పదేళ్లలో పర్యాటకంలో ఏపీ నంబర్ వన్.. చంద్రబాబు

Publish Date:Jan 8, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 2024లో చంద్రబాబునాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధి పరుగులు పెడుతోంది.  రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే  విజయవాడలో మూడు రోజుల పాటు అమరావతి ఆవకాయ్  ఫెస్టివల్ ను నిర్వహిస్తోంది. గురువారం (జనవరి 9)న ప్రారంభమైన అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ లో  సీఎం నారా చంద్రబాబు నాయుడు, యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  తెలుగు వారి ఆతిథ్యం, రుచి, క్రియేటివిటీ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంటాయన్నారు.  

పర్యాటక రంగాన్ని  ఆర్థిక వనరుగా తీర్చిదిద్దుతామన్న చంద్రబాబు, రానున్న పదేళ్లలో  పర్యాటకంలో ఏపీని నంబర్ వన్ గా తీర్చిదిద్దుతామన్నారు.   సూర్యలంక బీచ్‌ను గోవా తరహాలో అభివృద్ధి చేస్తామనీ,  పోలవరం పాపికొండలు, అరకు, గండికోట ఉత్సవాల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువస్తామన్నారు. ఇక అరకు కాఫీ ఇప్పటికే గ్లోబల్ బ్రాండ్‌గా మారిందని గుర్తు చేశారు.  రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోందనీ, పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నచంద్రబాబు, దేశానికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో పాతిక శాతం ఆంధ్రప్రదేశ్ కే దక్కాయనీ, ఇది బ్యాంక్ ఆఫ్ బరోడా నివేదిక తేటతెల్లం చేసిందని అన్నారు.   పీపీపీ విధానంలో కేంద్రం చేపడుతున్న ప్రాజెక్టుల్లో 30 శాతం ఏపీలోనే ఉన్నాయన్న ఆయన. అమరావతిని ప్రపంచంలోనే బెస్ట్ డైనమిక్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు.

పర్యాటకం అభివృద్ధి చెందడంలో భద్రత, శుభ్రత కీలకపాత్ర వహిస్తాయన్నారు.  ఇక రాష్ట్ర పర్యాటకంలో తెలుగు సినీమా కూడా ప్రధాన పాత్ర పోషించాలన్నారు.  క్రియేటివిటీకి తెలుగు సినిమా చిరునామా అన్న విషయాన్ని   భక్త ప్రహ్లాద నుంచి బాహుబలి వరకు సాధించిన విజయాలే  నిదర్శమన్నారు.   ఎన్టీఆర్ నుంచి ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వీఆర్, చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలయ్య వరకు హీరోలందరూ ఈ ప్రాంతం వారే కావడం గర్వకారణమన్నారు.    గత ప్రభుత్వం సాంస్కృతిక ,  వినోద కార్యకలాపాలను పూర్తిగా విస్మరించిందని విమర్శించిన చంద్రబాబు, రాష్ట్ర గొప్ప వారసత్వాన్ని హైలైట్ చేయడానికి తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలను నిర్వహించిందని చెప్పారు.    విజయవాడ ఉత్సవ్ మరియు కనక దుర్గ ఉత్సవ్‌లను ఆయనీ సందర్భంగా ప్రస్తావించారు.   

 అమరావతి- ఆవకాయ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న యూరోపియన్ యూనియన్  రాయబారి హెర్వే డెల్ఫీ సాంకేతికంగా, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్  వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. సెమీ కండక్టర్స్, ఏఐ, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. త్వరలో ఏపీలో  ఈయూ ఫిలిం ఫెస్టివల్' నిర్వహించనున్నట్లు చెప్పారు. రాజమౌళి తీసిన బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు తానూ చూశానని, 'నాటు నాటు' పాట తనను ఎంతో ఆకర్షించిందని డెల్ఫీ పేర్కొన్నారు. సంప్రదాయం, సంస్కృతిని మేళవిస్తూ   నిర్వహిస్తున్న ఆవకాయ ఫెస్టివల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వ్యవసాయంలో, నైపుణ్యంలో, ఆర్ధిక వృద్దిలో పెట్టుబడులతో ఏపీని లీడింగ్ స్టేట్ గా అభివర్ణించిన ఆయన, ఈ డైనమిజమే యూరోపియన్ యూనియన్ ను విశేషంగా ఆకట్టుకుంటోందని అన్నారు.  

By
en-us Political News

  
ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హైదరాబాద్‌కు రావడం గర్వకారణమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు
భారత డెయిరీ రంగ అభివృద్ధిలో విశిష్ట సేవలకు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ భువనేశ్వరికి అరుదైన అవార్డు వరించింది
మహిళా ఐఏఎస్‌లపై కొంతమంది వ్యక్తులు దుష్ప్రచారం చేయడం ఆందోళనకరమైన విషయం అని మంత్రి సీతక్క అన్నారు
చైనాలో కోతుల కొరత పెరిగిపోతండంతో వాటికి భారీగా డిమాండ్ పెరిగింది.
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి ఒక మాజీ ఐపీఎస్‌ అధికారి భార్య నుంచి కేటుగాడు రూ.2.58 కోట్లను కాజేశాడు
అయోధ్య రామాలయం క్లాంప్లెక్స్‌లో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది.
సూరత్ ఎయిర్ పోర్ట్‌లో బాలీవుడ్ మెగాస్టార్ అమితా బచ్చన్‌కు పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద బ్లోఔట్ మంటలు అదుపులోకి వచ్చాయి.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హైడ్రా మరోసారి తన సత్తా చాటింది.
ఈ నెల 12న ఇస్రో సీఎస్ఎల్వీ- సి62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఈ సందర్భంగా అమ్మవారిని ప్రార్ధించినట్లు ఇస్రొ చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా వేదపండితుల మంత్రోచ్ఛారణలతో ఇస్రో చైర్మన్‌ నారాయణన్‌ను సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
మద్యం కుంభకోణం కేసులో ఏ1గా ఉన్న రాజ్ కసిరెడ్డి ఆర్థోపెడిక్ సమస్యలతో గత కొద్ది రోజులుగా బాధపడుతుండటంతో జైలు అధికారులు ఆయనను ఈ రోజు విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇక ఈ కేసులో ఏ38గా ఉన్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి వెరికోజ్ వెయిన్స్ సమస్యలతో బాధపడుతుండటంతో ఆయనను మంగళగిరి ఎయిమ్స్ కు తరలించారు.
ఒడిశాలో పెను ప్రమాదం తప్పింది.
భూభారతి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో స్టాంప్ డ్యూటీ చార్జీలను కాజేసేలా ఓ ముఠా వ్యవస్థీకృతంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెలుగులోకి వచ్చింది. థర్డ్ పార్టీ అప్లికేషన్ సహాయంతో చలాన్ అమౌంట్లను ఎడిట్ చేసి, తక్కువ మొత్తానికి పేమెంట్ చేసి ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించినట్లు అధికారులు గుర్తించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.