టీడీపీని టార్గెట్ చేసిన కేసిఆర్, సోనియా!

Publish Date:Mar 5, 2014

Advertisement

 

కాంగ్రెస్ అధిష్టానం సరిగ్గా ఎన్నికలకు ముందు హటాత్తుగా విభజన అంశం భుజానికెత్తుకోవడం సహజంగానే అందరికీ అనుమానాలు రేకెత్తించింది. ఈ విభజన వల్ల రాజకీయంగా ఎవరు ఎక్కువ దెబ్బతిన్నారని ఆలోచిస్తే ‘తెలుగుదేశం పార్టీ’ అని అందరూ టక్కున జవాబిస్తారు. తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తూ ఆ పార్టీ లేఖ ఇచ్చినప్పటికీ ఆ సంగతి గట్టిగా చెప్పుకోలేక అటు తెలంగాణాలో, ఇటు సీమంద్ర రెండు ప్రాంతాలలో నష్టపోయింది. తెదేపాకు తెలంగాణా చాలా బలమయిన క్యాడర్ ఉన్నపటికీ పార్టీ అధిష్టానం కానీ, పార్టీలో తెలంగాణా నేతలు గానీ వారికి దైర్యం చెప్పి అండగా నిలబడకపోవడంతో ఇదే అదునుగా తెరాస తమ పార్టీలోకి వలసలు ప్రోత్సహించింది.

 

తెలంగాణాలో తెదేపాను దెబ్బతీయడం తెరాసకు ఎంత అవసరమో కాంగ్రెస్ కి కూడా అంతే అవసరం. కాంగ్రెస్ అధిష్టానానికి రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేసేందుకు యంపీ సీట్లు కావాలి. కేసీఆర్ లేదా ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి అయ్యేందుకు తెరాసకు యం.యల్యే. సీట్లు కావాలి. అయితే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురులేకుండా చేసుకొనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ తెరాసను విలీనం చేసుకొనేందుకు గట్టిగా పట్టు బట్టిందని అందరికీ తెలుసు. కానీ, తెరాసను విలీనం చేసుకొని తెలంగాణాలో బలమయిన క్యాడర్ ఉన్న తెదేపాను విడిచిపెట్టడం శత్రుశేషమే అవుతుంది. కనుక ఆ ప్రయత్నంలో తెరాసపై గట్టిగా ఒత్తిడి తెచ్చి తెదేపా నేతలని, క్యాడర్ ని పార్టీలోకి ఆకర్షించేందుకు గట్టిగా ప్రయత్నాలు చేసింది. అయితే, ఎక్కడా తన పాత్ర బయటపడకుండా తనలో విలీనం కాబోతున్న తెరాసనే ముందుంచి పని కానిచ్చేయాలని ఆలోచనతోనే కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన అంశానికి చివరి వరకు నొక్కిపడుతూ అనేక ట్విస్టులు ఇస్తూ ప్రజలనే కాదు తెరాసను దాని అధ్యక్షుడు కేసీఆర్ ని సైతం ఉక్కిరిబిక్కిరి చేసింది. పార్లమెంటులో తెలంగాణా బిల్లు ప్రవేశపెట్టినా కూడా అది ఆమోదం పొందుతుందో లేదో తెలియని పరిస్థితులు కల్పించడంతో ఎవరికీ తల వంచని కేసీఆర్ సోనియాగాంధీ ముందు సాగిలపడినంత పని చేయడం అందరికీ తెలిసిన విషయమే.

 

ఆ రెండు పార్టీల మధ్య తెదేపా నలిగి నష్టపోయింది. కానీ వారు ఆశించినట్లుగా తెలంగాణాలో తెదేపాను మాత్రం పూర్తిగా ఖాళీ చేయలేకపోయారు. ఈ పరిస్థితుల్లో తెరాస కాంగ్రెస్ లో విలీనం అయిపోతే, ఇక తెలంగాణాలో తెదేపా తప్ప మరో బలమయిన ప్రతిపక్షం ఉండదు. ఇదే అదునుగా తెదేపా-తెలంగాణ నేతలయిన ఎర్రబెల్లి, రావూరి, మోత్కుపల్లి, రేవంత్ రెడ్డి, రమణ తదితరులందరూ ఒక్క త్రాటిపైకి వచ్చి గట్టిగా, పట్టుపడితే నేటికీ తెదేపా మళ్ళీ బలపడి పూర్వ వైభవం పొందే అవకాశం ఉంది.

 

రాష్ట్ర విభజన వెనుక కాంగ్రెస్ అధిష్టానం ఉద్దేశ్యం తెలంగాణాలో తనకు ఎదురు లేకుండా చేసుకోవడమే కానీ తెదేపాను బలపడేలా చేయడం కాదు. కనుకనే, అంతవరకు ఒకరినొకరు కౌగలించుకొన్నంత పనిచేసిన కాంగ్రెస్-తెరాసలు అకస్మాత్తుగా శత్రువులుగా మారిపోయి విలీన ఒప్పందం తెంచేసుకొని ఉండవచ్చును. ఇప్పుడు కాంగ్రెస్-తెరాసలు వేర్వేరుగా తెదేపాలో బలమయిన నేతలకి, ముఖ్యంగా అసంతృప్తిగా ఉన్న ఎర్రబెల్లి, మోత్కుపల్లి వంటి వారికి టికెట్స్ ఆశ చూపి తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు ముమ్మురం చేయవచ్చును.

 

తెదేపా-తెలంగాణా కమిటీ వేసిన తరువాత, పార్టీ సారధ్య బాధ్యతల కోసం, తెలంగాణా అధ్యక్ష పదవి కోసం ఎలాగూ పార్టీలో లుకలుకలు మొదలయ్యే అవకాశం ఉంది గనుక, అదే అదునుగా ఆ రెండు పార్టీలు టికెట్స్ ఎరగా వేసి వలసలను ప్రోత్సహించి తెదేపాను పూర్తిగా బలహీనపరిచే ప్రయత్నం చేయవచ్చును. మరి ఇంతవరకు అనేక అగ్ని పరీక్షలు ఎదుర్కొన్న తెదేపా ఈ అంతిమ పరీక్ష ఏవిధంగా ఎదుర్కొంటుందో చూడవలసి ఉంది.

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.