Publish Date:Jul 26, 2022
పెళ్లికి వెల్లిన వియ్యపురాలిని ఆనక అందరూ స్టీలు గ్లాసులు బాగోలేదని మొట్టికాయలు మొట్టారట. అదు గో అలా అయింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంగతి. రాష్ట్రపతి ఎన్నికలయ్యేవరకూ జగన్ సర్కార్ అవసరాన్ని గుర్తించి చక్కగా పలకరించినవారంతా ఆ వెంటనే ఇలా అయితే ఎలా జగన్ అంటూ రాష్ట్ర ఆర్ధిక స్థితిని గురించి యక్షప్రశ్నలు వేసి, వెయ్యి అనుమానాలు ఇచ్చి వెనక్కి పంపారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఏపీ శ్రీలంక అంటూ ప్రజెంటేషన్ ఇచ్చి.. ఏపీని ప్రముఖంగా ప్రస్తావించారు. జాగ్రత్త పడాల్సిందే నన్నారు. ఆ తర్వాత ఏపీకి అప్పులిస్తున్న బ్యాంకులపై ఆర్బీఐ సీరియస్ అయింది.
ఇది మామూలు విషయం కాదు. ఎవరైనా ఏపీకి అప్పులివ్వాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. బ్యాం కులకు నోటీసుల ద్వారా ఆర్బీఐ కల్పించింది. ఏపీ తీసుకుంటున్న అప్పుల గురించి కేంద్రం సీరియస్ అయింది. ఈ కారణంగా జగన్ సర్కార్ అప్పుల స్థాయి విషయంలో అనుమానాలు బలమయ్యే అవకా శాలే కనప డుతున్నాయి.
అప్పులు సక్రమమా, అక్రమమా ఎక్కువా, తక్కువా అన్న వాటిని పక్కన పెడితే ఇంత కాలం పెద్దగా పట్టించుకోని కేంద్రం ఇప్పుడు కాస్త సీరియస్గా తీుకుందా అన్న అనుమానం తాజా పరిణామాల ద్వారా వస్తోంది. ఇన్నిరోజులు ఒకెత్తు ఇక నుంచి ఒకటి అన్నది కేంద్రం. ఇప్పటిదాకా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని చిన్నపిల్లాడిని చూసినట్టు కాస్తంత చూసీ చూడనట్టే ఉన్నకేంద్రం, ఆర్బీఐ ఇపుడు కళ్లు పెద్దవి చేశాయి. కానీ ఏపీ సర్కార్ అప్పుల మీద నడుస్తున్నది. బీజేసీ సర్కార్ ఈ విషయాన్ని ఇప్పుడు సీరియస్గా తీసుకుని వివరాలు డిమాండ్ చేసి ఆర్బీఐ నుంచి అప్పులకు అడ్డుకట్టవేస్తే ఆంధ్రా గతేమిటి. ప్రభు త్వానికి ఆర్ధిక కష్టాలు మెడకు చుట్టుకుంటాయి.
ఎందుకంటే ఈ ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన అప్పుల పరిమితిని దాదాపుగా ఈ నెలలో దాటేస్తారు. అద నపు అప్పుల కోసం ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. కానీ శ్రీలంక అనుభవాలు భయ పెడుతున్న సమయంలో కేంద్రం ఇక విచ్చలవిడిగా అప్పులకు ఏమాత్రం అవకాశం ఇవ్వదని భావిస్తున్నారు. అదే సమయంలో ఉచితాలపై ఇటీవల మోదీ వ్యాఖ్యలు కూడా కొంత మంది ఉదహరిస్తున్నారు. నగదు బదిలీ పథకాల్లో ఏపీ ముందు ఉంది. ఇలాంటి వాటిని మోదీ సహించరని బీజేపీ వర్గాలు చెబుతున్నా యి. మొత్తానికి బీజేపీ అప్పులు అందకుండా చేయడం కాదు కనీసం సహకారం అందివ్వకపోయినా ఏపీ ప్రభుత్వం ఆర్థిక కష్టాల్లో చిక్కుకుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/centre--shock-to-jagan-25-140577.html
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్షిప్ కాంక్లేవ్లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.