లాలూ దంపతులకు జడ్ ప్లస్ భద్రత తొలగింపు
Publish Date:Jun 6, 2026
Advertisement
లాలూ ఇంటి వద్ద ఆర్జేడీ కార్యకర్తలు కర్రలతో కాపలా.. బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్ , ఆయన సతీమణి రబ్రీదేవిలకు బిహార్ ప్రభుత్వం జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను ఇటీవల ఉపసంహరించుకుని, ప్రత్యేక సాయుధ పోలీసులతో భద్రత కల్పించింది. అయితే ఈ చర్యను లాలూ కుటుంబం తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. తమకు ప్రభుత్వం కేటాయించిన భద్రత వద్దంటూ ఇంటి నుంచి పోలీసులను పంపేసింది. దీంతో పాట్నాలోని 10- సర్క్యులర్ రోడ్లోని లాలూ నివాసం వద్ద ఆర్జేడీ కార్యకర్తలు, నేతలు కర్రలతో కాపలా కాస్తున్నారు. ఇక, బిహార్ ప్రతిపక్ష నేత హోదాలో లాలూ కుమారుడు తేజస్వీయాదవ్కు వై-ప్లస్, అలాగే ఎంపీ మిసా భారతికి ఉన్న భద్రతను యథావిధిగా కొనసాగించనున్నట్లు బిహార్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్కు మాత్రం ప్రస్తుతం ఉన్న వై-ప్లస్ భద్రతను తొలగించి.. ఓ కానిస్టేబుల్ను కేటాయించింది. ఈ పరిణామాలపై తేజస్వీ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తనకు కల్పించిన వై-కేటగిరీ భద్రతను వెనక్కి పంపారు. దీనిపై లాలూ కుమార్తె రోహిణి ఆచార్య దీనిపై స్పందిస్తూ.. తమ కుటుంబానికి హాని తలపెట్టాలనే దురుద్దేశంతోనే జడ్ ప్లస్ సెక్యూరిటీని ప్రభుత్వం తొలగించిందని ఆరోపించారు
http://www.teluguone.com/news/content/lalu-couples-z+-security-removed-36-222108.html





