కేసీఆర్ జర్నీ టు కాంగ్రెస్ వయా కేవీపీ

Publish Date:Jul 26, 2022

Advertisement

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ రాజకీయాలంటూ చేసిన విన్యాసం కేంద్రంతో సంబంధాలను తెగేదాకా లాగేసిందా? ఇక ఇప్పుడు జాతీయ రాజకీయాల సంగతి దేవుడెరుగు సొంత రాష్ట్రంలో నిలవడమెలా అన్న ఆందోళనలో కేసీఆర్ ఉన్నారా? ఆయన తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్రంలో తనకు మద్దతుగా నిలిచేందుకు కాంగ్రెస్ ను ఆశ్రయించడానికేనా? ఈ ప్రశ్నలకు పరిశీలకులు ఔననే సమాధానం చెబుతున్నారు.

కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు ముందు.. ఢిల్లీ చేరిన తరువాత కూడా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీతో టచ్ లోకి వెళ్లారని అంటున్నారు. రాష్ట్రంలోనైనా, జాతీయ స్థాయిలోనైనా తనను ఇప్పుడు ఆదుకుని ఒడ్డున పడేయగల పార్టీ కాంగ్రెస్సేనని కేసీఆర్ నమ్ముతున్నారని తెరాసలో ఆయనతో సన్నిహితంగా మెలిగే నేతలు అంటున్నారు. అందుకే ఆయన కాంగ్రెస్ కు పార్టీని చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారనీ, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేసే పనిలోనే ఆయన తాజా హస్తిన పర్యటన అనీ అంటున్నారు. తనంత తానుగా కాంగ్రెస్ కు చేరవ అవ్వడానికి గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్న సంగతి విదితమే.

తెరాసను కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్న ప్రతిపాదనను కూడా ఆయన ఒక మధ్య వర్తి ద్వారా సోనియాకు చేసినట్లు చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ అధినేత్రి అందుకు ససేమిరా అన్నారని అంటున్నారు. ఆ తరువాత కొద్ది కాలం సైలెంట్ గా ఉన్న కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా చురుకుగా వ్యవహరించారనీ, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు బేషరతుగా మద్దతు ప్రకటించడమే కాకుండా, యశ్వంత్ సిన్హాను తెలంగాణకు ఆహ్వానించి రాచమర్యాదలు చేయడమే కాకుండా భారీ ర్యాలీ నిర్వహించడాన్ని ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి హఠాత్తుగా హస్తిన పర్యటన చేపట్టడంతోనే కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేశారు.

ఇటీవలి కాలంలో ఆయన ఒక్కసారంటే ఒక్క సారి కూడా ప్రధానితో భేటీ కాకపోవడం.. ఆయన పలు సందర్భాలలో తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కనీసం ప్రొటోకాల్ ను కూడా పాటించకుండా ఆయనకు ఆహ్వానం, వీడ్కోలు పలకకుండా దూరంగా ఉండిపోవడం తెలిసిందే. రాష్ట్రంలో బీజేపీ తెరాసను దీటుగా ఎదుర్కొంటున్న క్రమంలో కేసీఆర్ వ్యూహాత్మకంగా తన విమర్శలకు టార్గెట్ గా ప్రధాని మోడీని ఎంచుకోవడంతో బీజేపీతోనూ, మోడీతోనూ పూడ్చడానికి వీల్లేనంతగా అగాధం పెరిగిందని తెరాస వర్గాలే చెబుతున్నాయి. రాజకీయంగా వైరి పక్షాలైనప్పటికీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతగా ప్రధానిపై వ్యక్తిగత దూషణలకు సైతం దిగిన సందర్భంగా గతంలో ఎన్నడూ లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తెలంగాణపై దృష్టి సారించిందనీ, పరిమితులకు మించిన అప్పులు, కాళేశ్వరం జాతీయ హోదా అంశాలలో రాష్ట్ర ప్రభుత్వం తప్పిదాలను, అవకతవకలను ఏకంగా పార్లమెంటు సాక్షిగానే వెల్లడించిందని అంటున్నారు.

కాగా ఇంత కాలం కేంద్రం విమర్శలను,  అప్పులు కేటాయింపుల విషయంలో కేంద్రాన్ని దీటుగా ఎదుర్కొన్న కేసీఆర్ ఇటీవలి వరదలలో కాళేశ్వరం పంప్ హౌస్ లు  నీట మునిగి, ప్రాజెక్టు లోపాలు బహిర్గతం కావడంతో డిఫెన్స లో పడ్డారని అంటున్నారు. దీంతో కేంద్రానికి చేరువ కావడానికి, రాజీపడటానికి అవకాశాలన్నీ మూసుకు పోయిన తరుణంలో ఆయనకు కనిపిస్తున్న ఏకైక హోప్ కాంగ్రెస్సేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ కు చేరువ కావడానికి అంది వచ్చిన ప్రతి అవకాశాన్నీ ఆయన రెండు చేతులతో అందుకోవడానికి చేయని ప్రయత్నం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. జీఎస్టీకి వ్యతిరేకంగా పార్లమెంటు ఆవరణలోని గాంధీ భవన్ వద్ద విపక్షాలతో ధర్నాకు కాంగ్రెస్  పిలుపునిచ్చిన సందర్భంలో అన్ని పార్టీల కంటే ముందుగా గాంధీ భవన్ కు ప్లకార్డులతో చేరుకున్నది తెరాస ఎంపీలే. అలాగే సోనియా గాంధీ ఈడీ విచారణ కోసం వెళ్లినప్పుడు నిరసన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నది కూడా టీఆర్ఎస్ ఎంపీలే. ఆందోళనా కార్యక్రమాలపై చర్చించేందుకు పార్లమెంటు ఆవరణలోని కాంగ్రెస్ కార్యాలయంలో విపక్షాల సమావేశానికి కూడా తెరాస హాజరైంది.

సోనియాను ఈడీ విచారణకు పిలవడాన్ని వ్యతిరేకించి కాంగ్రెస్ కు సంఘీ భావం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ హస్తిన పర్యటన రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటులో తెరాస ఎంపీలు కాంగ్రెస్ తో కలిసి వివిధ అంశాలపై పోరాడాలని ఇప్పటికే కేసీఆర్ వారికి దిశా నిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అలాగే హస్తిన పర్యటనకు ముందు ఆయన కేవీపీతో పలు మార్లు సంభాషించారనీ, ఒక అడుగు తాను వెనక్కు వేయడానికి సిద్ధంగా ఉన్నాననీ, కాంగ్రెస్ తో జట్టు కట్టేందుకు రెడీగా ఉన్నాననీ ఆయన కేవీపీకి చెప్పినట్లు తెలుస్తోంది. కేవీపీ ద్వారా ఆయన తన హస్తిన పర్యటనలో కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉందంటున్నారు. హస్తిన చేరిన తరువాత కూడా ఈ విషయంపై ఆయన కేవీపీతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ కాంగ్రెస్ తో సయోధ్యకు అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారని చెబుతున్నారు. ఇటు తెలంగాణలో తెరాస మరోసారి అధికారంలోకి రావాలన్నా.. అటు జాతీయ స్థాయిలో తన ఉనికిని కాపాడుకోవాలన్నా కాంగ్రెస్ స్నేహం అనివార్యమని కేసీఆర్ విశ్వసిస్తున్నారని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. కేసీఆర్ హస్తిన పర్యటనలో హస్తం పార్టీకి తెరాసను చేరువ చేసే కేసీఆర్ యత్రాలకు సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఆయనకు కేవీపీ భరోసా ఇచ్చారనీ చెబుతున్నారు. 

By
en-us Political News

  
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.