చంద్రబాబు వ్యూహం.. జాతీయ నేతగా లోకేష్ అడుగులు!

Publish Date:Nov 10, 2025

Advertisement

రాష్ట్రంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ముందు ముందు జాతీయ స్థాయిలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించానున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఇప్పటికే తన పనితీరుతో లోకేష్ రాష్ట్రంలో అన్ని వర్గాలకూ చేరువ అయ్యారు. గతంలో విమర్శలు చేసిన వారు కూడా ఇప్పుడు లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రాజకీయంగా పరిణితి చెందారన్న అభిప్రాయమూ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతోంది.

అందుకు తగ్గట్టుగానే లోకేష్ ఇటు ప్రభుత్వంలోనూ, అటు తేలుగుదేశం పార్టీలోనూ తిరుగులేని నేతగా గుర్తింపు పొందారు. ఇక ప్రజలలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ మరో లెవల్ కు చేరింది.  ప్రజానాయకుడిగా జనం ఆయనను భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన తెలుగుదేశం భవిష్యత్ నాయకుడిగా పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి.   ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకూ లోకేష్ అన్ని వర్గాల, అన్ని పార్టీల నుంచీ కూడా మంచి నేతగా గుర్తింపు పొందారు.  ఇక ఇప్పుడు ఆయనను జాతీయ స్థాయిలో కూడా తిరుగులేని నాయకుడిగా నిలబెట్టేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హస్తిన, ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ఆయనకు గుర్తింపు లభించేలా ఒకదాని వెంట  ఒకటిగా లోకేష్ వేస్తున్న అడుగుల వెనుక  చంద్రబాబు స్ట్రాటజీ ఉందని   పరిశీలకులు అంటున్నారు.

 ఇప్పటికే ప్రధాని నరేంద్రమోడీ లోకేష్ అడగకుండానే అప్పాయింట్ మెంట్లు ఇస్తున్నారు. అలాగే కేంద్ర కేబినెట్ లోని పలువురు మంత్రులతో లోకేష్ కు మంచి పరిచయాలు, అనుబంధం, సాన్నిహిత్యం ఏర్పడింది. తరచుగా వారి సూచనలు, సలహాలూ తీసుకుంటూ వారికి చేరువ అవుతున్నారు. ఇప్పుడు తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కూడా తాను వెళ్లకుండా లోకేష్ ను పంపించారు. అక్కడ ఆయన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి.

 బీహార్ ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.  ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ సహా పలువరు కేంద్ర మంత్రులు, బీజేపీ, ఎన్డీయే కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అంతటి కీలకమైన బీహార్ ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ఆంధ్రప్రదేశ్ నుంచి   నారా లోకేష్ వెళ్లడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ ప్రచారం ఆయనకు జాతీయ నేతగా వస్తున్న గుర్తింపును మరో మెట్టు పైకి తీసుకువెడుతుందని అంటున్నారు.     

By
en-us Political News

  
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.