Publish Date:Dec 21, 2025
ఖమ్మం జిల్లా రోడ్డు రవాణా కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ ఖమ్మం రేంజ్ అధికారులు ఆర్టీఓ కార్యాలయంలో దాడులు చేపట్టారు. తనిఖీల సమయంలో ఆర్టీఓ కార్యాలయంలో అక్రమంగా కార్యకలాపాలు నిర్వహి స్తున్న 13 మంది ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి వివిధ సేవల కోసం దరఖాస్తు దారుల నుంచి వసూలు చేసినట్లు అనుమానిస్తున్న రూ.78,120 లెక్కలేని నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఏజెంట్ల స్వాధీనంలో 837 అసలు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు (RCలు) అసలు డ్రైవింగ్ లైసెన్సులు లభ్యమవడం సంచలనంగా మారింది.
తనిఖీల్లో ఆర్టీఓ కార్యా లయంలోని హాజరు రిజిస్టర్, నగదు రిజిస్టర్ సహా పలు అధికారిక రిజిస్టర్లు సరిగా నిర్వహించబడటం లేదని అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, అనధికార ఏజెంట్లు ప్రభుత్వ కార్యాల యానికి సంబంధించిన అసలు పత్రాలను నిర్వహిం చడం తీవ్ర విధానపరమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు తమ విధులను నిర్వర్తించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఏసీబీ నిర్ధారించింది.
ఏజెంట్లు స్వేచ్ఛగా పనిచేయడానికి, అసలు పత్రాలు నిర్వహిం చడానికి అనుమతించడం వల్ల అవినీతి పెరిగి, దరఖాస్తుదారులు వేధింపు లకు గురవుతున్నారని అధికారులు అభిప్రాయ పడ్డారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు మరియు ఇందులో పాల్గొన్న ఇతరులపై క్రమశిక్షణా, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వివరణాత్మక నివేదిక సమర్పించనున్నట్లు ఏసీబీ తెలిపింది.లంచం డిమాండ్ చేస్తే 1064కి ఫోన్ చేయండిప్రజలకు ఏసీబీ విజ్ఞప్తి చేస్తూ,ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని కోరింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/khammam-rto-office-36-211344.html
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ పేరుతో...ఫేక్ నెంబ ర్ తో..ఆయన ఫొటోతో వాట్సాప్ క్రియేట్ చేసి మెస్సేజ్ లు పంపిస్తున్నారని వెల్ల డైంది.
జగన్ హయాంలో డాక్టర్ సుధాకర్ ప్రభుత్వ వైద్యులకు కరోనా మహమ్మారి నుంచి రక్షణకు కనీసం మాస్కులు కూడా ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించడమే జగన్ ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టడానికి కారణమైంది. ప్రభుత్వ డాక్టర్ అని కూడా చూడకుండా.. విశాఖపట్నం వీధుల్లో ఆయనను అర్థనగ్నంగా చేసి, చేతులు వెనక్కి విరిచి కట్టి పోలీసులు ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
న్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ పశ్చిమబెంగాల్ లోని ఐప్యాక్ ప్రధాన కార్యాలయంలో జరిపిన సోదాలలో.. గతంలో ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఎన్నికల వ్యూహాలపై సహకారం అందించిన సమయంలో జరిగిన ఆర్థిక లావాదేవీల గుట్టు బయటపడింది. ఆ ఆర్థిక అవకతవకలపై కూడా ఇప్పుడు ఈడీ దృష్టి సారించినట్లు రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఆ పరిస్థితి లేకుండా చేయాలని తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై టోల్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాసింది.
ఆవకాయ అన్నది కేవలం ఆహారం కాదనీ, అది మన సంప్రదాయం సాంస్కృతిక వైభవానికి చిహ్నమనీ చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ హోటళ్లు ఉన్నా, అక్కడ ఏపీ షెఫ్ లు ఉంటారనీ, అదీ ఆంధ్రా వంటలకు ఉన్న ప్రత్యేకత అనీ చెప్పారు.
పర్యాటక రంగాన్ని ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు. సూర్యలంక బీచ్ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ, పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు.
కొత్తపల్లి కూడలి వద్ద జగన్ పుట్టినరోజు ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అదే రాత్రి ఒక కోడిని తెచ్చి, దాన్ని గొంతు కోసి ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీపై చల్లారు. ఈ దృశ్యాలను వీడియో తీసి, దానికి రక్తచరిత్ర సినిమాలోని హింసాత్మక పాటను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశారు.
కామన్వెల్త్ యూత్ గేమ్స్ బంగారు పతక విజేత, జాతీయ షూటింగ్ కోచ్ అంకుశ్ భరద్వాజ్పై సస్పెన్షన్ వేటు పడింది.
ప్రపంచంలోని కుబేరుల గురించి మాట్లాడుకుంటే మనకు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్ వంటి పేర్లు గుర్తుకు వస్తాయి.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2006, న్యూజిలాండ్తో జరగనున్న 5 టీ20ల సిరీస్లు ముంచుకొస్తున్న తరుణంలో టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
యంగ్ ఇండియా స్కూల్ లో బ్రేక్ఫాస్ట్ అమలు చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
మహిళల ఆర్థిక ప్రగతి కోసం తాను స్థాపించిన డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు.
జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి లైబ్రరీ వద్ద నిరుద్యోగులు ధర్నా చేపట్టారు