తెలంగాణాలో పార్టీల బలాబలాలు

Publish Date:Apr 6, 2014

Advertisement

 

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న మొట్ట మొదటి ఎన్నికలు గనుక సహజంగానే ప్రజలలో తెలంగాణా సెంటిమెంటు చాలా బలంగా ఉంటుంది. దానిని కేసీఆర్ మరియు తెరాసలోని ఆయన కుటుంబ సభ్యులు తమ మాటలతో మరింత రగుల్చుతూ ఎన్నికలలో గెలిచేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. ఈ ఎన్నికలలో తెలంగాణా సెంటిమెంటు, తెలంగాణా సాధన, పునర్నిర్మాణం, సామాజిక న్యాయం అనే నాలుగు అంశాలే అన్ని పార్టీల భవితవ్యం నిర్దేశించబోతున్నాయి. అందువలన ఒక్కో పార్టీ వీటిలో తమకు అనువుగా ఉన్నఅంశాలను హైలైట్ చేస్తూ ప్రజలను ఆకట్టుకోవాలని ప్రయత్నించవచ్చును.

 

కాంగ్రెస్, తెదేపాలతో పోలిస్తే తెరాసకు బలమయిన యంపీ అభ్యర్ధులు లేరనే చెప్పవచ్చును. అయితే తెరాస ప్రధాన లక్ష్యం మెజార్టీ అసెంబ్లీ సీట్లను కైవసం చేసుకొని స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడమే గనుక బహుశః యంపీ స్థానాల కోసం మరీ అంతగా ఆరాటపడకపోవచ్చును. అలాగని పూర్తిగా వదులుకొంటుందని కాదు.

 

కాంగ్రెస్ మాత్రం వీలయినన్ని యంపీ స్థానాలను గెలుచుకోవడమే ప్రధాన లక్ష్యంగా పోరాడుతుంది. అందుకే పార్టీలో హేమాహేమీలనదగ్గ సిట్టింగ్ యంపీలకే మళ్ళీ స్థానాలు ఖరారు చేసింది. టీ-కాంగ్రెస్ పార్టీ తెలంగాణా సాధన, పునర్నిర్మాణం అనే రెండు అంశాలతో ఎన్నికల బరిలోకి దిగబోతోంది. కానీ, టీ-కాంగ్రెస్ నేతలు అలవాటు ప్రకారం ఒకరి కాళ్ళు మరొకరు లాక్కొంటూ, తమ బంధు జనాలందరికీ అసెంబ్లీ టికెట్స్ ఇప్పించుకొనేందుకు నేటికీ కుస్తీలు పడుతూనే ఉన్నారు. వారు ఈ బలహీనతను జయించలేరు. జయించగలిగితే వారిని తట్టుకోవడం తెరాస వల్ల కూడా కాదు. ఏమయినప్పటికీ, అసెంబ్లీ స్థానాలకు బరిలో దిగనున్న టీ-కాంగ్రెస్ నేతలు ఏ రకంగా కూడా తెరాసకు తీసిపోరు. వారిలో చాలా మంది కేవలం తమ వ్యక్తిగత బలంతోనే గెలవగల సమర్ధులు. కానీ, అంతమంది హేమాహేమీలను కేసీఆర్ ఒక్కడే బలంగా డీ కొంటుంటే, వారిలో ఏ ఒక్కరూ కూడా అతనిని గట్టిగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించకపోగా డిల్లీలో టికెట్స్ కోసం పైరవీలు చేసుకొనేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అందువల్ల వారి అనైక్యతే తెరాసకు శ్రీ రామరక్ష అని చెప్పుకోవచ్చును.

 

ఇక తెదేపా తెలంగాణా పునర్నిర్మాణం, సామాజిక న్యాయం అనే రెండు అంశాలతో తన ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు సిద్దమవుతోంది. తెదేపా-బీజేపీలు పొత్తులు పెట్టుకోవడం ఖాయమయితే, ఆ రెండు పార్టీలకు ఉన్న బలమయిన క్యాడర్, నేతల అండతో విడివిడిగా పోటీ చేస్తున్నకాంగ్రెస్, తెరాసలను నిలువరించగలవు. తెదేపా బీసీ మంత్రం పటిస్తూ, పునర్నిర్మాణం గురించి మాట్లాడుతూ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తే, బీజేపీ నరేంద్ర మోడీ పేరు చెప్పుకొని ఓట్లు రాబట్టుకొనే ప్రయత్నం చేయవచ్చును.

 

బీజేపీ నేతలు ఈసారి ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసినా తెలంగాణాలో విజయం సాధించగలమని అతిశయం ప్రదర్శిస్తున్నప్పటికీ వారికి అంత సీను లేదు. టీ-కాంగ్రెస్,తెరాస, తెదేపాల బలాలతో పోలిస్తే ఆ పార్టీ తెలంగాణాలో నాలుగవ స్థానంలోనే ఉంది, ఉంటుంది కూడా. తమ పార్టీ తెలంగాణా బిల్లుకి మద్దతు ఇచ్చింది గనుక తెలంగాణా ప్రజలు తమకే ఓటేస్తారని అనుకొంటే అది ఆత్మవంచన చేసుకోవడమే అవుతుంది. అందువల్ల రేపు ఎన్నికలలో ఆ పార్టీకి పడే ఓట్లన్నీకేవలం మోడీ మొహం చూసి వేసినవే అనుకోవచ్చును.

 

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్, తెరాస, తెదేపా-బీజేపీ బాలా బలాలు ఇంచుమించు సరిసమానంగానే ఉన్నట్లు కనబడుతోంది. ఎన్నికల వరకు ఇదే పరిస్థితి కొనసాగినట్లయితే తెలంగాణాలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశం లేదు. కొత్తగా ఏర్పడుతున్న తెలంగాణా రాష్ట్రానికి ఇది చాల నష్టం కలిగిస్తుంది. ఒకవేళ ఎన్నికలు సమీపించే సమయానికి ఈ పార్టీలలో ఏదో ఒకటి మరింత బలం పుంజుకొని రేసులో ముందుకు దూసుకుపోయినట్లయితే ఇటువంటి దుస్థితి నివారించవచ్చును.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.