జగన్ పంతమా.. మేకపాటి పట్టుదలా..?

Publish Date:Apr 27, 2022

Advertisement

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ అధినేత నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో గురువారం భేటీ అవుతున్నారు. ఇటీవలే హఠాత్తుగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్థానంలో ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డిని ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించాలని రాజమోహన్ రెడ్డి కోరేందుకు జగన్ ను కలుసుకుంటున్నారనే వార్తలు వస్తున్నాయి. వైఎస్ జగన్- మేకపాటి రాజమోహన్ రెడ్డి భేటీతో ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి ఎవరనే క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణకు ముందు ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మేకపాటి కుటుంబానికే చెందిన ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి కూడా సీఎం జగన్ ఛాన్స్ ఇవ్వలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి ఎవరనే విషయం కూడా ఇంతవరకు తేల్చలేదు.

ఇలా ఉండగా.. ఆత్మకూరు ఉప ఎన్నికలో దివంగత గౌతమ్ రెడ్డి సతీమని శ్రీకీర్తి రెడ్డి పోటీ చేస్తారంటూ మీడియాలో వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. ఆ అవకాశం శ్రీకీర్తిరెడ్డి కాకుండా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డికి ఇవ్వాలని మేకపాటి కుటుంబం నిర్ణయించింది. ఈ విషయాన్నే సీఎం జగన్ కు వివరించి, తన రెండో కుమారుడు విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేయించే దిశగా కీలకమైన చర్చలు జరుపుతారని తెలుస్తోంది. నిజానిని మేకపాటి కుటుంబంలోని మహిళలెవరూ రాజకీయాల్లోకి వచ్చే సాంప్రదాయంలేదు. దాని ప్రకారమే శ్రీకీర్తిరెడ్డి పోటీ చేస్తారనే ప్రచారానికి ఇప్పటికే మేకపాటి కుటుంబ సభ్యులు తెర దించారు. కేవలం మగవారు మాత్రమే రాజకీయాల్లో ఉంటారు. ఈ విషయమే సీఎం జగన్ కు వివరించి, శ్రీకీర్తికి కాకుండా విక్రమ్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని ఒప్పించేందుకే రాజమోహన్ రెడ్డి భేటీ అవుతున్నారని చెబుతున్నారు.

కాగా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సతీమణి శ్రీకీర్తిరెడ్డికి ఉప ఎన్నికల బరిలో దింపాలని, ఆమెను గెలిపించి, మంత్రి పదవి కూడా కట్టబెట్టాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ దిశగా వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా శ్రీకీర్తిరెడ్డిని ప్రోత్సహించారనే ప్రచారం ఉంది. ఈ క్రమంలో మేకపాటి తమ కుటుంబంలో మహిళలు రాజకీయాల్లోకి రారని తేల్చి చెప్పి, విక్రమ్ ను అభ్యర్థిగా ప్రకటించాలనే ప్రతిపాదనను సీఎం జగన్ ఒప్పుకుంటారో లేక.. శ్రీకీర్తిరెడ్డి పేరునే మళ్లీ తెరమీదకు తీసుకువస్తారా? అనే టెన్షన్ నెల్లూరు జిల్లా వైసీపీ కార్యకర్తల్లో మొదలైంది.

ఒక విధంగా చెప్పాలంటే.. గడచిన మూడేళ్లుగా వైఎస్ జగన్ గుమ్మం కూడా మేకపాటి రాజమోహన్ రెడ్డి తొక్కలేదు. తాజా పరిణామాలు జగన్ వద్దకు మేకపాటి రాజమోహన్ రెడ్డిని వెళ్లేలా చేశాయా? ఒక వేళ ఈ భేటీ సందర్భంగా శ్రీకీర్తిరెడ్డికి అవకాశం ఇద్దామని జగన్ అంటే రాజమోహన్ రెడ్డి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎవరనే స్పష్టత జగన్- రాజమోహన్ రెడ్డి భేటీలో ఫైనల్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మరి జగన్ పంతం నెగ్గుతుందా?.. రాజమోహన్ రెడ్డి పట్టుదల గెలుస్తుందో?

By
en-us Political News

  
మా ఆహ్వానాన్ని మన్నించి, మా హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచినందుకు G.O.A.T లియోనెల్ మెస్సి, ఫుట్‌బాల్ దిగ్గజాలు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌‌లకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్న రేవంత్.. మాతో చేరి శనివారం సాయంత్రం జీవితకాల జ్ఞాపకంగా మార్చినందుకు మా నాయకుడు రాహుల్ గాంధీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు.
అస‌లు మెస్సీ టూర్ ప్లాన్ చేసింది శ‌త‌ద్రు ద‌త్తా. శ‌త‌ద్రు ద‌త్తా ఎవ‌రంటే.. ఈయ‌న ప‌శ్చిమ‌ బెంగాల్ లోని హుగ్లీకి చెందిన వ్య‌క్తి. శ‌త‌ద్రు ద‌త్తా ఇనిషియేటివ్ పేరిట ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ కండ‌క్ట్ చేస్తుంటారు. క్రీడ‌ల‌కు సంబంధించిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను భార‌త్ తీసుకొచ్చి ఈవెంట్ల నిర్వ‌హ‌ణ చేయ‌డం శ‌త‌ద్రు ద‌త్త ఇనిషియేటివ్ సంస్థ చేసే ప్ర‌ధానమైన ప‌ని.
పహల్గాం అటాక్ తర్వాత భారత్-పాక్ మధ్య వైరం తీవ్రతరమైన విషయం తెలిసిందే. కొన్ని రోజుల కిందట ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి విముఖత చూపించారు. ట్రోఫీ గెలిచినప్పటికీ.. పీసీబీ ప్రెసిడెంట్ నఖ్వి చేతుల మీదుగా ట్రోఫీ కూడా తీసుకోలేదు. ఇదే విధానాన్ని యువ భారత్ ఈ అండర్ 19 టోర్నీలోనూ కొనసాగించింది.
తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ బ్రౌన్ యూనివర్సిటీ ఆవరణలో నల్లని దుస్తులు ధరించిన అగంతకుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. వర్సిటీలో పరీక్షలు జరుగుతుండగా ఈ ఘటన జరగడం గమనార్హం.
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము సీఐసీ ప్రధాన కమిషనర్ చేత సోమవారం (డిసెంబర్ 15) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక ఆయనతో పాటు నిమమితులైన ఎనిమిది మంది సీఐసీ కమిషర్లలో సీనియర్ జర్నలిస్టులు పీఆర్‌ రమేశ్‌, అశుతోష్‌ చతుర్వేది, రైల్వే బోర్డు మాజీ చైర్‌పర్సన్‌ జయవర్మ సిన్హా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుధారాణి వంటి ప్రముఖులు ఉన్నారు.
మెస్సీ బృందం నుంచి వచ్చిన ఈ అభినందనలు రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణంగా నిలవడమే కాకుండా, వారి సామర్థ్యానికి అంతర్జాతీయ గుర్తింపుగా మారాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
సరస్వతి పవర్ కంపెనీ షేర్ల విషయంలో వివాదం హైదరాబాద్ లోని నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యూనల్ (ఎన్సీఎల్టీ) కు ఎక్కింది. ఇరు వర్గాలూ అంటే జగన్ , భారతీ, విజయమ్మ, షర్మిలలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. ఈ కేసులో ఎన్సీఎల్టీలో ఎప్పటికప్పుడు విజయమ్మ, జగన్ లు పిటిషన్లు, కౌంటర్లు దాఖలు చేసుకుంటున్నారు. ఒకరు ముందు దాఖలు చేసిన పిటిషన్ పై మరొకరు కౌంటర్ దాఖలు చేస్తున్నారు. దానినీ కౌంటర్ చేస్తూ మళ్లీ పిటిషన్లు, కౌంటర్లు దాఖలు అవుతున్నాయి.
మెదక్ జిల్లా పెద శంకరం పేట శివారులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. పంచాయతీ ఎన్నికలలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి కామరెడ్డి జిల్లా హైదరాబాద్ నుంచి కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది
గోట్ టూర్ ఆఫ్ ఇండియాలో ఉప్పల్ వేదికగా ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి మ్యాచ్ ఘనంగా ప్రారంభమైంది.
గ్లోబల్ సాకర్ లెజెండ్ లియోనెల్ మెస్సీ శంషాబాద్ ఎయిర్‌ఫోర్టు నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకున్నారు
అంధుల క్రికెట్ కెప్టెన్ దీపిక గ్రామంలోని రోడ్ల పరిస్థితిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ఇమిడియట్‌ యాక్షన్ తీసుకున్నారు.
రామేశ్వరం కేఫ్‌లో మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌తో కేటీఆర్‌ భోజనం చేశారు.
సాంఘిక సంక్షేమ హాస్టల్లో గిరిజన విద్యార్థులు కోతుల బెడదతో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.