నోరు జారి జగన్ కేసులో ఇర్రుకొన్న కేంద్ర మంత్రి

Publish Date:Apr 30, 2013

Advertisement

 

జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు కాంగ్రెస్ మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల మద్యన ఉన్న ఒక అస్పష్టమయిన సన్నటి గీతను కూడా చేరిపివేస్తోంది. అతని కేసులతో విడదీయలేనంతగా ముడిపడిపోయిన మంత్రులు తమ తప్పులను ఒప్పుకొనలేక, వాటి నుండి తప్పుకొనలేక అవస్థలు పడుతుంటే, ప్రభుత్వంలో బాద్యతగల మంత్రులుగా వారు తీసుకొన్న నిర్ణయాలకు, ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేని జగన్ మోహన్ రెడ్డిని ఏవిధంగా బాధ్యుని చేస్తారంటూ జగన్ తరపు లాయర్లు వేస్తున్న ప్రశ్నలకు వారి దగ్గర సరయిన సమాధానం లేకపోవడంతో, వారు చనిపోయిన ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి వైపు చూ(పి)స్తున్నారు.

 

ఇక, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభావంతో ఉలికులికిపడుతున్న కాంగ్రెస్ నేతలు, ఆయన పార్టీని బౌతికంగా, నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో జగన్ మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు చేయసాగారు. కొందరు అతనినిని ఉరి తీయాలని డిమాండ్ చేస్తే, మరి కొందరు అతను శాశ్వితంగా జైలలోనే ఉండిపోతాడని జోస్యం చెప్పుతున్నారు.

 

ఆ ఊపులోనే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ఇటీవల రాష్ట్ర పర్యటనకి వచ్చినప్పుడు “ఏదో ఒకనాడు జగన్ మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు. అతను జైలు నుండి బయట పడాలంటే అతనికి అంతకంటే వేరే మార్గం లేదు,” అని పంచ్ డైలాగులు చెప్పి అనుచరులచేత చప్పట్లు కొట్టించుకొని సంతోషపడ్డారు.

 

కానీ ఆయన పంచ్ డైలాగులు జగన్ మోహన్ రెడ్డి తరపున వాదిస్తున్న హరీష్ సాల్వే అనే పెద్దాయనకు కూడా తెగ నచ్చేయడంతో, ఆ డైలాగులు వచ్చిన పేపర్ కటింగులని జాగ్రత్తగా భద్ర పరుచుకొని, మొన్న సుప్రీం కోర్టులో జగన్ బెయిల్ పిటిషను మీద వాదనలు జరుగుతున్నప్పుడు కోర్టులో బయటపెట్టి, “జగన్ మోహన్ రెడ్డి అరెస్టులో తమకి ఏ మాత్రం సంబంధం లేదని వాదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మరిప్పుడు అతను పార్టీలో చేరితే జైలు నుండి బయటపడతాడని ఏవిధంగా హామీ ఇస్తోంది? అంటే జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగా కుట్ర చేస్తే దానికి సీబీఐ పరోక్షంగా సహకరిస్తోందని భావించాలా? ఒకవేళ జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఒప్పుకొంటే సీబీఐ అతని మీద పెట్టిన కేసులన్నీ మాఫీ అయిపోతాయా?” అని ప్రశ్నించేసరికి సీబీఐ వద్ద చెప్పేందుకు సమాధానం లేదు.

 

ఒక పక్క తాము జగన్ మోహన్ రెడ్డి కేసులలో నిష్పక్షపాతంగా, ఎవరి ఒత్తిళ్ళు లేకుండా దర్యాప్తు జరుపుతున్నామని, తమది స్వతంత్ర సంస్థ అని సీబీఐ పదేపదే ప్రకటించుకొంటుంటే మరో వైపు, కాంగ్రెస్ మంత్రులే స్వయంగా జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతే అతను కేసుల నుండి, జైలు నుండి విడుదల హామీలు గుప్పించడంతో సీబీఐ ఇరకాటంలో పడింది. ఇక చేసేదేమీ లేక ఆవిధంగా హామీ ఇచ్చిన సదరు మంత్రి గారికి కూడా సమన్లు జారీ చేసి, ఆయన ఏవిధంగా జగన్ మోహన్ రెడ్డి ని జైలు నుండి విడిపిస్తారో తెలుసుకోవాలనుకొంటున్నట్లు కోర్టుకు విన్నవించుకొని బయట పడింది.

 

ఊహించని ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలందరి నోళ్ళు మూతపడే అవకాశం ఉంది. లేకుంటే వారు కూడా కోట్ల లాగే కోర్టు మెట్లక్కక తప్పదు.

By
en-us Political News

  
పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో నంబర్ 1, 2, 3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ హైరాక్కీని దాటి త్వ‌ర‌లో లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి.
లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం 400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి చేయ‌లేదు. ఎవ‌రి క‌ష్టం వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు.
అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు. ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.