మహాత్మునిపై అరుంధతీ రాయ్ అనుచిత వ్యాఖ్యలు

Publish Date:Jul 20, 2014

Advertisement

 

సమాజంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు, గౌరవం సంపాదించుకొన్న రచయితలు, రాజకీనాయకులు, కళాకారులు, సినీరంగానికి చెందినవారు అప్పుడప్పుడు నోరు జారి చిక్కుల్లో పడుతుంటారు. కానీ కొందరు కుహానా మేధావులు అహంకారంతోనో లేక తమ గొప్పదనం గురించి ప్రజలందరికీ చాటుకోవాలనే దురదతో ఉద్దేశ్యపూర్వకంగానే ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా అనుచితమయిన మాటాలు మాట్లాడుతుంటారు. ఆ కోవకు చెందిన వ్యక్తే ప్రముఖ రచయిత్రిగా పేరుపొందిన అరుంధతీరాయ్. ఆమె గొప్ప రచయిత, సామజిక కార్యకర్తే కావచ్చును. కానీ కేవలం భారతీయులే కాక యావత్ ప్రపంచమూ గౌరవించే మహాత్మాగాంధీనే విమర్శించే హక్కు ఆమెకు లేదనేచెప్పవచ్చును.

 

రెండు రోజుల క్రితం ఆమె ఒక సమావేశంలో మాట్లాడుతూ అసలు మహాత్మాగాంధీని జాతిపిత అనడమే చాల తప్పు అని ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపుతున్నాయి. అది ఇంకా చల్లారక మునుపే మొన్న తిరువనంతపురంలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ మన దేశంలో అనేకమంది మహానుభావులు ప్రజల దృష్టిలో హీరోలుగా చలామణి అవుతున్నారు. కానీ వారందరూ నకిలీ హీరోలేనని మహాత్మాగాంధీని ఉద్దేశ్యించి అన్నారు. మహాత్మాగాంధీ కులతత్వాన్ని సమర్దించారని, ఆ విషయం అయన 1936లో స్వయంగా వ్రాసిన ‘ఆదర్శనీయ భాంగి’ అనే వ్యాసంలో పారిశుద్ధ పనివారు (ఆ కాలంలో ఆ పనిని హరిజనులు చేసేవారు) ప్రజలు విసర్జించిన మూత్రాన్ని, మలాన్ని ఎరువుగా మార్చాలని వ్రాయడం గాంధీజీ కులాహంకారానికి, దేశంలో కులతత్వాన్ని సమర్ధించే విధంగా ఆయన ఆలోచనలు సాగాయని చెప్పడానికి అదే ఒక నిదర్శనమని, అటువంటి వ్యక్తి పేరు సంస్థలకు, విశ్వవిద్యాలయాలకు పెట్టుకోవడం అనుచితమని, వాటిని మార్చుకొనే రోజులు దగ్గర పడుతున్నాయని ఆమె అన్నారు. గాంధీజీ గురించి మనం వ్రాసుకొన్న పాటాలన్నీ అబద్దాలతో నిండి ఉన్నవేనని ఆమె అన్నారు.

 

అరుదంతీ రాయ్ గొప్ప మేధావే కావచ్చును. కానీ ఆనాటి పరిస్థితులను బట్టి గాంధీజీ వ్రాసిన వ్యాసాన్ని పట్టుకొని దానికి తన తెలివితేటలతో వక్ర బాష్యం చెప్పి ఆయనకు కులతత్వాన్ని ఆపాదించాలని చూసి ఆమె తనొక కుహానా మేధావని రుజువు చేసుకొన్నారు. గాంధీజీ దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతగా పోరాడారో అదేవిధంగా హరిజనుల గౌరవం కోసం పోరాడిన సంగతి భారతీయులు అందరికీ తెలుసు. ఆయన కులమతాలకు అతీతంగా భారతీయులందరూ అన్నదమ్ములవలె కలిసిమెలిసి సుఖంగా జీవించాలని కోరుకొన్నారు. మన దేశం నుండి పాకిస్తాన్ వేరే దేశంగా విడిపోతున్నపుడు ఆయన పడిన ఆవేదన గమనిస్తే ఆ విషయం అర్ధమవుతుంది.

 

భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత కావాలనుకొంటే ఆయనే స్వయంగా ప్రభుత్వాధినేతగా పగ్గాలు చెప్పట్టగలిగేవారు. కానీ ఆయన అటువంటి ఆలోచన చేయలేదు పైగా స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ, ఆఖ్యాతిని ఉపయోగించుకొని అధికారం చెప్పట్టకుండా ఉండేందుకు దానిని వెంటనే రద్దు చేయాలని ఆయన కోరారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆయన మాటను మన్నించలేదు. అయినప్పటికీ ఆయన అందుకు ఎవరినీ నిందించలేదు. దేశానికి మొట్ట మొదటి ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన నెహ్రూజీతో చాలా మర్యాదగా వ్యవహరించారు.

 

ఆ తరువాత కూడా ఆయన నిరాడంబర జీవనశైలిలో ఎటువంటి మార్పులు రాలేదు. ఇదంతా చరిత్ర పాటాలలో వ్రాయబడింది గనుక గుడ్డిగా నమ్మనవసరం లేదు. ఆనాడు జరిగిన ఈ సంఘటనలన్నీ సినిమాలు, వీడియోలు, ఫోటోలు తదితర దృశ్యరూపంలో నేటికీ మన కళ్ళెదుట సజీవంగానే ఉన్నాయి. అవి చూస్తే గాంధీజీ ఎందుకు మహాత్ముడయ్యారో అర్ధమవుతుంది. ఆ మాహాత్ముడి గొప్పదనం గురించి ఇటువంటి కుహానా మేధావులకి అర్ధం కాకపోవచ్చునేమో కానీ కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్నకోట్లాది భారతీయులకు మాత్రం బాగానే తెలుసు. అందుకే ఆయన నేటికీ వారి హృదయాలలో కొలువయ్యున్నారు.

 

అరుంధతీ రాయ్ వంటి కుహాన మేధావులు తమ తెలివితేటలను దేశ అభివృద్ధికి, ప్రజలమధ్య శాంతి సామరస్యాలు నెలకొల్పడానికీ ఉపయోగించి ఉంటే అందరూ సంతోషించి ఉండేవారు. కానీ భారతీయుల హృదయాలలో సమున్నత స్థానం పొందిన మహాత్ముని గురించి ఇలా చెడు ప్రచారం చేసేందుకు తన తెలివితేటలను ఉపయోగించడం ఆమె అహంకారానికి, అజ్ఞానికి అద్దం పడుతోంది. ఆవిధంగా మాట్లాడటం వలన ఆమె పేరు తాత్కాలికంగా మీడియాలో నానవచ్చునేమో కానీ దానివల్ల పోయేది ఆమె పరువే తప్ప గాంధీ మహాత్ముడిది కాదు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.