కాళేశ్వరం కమిషన్ ఎదుటకు కేసీఆర్

Publish Date:Jun 11, 2025

Advertisement

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  కాళేశ్వరం కమిషన్  ముందు విచారణకు హాజరయ్యారు.  సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ నుంచి  బయలుదేరి ఆయన నేరుగా బీఆర్కే భవన్ కు చేరుకున్నారు.  ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో వెంట ఈ విచారణకు వచ్చేందుకు  మాజీ మంత్రి హరీష్‌రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, పద్మారావుగౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కమిషన్ అనుమతించింది.  ఇలా ఉండగా కేసీఆర్ విచారణ కమిషన్ ముందు హాజరు కావడానికి బయలుదేరుతుండగా ఎర్రవల్లి ఫాం హౌస్ లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరావు కాలు జారి పడిపోయి గాయపడ్డారు. దీంతో ఆయనను సికిందరా బాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు.    ఆ తరువాత మార్గమధ్యంలో కేసీఆర్ కాన్వాయ్ లోని రెండు కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. కమిషన్ విచారణకు హాజరయ్యే ముందు ఈ అపశ్రుతులేంటంటూ బీఆర్ఎస్ శ్రేణులు మధనపడుతున్నాయి. 

కాగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరు నేపథ్యంలో బీఆర్క్కే భవన్ కు వచ్చే దారులలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అలాగే బీఆర్కు భవన్ లోకి  అందులో పని చేసే ఉద్యోగులను వినా మరెవరినీ అనుమతించడం లేదు. అలాగు బీఆర్కే భవన్, జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు రోడ్డుని పూర్తిగా మూసి వేశారు.  

ఇలా ఉండగా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావడానికి ముందు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సామాజిక మాధ్యమంలో చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో ఆయన కేసీఆర్ ను కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు నిలబెడితే ఆయన ఖ్యాతి ఇసుమంతైనా తగ్గదని  పేర్కొన్న కేటీఆర్ కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పటి ఫోటోను ఆ పోస్టుకు జత చేశారు. 

By
en-us Political News

  
గత జూన్ 12 వ తేదీన, అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు, రూ.500 కోట్లతో, ఎఐ 171 ట్రస్టును ఏర్పాటు చేయాలని టాటా సన్స్, నిర్ణయించింది.
నెల్లూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. జులై 6 న మంత్రి లోకేశ్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో ఆదుకోవాలని కార్యకర్త లోకేష్‌కి విజ్ఞప్తి చేశారు
మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి చంపేస్తామని బెదిరింపు కాల్ వచ్చింది. మరికాసేపట్లో చంపేస్తామని.. ఆపరేషన్ కగార్ ఆపాలని బెదిరించినట్లు తెలుస్తోంది.
కేంద్ర పసుపు బోర్డు కార్యాలయాన్ని నిజామాబాద్‌ వినాయక్‌నగర్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మాజీ సీఎం కేసీఆర్ క్షమించినా యెల్లో మీడియాను మేము వదిలిపెట్టమని మాజీ మంత్రి జగదీష్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు
ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో 24 గంటల పాటు చార్ ధామ్ యాత్రను నిలిపేశారు.
ఏపీ లిక్కర్ స్కాం.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన అంశం ఇది. గత ప్రభుత్వం మద్యం కుంభకోణంలో కోట్లాది రూపాయలు దొడ్డిదారిన స్వాహా చేసి బినామీ కంపెనీలు.. హవాలా మార్గంలో తెచ్చుకుని ఎన్నికలకు వినియోగించారనేది సిట్ విచారణలో వెలుగులోకి వస్తున్నాయి
ఈ క్యూఆర్ కోడ్ క్యాంపెయిన్ మెయిన్ మోటో అంటే ఏంటంటే.. రీకాలింగ్ ఆఫ్ చంద్ర‌బాబు మేనిఫెస్టో. దీన్ని కొత్త‌గా నిర్వ‌హించాల‌ని థింక్ చేసిన జ‌గ‌న్ అండ్ కో.. స్వామి కార్యం స్వ‌కార్యం చ‌క్క‌బెట్టే య‌త్నం చేస్తోంద‌ని అంటున్నారు.
యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్వేచ్చ సుసైడ్‌కి కారణమన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ రాత్రి 11 గంటలకు న్యాయవాది సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిరు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దాదాపు ఏడాది కాలం తర్వాత పెద్దారెడ్డి సొంత ఇంటికి చేరుకున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆయన ఇంటికి వచ్చిన పోలీసులు తాడిపత్రి ఇంట్లో ఉండరాదంటూ విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. సిట్టింగ్ బీర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉపఎన్నిక అనివార్యమైన జూబ్లీ నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తున్నాయి.
పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు.
వైసీపీ సీనియర్ నేత పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. వైసీపీ అధికరంలో ఉన్నన్నాళ్లూ దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోయిన పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఇప్పుడు కలుగులో దూరిన ఎలుకలా మారిపోయారు. కేసుల చట్రంలో ఇరుక్కుని బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితికి చేరుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.