పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ దంపతులకు 17 ఏళ్ల జైలు

Publish Date:Dec 20, 2025

Advertisement

 

సంచలనాలకు కేంద్రబిందువైన పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రిన్ - ఇ- ఇన్సాఫ్ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్‌ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు కఠిన శిక్ష విధించడం అటు పాకిస్థాన్‌తో పాటు ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తొషఖానా - 2 అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వేస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు 17 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ శనివారం తీర్పునిచ్చింది. 

ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఉన్న రావల్పిండిలోని అడియాలా జైలులోనే విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పులు వెలువరించడం గమనార్హం. 2021 మే నెలలో సౌదీలో ఇమ్రాన్ పర్యటించారు. 2021 మే నెలలో సౌదీ అరేబియా పర్యటించిన సందర్భంగా యువరాజు ఇమ్రాన్ ఖాన్ దంపతులకు ఖరీదైన ‘బల్గరి’ నగల సెట్‌ను బహుమతిగా అందజేశారు. ప్రభుత్వ ఖాజానాకు అప్పగించకుండా ఇమ్రాన్ అతని భార్య బుష్రా సొంత ప్రయోజనం కోసం తక్కువ ధరకు విక్రయించినట్లు వచ్చిన ఆరోపణపై కేసు నమోదైంది. 

ఈ కేసును విచారించిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి షారుఖ్ అర్జుమంద్ ఈ సంచలన తీర్పు ప్రకటించారు. ప్రధాని హూదాలో ఉంటూ నమ్మకద్రోహానికి పాల్పడినందుకు పాకిస్థాన్ పీనల్ కోడ్ సెక్షన్ 409 కింద 10 ఏళ్లు కఠిన శిక్ష, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద 7 ఏళ్లు సాధారణ శిక్ష విధించారు. అంతేకాదు దంపతులకు చెరో రూ.16.4 మిలియన్ జరిమానా కూడా విధించారు. ఈ తీర్పుతో ఇమ్రాన్ ఖాన్ మరో పదేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ తీర్పును హై కోర్టులో సవాలు చేస్తామని ఇమ్రాన్ ఖాన్ తరుపు న్యాయవాది తెలిపారు.

By
en-us Political News

  
టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరో చరిత్ర సృష్టించారు. 700 బిలియన్ డాలర్ల పైచిలుకు నికర సంపద కలిగిన తొలి వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు.
డిజిటల్ మోసాన్ని అరికట్టే లక్ష్యంతో నిర్ణయాత్మక చర్యలో భాగంగా కొత్త నియమాన్ని భారత రైల్వే ప్రవేశపెట్టింది.
గొల్లపూడిలో కొత్త శాటిలైట్ రైల్వే స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంపీలు కేశినేని శివనాథ్, దగ్గుబాటి పురందేశ్వరి రైల్వేమంత్రిని కోరారు.
మాజీ మావోయిస్టు, సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
వైసీపీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం కోసం, పారదర్శకత పెంచడానికి రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది .
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యంత అల్పానికి పడిపోయాయి. జనం బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రైవేటు క్యాబ్ సంస్థలకు పోటీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రా ట్యాక్సీ యాప్‌ను త్వరలో విడుదల చేయనుంది.
ఖమ్మం జిల్లా రోడ్డు రవాణా కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించడానికి ఏసు ప్రభువు జన్మించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి శనివారం రోజు నాంపల్లిలోని ప్రజాప్రతి నిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సీపీ సజ్జనార్ ఊహించని షాక్ ఇచ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.