ఒక మహనీయుని దివ్య స్మృతి

Publish Date:Jan 18, 2013

Advertisement

 

తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన స్వర్గీయ నందమూరి తారక రామారావుగారి 17వ వర్ధంతి నేడు. తెలుగు సినిమా చరిత్రలో మరింకెవరూ కూడా చేయని, చేయలేని అన్నిరకాల పాత్రలు పోషించడమే గాకుండా అపూర్వమయిన తన నటన కౌశలంతో ప్రజల మనసుల్లో ఆరాధ్య దైవంగా నిలిచిపోయేరు. ఒక మహానటుడిగా ఆయన ఎంతటి ఉన్నత శిఖరాలు అధిరోహించారో, రాజకీయ నాయకుడిగా కూడా యావత్ దేశంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తెలుగుజాతి ఆత్మా గౌరవానికి, పౌరుషానికి ప్రతీకగా నిలిచిన అయన, రాష్ట్రాన్ని, తెలుగు ప్రజనీ యావత్ దేశమూ గుర్తించేలా చేసిన ఘనుడు.

 

మిష్టర్ గిరీశంగా ప్రజలకి కల్లబొల్లి కబుర్లు చెప్పి ప్రజలకి వినోదంపంచిన ఆయనే, భారతమాతకు జేజేలు అంటూ బడిపంతులుగా పాఠాలు చెప్పి ఏంతో హృద్యమయిన నటన కనబరిచేరు. ‘పాంచాలీ...పంచభతృకీ...’అంటూ అయన పలికిన డైలాగులు నేటికీ తెలుగు ప్రజల చెవుల్లో మారుమ్రోగుతూనే ఉంటాయి. సామాజిక, జానపద, పౌరాణిక సినిమాలలో అయన కనబరిచిన ప్రతిభ, అయన ధరించిన వైవిధ్యమయిన పాత్రలు నభూతో నభవిష్యతి అని చెప్పవచ్చును. అయన సినిమాలు, అయన పోషించిన పాత్రలు, ఆయన ప్రతిభ గురించి సవివరంగా చెప్పదలచుకొంటే అదొక మహా గ్రంధమే అవుతుంది.

 

శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా ప్రజలచేత దండాలు పెట్టించుకొన్నఅయనే కర్ణ, దుర్యోధన, లంకేశ్వరుని వంటి ప్రతినాయక పాత్రలు కూడా పోషించి ప్రజలని మెప్పించారు. అయన నటన, ఆహార్యం, రాజసం చూసిన తెలుగు ప్రజలు, ఆయా దేవుళ్ళు, రాజులు కూడా నిజంగా ఆయనలాగే ఉంటారని భావించేంత గొప్పగా సాగింది అయన నటన.

 

ఇక, రాజకీయాలలో సాధారణ రాజకీయ నేతలకు బిన్నంగా, మనసుతో ఆలోచించే రాజకీయవేత్తగా యన్టీఆర్ ప్రజలచేత నీరాజనాలు అందుకొన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 9నెలల్లోనే రాష్ట్రంలో అధికారం చేప్పట్టిన ఘనుడు ఆయన. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి, తెలుగు పౌరుషానికి ప్రతీకగా నిలచిన ఆయన, రాష్ట్రంలో మొట్ట మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పరచిన ఘనుడు. తెలుగు బాష, తెలుగు ప్రజ,తెలుగు సినిమా, తెలుగు సంస్కృతీ, తెలుగు నేల.. ఇలాగ తెలుగుతో ముడిపడిన ప్రతీ అంశాన్ని అభిమానించే అచ్చ తెలుగు హృదయం ఆయనది.

 

రాష్ట్రంలో అనేక సంస్కరణలు అమలుచేసి ఒక నూతన శకానికి నాందిపలికి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన సాగాలనుకోనేవారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అధికారం చెప్పటినా కూడా, సర్వసంగ పరిత్యాగిగానే పాలన చేసారు. రాష్ట్ర వనరులకు, సంపదలకు అయన ఒక ధర్మకర్తగా వ్యవహరించారు తప్ప, వాటిని దోచుకొని దాచుకోవాలని ఏనాడు కలలో కూడా అనుకోలేదు.

 

తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపజేసి, తెలుగు జాతిని యావత్ ప్రపంచం కూడా గుర్తించేలా చేయగలిగిన ఆయనని మాత్రం మన సంకుచిత రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు నేటికీ రాజకీయ రంగుటద్దాలలోంచే చూస్తూ ఆయనకు ఈయవలసిన గౌరవం ఈయలేకపోతున్నారు. ఒక మహా నటుడిని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన ఒక మహనీయుడికీ ప్రభుత్వాలు గౌరవ పురష్కారాలు అందించకపోయినా, అయన తెలుగు ప్రజల మనస్సులో శాశ్వితంగా కోలువయున్నాడు. అటువంటి వ్యక్తిని గుర్తించలేక పోవడం ప్రభుత్వ దురదృష్టమే తప్ప ఆయనది కాదు. అయన 17వ వర్దంతి సందర్భంగా యావత్ తెలుగు ప్రజానీకం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తోంది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.