యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం
Publish Date:Jul 1, 2026
Advertisement
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల మండలి (ట్రస్ట్ బోర్డు) నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట ఆలయ కమిటీ ఏర్పాటుకు సంబంధించి తమకు కనీస సమాచారం కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులను, ముఖ్య నాయకులను సంప్రదించకుండానే ఈ నిర్ణయం తీసుకోవడంపై ఆయన బాహాటంగా తన నిరసన వ్యక్తం చేశారు. యాదాద్రి దేవస్థానానికి నూతన ధర్మకర్తల మండలిని ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలను, ప్రజాప్రతినిధులను కానీ కనీసం సంప్రదించకపోవడంపై రాజగోపాల్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆలయ బోర్డులో ఎవరిని నియమిస్తున్నారు, ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారు అనే విషయాలపై తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదన్న ఆయన.. ప్రభుత్వ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పాలకమండలి నియామకంలో కనీస పారదర్శకత లోపించిందని విమర్శిం చారు.
http://www.teluguone.com/news/content/komatireddy-rajagopal-reddy-expresses-anger-at-the-yadagirigutta-board-of-trustees-36-224727.html





