కిరణ్ పధకాలకు డబ్బెక్కడి నుండి రాలుతుంది?

Publish Date:Apr 30, 2013

Advertisement

 

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధికారంలో లేని ప్రతిపక్షాలతో పోటీ పడుతున్నట్లు నిత్యం ఏదో ఒక కొత్త పధకంతో ప్రజల ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఆయన ఆలోచనను ఎవరూ కాదనరు. కానీ, ఆయన వారికి ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో మరో వర్గం వారి జేబులోంచి బలవంతంగా డబ్బు గుంజుకోవడం ఏమనాలి?

 

ఇప్పుడు కరెంటు సర్ చార్జీలు పెరగడం నిత్య కృత్యం అయిపోయింది. ఇక బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల ధరలను సామాన్యులకే కాదు, మధ్యతరగతి వారికి సైతం భరించడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నఅమ్మ హస్తం, బంగారు తల్లి, పచ్చతోరణం ఇత్యాది పధకాలకు, ఇప్పటికే అమలవుతున్న జనని సురక్ష యోజన, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, రాజీవ్ విద్యా దీవెన వంటి అనేక ఇతర పధకాలకు అవసరమయిన వేలకోట్ల రూపాయల డబ్బు ఆయన ఎక్కడి నుండి తీసుకువస్తారని ప్రశ్నిస్తే, ఆ భారం మోయవలసినది బాధ్యత సమాజంలో మిగిలిన ప్రజలదేనని చెప్పక తప్పదు. అంటే, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు పన్నులు చెల్లించక తప్పదన్నమాట.

 

ఇప్పటికే, ప్రజలు అధిక ధరలతో విలవిలలాడుతు తమ కష్టాన్నిఎవరికీ మోర పెట్టుకొవాలో తెలియక బాధపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నఈ పధకాలతో మరింత పన్ను భారం, మరిన్ని కొత్త పన్నులు మోయక తప్పదు. ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపరిచే ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వాలు, వారిని ఎల్లకాలం ఇటువంటి సంక్షేమ పధకాల మీద ఆధారపడి బ్రతికేలా చేయడం చాలా దారుణమయిన ఆలోచన. ప్రభుత్వాలు ప్రజలకి ఉపాధి కల్పించి వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలి తప్ప, ఒకరి కష్టార్జితాన్ని మరొకరికి ఈ విధంగా పంపిణీ చేస్తూ రాజకీయ లబ్దిపొందాలనుకోవడం చాలా హేయమయిన పని.

 

ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు షర్మిల ఇద్దరూ ప్రకటిస్తున్న పధకాలకు లక్షల కోట్లు ఏ చెట్లు దులిపి తెస్తారని అడుగుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు తను ప్రకటించే పధకాలకు ఏ చెట్లు దులిపి తెస్తారో చెపితే బాగుంటుంది.

By
en-us Political News

  
 శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.
తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు.
వైసీపీ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు..!
నాలుగు దశాబ్దాలకు పైగా వైఎస్ కుటుంబానికీ, జగన్ కు పెట్టని కోటగా ఉన్న పులివెందులలో జగన్ ప్రతిష్ఠ పూర్తిగా మసకబారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం చేపట్టిన మెగా డీఎస్సీ ప్రక్రియ, విద్యాశాఖ నిర్ణయాలకు వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంా జరుగుతున్న నిరసనలు పులివెందులలో తుస్సు మన్నాయి.
అమరావతి నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతుండటం.. సహజంగానే వైసీపీయులకు మింగుడు పడటంలేదు. ఆ క్రమంలోనే.. వైసీపీ అధినేత జగన్.. అమరావతి కాదు మావిగన్ రాజధాని అంటూ ప్రతిపాదన చేసి నవ్వుల పాలయ్యారు.
మాజీ మంత్రి జనసేన నాయకుడు బాలినేని తీరు పట్ల ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది. 2024 ఎన్నికల తరువాత బాలినేని శ్రనివాసరెడ్డి.. వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేన గూటికి చేరారు. ఆ ఎన్నికలలో ఒంగోలు ఎమ్మెల్యేగా దామచర్ల జనార్దన్ రావు ఎన్నికయ్యారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కు బంధువు కావడం, 2024 ఎన్నికలలో తనకు ప్రత్యర్థి కావడంతో అప్పట్లోనే దామచర్ల జనసేనలోకి బాలినేని ఎంట్రీని వ్యతిరేకించారు.
పోచారం గాచారం మారిందా.. కాంగ్రెస్‌లో చేరడం పొరపాటేనా..?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు మంత్రులు లెక్క చేయడం లేదన్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి భట్టికి, పొంగులేటికి చెప్పినా వాళ్లు పట్టించుకోవడం లేదని పోచారం అన్నారు.
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. ఈ రెండేళ్లలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లిందే లేదు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించిందే లేదు. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఒకసారి, శాసన సభ్యత్వం పోతుందేమోనన్న భయంతో మరోసారి మాత్రమే వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. అంతే.. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు.
ఎవరైనా రాజకీయాలనుంచి విరమించుకున్నామని ప్రకటించి.. తూచ్ వ్యవసాయం కాదు, రాజకీయమే తన వ్యాపకం అని చెప్పడాన్ని ఎవరూ తప్పు పట్టరు. అలాగే రీ ఎంట్రీ విషయంలో ఏ పార్టీలో చేరాలన్న స్వేచ్ఛ కూడా సదరు నేతకు ఉంటుంది. దానినీ ఎవరూ కాదనరు. కానీ ముక్కెక్కడ అంటే బుర్ర వెనుక నుంచి వేలిని ముందుకు తీసుకు వచ్చిన చందంగా విజయసాయి.. తన పొలిటికల్ రీఎంట్రీపై పూటకో మాట, రోజుకో బాట అన్న అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
నిరసనల్లో జగన్ ఎక్కడా కనిపించకపోవడంతో డీఎస్సీలో అక్రమాలు, అవకతవకలు అంటూ వైసీపీ చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరసనలు ఆరంభంలోనే ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విఫలమయ్యాయి.
జగన్ సర్కార్ సృష్టించిన భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరిస్తున్నామన్నారు.  క్యూఆర్ కోడ్, బ్లాక్‌చైన్ సాంకేతికత,  కరెన్సీ నోట్ల తరహా సెక్యూరిటీ ఫీచర్లతో రూపొందించిన ట్యాంపర్ ప్రూఫ్ పాసు పుస్తకాలను రైతులకు అందిస్తున్నామన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.