మలేషియా విమాన దుర్ఘటనకి ఎవరిని నిందించాలి?

Publish Date:Jul 18, 2014

Advertisement

 

మలేషియా విమాన దుర్ఘటనలో 293 మంది చనిపోయారు. అందుకు విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడమో లేక ప్రకృతి వైపరీత్యమో కారణం కాదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య నెలకొన్న యుద్ద వాతావరణం అందుకు కారణం. అది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతీన్ ప్రయాణిస్తున్న విమానం అనుకొని పొరబడి ఉక్రెయిన్ సైనిక దళాలు పేల్చివేసాయని రష్యా దేశం ఆరోపిస్తుంటే, అది ఉక్రెయిన్ కి చెందిన విమానమని పొరబడి రష్యా వేర్పాటువాదులు కూల్చివేసారని ఇరు దేశాలు ఒకదానినొకటి నిందించుకొంటున్నాయి. ఏమయినప్పటికీ వారి పొరపాటుకు ఇతరులు భారీ మూల్యం చెల్లించవలసి వచ్చింది. ఈ నేరం చేసినవారికీ, ఇటువంటి తీవ్ర నేరాలు చేసే తాలిబాన్ తీవ్రవాదులకి తేడా ఏమిటంటే తాలిబన్లు కనీసం ఆ నేరం తామే చేసామని దైర్యంగా చెప్పుకొంటారు. కానీ వీరు చెప్పుకోవడం కాదు కనీసం ఒప్పుకోవడం లేదు కూడా. అందువల్ల ఈ ఘోర సామూహిక హత్యా నేరానికి పాల్పడినవారు ఏ దేశానికి చెందినవారయినప్పటికీ బహుశః తాలిబాన్లలాగే శిక్ష నుండి తప్పించుకొనే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి.

 

ఇక ఈ దుర్ఘటనకు ఆ రెండు దేశాలనే కాక మలేషియన్ ఎయిర్ లైన్స్ సంస్థను కూడా నిందించకతప్పదు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొని ఉందని గ్రహించగానే కొరియన్ ఎయిర్, ఏషియానా(దక్షిణ కొరియా), క్వంటాస్(ఆస్ట్రేలియా), చైనా ఎయిర్ లైన్స్ (తైవాన్),క్యాతీ పసిఫిక్ (హాంగ్ కాంగ్), పాకిస్తాన్ ఇంటర్ నేషనల్ (పాకిస్తాన్) వంటి అనేక దేశాలకు చెందిన విమానయాన సంస్థలు తమ విమానాలను ఆ ప్రాంతం మీదుగా నడపకుండా జాగ్రత్తపడ్డారు. కానీ మలేషియా, భారత్, అమెరికాతో సహా అనేక దేశాల విమానాలు నేటికీ ఆ ప్రాంతం మీదుగానే పయనిస్తున్నాయి.

 

బ్రెజిల్ దేశం నుండి స్వదేశానికి తిరుగు ప్రయాణమయిన భారత ప్రధాని నరేంద్ర మోడీ పయనించిన విమానం కూడా ఆ ప్రాంతం మీద నుండే రావలసి ఉంది. కానీ ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమయిన అధికారులు మోడీ విమానాన్ని వేరే సురక్షిత మార్గానికి మళ్ళించారు. అంటే ఎంత సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ, ఏదయినా ప్రమాదం లేదా దుర్ఘటన జరిగితే తప్ప ఎవరూ మేల్కొనరని అర్ధమవుతోంది. ఇప్పుడు అమెరికా కూడా తన విమానాలను ఆ మార్గం గుండా నడిపించబోమని ప్రకటించింది. బహుశః భారత్ తో సహా మిగిలిన దేశాలు కూడా అదేపని చేయవచ్చునేమో.

 

ఈ గుణపాఠం నేర్చుకొనేందుకు293 మంది బలికావలసి రావడమే దురదృష్టం. దానిని దురదృష్టం అనుకోవడం కంటే నిర్లక్ష్యం అనుకోవడమే సమంజసం. ఎందువలన అంటే వేరే మార్గం గుండా విమానాలను నడిపినట్లయితే, దూరం పెరిగి ఇంధన ఖర్చు మరికొంత పెరుగుతుంది. గనుకనే ఆ ప్రాంతంపై నుండి ప్రయాణించడం ప్రమాదమని తెలిసినా విమానాలు నడుపుతున్నారు. సాధారణంగా ఆ స్థాయి ప్రయాణికులు భద్రత కోసం అవసరమయితే మరికొంత భారం భరించగల స్తోమత గలవారే అయి ఉంటారు. కానీ చౌక ధరల విషయంలో పోటీలు పడుతున్న విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతను గాలి కొదిలిపెట్టి ప్రమాదకరమయిన యుద్ద ప్రాంతం మీదుగా విమానాలు నడపడం చాలా దారుణం.

 

అందుకు వారి వద్ద గొప్ప సంజాయిషీ కూడా సిద్దంగా ఉంది. ఆ ప్రాంతంలో 10,000 మీటర్లు లేదా 33,000 అడుగుల ఎత్తులో విమానాలు ఎగిరేందుకు సురక్షితమని, కానీ అంతకంటే తక్కువ ఎత్తులో అంటే 32, 0000 అడుగుల ఎత్తులో విమానాలు ప్రయాణించడం నిషేదించబడిందని, ఈ దుర్ఘటన జరిగినప్పుడు తమ విమానం ఖచ్చితంగా 33,000 అడుగుల ఎత్తులో పయనిస్తోందని మలేషియా అధికారుల వాదన. ఆయితే వారి వాదనలేవీ పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేవు, కనీసం ప్రయాణికుల భద్రతకు భరోసా ఇవ్వవని తేలిపోయింది.

 

ఈ దుర్ఘటన పొరపాటునే జరిగి ఉండవచ్చు, కానీ ఇజ్రాయిల్-పాలస్తీనా, ఇరాక్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వంటి అనేక దేశాలలో నేటికీ ఉగ్రవాదుల దాడులతో, విమాన దాడులతో ఉద్దేశ్యపూర్వకంగానే మారణ హోమం జరుగుతూనే ఉంది. అందులో వేలాది అమాయక ప్రజలు, అన్నెం పున్నెం తెలియని పసిపిల్లలూ నిత్యం చనిపోతూనే ఉన్నారు. అటువంటి దుష్క్రత్యాలను అన్ని దేశాలు ముక్త కంఠంతో ఖండిస్తాయి. కానీ ఈ నేరానికి పాల్పడిన వారిని మాత్రం ఎవరూ వేలెత్తి చూపరు. కేవలం ఖండిస్తారు, దిగ్భ్రాంతి ప్రకటిస్తారు అంతే. 

 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.