Publish Date:Apr 30, 2013
మొన్న సుప్రీం కోర్టు జగన్ మోహన్ రెడ్డి బెయిలు పిటిషను విచారణ చేపట్టినప్పుడు జగన్ తరపున వాదిస్తున్నలాయరు హరీష్ సాల్వే కేంద్ర మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి “జగన్ మోహన్ రెడ్డి జైల్లోంచి బయటపడాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరక తప్పదు” అని మీడియాకు ఇచ్చిన స్టేట్మెంటును కోర్టుకి సమర్పిస్తూ తన క్లయింటు జగన్ మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా అరెస్టు చేయించిందని చెప్పడానికి ఇదే ఒక ఉదాహరణ అని వాదించేసరికి సీబీఐ కూడా నోట మాటలేకుండా ఉండిపోవలసి వచ్చింది. ఆ విధంగా భరోసా ఇచ్చిన మంత్రిగారికి సమన్లు జారీ చేసి ఈ విషయంలో ఆయనను సంజాయిషీ కోరుతామని సీబీఐ చెప్పింది.
మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్ అటు కాంగ్రెస్ పార్టీని కూడా ఇబ్బందుల్లో పడేసింది. వైయస్సార్ కాంగ్రెస్ నేతలు ఇంతకాలం ఇదే విషయాన్ని గట్టిగా చెపుతున్నప్పటికీ వారి వాదనను కాంగ్రెస్ పార్టీ తేలికగా కొట్టివేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు స్వంత పార్టీకి చెందిన కేంద్ర మంత్రే స్వయంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారి వాదనను బలపరుస్తున్నట్లు మాట్లాడటం, ఆ పాయింటును సుప్రీం కోర్టులో జగన్ న్యాయవాదులు బయటపెట్టడంతో కాంగ్రెస్ కూడా అడ్డుగా దొరికిపోయింది.
అయితే, మహా మహా కుంభ కోణాలు బయటపడ్డపుడే కాంగ్రెస్ పార్టీ బెదిరిందీ లేదు, బయపడిందీలేదు. ఇక ఎప్పుడో జరిగిన ఈ కుంభకోణాలను చూసి ఎందుకు బయపడుతుంది? ఇటువంటి సమస్యల నుండి బయటపడటానికి కాంగ్రెస్ వద్ద సాంప్రదాయ సిద్దమయిన గృహ చిట్కాలు చాలానే ఉన్నాయి. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డిగారు చెప్పిన మాటలు పూర్తిగా అయన వ్యక్తిగతమయినవి. పార్టీకి వాటితో సంబంధం లేదు,” అని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు.ఇక, మీడియా ఒక వైపు సీబీఐ మరో వైపు నిత్యం వరి కుప్పలు నూర్చి పోస్తున్నట్లు దివంగత ముఖ్య మంత్రి రాజశేకర్ రెడ్డి హయంలో జరిగిన ‘పుణ్య కార్యలన్నిటినీ’ కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నా కూడా, ఒకవేళ రాజశేకర్ రెడ్డి గనుక తప్పుచేసి ఉంటే, కాంగ్రెస్ వాదులమయిన మేమందరం సిగ్గుతో తలలు వంచుకోవలసి ఉంటుందని ఆయన చెప్పడం మరో విశేషం.
ఇక ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చిన మంత్రి గారిలో కూడా స్వచ్చమయిన కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోంది కనుక, ఆయన కూడా అలవాటయిన మరో చిట్కాను ప్రయోగిస్తూ “జగన్ మోహన్ రెడ్డి మా పార్టీలో చేరితేనే అతనికి జైలు నుండి విముక్తి లభిస్తుందని నేనెన్నడూ అనలేదు. ఆ విధంగా అన్నానని ఎవరయినా ఋజువు చేస్తే నా మంత్రి పదవిని వదులుకోవడానికి కూడా నేను సిద్ధం. మరి ఎవరయినా దానిని నిరూపించగలరా?” అని సవాలు చేసారు. కానీ, సీబీఐ మాత్రం ఆయనకి సమన్లు జారీ చేసి సంజాయిషీ కోరాలని నిర్ణయించుకొనట్లు సమాచారం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/congress-39-22787.html
ఏది ఏమైతేనేం తెలంగాణలో మద్యం అమ్మకాలు కొత్త రికార్డు సృష్టించాయి. విశేషమేంటంటే.. ఇంతటి చలిలోనూ కూడా బీర్ల అమ్మాకాలు కూడా జోరుగా సాగాయి.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ అగ్రపీఠిన నిలుస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి మేమూడు నెలల్లోనే రాష్ట్ర వృద్ధి10.5 శాతంగా ఉంది.
రీసెంట్ గా తెలంగాణలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఏర్పాటు చేశారు. అలాగే ఏపీ కేంద్రంగా మరో కొత్త పార్టీ ఆవిర్భవించనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత్ పర్యటనకు వచ్చినపుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు
ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికీ తీసుకువెళ్లారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అమరావతి రాజధాని అన్న చట్టబద్ధత అవసరమని భావించింది. దీంతో ఇదే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది.
ప్రజా సమస్యలపై ఆ పార్టీ ఎలా స్పందిస్తోంది. వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు ఏమిటి? ప్రజల పక్షాన నిలబడేందుకు ఆ పార్టీ నేతలు ముందుకు వస్తున్నారా? వంటివన్నీ జనం గమనిస్తారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారికి భక్తులు ఇచ్చిన కానుకలను దొంగిలించడమంటే మహాఘోరం, క్షమించరాని నేరం. తాము శ్రీవారికి భక్తుతో సమర్పించిన కానుకలు చోరీ అవుతున్నాయంటే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి కూడా.
అన్నదమ్ములు, తల్లీ కుతుళ్లు, తోడికోడళ్లు ఒకరిపై ఒకరు పోటీ చేయడానికి సై సంటే సై అంటున్న ఉదంతాలూ ఉన్నాయి.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో ఒకే వార్డు నుంచి తల్లి, కూతురు నామినేషన్లు వేశారు.
తెలుగు వన్. దక్షిణాదిలో మాత్రమే కాదు యావత్ భారత దేశంలోనే యూట్యూబ్ ప్లాట్ ఫామ్ లో తొలి వీడియో అప్ లోడ్ చేసిన వన్ అండ్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ ఫామ్. డిజిటిల్ మీడియా రంగంలో తెలుగు వన్ తన పాతికేళ్ల ప్రస్థానంలో చేయని ప్రయోగముందా? అన్న పేరుంది.
ప్రజల్లో సంతృప్తి పెంచేలా వ్యవహరించేందుకు ఎమ్మెల్యేలు, నాయకులు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా వినియోగించుకోవాలని, ప్రజల వద్దకు వెళ్లాలని పలు మార్లు ఆదేశించారు. అయితే చంద్రబాబు నోటి మాటగా ఇచ్చిన ఈ సూచనలూ, ఆదేశాలు వారిపై పెద్దగా ప్రభావం చూపలేదు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు గ్రామస్తులపై వరాల జల్లు కురిపిస్తున్నారు.
తనకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ పట్లే కక్షగట్టినట్లుగా వ్యవహరించారు. ఇంత కాలం తన వెన్నంటి ఉండి, తన గెలుపులో కీలకంగా వ్యవహరించిన తెలుగుదేశం శ్రేణులు లక్ష్యంగా దౌర్జన్యాలకు దిగారు. పార్టీ అధినేతపైనా, అధినేత కుటుంబంపైనా కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు. తల్లిలాండి భువనేశ్వరిని సైతం దుర్భాషలాడారు. దేవాలయం లాంటి పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.