ఢిల్లీ పీఠం ఆప్ దే.. కేకే సర్వే అంచనా

Publish Date:Feb 5, 2025

Advertisement

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ లో కొన్ని ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అంచనా వేస్తే మరి కొన్ని ఢిల్లీపీఠంపై కమలనాథుల జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నాయి. కాంగ్రెస్కు జీరో నుంచి 3 స్థానా లు గెలిచే అవకాశాలున్నాయని ఎగ్జిట్ పోల్స తెలిపాయి. 

 కేకే సర్వే అయితే ఢిల్లీలో  ఆప్ మరోసారి అధికార పగ్గాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ఆ పార్టీ పోటీ చేసిన 70 స్థానాలకు గాను 44 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. బీజేపీ 26 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ ఖాతా తెరిచే అవకాశాలు మృగ్యమని పేర్కొంది. ఇక హోరాహోరీ పోటీ ఉన్న స్థానాలలో ఫలితం కొంచం అటూ ఇటైనా ఆప్ కచ్చితంగా 39, బీజేపీ 22 స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొన్నాయి. ఇక మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలలో ఫలితం ఫొటో ఫినిష్ ఉంటుందని కేకే సర్వే పేర్కొంది. 

పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో 51 నుంచి 50 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక అధికారంలో ఉన్న ఆప్ కేవలం 10 నుంచి 19 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ తేల్చింది. కాంగ్రెస్ ఈ సారి కూడా ఖాతా తెరిచే అవకాశాలు  లేవని అంచనా వేసింది. 

ఐ మ్యాక్ త్రీ ఎగ్జిట్ పోల్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ 24 నుంచి 36 స్థానాలలోనూ, బీజేపీ 41 నుంచి  43 స్థానాలలోనూ గెలిచే అవకాశాలున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తుందని అంచనావేసింది. ఇతరులు 1 నుంచి 2 స్థానాలలో గెలుస్తారని పేర్కొంది. ఈ ఎగ్జిట్ పోల్ బీజేపీ అధికారపగ్గాలు చేపడుతుందని పేర్కొంది. న్యూస్ ఆప్టిక్స్ కూడా బీజేపీకే అధికార పగ్గాలు అందుతాయని పేర్కొంది. ఆప్టిక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం ఆప్ కు 24 నుంచి 28, బీజేపీకి 35 నుంచి 44 కాంగ్రెస్ 2 నుంచి 4 స్థానాలలోనూ గెలుస్తుందని పేర్కొంది. ఇతరులు ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేసింది.  

చాణక్య స్ట్రాటజీస్‌ అంచనా ప్రకారం బీజేపీ 39 నుంచి 44 స్థానాలు, ఆప్‌ 25 నుంచి 28 స్థానాలు, కాంగ్రెస్‌ పార్టీ 2 నుంచి 3 స్థానాలు గెలుచుకోవచ్చని తెలిపింది.

By
en-us Political News

  
క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల అరెస్టునకు రంగం సిద్ధమైపోయినట్లే.. ఎందుకంటే వారిద్దరి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దశలో బెయిలు ఇవ్వడమంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
చేసిన తప్పులు దండంతో సరి అన్నది ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ రాజకీయాలలో మాత్రం కాదు. అందులోనూ నిలువెల్లా అహంకారంతో విర్రవీగి.. స్థాయి మరిచి చేసిన వ్యాఖ్యలతో చెలరేగిపోయిన వల్లభనేని వంశీ వంటి వారి విషయంలో అసలు కాదు అని అనక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది.
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ తమ ఘనతేనని, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒకటికి పదిసార్లు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటున్నారు అనే కంటే ట్రంప్ సొంత డబ్బా వాయించుకుంటున్నారు అనడమే కరెక్ట్.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు.
నమ్మక ద్రోహానికీ, విశ్వాస ఘాతుకానికీ పాల్పడిన టర్కీకి భారత్ బిగ్ షాక్ ఇచ్చింది. ఆ దేశ సంస్థ సెలిబి ఏవియేషన్ కు భద్రత అనుమతిని రద్దు చేసింది. ఆపరేషన్ సిందూర్, తదననంతర పరిణామాలలో భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ టర్కీ పాకిస్థాన్ కు పూర్తి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో భారీ భూకంపంలో టర్కీ దయనీయ స్థితిలో ఉన్న సమయంలో భారత్ దోస్త్ అంటూ ఆ దేశానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించింది.
విజయ్‌ షా, బీజేపీ నాయకుడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి.
పహల్గాం ఉగ్రదాడి మొదలు కాంగ్రెస్ పార్టీ ఆచారానికి భిన్నంగా ఆచి చూచి అడుగులు వేస్తూ వచ్చింది. వ్యూహతంకంగా పావులు కదిపింది. అక్కడ ఇక్కడ ఒకటి రెండు అపశ్రుతులు వినిచ్పించినా.. అందరిదీ ఒకటే మాట అన్నట్లుగా ప్రభుత్వానికి అండగా, ఒకే మాటపై నిలిచింది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వారాంతం సమీపిస్తుండటం, వేసవి సెలవులు కలిసిరావడంతో తిరుమల స్వామివారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు.
భారత్-పాక్ ఉద్రిక్తతలను తగ్గించడానికి తదుపరి చర్చలు కొనసాగించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌ల సమావేశంలో నిర్ణయించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది.
కాళేశ్వరం ఆలయాన్ని గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆలయ సమగ్రాభివృద్ధికి అవసరమైతే రూ.200 కోట్ల వరకు నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు.
దేశంలో ఏదైనా బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు నెలరోజులు మాత్రమేనని 415 పేజీలతో కూడిన తీర్పును అత్యున్నత ధర్మాసనం వెల్లడించింది.
హైదరాబాద్ మెట్రో చార్జీలు ఎల్లుండి నుంచి ఛార్జీలు పెరగనున్నాయి. కనిష్ఠ ధర రూ.10 నుంచి రూ.12కు, గరిష్ఠ ధర రూ.60 నుంచి రూ.75కు పెంచున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. సవరించిన నూతన ఛార్జీలు ఈ నెల 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సంస్థ స్పష్టం చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.