నోరు జారి జగన్ కేసులో ఇర్రుకొన్న కేంద్ర మంత్రి

Publish Date:Apr 30, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కాంగ్రెస్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్యన ఉన్న ఒక అస్పష్టమయిన సన్నటి గీతను కూడా చేరిపివేస్తోంది. అతని కేసులతో విడదీయలేనంతగా ముడిపడిపోయిన మంత్రులు తమ తప్పులను ఒప్పుకొనలేక, వాటి నుండి తప్పుకొనలేక అవస్థలు పడుతుంటే, ప్రభుత్వంలో బాద్యతగల మంత్రులుగా వారు తీసుకొన్న నిర్ణయాలకు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని జగన్ మోహన్ రెడ్డిని ఏవిధంగా బాధ్యుని చేస్తారంటూ జగన్ తరపు లాయర్లు వేస్తున్న ప్రశ్నలకు వారి దగ్గర సరయిన సమాధానం లేకపోవడంతో, వారు చనిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైపు చూ(పి)స్తున్నారు.

 

ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో ఉలికులికిపడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన పార్టీని బౌతికంగా, నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయసాగారు. కొందరు అతనినిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు అతను శాశ్వితంగా జైలలోనే ఉండిపోతాడని జోస్యం చెప్పుతున్నారు.

 

ఆ ఊపులోనే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు “ఏదో ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు. అతను జైలు నుండి బయట పడాలంటే అతనికి అంతకంటే వేరే మార్గం లేదు,” అని పంచ్ డైలాగులు చెప్పి అనుచరులచేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడ్డారు.

 

కానీ ఆయన పంచ్ డైలాగులు జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే అనే పెద్దాయనకు కూడా తెగ నచ్చేయడంతో, ఆ డైలాగులు వచ్చిన పేపర్ కటింగులని జాగ్రత్తగా భద్ర పరుచుకొని, మొన్న సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ పిటిషను మీద వాదనలు జరుగుతున్నప్పుడు కోర్టులో బయటపెట్టి, “జగన్ మోహన్ రెడ్డి అరెస్టులో తమకి ఏ మాత్రం సంబంధం లేదని వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరిప్పుడు అతను పార్టీలో చేరితే జైలు నుండి బయటపడతాడని ఏవిధంగా హామీ ఇస్తోంది? అంటే జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర చేస్తే దానికి సీబీఐ పరోక్షంగా సహకరిస్తోందని భావించాలా? ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకొంటే సీబీఐ అతని మీద పెట్టిన కేసులన్నీ మాఫీ అయిపోతాయా?” అని ప్రశ్నించేసరికి సీబీఐ వద్ద చెప్పేందుకు సమాధానం లేదు.

 

ఒక పక్క తాము జగన్ మోహన్ రెడ్డి కేసులలో నిష్పక్షపాతంగా, ఎవరి ఒత్తిళ్ళు లేకుండా దర్యాప్తు జరుపుతున్నామని, తమది స్వతంత్ర సంస్థ అని సీబీఐ పదేపదే ప్రకటించుకొంటుంటే మరో వైపు, కాంగ్రెస్ మంత్రులే స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అతను కేసుల నుండి, జైలు నుండి విడుదల హామీలు గుప్పించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. ఇక చేసేదేమీ లేక ఆవిధంగా హామీ ఇచ్చిన సదరు మంత్రి గారికి కూడా సమన్లు జారీ చేసి, ఆయన ఏవిధంగా జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విడిపిస్తారో తెలుసుకోవాలనుకొంటున్నట్లు కోర్టుకు విన్నవించుకొని బయట పడింది.

 

ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలందరి నోళ్ళు మూతపడే అవకాశం ఉంది. లేకుంటే వారు కూడా కోట్ల లాగే కోర్టు మెట్లక్కక తప్పదు.

By
en-us Political News

  
కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు
తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది.
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు.
మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి
జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం.
రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి. ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.
ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం.
పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి. గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు.
చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు.. పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.
బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది. మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్ సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.