LATEST NEWS
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్ది రోజులుగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్ట్ వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. గన్నవరం పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి, కోర్టు ముందు హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు. అయితే, ఆయనపై కేవలం పవన్ కళ్యాణ్ లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను దూషించారనే కారణంతోనే కాకుండా, అత్యంత కఠినమైన  ఉపా చట్టం కింద దేశద్రోహం కేసులు నమోదు చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే.. కేవలం దళిత క్రిస్టియన్ శంఖారావం సభలో మాట్లాడిన వ్యాఖ్యల కోణంలోనే కాకుండా..  ఆయన వెనుక ఉన్న ఒక పెద్ద నెట్‌వర్క్‌ను పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో ఎండగట్టారు. గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం. ముఖ్యంగా గత ఏడాది నవంబర్‌లో ఆయన విడుదల చేసిన కొన్ని వీడియోలను పోలీసులు పెన్ డ్రైవ్ రూపంలో న్యాయస్థానానికి సమర్పించారు. నిషేధిత సీపీఐ (ఎంఎల్) మావోయిస్టు సంస్థకు చెందిన కేశవరావు, హిడ్మా వంటి అగ్రనేతలను కీర్తిస్తూ..  వారు అమరజీవులని, మళ్లీ పుడతారని, యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని రావణ్ వ్యాఖ్యానించినట్లు రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. అమాయక గరిజన యువతను టార్గెట్ చేసుకుని దేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించేలా ఈ ప్రసంగాలు ఉన్నాయని ప్రాసిక్యూషన్ వాదిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  రామకృష్ణ తెలుగువన్ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. ఉపా' చట్టం కింద ఒకసారి కేసు నమోదైతే సాధారణ ఐపీసీ సెక్షన్లలాగా బెయిల్ రావడం సులభం కాదన్నారు. అయితే.. ఈ చట్టాన్ని శాంతిభద్రతలు సజావుగా ఉన్న ఏపీలో ప్రయోగించడం ఆందోళన కు గురిచేస్తోందనీ,  ప్రభుత్వం మారిన ప్రతిసారీ ఒకరు నేరస్థుడిగా, మరొకరు ప్రజాసేవకుడిగా మారిపోయే సంప్రదాయం సరికాదన్నారు. ప్రస్తుతం ప్రశ్న రావణ్ ముందున్న ఏకైక మార్గం హైకోర్టును ఆశ్రయించడమేనన్న ఆయన..  ప్రశ్న రావణ్.. ఆయన తరపు న్యాయవాదులు క్వాష్ పిటిషన్  దాఖలు చేసి, ఈ ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరే అవకాశం ఉందన్నారు. హైకోర్టుకు ఉన్న ప్రత్యేక అధికారాల ద్వారా వీడియో కంటెంట్‌ను క్షుణ్ణంగా పరిశీలించి..  ఒకవేళ ఆ ప్రసంగాల వల్ల సమాజంలో తక్షణ నష్టం లేదా హింస జరగలేదని భావిస్తే రావణ్‌కు ఉపశమనం లభించే అవకాశాలు ఉన్నాయని  రామకృష్ణ అభిప్రాయపడ్డారు.  Prashna Ravana Arrest AP, Former Judge Ramakrishna Interview,  UAPA Case Andhra Pradesh, Ravana Remand Report, AP Politics Telugu News  
  ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర రాజకీయ నాయ కులు, పోలీసు ఉన్నతాధికారులు, కీలక ప్రభుత్వ అధికారులకు వ్యక్తిగత భద్రత దృష్ట్యా గన్‌మెన్‌లను కేటాయించ డం సర్వసాధారణం. అయితే ఉప్పల్   బీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాత్రం ఈ విషయంలో భిన్నమైన నిర్ణయం తీసుకున్నారు.   తనకు వ్యక్తిగత భద్రత కోసం గన్‌మెన్‌లు అవసరం లేదని ఆయన మొదటి నుంచీ చెబుతూవస్తున్నారు.  ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి  గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ..  తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు. ప్రజల మధ్య ఎలాంటి హడావుడి లేకుండా, సాధారణ వ్యక్తిలా ఉండాలనేదే తన అభిప్రాయమని అప్పట్లోనే వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం (జులై 7) ఆయన భద్రత కోసం   గన్‌మెన్‌లు నివాసానికి వెళ్లగా..  లక్ష్మారెడ్డి వారిని  వెనక్కి పంపించారు. తన భద్రతను తానే చూసుకుంటానని, గన్‌మెన్‌లు లేకుండా  ప్రజల్లో తిరగడమే  తనకు సౌకర్యంగా ఉంటుందని వారికి వివరించారు. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని మరోసారి స్పష్టం చేయడంతో గన్‌మెన్‌లు అక్కడి నుంచి వెనుదిరిగారు. 
తమిళనాడు రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య నడుస్తున్న వివాదంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి  విజయ్ కరూర్ జిల్లాలో పర్యటించకుండా నిరోధించాలని కోరుతూ ప్రతిపక్ష  డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీంకోర్టు   నిరాకరించింది. ఒక రాష్ట్ర   ముఖ్యమంత్రి పర్యటనలను తాము ఏ విధంగా నియంత్రించగలమని న్యాయస్థానం  ప్రశ్నించింది. గతంలో   తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కరూర్ ప్రాంతంలో తీవ్రమైన తొక్కిసలాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలనూ, అలాగే గాయపడిన బాధితులను పరామర్శించేందుకు ఈ నెల  10న కరూర్ సందర్శనకు  సీఎం విజయ్ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే..  సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.వి. విశ్వనాథన్, జస్టిస్ అలోక్ అరధేలతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది. డీఎంకే తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. బాధితులను కలిసి ప్రభుత్వ పరంగా ఉద్యోగ నియామక పత్రాలు, ఇతర ఆర్థిక సాయం అందించేందుకు సీఎం వెళ్తున్నారని, దీనివల్ల సీబీఐ దర్యాప్తు పారదర్శకత దెబ్బతింటుందని ఆయన కోర్టుకు వివరించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందిస్తూ..  బాధిత కుటుంబాలను పరామర్శించడం సాక్షులను ప్రభావితం చేయడం ఎలా అవుతుందని ప్రశ్నించింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే కొట్టివేస్తామని స్పష్టం చేయడంతో..  డీఎంకే న్యాయవాది పిటిషన్‌ను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారు. దీంతో కోర్టు ఆ వ్యాజ్యాన్ని ముగించింది. దీంతో  ఈ నెల   10న సీఎం విజయ్  కరూర్ పర్యటనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి.   DMK Petition Dismissed, Tamil Nadu CM Joseph Vijay, Karur Stampede Case, Tamil Nadu Politics, TeluguOne
కల్వకుంట్ల కవిత కొత్త  రాజకీయ పార్టీ పేరు   ఇప్పుడు న్యాయస్థానం పరిధిలోకి చేరింది. తన నూతన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  (టీఆర్ఎస్)  పేరు  ఖరారు చేయాలని కోరుతూ ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత..  ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం  టీఆర్ఎస్  పేరు ఖరారు విషయంలో  పంపిన లేఖను సవాల్ చేస్తూ ఆమె   న్యాయపోరాటానికి దిగారు.  పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా తమ పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ జూన్ 23న కేంద్ర ఎన్నికల సంఘం తనకు ఒక అధికారిక లేఖను పంపిందని కవిత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈసీ లేవనెత్తిన అభ్యంతరాల నేపథ్యంలో, పార్టీ పేరు ఆమోదం పొందేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ‘టీఆర్ఎస్’ అనే సంక్షిప్త నామం చుట్టూ ఈ వివాదం తిరుగుతోంది. గతంలో కవిత తండ్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీని భారత రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి.. సొంత పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణ ఉద్యమం గుర్తుకు వచ్చేలా.. తన పార్టీకి  తెలంగాణ రక్షణ సమితి  అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ పేరుపై, ముఖ్యంగా  టీఆర్ఎస్  అనే సంక్షిప్త అక్షరాల వాడకంపై అభ్యంతరం తెలుపుతూ ఈసీకి పలు పిటిషన్లు వచ్చాయి.    ప్రస్తుతం చలామణిలో ఉన్న..  లేదా ప్రజల్లో గుర్తింపు పొందిన ఇతర పార్టీల పేర్లను పోలి ఉండేలా కొత్త పేర్లు ఉంటే ఓటర్లలో గందరగోళం నెలకొనే అవకాశం ఉంటుంది. కనుక కవిత ప్రతిపాదించిన పేరు పాత టీఆర్ఎస్ పార్టీని పోలి ఉండటంతో, దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ ఈసీ నోటీసులు జారీ చేసింది. దీనిపై స్పందించిన కవిత  చట్టప్రకారం తాము పెట్టుకున్న పేరు చెల్లుబాటు అవుతుందని వాదిస్తున్నారు.  ఈ పేరు మార్పు లేదా అభ్యంతరాలపై ఎన్నికల సంఘం అడిగిన వివరాలకు కవిత ఇప్పటికే బదులిచ్చినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు,  తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ పిటిషన్‌పై రానున్న రోజుల్లో ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. న్యాయస్థానం ఈ విషయంలో ఎలాంటి తీర్పు ఇస్తుంది, కేంద్ర ఎన్నికల సంఘానికి ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేస్తుంది అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.   Telangana Rakshana Sena, TRS Party Name Row, Delhi High Court, Election Commission of India
తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీకి ఇటీవల జరిగిన  ఎన్నికలలో   దళపతి విజయ్ సృష్టించిన సంచలన విజయం తెలిసిందే.  రాజకీయాల్లోకి ప్రవేశించిన తొలిసారే విజయం సాధించి   ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి  విజయ్ చరిత్ర సృష్టించారు.  కమల్ హాసన్ వంటి మహామహులకే సాధ్యం కాని ఈ ఫీట్ ను విజయ్ సాకారం చేయడంతో..  ఇప్పుడు కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి  అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే   స్టార్ హీరో ధనుష్ కూడా   రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.  తాజాగా ధనుష్ అభిమాన సంఘం నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో  పార్టీ  జెండాను ఆవిష్కరించడం ఆయన పొలిటికల్ ఎంట్రీకి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  కేవలం జెండా రూపకల్పనకే పరిమితం కాకుండా..  తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని అభిమాన సంఘాల నేతలకు ధనుష్ పిలుపునివ్వడం కూడా  ఆయన పోలిటికల్ ఎంట్రీని కన్ ఫర్మ్ చేస్తోందంటున్నారు.   Hero, Dhanush, Fans, Flag, Public, Service, Teluguone
ALSO ON TELUGUONE N E W S
  సినిమాని అన్ని విభాగాల్లోను అప్ డేట్ కండిషన్ లోకి తీసుకొచ్చిన దర్శకుడు శంకర్. ప్రేక్షకుల సినీ ఆలోచన స్థాయి పెంచి, మేము సినిమా చూసాం అని గర్వపడేలా చేసిన  దర్శకుడు కూడా. మేకింగ్ పరంగా కూడా సినిమా సైతం ఊహించని విధమైన టేకింగ్ తో సినిమా యొక్క వాల్యూ పెంచాడు. భారతీయ చలనచిత్ర రంగాన్ని గ్రాఫిక్స్ వైపు, భారీ బడ్జెట్ వైపు నడిపించిన ఒకే ఒక్కడు కూడాను. 1993లో వచ్చిన 'జెంటల్‌మ్యాన్' సినిమాతో మొదలైన ఆయన ప్రస్థానం, దాదాపు పాతికేళ్ల పాటు అప్రతిహతంగా సాగింది. జెంటల్‌మ్యాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన 100% బ్లాక్‌బస్టర్ విజయం టాలీవుడ్, కోలీవుడ్‌లను ఊపేసింది. ఆ తర్వాత వచ్చిన 'భారతీయుడు', 'జీన్స్', 'అపరిచితుడు', 'రోబో' చిత్రాలు కేవలం సినిమాలు కావు, ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ మార్చేసిన అద్భుతాలు. ముఖ్యంగా 2010లో వచ్చిన 'రోబో' చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹375 కోట్లకు పైగా వసూలు చేసి ఆ రోజుల్లోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మన స్క్రీన్‌పై చూపించి అందరినీ నోరెళ్లబెట్టేలా చేశారు శంకర్. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు ట్రెండ్ ఫాలో అవ్వడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా శంకర్ కెరీర్ గ్రాఫ్ పరిశీలిస్తే ఆయన మేకింగ్ స్టైల్‌లో పాత ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన '2.0' చిత్రం ఆశించిన స్థాయిలో   మెప్పించలేకపోయింది. వసూళ్లు సాధించినప్పటికీ, శంకర్ మార్క్ ఎమోషన్ అందులో మిస్ అయిందనేది పచ్చి నిజం. ఇక ఇటీవల కాలంలో ఆయన దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు మరింత నిరాశపరిచాయి. దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన 'ఇండియన్ 2'  డిజాస్టర్‌గా నిలిచింది. కేవలం 20% పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోలేక, పాతకాలపు కథనంతో సాగడం శంకర్ అభిమానులను సైతం తీవ్రంగా కలచివేసింది.  రామ్ చరణ్‌తో చేసిన 'గేమ్ చేంజర్ పరిస్థితి అంతే. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం రాజమౌళి, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి యువ దర్శకులు సరికొత్త స్క్రీన్‌ప్లే, గ్రిప్పింగ్ నరేషన్‌తో దూసుకుపోతున్నారు. నేటి తరం ఆడియన్స్ కేవలం భారీ సెట్లు, వందల కోట్లు ఖర్చు పెట్టిన గ్రాఫిక్స్ చూసి పడిపోవడం లేదు. బలమైన కథ, ఎమోషన్ ఉంటేనే 000 కోట్ల క్లబ్‌లో సినిమాలు చేరుతున్నాయి. కానీ శంకర్ ఇంకా 1990ల నాటి లంచగొండితనం, సామాజిక సమస్యల చుట్టూనే తిరుగుతున్నారు. నేటి డిజిటల్ యుగంలో 5G స్పీడ్‌తో దూసుకుపోతున్న ప్రేక్షకులకు శంకర్ పాత ఫార్ములా రొటీన్‌గా అనిపిస్తోంది. Also read: Lenin: టెన్షన్..టెన్షన్..టెన్షన్!  ఈ పరిస్థితులని చూస్తుంటే 'శంకర్ నుంచి ఇకపై అద్భుతమైన సినిమాలు రావడం కష్టమేనా?' అనే ప్రశ్న సినీ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఆయనను తక్కువ అంచనా వేయలేం. 30 ఏళ్లకు పైగా ఇండస్ట్రీని ఏలిన ఒక లెజెండరీ దర్శకుడు ఒక్క సరైన హిట్‌తో మళ్లీ ఫామ్‌లోకి రావడం అసాధ్యమేమీ కాదు. కాకపోతే శంకర్ తన పాత ఆలోచనల నుంచి బయటకు వచ్చి, నేటి తరం ప్రేక్షకుల పల్స్ పట్టుకోవాల్సి ఉంటుంది. విజువల్ గ్రాండ్‌నెస్ పక్కన పెట్టి, కథలో దమ్ము చూపిస్తేనే శంకర్ మళ్లీ కింగ్ కాగలరు. లేదంటే ఆయన శకం ముగిసినట్లేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.  shankar, game changer, ram charan
గత కొంతకాలంగా ఒక అరుదైన అనారోగ్య సమస్యతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ ఇక లేరు అనే వార్త అందరి గుండెలను పిండేస్తోంది. ఆ చిన్న వయసులోనే ఊహించని వ్యాధి ఎదురైనా, అతను ప్రదర్శించిన అంతులేని ఆత్మవిశ్వాసం, పోరాట పటిమ ఎంతో మంది హృదయాలను కదిలించాయి. నిరంజన్ మరణవార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని వారాల క్రితమే నిరంజన్ జీవితంలో ఒక అద్భుతమైన క్షణం చోటుచేసుకుంది. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తన జీవితంలో చివరి కోరిక తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్‌ను కలవడమేనని తెలుసుకున్న జనసేనాని ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తెలంగాణలోని హనుమకొండలో ఉన్న నిరంజన్ నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. నిరంజన్‌ను ఎంతో ప్రేమగా హత్తుకుని, అతని తల్లిదండ్రులతో మాట్లాడి, నిరంజన్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిరంజన్ కోలుకోవాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వయంగా అందించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నిరంజన్ వైద్యం కోసం గతంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కూడా తన వంతుగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. నిరంజన్ ప్రాణాలను కాపాడేందుకు తన వంతు ప్రయత్నం చేసినప్పటికీ, విధి ఎంత క్రూరమైనదో మరోసారి రుజువైంది. ఆ మరువలేని తీపి జ్ఞాపకాన్ని, తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్న కొద్దిరోజులకే నిరంజన్ తుది శ్వాస విడిచారు. ఈ గుండెను పిండేసే వార్త తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైన బండ్ల గణేష్, సోషల్ మీడియా వేదికగా నిరంజన్ మృతి పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. "చిన్నారి నిరంజన్ మరణ వార్త నన్నెంతో కలచివేసింది. తన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి." అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేశారు. తనను ప్రాణంగా ప్రేమించే అభిమాన హీరోను కలవాలనే అతిపెద్ద కల నెరవేరినప్పటికీ, ఆ జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చి నిరంజన్ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అందరినీ కలచివేస్తోంది. నిరంజన్ చేసిన భౌతిక పోరాటం ముగిసినప్పటికీ, ఆ చిన్నారి ముఖంలో కనిపించిన చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. https://x.com/ganeshbandla/status/2074723185761923274 Pawan Kalyan, Niranjan, Bandla Ganesh, TeluguOne  
తెలుగు సినిమా ఎదుగుదల అక్కినేని(Akkineni)కాంపౌండ్ లోనే పురుడు పోసుకుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అందుకు ఆద్యుడు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు అనే విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన రెండో మనవడు అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ నెల 10 న ;లెనిన్' తో సెల్యులాయిడ్ పై అడుగుపెడుతున్నాడు. రిలీజ్ టైందగ్గరపడుతున్న కొద్దీ అక్కినేని అభిమానుల్లో తీవ్రమైన ఉత్కంఠ, టెన్షన్ నెలకొంది.  దీనికి ప్రధాన కారణం అఖిల్ కెరీర్ లో ఇంతవరకు సరైన హిట్ లేదు. అఖిల్ మొదలుకొని, ఏజెంట్ వరకు తన పెర్ఫార్మ్ విషయంలో ఏ లోటు లేకపోయినా, కథ, కధనం బాగోకపోవడంతో హిట్ అనేది అఖిల్ కి డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తుంది. పైగా ఇప్పుడు  3 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత లెనిన్ తో  వెండితెరపై కనిపించబోతున్నాడు . మరోవైపు రిలీజ్ డేట్  ఏకంగా 3 సార్లు మారడం కూడా అభిమానుల్లో టెన్షన్‌ని పెంచేసింది. మొదట మే 1న, ఆ తర్వాత జూన్ 26న విడుదల చేయాలనుకున్నా, చివరకు జూలై 10 వ తేదీని లాక్ చేశారు. రామ్ చరణ్ 'పెద్ది' వంటి పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ క్లాష్ రాకూడదనే ఉద్దేశంతోనే నిర్మాత నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రామీణ యాక్షన్ డ్రామాను దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరు రాయలసీమ (చిత్తూరు) నేపథ్యంతో తెరకెక్కించారు. తిరుపతిలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ తన అభిమానులకి  భావోద్వేగంతో క్షమాపణలు చెప్పారు. "ఇంతకాలం మిమ్మల్ని ఊరించినందుకు నన్ను క్షమించండి, నా హృదయం ఎప్పుడూ మీ కోసమే " అంటూ చెప్పుకొచ్చాడు. Also read: Imanvi: ప్రభాస్ హీరోయిన్ ఇమాన్వికి మరో ఛాన్స్ ఎందుకు రాలేదు.. అసలు రీజన్ ఇదే! అయితే, ఈ టెన్షన్ల నడుమ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రంపై అత్యంత ధీమాగా ఉన్నారు. 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల నుండి 200 కోట్ల రూపాయల వరకు వసూలు చేసే సత్తా ఉన్న కమర్షియల్ సినిమా అని ఆయన గ్యారెంటీ ఇచ్చారు. ఇంటర్వెల్‌కు 45 నిమిషాల ముందు నుండి క్లైమాక్స్ వరకు ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదని, థియేటర్ల నుండి వచ్చే ప్రతి ఒక్కరూ సంతృప్తితో వస్తారని 200 శాతం నమ్మకంగా చెప్పారు. అఖిల్ కూడా లెనిన్ ని 'రాయలసీమ మహాభారతం' అని అభివర్ణించారు. సీనియర్ నటుడు నాగార్జున కూడా "ఈ సినిమాలో మీరు అఖిల్‌ను చూడరు, కేవలం లెనిన్‌ను మాత్రమే చూస్తారు" అని ప్రశంసించారు. దీనికి తోడుగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కూడా అఖిల్‌కు బాసటగా నిలిచి 'లెనిన్' కోసం గర్జించడంతో అక్కినేని ఫ్యాన్స్‌లో భయంతో కూడిన ఒక కొత్త జోష్ కనిపిస్తోంది. జూలై 10న థియేటర్లలో అఖిల్ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని టాలీవుడ్ మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.  అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జత కట్టింది.   akhil akkineni, bhagyashri borse, lenin, nagarjuna  
In heartbreaking news for the Telugu film fraternity and Jana Sena supporters, Niranjan, the 17-year-old fan of Pawan Kalyan who had won hearts with his inspiring spirit despite battling Duchenne Muscular Dystrophy (DMD), has passed away. The news has left fans across social media mourning the loss of the teenager, whose emotional meeting with the actor-politician just a few weeks ago had touched millions. Niranjan, a resident of Hanumakonda in Telangana, had been bedridden for years due to the rare genetic disorder. His long-cherished dream was to meet Pawan Kalyan. After learning about the boy's wish through Jana Sena leaders, the Andhra Pradesh Deputy Chief Minister personally visited Niranjan at his home in June, spending quality time with him and his family. During the emotional interaction, Pawan Kalyan hugged Niranjan, spoke to his parents about his treatment, donated ₹1 lakh towards medical expenses, presented Tirumala prasadam and sacred akshatalu, and even promised to gift him a puppy after learning about his wish. He also assured support for the family's livelihood by helping them set up a food stall. The visit was widely praised as one of the actor's most heartfelt gestures. Niranjan's passing has triggered an outpouring of grief from Pawan Kalyan fans, Jana Sena workers and netizens, who are sharing memories and visuals from that unforgettable meeting. What was once a dream fulfilled has now become a poignant reminder of the teenager's courage and unwavering admiration for the star. Producer Bandla Ganesh also met the family after Pawan Kalyan met Niranjan and donated Rs.5 lakhs for his recovery. He expressed his condolences to the grief stricken family and prayed for their strength.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)సరసన జోడి కట్టాలనేది ఎంతో మంది హీరోయిన్స్ కల. అలాంటి కలని కనడానికి కొంచం టైం పట్ట్టే అవకాశం ఉన్నా కూడా అనుకోకుండా ప్రభాస్ తో 'ఫౌజీ' లో జోడి కట్టే ఛాన్స్ దక్కించుకుంది ఇమాన్వి(Imanvi). 1940ల కాలం నాటి చారిత్రక నేపథ్యంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాల్లో ఇమాన్వి  మెరిసినప్పుడు, ఒక్కసారిగా ఇండస్ట్రీ చూపు మొత్తం ఈ కొత్త భామపైనే పడింది. ఆమె అందం, ప్రత్యేకించి హను రాఘవపూడిని ఆకట్టుకున్న ఆమె భావగర్భితమైన కళ్ళు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి. అయితే, ఈ భారీ ప్రాజెక్టు ప్రారంభమై నెలలు గడుస్తున్నా, ఇమాన్వి ఇప్పటివరకు మరో కొత్త తెలుగు సినిమాపై సంతకం చేయకపోవడం టాలీవుడ్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ పక్కన హీరోయిన్‌గా అనౌన్స్ అయిన వెంటనే, ఇతర పెద్ద బ్యానర్లు, స్టార్ హీరోల సినిమాల నుంచి వరుస ఆఫర్లు రావడం సర్వసాధారణం. కానీ, ఇమాన్వి విషయంలో అలా జరగకపోవడంతో టాలీవుడ్ లైనప్‌లో ఆమె పేరు ఎక్కడా వినిపించడం లేదు. దీని వెనుక అసలు కారణం ఏంటా అని ఆరా తీయగా, ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక ఆసక్తికరమైన సమాచారం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, 'ఫౌజీ' చిత్ర నిర్మాతలు ఇమాన్వితో ఒక ప్రత్యేకమైన అగ్రిమెంట్ లేదా బాండ్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిబంధన ప్రకారం, ఈ చిత్రం పూర్తయి థియేటర్లలో విడుదలయ్యే వరకు ఆమె మరే ఇతర తెలుగు సినిమాను అంగీకరించకూడదు, వేరే ప్రాజెక్టులపై సంతకం చేయకూడదు. ఈ కఠినమైన క్లాజ్ వల్లే ఆమెకు ఆఫర్లు వస్తున్నప్పటికీ నిబంధనల ప్రకారం వేరే సినిమాలకి కమిట్ కాలేకపోతోందని గట్టిగా వినిపిస్తోంది. హను రాఘవపూడి తన సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్‌ను చాలా పవర్‌ఫుల్‌గా, విభిన్నంగా డిజైన్ చేస్తారు. ఈ సినిమాలో ఇమాన్వి క్యారక్టర్ కి సంబంధించిన లుక్, లీడ్ ఎలిమెంట్స్ చాలా రహస్యంగా ఉంచాలని, సినిమా రిలీజ్ వరకు ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ వేరే ఎక్కడా రివీల్ కాకూడదనే ఉద్దేశంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. Also read: Ravi teja: వీరాధి వీరులంట.. నిజమవుతుందా మరి! ప్రస్తుతం 'ఫౌజీ' సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ షూటింగ్ పెండింగ్‌లో ఉంది. తాజా అప్‌డేట్స్ ప్రకారం, రాబోయే ఆగస్టు నెలలో రెబల్ స్టార్ ప్రభాస్ తిరిగి ఈ చిత్ర యూనిట్‌తో కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ లోగా చిత్ర బృందం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు, అభిమానుల కోసం ఒక అదిరిపోయే గ్లింప్స్ లేదా ఫస్ట్ లుక్ కంటెంట్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉంది.  prabhas, imanvi, fauji, hanu raghavapudi
మాస్ మహారాజా రవితేజ(Raviteja)ప్రస్తుతం 'ఇరుముడి'(irumudi)మూవీ ఇస్తున్న కిక్ లో ఉన్నాడు. కిక్ అని ఎందుకు అనాల్సి వస్తుందంటే ఈ మధ్య కాలంలో పోస్టర్ రిలీజ్ తోనే పాజిటివ్ వైబ్రేషన్ తెచ్చుకున్న మూవీ ఏదైనా ఉందంటే అది ఇరుముడి అని చెప్పవచ్చు. కొన్ని రోజుల క్రితం విడుదలైన సాంగ్ రిలీజ్ తో అయితే హిట్ స్థాయి ఏ రేంజ్ లో ఉంటుందో అని లెక్కలు వేసుకునే పరిస్థితి. ఇక మాస్ మహారాజా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని, కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు తో కలిసి మల్టి స్టారర్ గా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. మరి ఆ ఇద్దరి కామెడీ  టైమింగ్ ఒకే తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు వినోదం డబుల్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ వినూత్న కలయిక గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.ఫిల్మ్ నగర్ నుంచి వినిపిస్తున్న లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, 'రాజా రాజ చోర', 'స్వాగ్' వంటి వైవిధ్యభరితమైన వినోదాత్మక చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్‌గా తనదైన ముద్ర వేసుకున్న హసిత్ గోలి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ మార్క్ మాస్ ఎనర్జీని, శ్రీ విష్ణుకు ఉన్న విలక్షణమైన కామెడీ టైమింగ్‌ను పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు ఒక క్రేజీ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి రెండు విభిన్నమైన ఆసక్తికరమైన టైటిల్స్ నెట్టింట విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. సోషల్ మీడియాలో కొందరు ఈ ప్రాజెక్ట్‌కు 'వీరాధి వీరులంట' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు చెబుతుండగా, మరికొందరు 'అక్కాయిలూ… బాగున్నారా?' అనే వెరైటీ టైటిల్ ఖరారయ్యే అవకాశం ఉందని ప్రచారం చేస్తున్నారు. ఏదేమైనా ఈ ఇద్దరి పాత్రలు థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉంటాయని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మరియు టైటిల్‌పై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని సమాచారం. Also read: rishab shetty: కాంతార ఫ్యాన్స్‌కి డబుల్ ధమాకా: చాప్టర్ 2 పై క్రేజీ అప్‌డేట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన 'శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్' బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారని ఇండస్ట్రీ టాక్. గతంలో ఎన్నో కుటుంబ కథా చిత్రాలు, కమర్షియల్ బ్లాక్‌బస్టర్లు మరియు మల్టీస్టారర్ సినిమాలతో ఘన విజయాలు అందుకున్న ఈ నిర్మాణ సంస్థ నుంచి మరో క్రేజీ కాంబో వస్తుండటంతో అభిమానులలో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న ఈ సినిమాను త్వరలోనే లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్లాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.   raviteja, sreevishnu, irumudi
అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమవుతోంది. అఖిల్ గత చిత్రం 'ఏజెంట్' భారీ అంచనాలతో వచ్చి డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత అఖిల్ దాదాపు 3 ఏళ్ల పాటు విరామం తీసుకుని, ఎంతో పట్టుదలగా ఈ 'లెనిన్' ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. జూలై 10న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకున్న మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్, మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, అక్కినేని నాగార్జున సంయుక్తంగా ఈ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామాను నిర్మించారు. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో సినిమాపై ఉన్న అంచనాలను పెంచేశాయి. అఖిల్ మునుపెన్నడూ లేని విధంగా రగ్డ్ లుక్‌లో కనిపిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో సైతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో అఖిల్ మేకోవర్, అతని నటన కెరీర్‌లోనే బెస్ట్ అని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తోంది.  జూలై 10న రిలీజ్ కాబోతున్న తరుణంలో, ఈ చిత్రాన్ని మేకర్స్ ఇప్పటికే కొంతమంది పరిశ్రమ పెద్దలకు, సన్నిహితులకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. సినిమాను చూసిన ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి అందుతున్న ఫస్ట్ రివ్యూ రిపోర్ట్స్ వింటే అక్కినేని ఫ్యాన్స్‌కి ఖచ్చితంగా పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇన్సైడ్ టాక్ ప్రకారం, 'లెనిన్' సినిమా మ్యాన్ ఆఫ్ మాసెస్  ఎన్టీఆర్ పవర్‌ఫుల్ వాయిస్ ఓవర్‌తో అత్యంత గ్రాండ్‌గా ప్రారంభమవుతుందట. ఎన్టీఆర్ గంభీరమైన శబ్దంతో సినిమా బ్యాక్‌డ్రాప్‌ను ఎలివేట్ చేసే విధానం థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సమాచారం. ఆ తర్వాత వచ్చే అఖిల్ ఇంట్రడక్షన్ సీన్, హై-వోల్టేజ్ యాక్షన్ బ్లాక్స్ వెండితెరపై మాస్ జాతరను తలపిస్తాయని చెప్తున్నారు.  ఇక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ డైలాగ్‌తో ప్లాన్ చేయడం అదిరిపోయిందని తెలుస్తోంది. అఖిల్, భాగ్యశ్రీ బోర్సేల మధ్య సాగే రొమాంటిక్ ట్రాక్ చాలా వైవిధ్యంగా, ఫ్రెష్‌గా ఉంటుందని, వీరి ప్రేమకథే మొత్తానికి ఈ కమర్షియల్ యాక్షన్ డ్రామాను ఒక పెద్ద మలుపు తిప్పుతుందని ఇండస్ట్రీ టాక్. ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్‌కు కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా చాలా ప్రాధాన్యత కల్పించారట. ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే కొన్ని షాకింగ్ ట్విస్టులు ప్రేక్షకులు ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని, ఆ స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌కి థియేటర్లలో మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయమని ఇన్సైడర్ రిపోర్ట్స్ స్పష్టం చేస్తున్నాయి. ఫస్టాఫ్ ఎంటర్టైన్మెంట్, యాక్షన్ మోడ్‌లో సాగితే..సెకండాఫ్ మాత్రం అద్భుతమైన ఎమోషన్స్, మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో సరికొత్త అనుభూతిని ఇస్తుందని అంటున్నారు.  మొత్తానికి 'లెనిన్' చిత్రం అఖిల్ అక్కినేనికి ఒక సాలిడ్ కమర్షియల్ కంబ్యాక్ మూవీ అవుతుందని, బాక్సాఫీస్ వద్ద అఖిల్ ఖాతాలో మొదటి బ్లాక్‌బస్టర్ పడటం ఖాయమని ఈ ఫస్ట్ రివ్యూస్ ద్వారా స్పష్టమవుతోంది. దాదాపు 3 సంవత్సరాల నిరీక్షణకు ఈ సినిమాతో అఖిల్ సరైన సమాధానం చెప్పబోతున్నాడని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి జూలై 10న సాధారణ ప్రేక్షకులు ఈ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామాను ఏ రేంజ్‌లో ఆదరిస్తారో చూడాలి.     Akhil Akkineni, Lenin Review, Bhagyashri Borse, NTR  
  కంటెంట్ బలంగా ఉంటే పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు, పాన్ ఇండియా లెవల్లో రికార్డు మోతలు మోగించవచ్చు అని కాంతార, కాంతార చాప్టర్ 1 తో నిరూపించాడు రిషబ్ శెట్టి.  మన దేశ సంస్కృతి, జానపద, దైవిక సంప్రదాయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులకి పరిచయం చేసిన ఘనత కూడా రిషబ్ శెట్టికి  దక్కింది. ఈ  ఫ్రాంచైజీకి కొనసాగింపుగా వస్తున్న తదుపరి భాగాలపై ఇటు పరిశ్రమ వర్గాల్లోనూ, అటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే  రిషబ్ శెట్టి తన పుట్టినరోజుని  పురస్కరించుకుని అభిమానులకి  డబుల్ గుడ్‌న్యూస్ ఇస్తూ ఒక క్రేజీ అప్‌డేట్ ప్రకటించారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు  సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతున్నాయి  ప్రస్తుతం టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'జై హనుమాన్' షూటింగ్‌లో రిషబ్ శెట్టి బిజీగా ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో పాటు సందీప్ సింగ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చారిత్రాత్మక చిత్రం 'ది ప్రైడ్ ఆఫ్ భారత్ – ఛత్రపతి శివాజీ మహారాజ్' లో కూడా ఆయన నటిస్తున్నారు. తన చేతిలో ఉన్న ఈ రెండు భారీ చిత్రాల షెడ్యూల్స్ గురించి స్పష్టతనిస్తూ, ఈ రెండు సినిమాల చిత్రీకరణ ఒకేసారి జరగదని ఆయన స్పష్టం చేశారు. మొదటగా 'జై హనుమాన్' పూర్తి చేసిన తర్వాతే శివాజీ మహారాజ్ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్తుందని ప్రకటించారు. ఈ రెండు విభిన్న పాత్రల కోసం తాను పూర్తిగా భిన్నమైన శారీరక రూపాల్లో, సరికొత్త లుక్స్‌లో కనిపించబోతున్నట్లు వెల్లడించారు. ఒకే సమయంలో మల్టీటాస్కింగ్ చేయడం తనకు ఇష్టం ఉండదని, అందుకే ఒక్కో సినిమాని ఎంతో నిబద్ధతతో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. నేను నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, నాలోని దర్శకుడిని అస్సలు ఖాళీగా ఉంచలేను. దర్శకత్వం చేయడం ద్వారానే నాకు మానసిక ప్రశాంతత, నిజమైన ఆనందం లభిస్తాయి. ప్రస్తుతం నా రచయితల బృందంతో కలిసి 'కాంతార: చాప్టర్ 2' స్క్రిప్ట్ పనులని చేయిస్తున్నానని చెప్పుకొచ్చాడు.ఇప్పుడు ఈ మాటలు కాంతార సిరీస్ అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తున్నాయి.  
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' వంటి సినిమాలతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సిద్ధు జొన్నలగడ్డ వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన విలక్షణమైన కథలతో విభిన్నమైన ప్రాజెక్టులను లైన్‌లో పెడుతూ కెరీర్‌ను ఎంతో పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధు జొన్నలగడ్డ టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఒక వెబ్‌సిరీస్ చేస్తున్నారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సరికొత్త రికార్డులు సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ భారీ వెబ్‌సిరీస్‌తో పాటు, ఆయన ఖాతాలో మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వెంకీ అట్లూరి ప్రాజెక్ట్‌తో పాటు సిద్ధు జొన్నలగడ్డ ‘ఆర్ఎస్ జే స్వరూప్’ దర్శకత్వంలో ఒక విలక్షణమైన సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. తాజాగా సిద్ధు మరో క్రేజీ ప్రాజెక్ట్ ని లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ అయిన 'సుకుమార్ రైటింగ్స్' బ్యానర్‌లో సిద్ధు ఒక సరికొత్త చిత్రం చేయనున్నట్లు సమాచారం. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అప్పుడే ఫిలిం నగర్ సర్కిల్స్‌లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ చిత్రంతో సుకుమార్ సోదరుడి కుమారుడు బాబీ దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయం కానున్నట్లు సమాచారం అందుతోంది. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌ నుంచి వచ్చే సినిమాలు ఎప్పుడూ వైవిధ్యమైన కథాంశాలతో, కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సక్సెస్ అవుతుంటాయి. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ ఎనర్జీకి, సుకుమార్ స్కూల్ నుంచి వస్తున్న సరికొత్త కాన్సెప్ట్‌ తోడైతే థియేటర్లలో నెక్ట్స్ లెవెల్ వినోదం ఖాయమని ఇండస్ట్రీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు టాక్. ఎనర్జిటిక్ హీరో సిద్ధు జొన్నలగడ్డ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయేలా ఒక అదిరిపోయే స్క్రిప్ట్‌ను బాబీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సుకుమార్ నిర్మాణంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రబృందం అధికారికంగా వెల్లడించే అవకాశముంది.      Siddhu Jonnalagadda, Sukumar, TeluguOne  
గత కొంతకాలంగా అరుదైన అనారోగ్య సమస్యతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూశారు. చిన్న వయసులోనే ప్రాణాంతక వ్యాధి ఎదురైనా, అతను ప్రదర్శించిన అంతులేని ధైర్యం, పోరాట పటిమ ఎంతో మంది హృదయాలను కదిలించాయి. నిరంజన్ మరణవార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా పవన్ ఫ్యాన్స్ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని వారాల క్రితమే నిరంజన్ జీవితంలో ఒక అద్భుతమైన క్షణం చోటుచేసుకుంది. నిరంజన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, తన జీవితంలో చివరి కోరిక తన అభిమాన నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవడమేనని తెలుసుకున్న జనసేనాని ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తెలంగాణలోని హనుమకొండలో ఉన్న నిరంజన్ నివాసానికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లారు. ఆ భావోద్వేగ భరితమైన క్షణానికి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో ఎంతగానో వైరల్ అయ్యాయి. హనుమకొండ పర్యటనలో పవన్ కళ్యాణ్.. నిరంజన్‌తో ఎంతో విలువైన సమయాన్ని గడిపారు. నిరంజన్‌ను ఎంతో ప్రేమగా హత్తుకుని, నుదుటిపై ముద్దుపెట్టి ధైర్యాన్ని నూరిపోశారు. అతని తల్లిదండ్రులతో మాట్లాడి, నిరంజన్ ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతటితో ఆగకుండా, ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేయడంతో పాటు, భవిష్యత్తులో వారి జీవనోపాధికి అవసరమైన పూర్తి మద్దతును ఇస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. నిరంజన్ కోలుకోవాలని కోరుకుంటూ తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని స్వయంగా అందించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అంతేకాదు, కుక్కపిల్ల కావాలని నిరంజన్ కోరడంతో.. అదే రోజు ఒక కుక్క పిల్లను గిఫ్ట్ గా పంపించారు. అలాగే, 'OG2' సినిమాకు నువ్వే నా స్పెషల్ గెస్ట్ అని హామీ ఇచ్చారు. అయితే, విధి ఎంత క్రూరమైనదో మరోసారి రుజువైంది. ఆ మరువలేని తీపి జ్ఞాపకాన్ని, తన జీవిత ఆశయాన్ని నెరవేర్చుకున్న కొద్దిరోజులకే నిరంజన్ తుది శ్వాస విడిచారు. తనను ప్రాణంగా ప్రేమించే అభిమాన హీరోను కలవాలనే అతిపెద్ద కల నెరవేరినప్పటికీ, ఆ జ్ఞాపకాలను మాత్రమే మిగిల్చి నిరంజన్ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అందరినీ కలచివేస్తోంది. నిరంజన్ చేసిన భౌతిక పోరాటం ముగిసినప్పటికీ, ఆ చిన్నారి ముఖంలో కనిపించిన చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.      Pawan Kalyan, Niranjan, Emotional, TeluguOne  
ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే అవసరానికి మించి మొబైల్ వాడటం క్రమంగా వ్యసనంగా మారి మన ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వీడియోలో Dr. వేణుగోపాల్ మొబైల్ వ్యసనం వల్ల మెదడులో జరిగే మార్పులు, ఏకాగ్రత తగ్గిపోవడం, జ్ఞాపకశక్తిపై పడే ప్రభావం, నిద్ర సమస్యలు, ఆందోళన, ఒత్తిడి వంటి అంశాలను చాలా సులభంగా వివరించారు.  అలాగే మొబైల్‌కు బానిస కాకుండా ఉండేందుకు పాటించాల్సిన అలవాట్లు, స్క్రీన్ టైమ్‌ను ఎలా తగ్గించుకోవాలి, పిల్లలు మరియు యువతలో మొబైల్ వినియోగాన్ని ఎలా నియంత్రించాలి అనే విషయాలపై కూడా విలువైన సూచనలు అందించారు.  మొబైల్‌ను పూర్తిగా వదిలేయడం అవసరం లేదు. కానీ దానిని సరైన విధంగా ఉపయోగించడం ద్వారా మన మెదడు ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను మరియు జీవన నాణ్యతను కాపాడుకోవచ్చు. మొబైల్ వ్యసనం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోండి.  
ఒక ఉత్తమమైన తరాన్ని సమాజానికి ఇచ్చే ఉద్దేశంతో వివాహం చేసుకుంటారని పెద్దలు చెబుతారు. ఆరోగ్యకరమైన బంధం ద్వారా  ఒక మంచి తరం తయారవుతుంది. కుటుంబం విషయానికి వస్తే.. వంశం ముందుకు సాగడం అనేది పిల్లల ద్వారానే జరుగుతుంది. ఇది వందలాది, వేలాది సంవత్సరాలుగా సాగుతున్న సంప్రదాయం.  అయితే భారతదేశంలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. భారతీయులు విదేశాలలో పుట్టిన సంప్రదాయాలను పాటిస్తూ వెర్రిగా మారిపోతున్నారు. డేటింగ్ లు, సహజీవనాలు, రకరకాల కొత్త కల్చర్లు పాటిస్తూ భారతీయ సంస్కృతికి దూరం అవుతున్నారు. ఇప్పుడు డింక్ పేరిట ఏకంగా ఒక తరాన్ని పుట్టకుండా ఆపేస్తున్నారు.  అసలు డింక్ అంటే ఏమిటి?  దీని పట్ల భారతీయ జంటలు ఎందుకు అంత ఆకర్షితులు అవుతున్నారు? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. దశాబ్దాలుగా కుటుంబ వంశాన్ని కొనసాగించే మార్గంగా వివాహాన్ని చూసేవారు. కానీ కొత్త తరం దీనికి వ్యతిరేకంగా ఉంది, వంశాన్ని ముందుకు తీసుకెళ్లడం అనే విషయం కంటే.. ప్రపంచం పట్ల ఆసక్తి పెరిగింది,  సంబంధాల తీరు కూడా మారుతోంది. ఇప్పుడు ఒక బిడ్డను కనాలన్నా,  వంశాన్ని ముందుకు నడపాలన్నా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.దీన్నే డింక్ అంటున్నారు. విదేశాలలో పుట్టిన ఈ సంస్కృతి పట్ల భారతీయులు కూడా  నెమ్మదిగా అలవాటు పడుతున్నారు. డింక్ అంటే.. DINK అంటే ' డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ', పేరులోనే దీని  అర్థం ఉంది. దీని అర్థం పెళ్లి తర్వాత పిల్లలను కనాలని అనుకోకపోవడం. డింక్ జంటలు ఎందుకు పెరుగుతున్నాయ్.. కొన్నేళ్ల క్రితం వరకు ఇంకా పిల్లలు ఎందుకు పుట్టలేదు అనేదే చాలా పెద్ద ప్రశ్నగా ఉండేది పెళ్లైన జంటల్లో.. కానీ ఇప్పుడు పిల్లలు వద్దు అనే నిర్ణయం వస్తోంది. ముఖ్యంగా బారతదేశంలోని పట్టణాలలో ఉన్న జంటలలో చాలా మార్పు వస్తోంది. చదువుకున్న, ఇద్దరూ సంపాదించే భార్యాభర్తలు అసలు మనకు పిల్లలు అవసరమేనా అనే ప్రశ్న వేసుకుంటున్నారు. ముఖ్యంగా 20, 30 ఏళ్ల వయసులో  పెళ్లిచేసుకున్న జంటలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి.ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆర్థిక భారం.. చాలామంది ఎదుర్కునే స్పష్టమన కారణం ఆర్థిక విషయాలే..   ఇరవై, ముప్పై సంవత్సరాల కిందట పిల్లలను పెంచినట్టు నేటికాలంలో మెట్రో సిటీలలో పిలలను పెంచడం కష్టమవుతోందని చాలామంది అంటున్నారు. పాఠశాల ఫీజులు,ఇల్లు కొనడం లేదా అద్దె, పిల్లల సంరక్షణ , ఆరోగ్య సంరక్షణ.. ఇవన్నీ పిల్లలు వద్దు అనుకోవడానికి కారణం అవుతున్నాయి. మెట్రో పట్టణాలలో ఇద్దరు వ్యక్తుల సంపాదన కూడా వీటికి సరిగా సరిపోవడం లేదని ఆవేదన చాలా మందిలో ఉంది. క్వాలిటీ లైఫ్.. పిల్లలు పుడితే లైఫ్ క్వాలిటీ పోతుందని చాలామంది జంటలు అబిప్రాయం.  పిల్లల బాధ్యతలలో తాము ఎన్నో సంతోషాలు, సరదాలు, ఇష్టాలు కోల్పోవడానికి, జీవితాన్ని సరదాగా గడపడానికి, ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు ఎక్కువ సమయం గడపడానికి సరిపడినంత సమయం దొరకడం లేదని అనుకుంటున్నారు.  పైగా పిల్లల కారణంగా జీవితంలో కాస్త విలాసంగా బ్రతికే అవకాశం ఉన్నా దాన్ని పిల్లల కోసం త్యాగం చేయాల్సి వస్తుంది. అందుకే పిల్లలు వద్దని అనుకుంటున్నారు. మరొక మార్గం.. చాలా మంది DINK జంటగా ఉండాలని నిర్ణయం తీసుకుంటే అది  బాధ్యతల నుండి తప్పించుకోవడం కోసం లేదా వారి విలాసవంతమైన జీవితం కోసం అనుకుంటారు.  కానీ ఇది తప్పు.. చాలామంది పిల్లల పట్ల తీసుకోవాల్సిన బాధ్యతలను ఒకరికొకరు బాధ్యతగా చూసుకోవడంలో, అలాగే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, జంతు సంక్షేమం వంటి  తమకు ఇష్టమైన విషయాల ద్వారా బాధ్యతను తీసుకుంటున్నారు. ఇది తమ తరువాత వంశం లేకపోయినా,   కుటుంబాన్ని కాపాడుకోవడం ,  జీవన నాణ్యతను మెరుగ్గా ఉంచుకోవడం వంటి కారణాల వల్లే చేస్తున్నారు.                                    *రూపశ్రీ.
  నేటి కాలంలో, సంబంధాలు బలపడటానికి , విచ్ఛిన్నం కావడానికి కమ్యూనికేషన్ సరిగా లేకపోవడమే అతిపెద్ద కారణంగా మారింది. అది కుటుంబ సంబంధం అయినా, స్నేహ సంబంధం అయినా, లేదా మరేదైనా వ్యక్తిగత సంబంధం అయినా, ఒకరినొకరు సరైన విధంగా కమ్యూనికేట్ చేయడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలాముఖ్యం. నిజానికి చాలామంది రిలేషన్ లో ఉన్నప్పుడు  తమ మనసులో ఉన్న విషయాలను ఓపెన్ గా చెప్పడానికి ధైర్యం చేయరు. చాలా సందేహపడుతూ ఉంటారు. దీని వల్ల అపార్థాలు పెరిగి  రిలేషన్స్ లో దూరం ఏర్పడుతుంది. అందుకే రిలేషన్ లో ఉన్నప్పుడు ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా ముఖ్యం అంటుంటారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నమ్మకాన్ని పెంచుతుంది.. చక్కగా, ఎలాంటి విమర్శలు లేకుండా ఓపెన్ గా మాట్లాడుకోవడం ఏ  సంబంధానికైనా బలమైన పునాది ఏర్పరుస్తుంది. రిలేషన్ లో ఉన్న వ్యక్తులు నిజాయితీగా మాట్లాడినప్పుడు, వారి మధ్య నమ్మకం దానంతట అదే పెరుగుతుంది. మంచి కమ్యూనికేషన్  వల్ల అవతలి వ్యక్తి మన మాటలను శ్రద్ధగా వింటున్నారని మనకు అనిపిస్తుంది. ఇది అపార్థాల అవకాశాన్ని తగ్గిస్తుంది , సంబంధాలు దీర్ఘకాలం పాటు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.  కమ్యూనికేషన్ బలహీనంగా ఉంటే.. అనుమానం,  అపార్థాలు, దూరం పెరుగుతాయి. అపార్థాలు తొలగిస్తుంది.. రిలేషన్స్ లోని సమస్యలు చాలా వరకు పెద్ద కారణం వల్ల కాకుండా, చిన్న చిన్న అపార్థాల వల్ల తలెత్తుతాయి. సరైన సంభాషణ ద్వారా ఈ అపార్థాలను సులభంగా పరిష్కరించవచ్చు. ప్రజలు తమ ఆలోచనలను, భావాలను బహిరంగంగా మాట్లాడుకున్నప్పుడు, వారికి ఉండే  సందేహాలు తొలగిపోతాయి. ఇది సంబంధాలలో స్పష్టతను తీసుకువచ్చి, అనవసరమైన ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎమోషనల్ బాండింగ్.. కమ్యూనికేషన్ చేయడం అంటే కేవలం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడమే కాదు..  అది భావోద్వేగాలను వ్యక్తపరిచే ఒక మార్గం కూడా.   మనసులోని మాటలను పంచుకున్నప్పుడు ఇద్దరి మధ్య మరింత గాఢమైన భావోద్వేగ బంధం ఏర్పడుతుంది. ఇది ఒకరిలో ఒకరికి చెందిన ఫీలింగ్ ను పెంపొందించి, సంబంధాలను మరింత సన్నిహితంగా చేస్తుంది. ఈ అనుబంధమే ఏ సంబంధాన్నైనా ప్రత్యేకంగా నిలుపుతుంది. సమస్యల పరిష్కారం.. ప్రతి సంబంధంలో లేదా పరిస్థితిలో సమస్యలు సర్వసాధారణం, కానీ సరైన కమ్యూనికేషన్  ద్వారా వాటిని సులభంగా పరిష్కరించవచ్చు. ఇరు పక్షాలు తమ అభిప్రాయాలను ఓపెన్ గా వ్యక్తపరిచినప్పుడు, పరిష్కారాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కమ్యూనికేషన్ వల్ల  తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం తగ్గుతుంది.  ఇద్దరు వ్యక్తులు ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్లడానికి మార్గం కల్పిస్తుంది.  అందుకే ఓపెన్ గా మాట్లాడుకోవడం  అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుంది. మానసిక ఒత్తిడి.. మనసులో భావాలను, ఆందోళనలను ఇతరులతో పంచుకున్నప్పుడు మనసు తేలికపడుతుంది. ఏ విషయాన్ని అయినా మనసులోనే దాచుకోవడం ఒత్తిడిని పెంచుతుంది, కానీ మాట్లాడటం ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. మంచి కమ్యూనికేషన్ ఒక వ్యక్తి మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా , సంతోషంగా ఉండేలా చేస్తుంది.                                      *రూపశ్రీ.
బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke) అనేది అత్యవసర వైద్య పరిస్థితి. మెదడుకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే ప్రాణాపాయం మాత్రమే కాకుండా శాశ్వత వైకల్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది.  ఈ వీడియోలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ బ్రెయిన్ స్ట్రోక్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు.  ఈ వీడియోలో మీరు తెలుసుకునే అంశాలు: బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ ఎన్ని రకాలుగా ఉంటుంది? స్ట్రోక్ వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే హెచ్చరిక లక్షణాలు (TIA) ఏమిటి? చేతులు, కాళ్లు బలహీనపడటం, ముఖం వంకర కావడం, మాట తడబడటం వంటి లక్షణాలను ఎలా గుర్తించాలి? "గోల్డెన్ పీరియడ్" అంటే ఏమిటి? ఆ సమయంలో చికిత్స ఎందుకు చాలా కీలకం? ఆధునిక వైద్యంలో అందుబాటులో ఉన్న చికిత్సలు ఏమిటి? స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఎప్పుడు వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి? స్ట్రోక్ విషయంలో ప్రతి నిమిషం ఎంతో విలువైనది. లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా అత్యవసర వైద్య సహాయం తీసుకోవడం వల్ల ప్రాణాలను కాపాడడమే కాకుండా మెదడు దెబ్బతినే ప్రమాదాన్ని కూడా తగ్గించవచ్చు.  బ్రెయిన్ స్ట్రోక్ గురించి పూర్తి అవగాహన పొందాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health‌ ను ఫాలో అవుతూ ఉండండి.
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతుంటారు.  పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని,  జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుందని అంటుంటారు.  దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. పెరుగు కడుపుకు మేలు చేసే ప్రోబయోటిక్ ఆహారంగా పరిగణించబడుతుంది, కానీ వర్షాకాలంలో పెరుగు తినడం పై  భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు మరింత తీవ్రమవుతాయని కొందరు చెబుతారు, అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం వేరే విధంగా చెబుతున్నారు. వర్షాకాలంలో పెరుగు తినవచ్చా? ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, వర్షాకాలంలో పెరుగును తినవచ్చు, కానీ దాని పరిమాణం , పెరుగు తినే  సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి, ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అయితే, వర్షాకాలంలో జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల కొంతమందికి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది,  పేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది, శరీరాన్ని చల్లబరచడమే కాకుండా ఉత్తేజపరుస్తుంది.   రోగనిరోధక వ్యవస్థకు మద్దతు ఇస్తుంది. వర్షంలో పెరుగు తినడం వల్ల కలిగే నష్టాలు.. వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు , ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే పెద్దలు జలుబు, జ్వరం ఉన్నప్పుడు పెరుగు తినకూడదని చెబుతారు. పెరుగు తినడం వల్ల   కఫం , శ్లేష్మంతో సమస్యలు రావచ్చు. కొంతమందికి కడుపు ఉబ్బరం కలగవచ్చు.  రాత్రిపూట తినడం జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. పెరుగు ఎలా తింటే శ్రేష్టం..  పగటిపూట మాత్రమే పెరుగు తినడం మంచిది.  రాత్రిపూట పెరుగు తినడం మానుకోవాలి.   కొద్దిగా వేయించిన జీలకర్ర లేదా నల్ల మిరియాల పొడి వేసుకుని  పెరుగు తీసుకుంటే మంచిది.  తాజాగా,  ఇంట్లో తయారుచేసిన పెరుగును మాత్రమే తినడం ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం. పెరుగు ఎవరు తినకూడదు? జలుబుతో బాధపడుతున్న వాళ్లు,  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళు, ఆస్తమా లేదా అలర్జీ రోగులు, రాత్రి ఆలస్యంగా భోజనం చేసే వారు.. పెరుగు విషయంలో జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.
శరీరంలో అధిక వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతుంటాయి. ఈ లక్షణాలు సాధారణంగా కనిపించినప్పటికీ, ఆయుర్వేదం ప్రకారం ఇవి పిత్త దోషం (Pitta Dosha) పెరగడం వల్ల వచ్చే సంకేతాలు కావచ్చని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డా. చి. మధుసూదన్ శర్మ వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిత్త దోషం ఎందుకు పెరుగుతుంది? దానికి కారణమయ్యే ఆహారపు అలవాట్లు, జీవనశైలి, వాతావరణ ప్రభావాలు ఏమిటి? అలాగే పిత్తాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన ఆహారం, పాటించాల్సిన జీవనశైలి, ఆయుర్వేదంలో సూచించే సహజ చిట్కాలు వంటి అనేక ఉపయోగకరమైన విషయాలను సులభంగా వివరించారు. శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం, పాదాల్లో లేదా కళ్లలో మంట, తరచూ నోటి పూత రావడం, గ్యాస్, అసిడిటీ సమస్యలు వేధిస్తుంటే ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: పిత్త దోషం అంటే ఏమిటి? శరీరంలో వేడి పెరగడానికి ప్రధాన కారణాలు పాదాలు, కళ్లలో మంట ఎందుకు వస్తుంది? నోటి పూత, గ్యాస్, అసిడిటీకి ఆయుర్వేద వివరణ పిత్తాన్ని తగ్గించే ఆహారాలు నివారించాల్సిన ఆహార పదార్థాలు రోజువారీ జీవితంలో పాటించాల్సిన ఆరోగ్యకరమైన అలవాట్లు సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే ఆయుర్వేద సూచనలు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పిత్త దోషాన్ని సమతుల్యం చేసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద అవగాహన కోసం మాత్రమే. వ్యక్తిగత ఆరోగ్య సమస్యల కోసం తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని లేదా ఆయుర్వేద నిపుణుడిని సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)