హైదరాబాద్ పై రిఫరెండం..ఇదేమీ కిరికిరి కేసిఆర్ ?

Publish Date:Jan 18, 2013

Advertisement

 

తెలంగాణా ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు కేసిఆర్  అకస్మాత్తుగా మాయం అయిపోవడం, లేదా ఎవరూ ఊహించలేని విధంగా ఏదో ప్రకటన చేసి కొంత గందరగోళం సృష్టించడం అందరూ ఎరిగినదే. కేంద్రం నుండి తెలంగాణాకి అనుకూలంగా బలమయిన సంకేతాలు వస్తున్న ఈ తరుణంలో, కేవలం మరొక పదిరోజుల్లో తెలంగాణా అంశంపై తాడోపేడో తేలనున్న ఈ తరుణంలో, మళ్ళీ కేసిఆర్  కొద్ది రోజులుగా కనబడక పోవడమే గాకుండా, తిరిగిరాగానే హైదరాబాద్ పై రెఫరెండం పెట్టి, అది ఎవరికీ చెందాలో నిర్నయిద్దామని ప్రకటించి, కేంద్రానికి, సీమంద్రవాసులకు రాని ఒక సరికొత్త ఐడియాను చెప్పడంతో తెలంగాణావాదులు భగ్గుమన్నారు.

 

హైదరాబాదును కొన్ని సం.ల పాటు ఉమ్మడి రాజధానిగా చేస్తే ఎలా ఉంటుందని కేంద్రం ఆలోచిస్తున్న ఈ తరుణంలో, కేసిఆర్  ఈ విధంగా హైదరాబాద్ పై రెఫరండం అనడం చూస్తే అయన కోరుండి హైదరాబాదును వదులుకోవాలని ఆలోచిస్తున్నారా? అనే సందేహం కలుగక మానదు. ఎందుకంటే, జంట నగరాలలో తెలంగాణావారికన్నా కూడా ఎక్కువగా సీమంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన స్థిరపడిన ప్రజలే ఉన్నారు. ఆ కారణం చేతనే తెరాస ఇంతవరకు జరిగిన ఎన్నికలలో జంట నగరాలలో తన ప్రభావం చూపలేకపోతోంది. మరటువంటప్పుడు అయన తెలంగాణాపై రెఫరెండంకి వెళదామని అనడంలో ఆయన ఉద్దేశం ఏమిటి అని తెలంగాణావాదులే ప్రశ్నిస్తున్నారు.

 

కీలకమయిన ఈ సమయంలో అయన విధమయిన ప్రకటనచేయడం తెలంగాణా విషయంలో కేంద్రాన్నితప్పుదారి పట్టించడంలో అయన ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసిఆర్  ఈవిధంగా ప్రకటించడం చూస్తే, సీమంద్రులకి ఆయనే స్వయంగా ఒక ఆయుధం అందించి, దశాబ్దాలుగా రావణకాష్టంలా మండుతున్న తెలంగాణా అంశానికి సరిగ్గా పరిష్కారం అయ్యే దశలో సైంధవునిలా అడ్డుపడుతున్నారని తెలంగాణావాదులు భగ్గుమన్నారు.

 

అసలు ఈ విధంగా ఎవరూ ఊహించని ప్రతిపాదన అయన ఎందుకు చేసారని ఆలోచిస్తే మనకు రెండు మూడు కారణాలు కనిపిస్తాయి. తెలంగాణా నుంచి హైదరాబాద్ ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడనే అయన తాపత్రయం కారణం కావచ్చును. జంట నగరాలలో తమ పార్టీకున్న బలంతో ప్రజలను నయాన్నో భయాన్నో తెలంగాణకు అనుకూలంగా ఓటువేయించుకోవచ్చుననే ధీమాతోనే ఆయన ఆ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

కాంగ్రెస్ తెలంగాణా రాష్ట్రం ప్రకటించేమాటయితే తెరాసను ఆ పార్టీలో కలిపేస్తామని కేసీర్ స్వయంగా ప్రతిపాదించేరు గనుక, జనవరి 28వ తేదిన కేంద్రం తెలంగాణా ప్రకటన చేసే సూచనలు ఉన్నందున మాట ప్రకారం తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలిపేయవలసివస్తే, ఇక తనకీ, తన నేతలకి కూడా ఇంతవరకు ప్రజలలో ఉన్న ప్రత్యేక గుర్తింపు ఉండబోదనే నిజం గ్రహించడంవలన ఆ ఆందోళనతో తెలంగాణా ప్రకటనను జాప్యం చేయించే ఆలోచనతో ఈ ప్రకటనచేసి ఉండవచ్చును.

 

ఇంతకాలం తెరాస అధినేతగా రాష్ట్ర రాజకీయాలు శాసిస్తున్న కేసిఆర్ , కాంగ్రెస్ పార్టీలో జేరవలసి వస్తే, ఇంతవరకు ఏ సోనియమ్మ, రాహుల్ గాంధీలను, అధిష్టానాన్నినోరార తిట్టేడో, ఇప్పుడు వారి కాళ్ళ వద్దే పడిఉండక తప్పదనే ఆలోచనే ఆయనకి చాల భయంకరంగా కనిపించడం కూడా ఒక కారణం కావచ్చును.

 

తెలంగాణా ప్రకటనకి, తెరాస కాంగ్రెస్ పార్టీలో విలీనానికి ముడిపెట్టి అయన స్వయంగా చేసిన ప్రతిపాదన ఇప్పుడు ఈవిధంగా అకస్మాతుగా తన మెడకే చుట్టుకోవడంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న కేసిఆర్  అందులోంచి బయటపడే ప్రయత్నంలో భాగంగానే ఈ రెఫరెండం ప్రతిపాదన చేసి తద్వారా ఈ గండం నుండి ఎలా గట్టేకాలో ఆలోచించేందుకు కొంత సమయం పొందే ప్రయత్నం కావచ్చును.

 

ఎన్నికల సమయం వరకు కేంద్రం ఖచ్చితంగా తెలంగాణా ప్రకటించదని ధృడంగా విశ్వసిస్తున్నకేసిఆర్ , రానున్న ఎన్నికలలో తెలంగాణాలో అన్ని నియోజక వర్గాలకు తెరాస పోటీచేయబోతోందని ముందే ప్రకటించడం జరిగింది. తెలంగాణా సెంటిమెంట్ బలంగా ఉంటేనే ఎన్నికలలో పూర్తీ మెజార్టీ సాదించే అవకాశం ఉంది.

 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణా అంశంపై ఎంత జాప్యంచేస్తే అంత తెరాసకు లాభం అని కాంగ్రెస్, తెరాస రెండూ గ్రహించాయి. గానీ, ఊహించని విధంగా ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేసేందుకు సిద్దం కావడంతో తన కలలు కల్లలు కాబోతున్నందున కేసిఆర్  తీవ్ర ఆందోళనకి గురయి కేంద్రం తన నిర్ణయాన్ని మరికొంత కాలం వాయిదా వేసేందుకు ఈ ప్రతిపాదన తెచ్చి ఉండవచ్చును.

 

ఒక వేళ కేంద్రం దీనికి అంగీకరిస్తే, సమస్య ఎటూ మరింత జటిలం చేయగలిగే సత్తా తనకి ఉంది కనుక, ఎన్నికల సమయం దగ్గిర పడేవరకూ తెలంగాణ భావోద్వేగాలను తనకు అనుకూలంగా మలుచుకొనే అవకాశం ఉంటుంది.

 

స్వయంగా రాజ్యాదికారం పొందగలిగే అవకాశాన్ని వదులుకొని, కాంగ్రెస్ పంచన జేరడం అటువంటి వ్యక్తిత్వం ఉన్నవారెవరూ ఊహించలేరు. కనుకనే, ఎన్నికల వరకు తెలంగాణా అంశాన్ని సాగ దీయడం కోసం ఈ ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

తెలంగాణా అంశం, భావోద్వేగాలు లేనప్పుడు సహజంగానే కేసిఆర్ , అయన నాయకులూ, అయన తెరాస పార్టీ, జేయేసీలు అన్నీ కూడా తమ ప్రాధాన్యతని కోల్పోతాయి. అందువల్లనే, తెలంగాణా అంశం ఎంతకాలం సాగదీస్తే అంట మంచిదని అయన భావిస్తూ ఇటువంటి ప్రతిపాదన చేసి ఉండవచ్చును.

 

ఏది ఏమయినప్పటికీ, కేంద్రం తెలంగాణా ప్రకటన చేసినట్లయితే అయన తన మాటకు కట్టుబడి తెరాసను కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారా లేదా, ఆ విధంగా చేయకపోతే కాంగ్రెస్ తెలంగాణా ప్రకటన చేస్తుందా లేదా అనే రెండు సందేహాలు మిగిలిపోయాయి. ఇటువంటి అన్ని ధర్మ సందేహాలు ఈ నెల 28వ తేదీ కేంద్ర ప్రకటనతో తీరుతాయని ఆశిద్దాము.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.