కిరణ్ పధకాలకు డబ్బెక్కడి నుండి రాలుతుంది?

Publish Date:Apr 30, 2013

Advertisement

 

రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అధికారంలో లేని ప్రతిపక్షాలతో పోటీ పడుతున్నట్లు నిత్యం ఏదో ఒక కొత్త పధకంతో ప్రజల ముందుకు వస్తున్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని నిరుపేదలను ఆదుకోవాలనే ఆయన ఆలోచనను ఎవరూ కాదనరు. కానీ, ఆయన వారికి ఒక చేత్తో ఇస్తూ, మరో చేత్తో మరో వర్గం వారి జేబులోంచి బలవంతంగా డబ్బు గుంజుకోవడం ఏమనాలి?

 

ఇప్పుడు కరెంటు సర్ చార్జీలు పెరగడం నిత్య కృత్యం అయిపోయింది. ఇక బియ్యం, పప్పులు, నూనెలు, కూరగాయలు వంటి నిత్యావసర సరుకుల ధరలను సామాన్యులకే కాదు, మధ్యతరగతి వారికి సైతం భరించడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నఅమ్మ హస్తం, బంగారు తల్లి, పచ్చతోరణం ఇత్యాది పధకాలకు, ఇప్పటికే అమలవుతున్న జనని సురక్ష యోజన, ప్రీ పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులు, రాజీవ్ విద్యా దీవెన వంటి అనేక ఇతర పధకాలకు అవసరమయిన వేలకోట్ల రూపాయల డబ్బు ఆయన ఎక్కడి నుండి తీసుకువస్తారని ప్రశ్నిస్తే, ఆ భారం మోయవలసినది బాధ్యత సమాజంలో మిగిలిన ప్రజలదేనని చెప్పక తప్పదు. అంటే, ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలు పన్నులు చెల్లించక తప్పదన్నమాట.

 

ఇప్పటికే, ప్రజలు అధిక ధరలతో విలవిలలాడుతు తమ కష్టాన్నిఎవరికీ మోర పెట్టుకొవాలో తెలియక బాధపడుతుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటిస్తున్నఈ పధకాలతో మరింత పన్ను భారం, మరిన్ని కొత్త పన్నులు మోయక తప్పదు. ప్రజల ఆర్ధిక స్థితిగతులు మెరుగుపరిచే ప్రయత్నం చేయవలసిన ప్రభుత్వాలు, వారిని ఎల్లకాలం ఇటువంటి సంక్షేమ పధకాల మీద ఆధారపడి బ్రతికేలా చేయడం చాలా దారుణమయిన ఆలోచన. ప్రభుత్వాలు ప్రజలకి ఉపాధి కల్పించి వారు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేయాలి తప్ప, ఒకరి కష్టార్జితాన్ని మరొకరికి ఈ విధంగా పంపిణీ చేస్తూ రాజకీయ లబ్దిపొందాలనుకోవడం చాలా హేయమయిన పని.

 

ప్రతిపక్ష నేత చంద్రబాబు మరియు షర్మిల ఇద్దరూ ప్రకటిస్తున్న పధకాలకు లక్షల కోట్లు ఏ చెట్లు దులిపి తెస్తారని అడుగుతున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఇప్పుడు తను ప్రకటించే పధకాలకు ఏ చెట్లు దులిపి తెస్తారో చెపితే బాగుంటుంది.

By
en-us Political News

  
ఈ ఫోన్ ట్యాపింగ్ పిశాచాల పిండాలు పిచ్చుకలకు వేసినా పాపం లేదు.
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నామినేషన్ దాఖలు సందర్భంగా మంగళగిరిలో పండుగ వాతావరణం కనిపించింది. నామినేషన్ దాఖలు సందర్భంగా నిర్వహించిన ర్యాలీకి మంగళిగిరి నియోజకవర్గం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలు ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వచ్చారు.
ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికల ప్రక్రియలో గురువారం (ఏప్రిల్ 18) కీలకఅంకం ప్రారంభం అయ్యింది. ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఉదయం 9 గంటలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల అవ్వగా, ఆ క్షణం నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం అయ్యింది.
కాంగ్రెస్ సహా పలు పార్టీలను కుటుంబ పార్టీలని తరచూ విమర్శించే మోడీ.. ఇప్పుడు బీజేపీలో పార్టీ కంటే ఎదిగిపోయిన నేతగా తనను తాను ఆవిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ ఇప్పుడు మోడీ అనే గొడుగు కింద సేదతీరుతోందా అన్న భావన కలిగేలా పార్టీలో మోడీ భజన సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఈ సారి సినీ కళ పెద్దగా కనిపించడం లేదు. మొత్తంగా ఏపీ ఎన్నికల ప్రచారానికి సినీ పరిశ్రమ ఒకింత దూరంగా ఉంది. పరిశ్రమకు చెందిన అతితక్కువ మంది మాత్రమే తమ మద్దతు ఎటువైపు అన్నది చెబుతున్నారు.
దేశంలో వేసవిని మించి పొలిటికల్ హీట్ ఉంది. దేశంలో ఏడు విడతల్లో సాగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మొత్తం 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి దశ పోలింగ్ జరగనుంది. తొలిదశలో మొత్తం 102 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తారు.
విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి.
బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది.
తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.