభించే ఆహారాల్లో ఇది ఒకటి. మన తాతలు రోజంతా కష్టపడి పనిచేయడానికి అవసరమైన శక్తిని ఈ ఉలవలే ఇచ్చేవి. ఉలవ చారు, ఉలవ పప్పు, చట్నీలు లేదా గుగ్గిళ్ల  రూపంలో వీటిని తీసుకునేవారు. ప్రోటీన్‌తో పాటు ఇందులో ఐరన్, పీచు పదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కిడ్నీ రాళ్లను నివారించడంలోనూ, శరీరంలో కొవ్వును తగ్గించడంలోనూ అద్భుతంగా పనిచేస్తాయి. సత్తు పిండి.. ఇది శనగలను వేయించి, మెత్తగా పొడి చేసి తయారుచేసే సంప్రదాయ ఆహారం. ప్రోటీన్ షేక్స్‌కు ఇది పూర్వీకుల కాలం నాటి దేశీ వెర్షన్ అని చెప్పవచ్చు. వేసవికాలంలో సత్తు పిండిని నీళ్లు, నిమ్మరసం, మసాలాలతో కలిపి  తాగేందుకు వాడేవారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా, కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. నాణ్యమైన ప్రోటీన్ , ఫైబర్ ఉన్న సత్తు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. నల్ల శనగలు.. ఈ రోజుల్లో తెల్ల శనగలు వాడకం పెరిగినప్పటికీ, పూర్వకాలంలో నల్ల శనగలదే హవా రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే గుడాలుగా  తినడం లేదా కూరల్లో వాడటం చేసేవారు. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా వేయించిన నల్ల శనగలను తీసుకెళ్లేవారు. ఇవి త్వరగా పాడవవు, తింటే కడుపు నిండుగా ఉంటుంది. ఇవి ప్లాంట్ బేస్డ్   ప్రోటీన్‌తో పాటు ఐరన్‌ను సమృద్ధిగా అందిస్తాయి.  బొబ్బర్లు / అలసందలు.. బొబ్బర్లు లేదా అలసందలు ఒకప్పుడు ప్రతీ ఇంట్లోనూ రెగ్యులర్‌గా వండే కూర ధాన్యం. వీటిలో అత్యధిక మోతాదులో ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ , ఐరన్ ఉంటాయి. నాటు దినుసులు , మసాలాలతో నెమ్మదిగా ఉడికించి చేసే బొబ్బర్ల కూర లేదా గుడాలు శరీరానికి మంచి బలాన్ని ఇస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. మట్కీ / మోత్ బీన్స్.. రాజస్థాన్ వంటి పొడి వాతావరణం కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా పండే మట్కీ లేదా మోత్ బీన్స్ చిన్నగా ఉన్నప్పటికీ పోషకాల గని. ఇవి చూడటానికి పెసల సైజ్ లో ఉంటాయి. కానీ వీటి రంగు మాత్రం భిన్నంగా ఉంటుంది.  తక్కువ నీటితో పండే ఈ పంట రైతులకు, ప్రజలకు ప్రధాన ప్రోటీన్ మూలంగా ఉండేది. వీటిని మొలకలెత్తించి తినడం లేదా కారంగా కూర వండుకోవడం చేసేవారు. ధాన్యాలను మొలకెత్తించడం వల్ల వాటిలోని ప్రోటీన్ , ఇతర పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుందని మన పూర్వీకులకు ముందే తెలుసు. మినపప్పు.. నేడు మినపప్పును కేవలం ఇడ్లీ, దోస పిండి లేదా పోపులకే పరిమితం చేశాం. కానీ, పూర్వకాలంలో మినపప్పుతో వడలు, మినప రొట్టెలు, మినప సున్నుండలు వంటి బలమైన పదార్థాలు తయారుచేసి తినేవారు. మినపప్పులో ప్రోటీన్‌తో పాటు క్యాల్షియం, పొటాషియం, ఐరన్ మెండుగా ఉంటాయి. బియ్యం లేదా తృణధాన్యాలతో కలిపి మినపప్పును తిన్నప్పుడు అది శరీరానికి పూర్తిస్థాయి ప్రోటీన్‌ను అందిస్తుంది.  ఇంట్లోనే తయారుచేసిన తాజా పనీర్.. పాకెట్లలో లభించే ప్యాక్ చేసిన పనీర్ కాకుండా, మన అమ్మమ్మలు గేదె లేదా ఆవు పాల నుంచి తాజా నిమ్మరసం పిండి పనీర్ తయారు చేసేవారు. ఈ తాజా పనీర్‌లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇది నాణ్యమైన ప్రోటీన్ , క్యాల్షియంను ఉచితంగా శరీరానికి అందిస్తుంది. ఎముకల గట్టితనానికి, కండరాల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.  వేయించిన వేరుశనగలు..   నట్స్ అనగానే ఈ రోజుల్లో బాదం, జీడిపప్పు, పిస్తా గుర్తుకొస్తాయి. కానీ పేదవాడి బాదం పప్పు అయిన వేరుశనగలు పోషకాల్లో దేనికీ తీసిపోవు. సాయంత్రం పూట తినుబండారంగా, లేదా బెల్లంతో కలిపి పల్లీ పట్టీ రూపంలో పూర్వీకులు వీటిని రోజూ తినేవారు. వేరుశనగల్లో ప్రోటీన్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. రాజగిరా / అమరాంత్ గింజలు.. రాజగిరాను  ఉపవాసాల సమయంలో ఎక్కువగా తింటుంటారు. కానీ పూర్వకాలంలో దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకునేవారు. రాజగిరా గింజల్లో శరీరం స్వయంగా తయారుచేసుకోలేని 9 రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది సంపూర్ణ ప్రోటీన్ కలిగిన అతికొద్ది వృక్షాహారాలలో ఒకటి. రాజగిరా లాడ్డు, జావ, రొట్టెల రూపంలో  తీసుకోవడం వల్ల ఎముకలు గట్టిపడతాయి. నువ్వులు .. పరిమాణంలో చిన్నవిగా ఉన్నప్పటికీ నువ్వులలో ఉండే పోషకాలు అపారం. నువ్వుల పొడి, నువ్వుల చట్నీ, నువ్వుల ఉండలు మన సంప్రదాయ ఆహారంలో భాగం. నువ్వులలో కేవలం క్యాల్షియం, మంచి కొవ్వులే కాకుండా విలువైన ప్రోటీన్ కూడా ఉంటుంది. నువ్వులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కండరాలు బలంగా మారడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్‌నెస్ అంటే విదేశీ ఆహార అలవాట్లను లేదా ప్యాక్ చేసిన హెల్త్ పౌడర్లను గ్రైండ్ చేయడం కాదు. మన ఇంట్లోనే, మన పూర్వీకులు తిన్న సంప్రదాయ ధాన్యాలు , పప్పు దినుసులలోనే శరీరానికి అవసరమైన అసలైన బలం దాగి ఉంది.  దైనందిన ఆహారంలో మళ్లీ ఈ పాతకాలపు ఆహారాలను భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన శరీరం లభిస్తుంది.  
రోజూ కొన్ని నిమిషాలు ఓం చాంటింగ్ చేయడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. ఉద్గీత్ ప్రాణాయామం (Udgitha Pranayama) లో లోతుగా శ్వాస తీసుకుని, నెమ్మదిగా శ్వాసను వదులుతూ “ఓం” అని దీర్ఘంగా ఉచ్చరిస్తారు. ఈ ప్రక్రియ శ్వాసపై దృష్టిని కేంద్రీకరించడంతో పాటు మనసును రిలాక్స్ చేయడంలో సహాయపడవచ్చు. ఈ వీడియోలో ఉద్గీత్ ప్రాణాయామం అంటే ఏమిటి? దీన్ని ఎలా చేయాలి? ఓం చాంటింగ్ తర్వాత 2–3 సెకన్ల పాటు ఉండే విరామానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి? అలాగే స్ట్రెస్, బీపీ, గుండె ఆరోగ్యం, నిద్రలేమి వంటి అంశాలపై దీని ప్రభావం గురించి తెలుసుకుందాం. అయితే ప్రతి ఒక్కరికీ అన్ని రకాల ప్రాణాయామాలు ఒకే విధంగా సరిపోవు. ఎవరెవరు ఉద్గీత్ ప్రాణాయామం చేయకుండా ఉండాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి ముఖ్యమైన విషయాలను కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. గమనిక: ప్రాణాయామం ఆరోగ్యానికి సహాయకరంగా ఉండవచ్చు కానీ ఇది వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. బీపీ, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం ప్రారంభించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)