మన అమ్మవార్లు రాతి విగ్రహాలేనా?

Publish Date:Oct 9, 2016

Advertisement

 

శరన్నవరాత్రి ఉత్సవాలు అయిపోవస్తున్నాయి. జనం దసరా కోసం ఉత్సహంగా సిద్ధమైపోతున్నారు. ఈ హడావిడిలో... నిజంగా హిందూ మతంలోని శక్తి ఆరాధన వెనుక వున్న రహస్యం ఏంటి? ఎవరన్నా ఆలోచిస్తున్నారా? సాధారణ జనం పూజలు, పునస్కారాల కోలాహలంలో అసలు మర్మం మరిచిపోతుంటారు. అమ్మవారి అలంకారాలు, కుంకుమ పూజలు, దాండియాలు ఇవన్నీ తప్పు కాకపోయినా, అంతా శాస్త్రబద్ధమే అయినా... మన ఋషులు ఏ మూలమైన ఆలోచనతో శక్తి పూజించటం మొదలుపెట్టారో అది మనం పూర్తిగా పట్టించుకోవటమే లేదు. పైపైన ఆచారాలు, సంప్రదాయాలతో సరిపెట్టేస్తున్నాం... 
అమ్మవార్ని అంగరంగ వైభవంగా ఆరాదించటం మనకు ఎవ్వరూ చెప్పక్కర్లేదు. అది ఎలాగూ చేస్తాం. కాని, అందులోని తాత్విక కోణం ఇప్పుడోసారి చూద్దాం. మన వాళ్లు శక్తిని సృష్టికి మూలంగా భావించారు. శక్తి అంటే ఎనర్జీ. ఎనర్జీ లేకుంటే మ్యాటర్ దేనికీ పనికిరాదు. అందుకే, శక్తి లేకుంటే శివుడు సృష్టి చేయలేడంటుంది వేదం. ఆ శక్తికి ప్రతిరూపమే పార్వతి దేవీ. సతీ దేవీ అన్నా, దాక్షాయణి అన్నా, గౌరీ అన్నా అన్నీ ఆమే. శివుడికి అర్థాంగి అయిన ఆ అమ్మ మొత్తం సృష్టిలోని శక్తి. ఆమె వల్లే కణాలు, అణువులు మొదలు అండ, పిండ, బ్రహ్మండాలు నిలిచేది, కదిలేది, వ్యాపించేది, కుంచించుకుపోయేది! అసలు శక్తి ఎప్పుడైతే తనని తాను ఒక దేహం నుంచి ఉపసంహరించుకుంటుందో అప్పుడే ఆ శరీరం శవమైపోతుంది. దానిలోని అప్పటి వరకూ వున్న చూతన్యమే శక్తి! ఆ శక్తి శాశ్వతం అంటుంది సనాతన ధర్మం. అంతే కదా... పదార్థం పుడుతుంది, మరణిస్తుంది. సృజింపబడుతుంది. మాయమైపోతుంది. కాని, సృష్టి, స్థితి, లయాలకి కారణమైన శక్తి శాశ్వతంగా మిగిలే వుంటుంది. 
మొత్తం విశ్వాన్ని ఆవరించిన, ఆవహించిన శక్తినే కాదు ఇంకా అనేక ప్రకృతి అంశల్ని కూడా భానతీయ సంస్కృతి స్త్రీగానే భావిస్తుంది. ఎందుకంటే, స్త్రీ మాత్రమే సృష్టికి, పుష్టికి కారణం. అది చంటి బిడ్డైనా, పండు ముసలి అయినా అమ్మ రూపంలోనో, అమ్మవారి రూపంలోనో స్త్రీ నుంచే ప్రతీ జీవి ప్రాణ రక్షణ పొందుతుంది. అందుకే, మన పెద్దలు స్త్రీ ఆరాధనకి ఎనలేని ప్రాముఖ్యత ఇచ్చారు.
మనం జీవిస్తున్న భూమిని కూడా మన వాళ్లు భూమాత అన్నారు. ఎందుకని? భూమి తల్లి లాగే మనకు కావాల్సిన సమస్తం ఇస్తుంది. ఆమె ఇవ్వనిది ఏదీ మనకు లేదు. ఆమె ఇవ్వకుంటే అది లేనట్లే! తినే తిండి, తాగే నీరు, వాడుకునే చెట్లు, చేమలు, కొండలు, లోయలు, గుహలు, ఖనిజాలు అన్నీ భూదేవీ ఇచ్చేవే. అందుకే, భూమిని విశ్వ రూపుడైన విష్ణువుకి భార్య అన్నారు. సహచరి అన్నమాట. పొద్దున్న లేస్తే భూదేవీకి క్షమాపణ చెప్పమని కూడా అంటారు పెద్దలు. అంటే... మనకు సర్వం, సమస్తం ఇచ్చే భూదేవికి మనం కృతజ్ఞతతో వుండాలన్నది భావం అన్నమాట... 
శివుడి భార్యలని చెప్పే అన్నపూర్ణా, గంగలు కూడా ప్రకృతి అంశలే! అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పే వేదం... ఆ అన్నానికి అధిదేవత అన్నపూర్ణేశ్వరి అంటుంది. అన్నపూర్ణ వద్ద ఆది భిక్షువు పరమశివుడు ఆహారం భిక్షగా స్వీకరిస్తాడు. అంటే అమ్మ అవసరం, అన్నం అవసరం సాక్షాత్తు శివుడికి కూడా వుందని చెప్పటమే దీనిలోని లౌకికమైన భావం. ఇంకా ఆధ్యాత్మిక కోణాలు అనేకం వున్నా... మనిషికి అత్యంత ప్రధానమైన అన్నం స్త్రీ వల్లే సమకూరుతుంది. ఆమె లేకపోతే అఖిల జగాలు ఆకలితో అలమటిస్తాయి....
గంగ అంటే నీళ్లు. భారతీయులు నదుల్ని, సముద్రాల్ని పూజించటం ఈ మధ్య కొందరు మూఢ నమ్మకాలని అనుకుంటున్నారు. కాని, ప్రకృతిలోని నీరు, చెట్టు, చేమా అన్నీ దైవాంశలని భావించటం మహోన్నతమైన ఆధ్యాత్మికత. అది వేల ఏళ్లు పటిష్టంగా వుండటం వల్లే భారతదేశంలోని నదులు, అడవులు, అద్బుత ప్రకృతి సురక్షితంగా వుంటూ వచ్చింది. ఆధునిక కాలంలో ప్రాణాధారమైన నీటిని కూడా ఓ సహజ వనరుగా మాత్రమే భావించి ఇష్టానుసారం దుర్వినియోగం చేసేశారు. దాని ఫలితమే గంగా నది లాంటి నదులు కాలుష్యమయం అయిపోవటం. కాని, గంగను అమ్మగా భావిస్తే , నిజంగా ఆరాధిస్తే వేల ఏళ్లు పవిత్రంగా వున్నట్టే ఇప్పుడూ వుండేవి... 
సృష్టిలోని శక్తి, భూమి, అన్నం, నీరు... ఇలాంటి అంశలే కాదు... మనిషికి వ్యక్తిగతంగా అవసరం అయ్యే సహజ శక్తులు కూడా స్త్రీ రూపంలో దర్శించారు మన ఋషులు. అన్ని సుఖాలు, సౌక్యాలు, సంతోషాలకు మూలమైన సంపద, ఐశ్వర్యం లక్ష్మీ దేవీ అన్నారు. ఎంత ఆస్తి, పాస్తులున్నా , ఇంకా ఏం వున్నా జ్ఞానం అవసరం. అది వుంటేనే మనఃశాంతిగా, దైర్యంగా వుండగలిగేది.  ఆ జ్ఞానాన్ని కూడా సరస్వతి రూపంలో కొలిచారు భారతీయులు. ఇక డబ్బు, జ్ఞానం లాగే మనిషికి అత్యంత అవసరమైంది ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపం శ్రీకృష్ణుని ప్రియురాలైన రాథ. 
భారతీయ సంస్కృతి శృంగారాన్ని కూడా ఎప్పుడూ తప్పుగా చూడలేదు. బ్రహ్మచర్యాన్ని బోధించిన మన శాస్త్రాలే రతి దేవీని కూడా ఆరాధించాయి. ఆమె మనుషుల్లోని కోరిక అనే శక్తికి అధిదేవత అన్నాయి. ఇక రంభ లాంటి అప్సరసల్ని అందానికి సంకేతంగా వాడారు. అది కూడా జీవితంలో ఎంతో ప్రధానమైన అంశమని అనేక పురాణ కథల ద్వారా తెలియజేశారు.... 
ఇలా వేద, పురాణ, ఇతిహాసాల్ని తరిచి చూస్తే మనకు సంతోషానికి అధిదేవతగా సంతోషిమాత, విఘ్నేశ్వరుడి భార్యలుగా సిద్ది, బుద్ది, సుబ్రమణ్యుని దేవేరులుగా శ్రీవల్లి, దేవసేన... అందరూ ప్రకృతి అంశలే! హిందువులు ఎంతో ఉన్నతంగా భావించే గాయత్రి దేవి కూడా సృష్టిలోని సమస్తమైన సాత్విక శక్తికి సంకేతం! 
నవరాత్రి ఉత్సవాలు చేసుకుంటూనే మన ఋషులు, మునులు ఎంతో నిగూఢంగా ఆలోచించి ఏర్పాటు చేసిన స్త్రీ దేవతారాధన, శక్తి ఉపాసన ధార్మిక మర్మాల్ని కూడా మనం తెలుసుకోవాలి! అందులోని 
తాత్విక రహస్యం అవగాహన చేసుకోవాలి... 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.