తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి లేదు.. ఉన్నదంతా నకిలీయే!

Publish Date:Jun 7, 2025

Advertisement

చేసిన పాపం ఎప్పటికైనా బయటపడక తప్పదు. అందులోనూ తిరుమల దేవుడి విషయంలో చేసిన అపచారానికి ఎంతటి వాడికైనా శిక్ష తప్పదు. కర్మఫలం అనుభవించకతప్పదు. ఇప్పుడు జగన్ హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలు, అరాచకాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నిజాల నిగ్గు తేలుస్తోంది. 

వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించి నప్పుడు వైసీపీ నేతలు భగ్గుమన్నారు. దేవుడిని కించ పరుస్తున్నారని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎంతకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. విచారణ ఎంత లోతుగా జరిగినా నిజాలు బయటకు రావనీ, ఎవరూ నోరు విప్పరనీ, తమంటే అంత భయం ఇప్పటికీ టీటీడీ అధికారులలోనూ, ప్రజలలోనూ ఉందనీ తలపోశారు.  అయితే.. ఇప్పుడు సిట్ దర్యాప్తులో వాస్తవాలు ఒక్కటొక్కటిగా వెలుగులోనికి వస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం లో అసలు కల్తీ నెయ్యి వాడలేదనీ.. వాడింది మొత్తం నకిలీ నెయ్యేననీ సిట్ కోర్టులు తెలిపింది. నిజానికి తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిది అసలు నెయ్యే కాదనీ, నెయ్యిలా కనిపించే నకిలీ అని సిట్ తేల్చింది.  

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ  ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందన్న చంద్రబాబు ఆరోపణ  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.  దీనిపై తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ ను కాదని.. సుప్రీం కోర్టు సీబీఐ ఆధ్వర్యంలో స్వతంత్ర సిట్ ను నియమించింది.  ఆ సిట్ దర్యాప్తులో  ఇప్పుడు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం కోసం వైసీపీ హయాంలో సరఫరా చేసినది కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదని తేలింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ కోర్టుకు తెలిపింది. కెమికల్స్‌తో నెయ్యిలా కనిపించే మిశ్రమాన్ని తయారు చేసి బోలేబాబా డెయిరీ వాటిని వైష్ణవి, ఏఆర్ డెయిరీల పేరుతో టీటీడీకి సరఫరా చేసిందని  సిట్ స్పష్టం చేసింది.  నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టి వేయాలని కోరుతూ దాఖలు చేసిన అఫిఢివిట్ లో  సిట్ ఈ సంచలన విషయాలను పేర్కొంది.  

నిజానికి భోలేబాబా డెయిరీకి పాలు, నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేవని సిట్ స్పష్టం చేసింది. భోలేబాబా డెయిరీ తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారని సీట్ వివరించింది. భోలేబాబా డెయిరీ కేవలం పామాయిల్, రసాయనాలు, ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారుచేసి ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి  సరఫరా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. పక్కా ప్రణాళిక ప్రకారమే ఏఆర్‌ డెయిరీ, వైష్ణవీ డెయిరీలను ముందుపెట్టి భోలేబాబా డెయిరీ వ్యవహారాన్ని నడిపిందన్నది సిట్ అభియోగం. 

అంతే కాకుండా ఇప్పుడీ  నెయ్యి మాఫియా ..సాక్షుల్ని బెదిరిస్తోంది. సాక్షులపేరుపై  తప్పుడు పిటిషన్లు వేస్తోంది. ఎవరూ సీబీఐ సిట్ ముందు హాజరు కాకుండా.. మాఫియా కాపలా కాస్తున్నది. ఈ కేసులో సాక్షిగా ఉన్న సంజీవ్‌ జైన్‌ అనే వ్యక్తి తిరుపతి ఎయిర్ పోర్టులో దిగగానే ఆయనను  కిడ్నాప్ చేసి.. చెన్నై తీసుకెళ్లి ఢిల్లీ ఫ్లైట్ ఎక్కించేశారు.  మరో వ్యక్తి పేరుతో తప్పుడు పిటిషన్ దాఖలు చేశారు. ఆ వ్యక్తే స్వయంగా  తాను పిటిషన్ దాఖలు చేయలేదని హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వివరాలను సిట్ కోర్టు ముందుంచింది. అసలు ఆ  నకిలీ నెయ్యిని టీటీడీ ఎందుకు కొనుగోలు చేసింది? దీని వెనుక ఎవరు న్నారు.. అన్న విషయాలను రాబట్టాలంటే.. నిందితులకు బెయిలు ఇవ్వవద్దని సిట్ కోర్టును కోరింది.  సిట్ ఇప్పటికే  టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఎను విచారిస్తున్నది,   ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్నది త్వరలో బయటకు రానుంది.   

By
en-us Political News

  
ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసీఆర్ అండ్ కోని మ‌రింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్ర‌ణీత్ రావును విచారించింది సిట్. ఆరు వంద‌ల మంది ప్రొఫైల్స్ ఎలా త‌యారు చేశారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు రూరల్ పరిధి పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం 295 సర్వే నెంబర్ 1.80 ఎకరాల స్థలానికి సంబంధించి తమకు 1869 నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసి వరదరాజన్ పేర్కొన్నారు.
ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు.
తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త కథలు, కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు తొంగి చూస్తున్నాయి.
ఇంగ్లండ్‌తో లీడ్స్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా 471 పరుగులకు ఆలౌటైంది.
బనకచర్ల ప్రాజెక్ట్‌ వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని సీపీఐ నేత నారాయణ కొరారు.
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకోనుంది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక సమావేశం ఈ నెల 27వ తేదీన ప్రత్యేకంగా సమావేశం కానుంది.
పాడి పంట. ఈ జంట వ్యవస్థల్లో పశువులు సుభిక్షంగా ఉంటే చాలు.. పంటలు, పల్లెలు, రైతు కుటుంబాలు యథాతథంగా బాగుంటాయి.
అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. భద్రతా లోపానికి కారణమైన ముగ్గురు ఉద్యోగులను తొలిగించాలని ఎయిరిండియాను ఆదేశించింది.
ప్రపంచ యోగా దినోత్సవం సందర్బంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం కావడంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ పేరు మార్చాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నిరసన వ్యక్తం చేశారు. ఇవాళ కేబీఆర్ పార్కు వద్ద ఆయన ధర్నా చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పుష్ప మూవీ డైలాగ్ ప్లకార్డులు ప్రదర్శించారు. 2028 లో రప్పా రప్పా 3.0 లోడింగ్" అంటూ మాజీ మంత్రి హారీశ్‌రావు, ఫోటోలతో ప్లకార్డులు రూపోందించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.