కాపుగాసి... లోకేష్ పై దాడి చేశారా?

Publish Date:Oct 8, 2016

Advertisement

కులం గాలి లాంటిది... అది లేకపోతే రాజకీయాలు బతకలేవు! అలాగని ఆ గాలి ఎక్కువై... దుమారంగా మారితే... అప్పుడు అన్ని పాలిటిక్సూ కొట్టుకుపోతుంటాయి! ఇదీ కులంతో వచ్చిన సమస్య!
నవ్యాంధ్రని ఏలుతోన్న టీడీపికి ఇప్పుడు కులం సమస్యే వచ్చినట్టు కనిపిస్తోంది. అభివృద్ధి, ప్రాజెక్ట్ లు, ఉద్యోగాలు లాంటివి అడిగే వారికన్నా కులాల క్యాలికులేషన్స్ చేసుకునేవారు ఎక్కువైపోయారు. సింధు సిల్వర్ మెడల్ గెలిస్తే ఆమె కులం ఏదీ అని గూగుల్ సెర్స్ చేశారంటే... మనోళ్ల కుల పిచ్చి ఎంతో అర్థం చేసుకోవచ్చు! ఇప్పుడు ఈ వీక్ పాయింటేనే ప్రతి పక్షాలు, వాటి అనుబంధ మీడియాలు, పోషల్ మీడియా శూరులు క్యాష్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది! ఇంతకీ ఏమైందంటే... 
వున్నట్టుండీ సోషల్ మీడియా సైట్లలో ఓ ఫోటో ప్రత్యక్షం అయింది. దాంట్లో ఆంధ్రా డిప్యుటి సీఎం నిమ్మకాయల చినరాజప్ప వేదిక కింద నిల్చుని వుంటారు. వేదిక మీద చిన బాబు లోకేష్ కనిపిస్తుంటారు. ఆయన వేలెత్తి చూపుతూ ఏదో మాట్లాడుతుంటారు. కాని, అది మౌనంగా వుండే ఫోటో కదా... అందుకే లోకేష్ ఏమన్నారో, చినరాజప్ప ఏమనిపించుకున్నారో మనకు తెలియదు. కాని, కొందరు కులోన్మాద రాక్షసులకు మాత్రం దాంట్లో ఎన్నో మాటలు వినిపించాయి. వెంటనే ఫేస్బుక్ లాంటి వేదికల్లో ప్రచారం మొదలైంది. ఇన్ ఫ్యాక్ట్, విష ప్రచారం స్టార్టైంది... 
కాపు సామాజిక వర్గానికి చెందిన చిన రాజప్ప వయసులో పెద్దాయన. పైగా సౌమ్యుడని పేరుంది. ఆ కులం వారికి ఆయనంటే అభిమానం కూడా. సరిగ్గా ఈ పాయింట్ ని వాడుకునే ఎజెండా సిద్దం చేసుకున్నారు యాంటీ టీడీపీ బ్యాచ్. లోకేష్ ఫలానా మీటింగ్ లో చిన రాజప్పని తిట్టాడు. దారుణంగా అవమానించాడు. ఎంతగా అంటే, డిప్యుటీ సీఎం కళ్ల నీళ్లు పెట్టుకునేంతగా! ఇలా సాగింది నెగటివ్ క్యాంపైన్! మరి దీనికంతటికీ ఆధారం... ఒక్క ఫోటో మాత్రమే. అందులో చినరాజప్ప లోకేష్ ముందు నిలబడి వుంటారు. అంతకు మించి అందులో ఏముండదు. అయినా దుష్ప్రచారం మాత్రం ఆగలేదు. సోషల్ మీడియాలో వైసీపీ వర్గాలు, కాపు యూత్ గ్రూపులు ఇష్టానుసారం షేర్లు చేసేశాయి. వీలున్నంత వరకూ కాంగ్రెస్ వాళ్లు కూడా దీన్ని జనంలోకి పంపే ప్రయత్నం చేశారు!
డిప్యుటీ సీఎంను లోకేష్ తిట్టాడన్న ప్రచారం ఎందుకు జరిగింది? దాని వెనుక కారణాలు ఏంటి? ఎవరున్నారు? వాళ్లకి దీని వల్ల కలిగే లాభం ఏంటి? ఇలా బోలెడు ప్రశ్నలు. ఒక్కోటి చూద్దాం. కాని, అంతకంటే ముందు మనం స్టోరీలో బాగా వెనక్కి వెళ్లాలి. ఫ్లాష్ బ్యాక్ లో ఏమైందో కూడా తెలుసుకోవాలి! పవన్ కళ్యాణ్ కూడా చినరాజప్పలా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖుడు. లోకేష్ లాగే పరిటాల కూడా టీడీపీ తరుఫున జనంలో విపరీతమైన గుర్తింపు వున్న నేత! వాళ్లిద్దరి మధ్య లేని గొడవని రాజేశారు చాన్నాళ్ల కింద! 
పవన్ కళ్యాణ్ కి పరిటాలకి ఏదో విషయంలో గొడవ జరిగిందనీ, పవర్ స్టార్ కి పరిటాల గుండు గీయించారనీ... అప్పట్లో అదేపనిగా దుష్ప్రచారం జరిగింది. అది తప్పుడు ప్రచారం అని ఈజీగా చెప్పొచ్చు. ఎందుకంటే, తనకు అన్యాయం జరిగితే బెదిరిపోయి కిక్కురుమనకుండా వుండిపోయే నైజం పవన్ కళ్యాణ్ ది కాదు. మరి అటువంటప్పుడు పరిటాల రవితో ఆయనకు గొడవైతే సైలెంట్ గా ఊరుకుంటాడా? అంతకు మించి పరిటాల దాడి చేశాడని రాసిన డెక్కన్ క్రానికల్ పేపర్ వారి ఆపీస్ ముందు ధర్నా చేస్తాడా? ఇలా ఇప్పుడు వెనక్కి తిరిగి ఆలోచిస్తే అంతా ఉట్టిదేనని అర్థమైపోతుంది! అయినా అప్పుడు ఎందుకని ఆ గాసిప్ వ్యాపింపజేశారు? లాజిక్ చాలా సింపుల్... టీడీపికి దగ్గరయ్యే చాన్స్ వున్న కాపుల్ని ఆ పార్టీకి దూరం చేయటమే లక్ష్యం! దాన్ని పరిటాల, పవన్ ల మధ్య శత్రుత్వంగా చీత్రీకరించి సక్సెస్ అయ్యారు. టీడీపికి కాపు ఓట్లు తరువాతి ఎన్నికల్లో అస్సలు పడలేదు! మరి దీని వల్ల లాభపడింది ఎవరు? కాపు ఓట్లు కొల్లగొట్టిన కాంగ్రెస్!
ఇప్పుడు కూడా కాపుల్ని తమ వైపు తిప్పుకోటానికి కొన్ని దుష్ట రాజకీయ శక్తులు కాపుగాస్తున్నాయి. వాటి కుటిల కుల తంత్రాలే పదే పదే ఎగిసిపడుతోన్న నిరసన జ్వాలలు. చంద్రబాబు ఎన్నికల ముందు అనివార్యమై హామి ఇచ్చిన కాపుల రిజర్వేషన్ అంశం... ఇప్పుడు బాగా పనికొస్తోంది ప్రత్యర్థులు తమ 'ముద్ర' వేయటానికి! అవును... కాపుల ఆత్మాభిమానంపై తమదైన ముద్రవేసి వార్ని టీడీపికి దూరం చేసే జగన్నాటకం నడుస్తోంది!
ఆ మధ్య జరిగిన కాపు గర్జన సభ అనూహ్యమైన హింసకు దారి తీసింది. ఓ రైలు మొత్తం తగులబెట్టారు. కాని, అసలు గతంలో కాపుల్ని బీసీల్లో చేర్చమని జరుగుతోన్న ఉద్యమం ఏనాడైనా హింసాత్మకం అయిందా? మరెప్పుడూ కానిది తునిలో మాత్రం ఎందుకు అయింది? నిజానికి అవ్వలేదు... చేశారు! అధికారం కోసం కాపు కాచుకుని కూర్చున్న వారు... కాపులపై కపట ప్రేమ ఒలికిస్తూ విధ్వంసానికి కారణం అయ్యారు... 
2014లో కాపులు వన్ సైడెడ్ గా టీడీపికి జైకొట్టారు. ఇది చాలా మందికి మింగుడుపడటం లేదు. అందుకే, వచ్చే ఎన్నికల నాటికి ఆ సామాజిక వర్గాన్ని తెలుగుదేశానికి దూరం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే లోకేష్ , చినరాజప్పల ఉదంతం!
పవన్ కళ్యాణ్, పరిటాల ఎపిసోడ్ తో ఒకప్పుడు చేసినట్టే ఇప్పుడూ చేద్దామని దుర్భుద్ధి గల వాళ్లు ఆలోచిస్తున్నారు. డిప్యుటి సీఎంని... కాబోయే సీఎం అన్న ప్రచారం వున్న లోకేష్... తిట్టాడని కట్టుకథలు చెప్పి కాపుల ఆత్మాభిమానం దెబ్బతిస్తున్నారు. నిజంగా మాత్రం అసలక్కడ ఏమీ జరగలేదేన్నది టాక్! టీడీపీలోని అత్యంత విశ్వసనీయ వర్గాల ప్రకారం చినరాజప్ప ఏదో మాట్లాడినప్పడు ఆయనకు మామూలుగానే లోకేష్ సమాధానం ఇస్తుంటే సదరు ఫోటో తీశారు. పక్కనున్న వాళ్ల ఎక్స్ ప్రెషన్లు చూస్తే కూడా లోకేష్ డిప్యుటీ సీఎంని కటువుగా ఏమీ అనటం లేదని మనకు అర్థమైపోతుంది!
ప్రభుత్వంలో భాగం కాని లోకేష్ నిజంగా ఉప ముఖ్యమంత్రి స్థాయిలోని నేతను ఏమన్నా అంటే అది తప్పే. కాని, ఏమీ జరగకుండానే దుష్ప్రచారం జరిగిపోయింది. పైగా వైరల్ అయిన ఆ ఫోటోను సోషల్ మీడియా దొంగలు లోకేష్ ఫేస్బుక్ పేజ్ లోంచే తీసుకున్నారట! ఆయన పర్సనల్ సోషల్ మీడియా టీమ్ దాన్ని పొరపాటున అప్ లోడ్ చేసిందట. మళ్లీ తీసేసేలోపు డౌన్ లోడ్ చేసుకున్న ప్రబుద్ధులు... ఫోటో చుట్టూ కథ అల్లేశారు. కాపులకి అవమానం అంటూ గావుకేకలు పెట్టారు! నెటిజన్స్ చాలా వరకూ నమ్మేశారు. అయితే, లోకేష్ భవిష్యత్ లో పార్టీనే నడిపించే అవకాశం వున్న వాడిగా చాలా జాగ్రత్తగా మసలు కోవాలి. ఆయన టీమ్ లోని వారికి రాజకీయ పరిణతి, అంకిత భావం లాంటివి వున్నయా అని చూసుకోవాలి. లేదంటే వాళ్లు చేసే పొరపాట్లు ఇలా ఒక కులం మొత్తాన్నీ దూరం చేసే ప్రమాదం వుంది. ఇక చంద్రబాబు కూడా కాపుల కోసం , బ్రాహ్మణుల కోసం కార్పోరేషన్లు పెడుతూ కుల ఒత్తిళ్లకు తలొగ్గకపోతే చాలా బెటర్. ఎందుకంటే, వాటి వల్ల ఆయా కులాలకు కలిగే లాభం కన్నా ఇతర కులాల వారికి కలిగే మనస్తాపం ఎక్కువ.
కాపుల్ని బీసీల్లో చేర్చటం అనే దానిపై త్వరగా తేల్చి... ఏపీ సీఎం అందరికీ అభివృద్ధి అనే ఆదర్శవంతమైన లక్ష్యం వైపు దూసుకెళితే చాలా బావుంటుంది! లేదంటే గతంలో టీడీపీ కాపులకి దూరమై ఎంతో నష్టపోయినట్టే ఇప్పుడూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. కారణం... కాపు ఓటర్ల కోసం కాపుగాసిన తోడేళ్లు బోలేడు వుండటమే!
 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.