విడదల రజినిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం

Publish Date:Feb 5, 2025

Advertisement

తెలుగుదేశంలో వున్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన సైబరాబాద్ మొక్క  విడదల రజిని, ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు. ఎమ్మెల్యే పదవితోపాటు మంత్రి పదవి కూడా పొందారు. జగన్ మెప్పు పొందడం కోసం ఏ నోటితో అయితే చంద్రబాబుని కీర్తించారో.. అదే నోటితో చంద్రబాబుని అనరాని మాటలు అన్నారు. రాజకీయ ఊసరవెల్లి తనానికి నిఖార్సయిన నిదర్శనంగా తెలుగు ప్రజల దృష్టిలో నిలిచారు. ఈ సైబరాబాద్ మొక్క విడదల రజిని మొన్నటి వరకు మంత్రి పదవి వెలగబెట్టి, ఈ ఎన్నికలలో గుంటూరు వెస్ట్ స్థానం నుంచి పోటీ చేశారు. గుంటూరు వెస్ట్ ఓటర్లు ఈమె వేస్ట్ అని ఆమెను ఓడించడం ద్వారా విస్పష్టంగా చెప్పేశారు. 

అయినా ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా పోటీ చేసిన తొలి సారే ఎమ్మెల్యేగా ఎన్నికై.. జగన్ కేబినెట్ లో మంత్రిపదవి కొట్టేసిన విడదల రజనికి రాజకీయంగా రంగులు మార్చడం ఎలాగో బాగానే వంటపట్టింది. 2019 ఎన్నికలలో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి విజయం సాధించిన విడదల రజనీ, 2024 ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరి పేటలో చెల్లని కాసులా మారిపోయారని భావించిన జగన్ ఆమెను గుంటూరు వెస్ట్ కు మార్చారు. అయితే అక్కడ ఆమెను జనం ఓడించారు. ఇక మంత్రిగా ఆమె చేసిన అవినీతి, అక్రమ వసూళ్లపై, దౌర్జన్యాలపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓటమి తరువాత ఆమెకు అన్ని వైపుల నుంచీ చిక్కులు చుట్టుముట్టాయి. కొంత కాలం అజ్ణాతంలోకి వెళ్లిపోయినట్లుగా ఎవరికీ కనిపించకుండా, వినిపించకుండా గడిపారు. మధ్యలో పార్టీ మారేందుకు కూడా విఫలయత్నం చేశారన్న వార్తలు వినవచ్చాయి. మొత్తం మీద వైసీపీ అధికారం కోల్పోయిన నాటి నుంచీ ఈ మాజీ మంత్రి ఎక్కువగా మౌనాన్నే ఆశ్రయించి ఎవరి దృష్టిలోనూ పడకుండా మనుగడ సాగిస్తున్నారు. అయితే చేసిన తప్పులు అంత తేలిగ్గా వదలవు కదా! 

తాజాగా ఆమెపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు పోలీసులను ఆదేశించింది. మాజీ మంత్రి విడదల రజినీ, ఆమె పీఏలు దొడ్డా రామకృష్ణ, ఫణి సహా అప్పటి సీఐ సూర్యనారాయణపై కూడా కేసు నమోదు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. తెలుగుదేశం నాయకుడు పిల్లి కోటి పిటిషన్ పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ పిల్లి కోటి పిటిషన్ ఏమిటంటే.. 

ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకూ విడదల రజినీ, ఆమె పీఏలు, దొడ్డారామకృష్ణ, ఫణి, అప్పటి సీఐ సూర్యనారాయణ తనను హింసించారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలంటూ పిల్లి కోటి హైకోర్టును ఆశ్రయించారు.  2019లో చిలకలూరి పోలీస్ స్టేషన్‌లో తనను చిత్రహింసలకు గురి చేశారని ఆయన పేర్కొన్నారు. అప్పట్లో దీనిపై ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యా తీసుకోలేదని పిల్లి పేర్కొన్నారు. ఆ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విడదల రజిని, ఆమె పిఏలు, అప్పటి   సీఐపై రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

By
en-us Political News

  
ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదోవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సన్మానించారు. ఉండవల్లిలో ఆయన విద్యార్థులతో ముఖముఖి నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌లో జూన్‌ ఒకటో తేదీ నుంచి చౌకధర దకాణాల ద్వారానే రేషన్‌ సరఫరా చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు దివ్యాంగులకు మాత్రం డోర్‌ డెలివరీ చేస్తాని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయ పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థాన మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తిరుమ‌ల కొండ‌ల్లో ఉన్న ప‌చ్చ‌ద‌నాన్ని అట‌వీశాఖ ద్వారా 68.14 శాతం నుండి 80 శాతానికి పెంచేందుకు నిర్ణ‌యించారు. ప‌చ్చ‌ద‌నాన్ని పెంచేందుకు రూ.4 కోట్ల కేటాయించింది. స్విమ్స్ ఆసుపత్రిలో 597 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు రేపు చిత్తూరు జిల్లా తన సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా బుధవారం మధ్యాహ్నం అమ్మవారిని కుటుంబ సమేతంగా ముఖ్యమంత్రి దర్శించుకుంటారు.
జగన్ అడ్డా కడపలో తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడు నిర్వహణకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 27 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 19 వరకూ జరిగే పసుపు పండుగ మహానాడు నిర్వహణ కోసం తెలుగుదేశం అధినేత చంద్రబాబు 19 కమిటీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భారత ఆపరేషన్ సిందూర్‌ చేపట్టిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.
దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మళ్లీ ఆందోళన రేపుతున్నాయి. మే 19 నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఆరోగ్య శాఖ అధికారులు, వ్యాధి వ్యాప్తి తీరుతెన్నులపై నిశితంగా దృష్టి సారించారు.
బాపులపాడు నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నూజివీడు కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో వంశీని రెండు రోజుల కస్టడీకి ఇవ్వాలని హనుమాన్ జంక్షన్ పోలీసులు కోర్టుకు కోరారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు. యూనివర్శిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పెంచిన ప్రయాణ ఛార్జీలను సవరించింది. ఇటీవల పెంచిన మెట్రో ఛార్జీలను సవరిస్తూ, వాటిని 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు యాజమాన్యం పేర్కొన్నాది.
నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనానికి అనుబంధంగా ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో బుధ, గురువారాలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.