ఇంకా భ్రమల్లోనే బ్రతుకుదామంటున్న కిరణ్

Publish Date:Apr 5, 2014

Advertisement

 

 

కిరణ్ కుమార్ రెడ్డి తన పార్టీని స్థాపించడంలో ఆలస్యం చేయడం, అందుకు ఆయన ఎంచుకొన్న సమయం ఒక పెద్ద తప్పు అయితే, అధికారికంగా రాష్ట్ర విభజన జరిగిపోయి రెండు రాష్ట్రాలు ఏర్పడుతున్న తరుణంలో కూడా తన పార్టీకి జై సమైక్యాంధ్ర పార్టీ అని పెట్టుకోవడం మరో పెద్ద తప్పు. కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లను తన ఖాతాలో వేసుకోవాలంటే ప్రజలలో సమైక్య సెంటిమెంటుని రెచ్చగొట్టడమే అందుకు మార్గమని ఆయన దృడంగా విశ్వసించబట్టే ఆయన తన పార్టీకి ఆ పేరు పెట్టుకొన్నారు. ఆయన సమైక్యవాదమనే పునాదిపై తన పార్టీని స్థాపించుకొన్న కారణంగా నేడు సరిగ్గా అదే ఆయన పార్టీకి పెద్ద ప్రతిబందంగా మారింది.

 

సీమాంధ్ర ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే మనస్పూర్తిగా కోరుకొన్న మాట నిజం. కానీ, ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తరువాత నేటికీ వారు ఆ భ్రమలలో కొనసాగేందుకు సిద్దంగా లేరు. వారి అభీష్టానికి విరుద్దంగా రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీని శిక్షించేదుకు వారు సిద్దంగా ఉన్నారు. కానీ, అదే సమయంలో ప్రజలందరూ కూడా ఒక సానుకూల యదార్ధ, దృక్పదంతో రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఆలోచిస్తున్నారు. అయితే మూడేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన కిరణ్ కుమార్ రెడ్డికి, ఆయన పార్టీలో ఉన్న ఉండవల్లి, హర్షకుమార్ వంటి రాజకీయ అనుభవజ్ఞులకు ఈ విషయం తెలియదని భావించలేము. కానీ, పార్టీ తీసుకొన్న స్టాండ్ కారణంగానే వారందరూ నేటికీ రాష్ట్రం విడిపోలేదని, తమ పార్టీకి ఓటేసి గెలిపిస్తే విడిపోయిన రాష్ట్రాన్ని తిరిగి కలుపుతామని వితండ వాదనలు చేయవలసి వస్తోంది. ఆవిధంగా నేటికీ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తూ ప్రజలలో తాము నవ్వుల పాలవుతున్నామనే సంగతిని కూడా విస్మరించవలసి రావడం నిజంగా దయనీయమే.

 

రాష్ట్ర విభజన వ్యవహారం సజావుగా పూర్తి కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ యంపీలు, సీమాంధ్ర కేంద్రమంత్రులు పోషించిన పాత్రల గురించి ప్రజలకు బాగానే జ్ఞాపకం ఉంది. అందుకే జైసపాకు, కాంగ్రెస్ పార్టీకి సీమాంద్రాలో ఆదరణ కరువయింది. అయినప్పటికీ రాజకీయ పార్టీలు అధికారం కైవసం చేసుకోవడానికి తమ ప్రయత్నాలు తాము చేయాలి గనుక తాము చెప్పదలచుకొన్నవి ప్రజలకు చెప్పుకొంటున్నారు.

 

రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ లక్షలమంది ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఉద్యమాలు చేసినప్పుడు వారి అభిప్రాయాలు గుర్తించడానికి కాంగ్రెస్ అధిష్టానికి కళ్ళు చెవులు లేవా? ఉంటే అవి మూడుకు పోయాయా? అని ప్రశ్నించిన అదే కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ నుండి ఏమి ఆశిస్తున్నారో గ్రహించలేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః ఆయన తీసుకొన్న సమైక్య స్టాండ్ ఆయన నోటికి తాళాలు వేస్తోందనుకొన్నా, ఇప్పుడు తనకు, ప్రజలకు కూడా శత్రువుగా మారిన కాంగ్రెస్ పార్టీని, దాని అధిష్టానాన్ని నోరు తెరిచి విమర్శించేందుకు నేటికీ జంకడం చూస్తే, మళ్ళీ ఏదో ఒకరోజు కాంగ్రెస్ గూటికే చేరే ఉద్దేశ్యం ఉంది గనుకనే ఆయన నోటికి తాళం బిగించుకొని పొదుపుగా విమర్శించవలసి వస్తోందని స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ వ్యతిరేఖ ఓట్లను నొల్లుకోవాలని పార్టీ పెట్టుకొన్న ఆయన కనీసం కాంగ్రెస్ పార్టీని నోరారా చీల్చిచెండాడి ఉంటే, దెబ్బ తిన్న సీమాంధ్ర ప్రజల మనసులకు స్వాంతన లభించి ఆయన పార్టీకి ఎంతో కొంత జనాధారణ పెంచి ఉండేది. కానీ, నేటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ, దాని అధిష్టాన దేవతల పట్ల అదే వినయ విధేయతలు ప్రదర్శిస్తున్నందున ప్రజలను ఆకట్టుకోలేక పోవడమే గాక వారిలో తన పార్టీ పట్ల మరింత అనుమానాలు పెరిగేలా వ్యవహరిస్తున్నారు. దానికి తోడు పార్టీ స్టాండ్ కారణంగా విడిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ కలుపుతానని ప్రజలనుమభ్యపెట్టవలసి వస్తోంది.

 

ముఖ్యమంత్రిగా ఉన్నపుడే రాష్ట్రాన్ని విడిపోకుండా కాపాడలేని ఆయన ఇప్పుడు ఏవిధంగా కలుపగలరు? అని ఆలోచిస్తే ఆయన చేస్తున్న వాదనలకు అర్ధం లేదని తెలుస్తుంది. ఒకవేళ ఆయన ఇప్పుడు నిజంగానే రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి కలిపేందుకు సిద్దపడినా మానసికంగా విడిపోయి, తమ రాష్ట్రాలను పునర్నిర్మించుకొని ఇకనయినా సుఖంగా బ్రతకాలనుకొంటున్న రెండు రాష్ట్రాల ప్రజలు అందుకు అంగీకరించరు. ఆయన ప్రజలను మభ్యపెట్టేందుకు చెపుతున్న ఇటువంటి మాటల వలన ప్రజలకు ఎటువంటి ప్రయోజనమూ లేకపోయినా, ఆయనలాగే సెంటిమెంటుని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలనుకొంటున్న కేసీఆర్ వంటి వారికి ముఖ్యమంత్రి అయ్యేందుకు మంచి సాకుని అందజేయగలుగుతున్నాయి.

 

అందువల్ల కిరణ్ కుమార్ రెడ్డికి ఈ ఎన్నికలలో కనీసం తనొక్కడయినా ఖచ్చితంగా గెలవాలనే కోరిక ఉండి ఉంటే కనీసం ఇప్పటి నుండయినా తన పందా మార్చుకొని ప్రజల ముందుకు వెళ్ళినట్లయితే ఏమయినా ఫలితం ఉంటుంది. అలా కాక ఇంకా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తే చివరికి ఆయనే ప్రజలలో నవ్వులపాలవుతారు.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.