పవన్‌ తిరుపతి పర్యటనపై విమర్శలు... ఎమ్మెల్యేలను కలిసే భాగ్యం లేదా?

Publish Date:Nov 11, 2025

Advertisement

 

డిప్యూటీ సీఎం తమ జిల్లాకు వస్తున్నారంటే స్థానిక నాయకులు కూడా ఇతర పర్యటనలు మానుకొని ఆయన్ను కలవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇటీవల పవన్‌ కల్యాణ్‌ తిరుపతి జిల్లా పర్యటనలో మాత్రం ప్రజాప్రతినిధులకు నో ఎంట్రీ బోర్డు పెట్టారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన.. నేరుగా మాముండూరు అటవీ ప్రాంతంలోని పర్యాటక కేంద్రానికి వెళ్లారు. అక్కడ అధికారుల నుంచి వివరాలు సేకరించి, వాచ్ టవర్ నుంచి పరిసరాలను పరిశీలించారు. 

అనంతరం అటవీ ప్రాంతంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. మాముండూరు అటవీ ప్రాంతం శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుదీర్ రెడ్డి ఉపముఖ్యమంత్రిని కలిసి పలు కీలక సమస్యలను ప్రస్తావించాలని సిద్ధమయ్యారు. ముఖ్యంగా రేణిగుంట, ఏర్పేడు అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న వన్యప్రాణుల దాడుల కారణంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై అటవీ శాఖ నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలను ఆయన దృష్టికి తీసుకురావాలనుకున్నారు. 

బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం కోసం అటవీ భూముల సేకరణపై స్పష్టత లేకపోవడంతో ప్రాజెక్టు పూర్తి కావడం లేదు అనే విషయాన్ని పవన్‌కు వివరిద్దామనుకున్నారట. అంతేకాదు.. శ్రీకాళహస్తి ఆలయం సమీపంలోని కొండలపై చెట్ల పెంపకానికి అటవీ శాఖ తీసుకోవాల్సిన చర్యలపైనా ఆయనతో డిస్కస్‌ చేద్దామని రెడీ అయ్యారట. అయితే పవన్‌ వ్యక్తిగత సిబ్బంది నుంచి ఆ టూర్‌కు ఎవరూ రావాల్సిన అవసరం లేదని సమాచారం ఇచ్చారు. దాంతో బొజ్జల సుధీర్‌ రెడ్డి పవన్‌ టూర్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది.

 ఇక తిరుపతిలో జరిగిన అటవీ శాఖ రివ్యూ సమావేశానికి సైతం స్థానిక ఎమ్మెల్యేలు ఎవరికీ అవకాశం ఇవ్వలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా మంత్రులు లేదా ముఖ్యమంత్రి సమీక్షలు నిర్వహించినప్పుడు ఆయా జిల్లాల ప్రజా ప్రతినిధులు హాజరై తమ నియోజకవర్గ సమస్యలను చెబుతుంటారు. కానీ, ఇక్కడ జనసేన తిరుపతి ఎమ్మెల్యేను సైతం సమావేశంలోకి రానివ్వలేదట. దీంతో ఆయన పక్క గదిలో ఉండిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తిరుమలతో పాటు తిరుపతిలో ఉన్న అటవీ శాఖ సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని ఎమ్మెల్యే సిద్ధమైనా అది సాధ్యపడలేదు. 

హాస్తకళల అభివృద్ధి చైర్మన్ డాక్టర్ హారి ప్రసాద్ కూడా ఎర్రచందనాన్ని హాస్తకళల కార్పొరేషన్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేయడానికి ప్రపోజల్స్ సిద్ధం చేసుకున్నారు. కానీ, ఆయన్ని కూడా కలవడానికి అవకాశం దక్కలేదనే టాక్ ఉంది. ఇక రెండవ రోజు పర్యటనలోనూ ఇదే పరిస్థితి ఎదురైందట. పలమనేరుకు వచ్చిన ఉపముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ వచ్చారు. 

అయితే, రైతులతో సమావేశం అవుతారని ముందుగా చెప్పినా, డిప్యూటీ సీఎం నేరుగా మొసలిమడుగు ఏనుగుల క్యాంపుకు వచ్చి అధికారుల సమావేశంలో మాత్రమే పాల్గొన్నారు. ఏనుగుల దాడుల గురించి వివరించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నించినా ఆయన పట్టించుకోలేదనే చర్చ నడుస్తోంది. ఏనుగుల దాడులతో అల్లాడిపోతున్న తమ మాటలు కనీసం అటవీ మంత్రిగా పవన్ కల్యాణ్ వింటారని ఆశించిన రైతులకు ఈ పర్యటన నిరాశనే మిగిల్చింది. ఏనుగుల బాధితులు ఏడాదిన్నర తర్వాత తమ కష్టాలు వినడానికి మంత్రి వస్తున్నారని ఆశగా వచ్చారు. 

పంట నష్టం కొద్దిగా జరిగితే, పరిహారం అంతకంటే తక్కువగా ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటలను రక్షించుకోవడానికి ఒక్కోసారి రైతులు విద్యుత్ వైర్లను వేయడం, అటవీ జంతువులు చనిపోవడంతో రైతులపై కేసులు పెడుతున్నారని వారు వాపోతున్నారు. అటవీ శాఖ లెక్కల ప్రకారమే పెద్ద ఎత్తున పంట నష్టం జరిగినట్లు చెబుతున్నా, పరిహారం విషయంలో నిర్లక్ష్యం ఉందనే విమర్శలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తమ గోడు చెప్పుకుందామని వచ్చిన రైతులకు ఉపముఖ్యమంత్రిని కలిసే అవకాశం దక్కకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో ఉపముఖ్యమంత్రి సమక్షంలో అధికారులకు తమ సమస్యలు వినిపించుకుందామనుకున్న రైతులకు, అధికారులకు వార్నింగ్ ఇద్దామని భావించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు నిరాశ మిగిలింది. ఈ పర్యటన స్థానిక జనసేన క్యాడర్‌కు సైతం నిరాశ కలిగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

By
en-us Political News

  
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
అగ్రరాజ్యం అమెరికా ఆగకుండా చేస్తున్న హెచ్చరికలు, విధిస్తున్న ఆంక్షలు, ఆరంభించిన టాక్స్ వార్ ను కూడా లెక్క చేయకుండా మోడీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం రష్యాతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా వేస్తున్న అడుగులు అమెరికా అధ్యక్షుడికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
ఈ మధ్య కాలంలో దేవతలు దీవించడానికి బదులు శపిస్తున్నారా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేవుళ్లకు సంబంధించిన అంశాల్లో చిన్న వివాదం కూడా అతి పెద్ద రాద్ధాంతంగా మారిపోతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దిగ్గజ దర్శకుడు రాజమౌళి.. ఇలా వారు యథాలాపంగా చేసిన వ్యాఖ్యల వెనుక కూడా దైవ ధిక్కారం, దైవ దూషణ ఉందన్న ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తి పెద్ద వివాదంగా మారిపోతున్న పరిస్థితి.
పవన్ ఆ వ్యాఖ్యలు చేసిన వెంటనే తెలంగాణ నుంచి ఎవరూ స్పందించలేదు కూడా. కానీ తీరిగ్గా పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేసిన వారం తరువాత తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయన టార్గెట్ గా విమర్శలు గుప్పించడం విస్తుగొలుపుతోంది.
అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో జగన్ సర్కార్ అనుసరించిన విధానాలు, కక్షపూరిత రాజకీయం, రాష్ట్రంలోఅభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, సంక్షేమం పేరుతో అరకొర పందేరాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న జగన్ సర్కార్ కు గత ఎన్నికలలో జనం గట్టి బుద్ధి చెప్పారు. కేవలం 11 స్థానాలలో మాత్రమే విజయం సాధించిన వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
తెలుగు రాష్ట్రాలలో స‌ర్పంచ్ ప‌దవికి కూడా భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టేస్తున్నారు. స‌ర్పంచ్ ప‌ద‌వుల వేలంలో ఒక పంచయతీలో స‌ర్పంచ్ సీటు ఏకంగా కోటి రూపాయ‌లు ప‌లికిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్ధం చేసుకోవచ్చు.
నిన్న మొన్నటి వరకూ కాళేశ్వరం అవినీతిపైనే విమర్శలు గుప్పించి, ఆ అవినీతి వెనుక ఉన్నది మాజీ మంత్రి హరీష్ రావే అంటూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు అసలు కాళేశ్వరం ప్రాజెక్టే వేస్ట్..అంటూ బాంబు పేల్చారు.
లోకేష్ త‌ల్లిచాటు బిడ్డ‌గా ఎదిగారు. ఆయ‌న ఎదిగిన విధం అత్యంత ఉదాత్తం. సంస్కార‌వంతం. ఎందుకంటే తండ్రి ప్రజా నాయకుడిగా చాలా చాలా బిజీ. దీంతో లోకేష్ ని అన్నీ తానై పెంచిన జిజియా బాయి భువ‌నేశ్వ‌రి. లోకేష్ లో ఒక మాన‌వ‌త్వం, మంచి, మ‌ర్యాద, పెద్దా, చిన్నల ప‌ట్ల చూపించాల్సిన క‌రుణ- జాలి- ద‌య- ప్రేమ‌- బాధ్య‌త‌ వంటి సుగుణాల‌ు ప్రోది అయ్యేలా పెంచి పెద్ద చేశారు భువ‌నేశ్వ‌రి అని చెప్ప‌డానికి ఎన్నో నిద‌ర్శ‌నాలు.
తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.
కాంగ్రెస్, బీజేపీల‌క‌న్నా కూడా ఈ క‌విత‌తోనే ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. పరువుపోతోందన్న మాట బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తోంది.
హరీష్ రావుపై తాన చేసిన కామెంట్లకు కౌంటర్లిచ్చే నాయకులను కవిత టార్గెట్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. హరీష్ కు మద్దతుగా నోరెత్తిన నేతలపై కవిత విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా, వారి అవినీతి బాగోతాలు కూడా బయటపెడుతూ వారి నోళ్లు మూయించాలన్న వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.