తెదేపా వల్ల తెరాస అభద్రతాభావానికి గురవుతోందా?

Publish Date:Apr 4, 2014

Advertisement

 

తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తన ఎన్నికల ప్రసంగాలలో తరచూ మనకి ‘అంద్రోళ్ళ పార్టీల’ పెత్తనం అక్కరలేదని చెపుతుండటం అందరూ గమనించే ఉంటారు. కానీ డిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న బీజేపీ కానీ, కాంగ్రెస్ పార్టీల పట్ల గానీ ఆయన అటువంటి వ్యతిరేఖత ప్రదర్శించడం ఎన్నడూ చూడలేదు.

 

తెరాస పార్టీ ఇంతవరకు అవసరమయినప్పుడల్లా ప్రజలలో తెలంగాణా సెంటిమెంటుని రెచ్చగొడుతూ నెట్టుకొస్తోంది తప్ప తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలలాగ పార్టీని గ్రామస్థాయి నుండి నిర్మించుకొని బలోపేతం చేసుకొనే ప్రయత్నం చేయలేదు. అందువల్ల బలమయిన నేతలు విస్తృతమయిన క్యాడర్ కలిగి ఉన్న తెదేపాను చూసి తెరాస అభద్రతా భావానికి గురవడం సహజమే. అందుకే తనకు బలమయిన పోటీ ఇస్తున్న తెదేపా మీద ‘ఆంద్రోళ్ళ పార్టీ’ అని బలంగా ముద్ర వేసేందుకు కేసీఆర్ తరచూ ప్రయత్నిస్తుంటారు. ఆ పార్టీ నేత హరీష్ రావు “ఈ ఎన్నికలలో ఓడిపోయినట్లయితే తెలంగాణాలో తెదేపా దుఖాణం కట్టేసి వెళ్ళిపోతారా?” అని చంద్రబాబుని అడిగిన ప్రశ్నలో కూడా అదే రకమయిన అభద్రతా భావం కనబడుతోంది. తెరాస తాను అధికారంలోకి రావడం ఖాయమని బల్ల గుద్ది మరీ వాదిస్తున్నపుడు, తెదేపాను చూసి ఎందుకు అంత కలవరపడుతున్నట్లు? కాంగ్రెస్, బీజేపీలను చూసి ఎందుకు భయపడటం లేదు? అని ప్రశ్నించుకొంటే చంద్రబాబు మరియు తెదేపా శక్తియుక్తుల మీద వారికి ఉన్న అపార నమ్మకమేనని చెప్పక తప్పదు.

 

తమ దెబ్బకి తెలంగాణాలో తెదేపా పూర్తిగా తుడిచిపెట్టుకు పోయిందని విర్రవీగుతున్న తెరాస నేతలకి ఇటీవల తెలంగాణాలో తెదేపా నిర్వహించిన మూడు ప్రజాగర్జన సభలు విజయవంతం కావడం, చంద్రబాబు బీసి మంత్రానికి తమ వద్ద సరయిన జవాబు లేకపోవడం చాలా కలవరపరిచే అంశాలేనని చెప్పవచ్చును. రాష్ట్ర విభజనతో తెదేపా కూడా వైకాపాలాగే తెలంగాణా నుండి బిచాణా ఎత్తేస్తుందని, ఇక తమకు తిరుగే ఉండదని భావిస్తే, అందుకు విరుద్దంగా తెదేపా ఊహించనంత వేగంగా మళ్ళీ తెలంగాణాలో బలం పుంజుకోవడమే కాక తమ విజయావకాశాలను కూడా గండి కొట్టే స్థాయికి ఎదగడం తెరాస జీర్ణించుకోవడం కష్టమే.

 

ఇక కేసీఆర్ దురాశకు పోయి తన వెంటపడుతున్న కాంగ్రెస్ పార్టీని చ్చీ కొడుతూ దూరంగా పెడితే, అసలు తెదేపాతో పొత్తులకే అంగీకరించని బీజేపీ తెలంగాణా నేతలు పార్టీ జాతీయ అవసరాల దృష్ట్యా తెదేపాతో సర్దుకుపోయేందుకు అంగీకరించడంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తులు దాదాపు ఖరారు అయ్యాయి. దీనితో తెలంగాణాలో కూడా పార్టీల బలాబలాలు ఒక్కసారిగా మారిపోనున్నాయి. తెదేపా-బీజేపీలు చేతులు కలిపి బలపడితే, కాంగ్రెస్, తెరాసలు విడిపోయి బలహీనపడ్డాయి. తెరాస నేతల అభద్రతా భావానికి ఇది కూడా ఒక కారణమేనని చెప్పవచ్చును.

 

ఇక తమవంటి ఒక ప్రాంతీయ పార్టీ తెదేపాని చూసి భయపడుతున్న తెరాస నేతలు తమకంటే ఎన్నో రెట్లు బలమయిన జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను చూసి ఎందుకు భయపడటం లేదు అంటే, నేటికీ బీజేపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి గెలవలేదని, కనీసం తమకు గట్టి పోటీ కూడా ఇవ్వలేదనే భావనే తెరాస అలుసుకి కారణం. కానీ అది ఇప్పుడు తెదేపాతో చేతులు కలుపుతోంది గనుక ఇప్పుడు దానిని కూడా కేసీఆర్ తన లెక్కలోకి తీసుకోక తప్పదు.

 

ఇక టీ-కాంగ్రెస్ నేతలకు ఎన్నికలలో పార్టీని గెలిపించుకొని అధికారంలోకి రావాలనే తపన కంటే, తమకు తమ కుటుంబ సభ్యులకు టికెట్స్ సాధించుకోవడం పైనా, అధికారంలోకి రాలేమని తెలిసినా ముఖ్యమంత్రి కుర్చీకోసం తోటి నేతలతో సిగపట్లు పట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు గనుక వారిని వారే ఓడించుకొంటారనే ధీమా కేసీఆర్ కి ఉన్నందునే ఆయన కాంగ్రెస్ ను చూసి కూడా ఎన్నడూ భయపడలేదు. ఒకవేళ కాంగ్రెస్ నేతలు అందరూ మళ్ళీ ఒక్క త్రాటిపైకి తమను డ్డీ కొనాలని చూసినా వారిపై ప్రయోగించడానికి “తెలంగాణా సెంటిమెంటు” అనే బ్రహ్మాస్త్రం ఉండనే ఉంది.

 

అయితే కాంగ్రెస్ పార్టీ మీద దివ్యంగా పనిచేసే ఆ బ్రహ్మాస్త్రం ‘ఆంధ్రోళ్ళ తెదేపా’ మీద ఎందుకు పనిచేయడం లేదు? అంటే తెలంగాణా ప్రజలు కేసీఆర్ చెపుతున్న మాయమాటలను నమ్మకపోవడమేనని అనుకోవచ్చును. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి మొదలు కాంగ్రెస్ పార్టీతో విలీనం, పొత్తుల వరకు కేసీఆర్ చేస్తున్న మాటల గారడీని ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. చంద్రబాబు నిర్ద్వందంగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ఇవ్వకపోయినా, ఆయన ఇప్పుడు తెలంగాణాలో తన పార్టీని పూర్తిగా బీసీలకే అప్పజెప్పడం, వారికే అధికారమని విస్పష్టంగా ప్రకటించడం, ముఖ్యంగా తాను కల్పించిన ఉపాధి, చేసిన అభివృద్ధి పనులు గురించి ప్రజలకు సమర్ధంగా చెప్పుకోవడం వలన తేదేపాకు ప్రజలలో క్రమంగా ఆ పార్టీ పట్ల ఆదరణ పెరుగుతూ వస్తోంది.

 

కేసీఆర్ చేస్తున్న వేర్పాటు తెలంగాణావాదం వలన ఇప్పుడు తెలంగాణా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని వారికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్రాలో నయినా తెలంగాణాలో అయినా ప్రజలకు కావలసింది సుస్థిరమయిన పాలన, వేగంగా అభివృద్ధి, ఉపాధి, భద్రత, శాంతి వంటివే కోరుకొంటున్నారు కనుకనే వాటిని ఇవ్వగల నేతలకు, పార్టీలకే ప్రజలు పట్టం గడతారు తప్ప మాటల గారడీలు చేసే అనుభవం లేని నేతలకు కాదు. బహుశః ఈ అంశమే తేదేపాకు రెండు ప్రాంతాలలో కలిసి వస్తోంది. కానీ దీనిని తెదేపా ఎంత సమర్ధంగా వినియోగించుకొంటుందో తెలుసుకొనేందుకు ఎన్నికల ఫలితాలే గీటురాయిగా నిలుస్తాయి.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.