పిట్టల దొరసాని వచ్చింది...కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్ సెటైర్లు

Publish Date:Apr 25, 2026

Advertisement

 

ఇన్నాళ్లూ పిట్టలదొర క్యారెక్టర్ చూశాం..

ఇకపై పిట్టల దొరసాని వేషము చూడాలి అర్వింద్ సెటైర్లు

తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ తనదైన శైలిలో స్పందించింది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ పోస్ట్ చేసింది. ఈ మేరకు తన ఎక్స్ ఖాతా వేదికగా బీఆర్ఎస్ పార్టీ పోస్ట్ చేసింది. కవిత ప్రకటించిన కొత్త పార్టీ తెలంగాణ రాష్ట్ర సేనపై  అధికార కాంగ్రెస్ ఎటాక్ ప్రారంభించింది. బీఆర్ఎస్ తోక పార్టీనే కవితక్క ప్రారంభించిన ఈ కొత్త పార్టీ (తెలంగాణ రాష్ట్ర సేన) అని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఇవాళ ట్వీట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. తలా తోక ఎప్పటికీ ఒక్కటేనని బాపు బీఆర్ఎస్ అంతర్భాగమే తనయ టీఆర్ఎస్.. అంతా గ్యాస్ అంటూ సెటైర్ వేశారు.


బీజేపీ నేతలు తమదైన శైలిలో స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్, కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవితను తాము ఎప్పుడో మర్చిపోయామని, ఇప్పుడు మళ్లీ ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఆమె తీసుకున్న నిర్ణయం ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీసింది.గతంలో కవితపై 'పిట్టలదొర' అని విమర్శించిన అర్వింద్, ఇప్పుడు ఆమె కొత్త పార్టీ ఏర్పాటును ఉద్దేశించి 'పిట్టల దొరసాని' పాత్రను పోషిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా టీఆర్ఎస్ హ్యాంగోవర్‌లోనే బతుకుతున్నారని, వాస్తవాలను గుర్తించడం లేదని ఆయన విమర్శించారు.

మరోవైపు, రాష్ట్ర బీజేపీ నాయకుడు రాంచందర్ రావు మాట్లాడుతూ, ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చినా, రాష్ట్రంలో బీజేపీని ఏమీ చేయలేవని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని ఆయన గుర్తుచేశారు.బీఆర్ఎస్ నుండి పుట్టినదే టీఆర్ఎస్ అని రాంచందర్ రావు ఆరోపించారు. కవిత ప్రారంభించబోయే కొత్త పార్టీ రాజకీయ అస్తిత్వంపై అనేక అనుమానాలు ఉన్నాయని, ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమేనని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

ప్రస్తుతం కవిత తన రాజకీయ ప్రస్థానంలో తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఉన్న ప్రధాన పార్టీల మధ్య, కవిత కొత్త పార్టీ తన ప్రభావాన్ని ఎలా చూపుతుందో వేచి చూడాల్సిందే.ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజలు దీన్ని కేవలం ఒక రాజకీయ వ్యూహంగా చూస్తారా లేక ఆదరిస్తారా అనేది భవిష్యత్తులో తేలనుంది.
 

By
en-us Political News

  
ఎమ్మెల్సీ అనంతబాబు సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలను తీవ్రంగా పరిగణించిన కాకినాడలోని మొబైల్ కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది.
తమకు ఇష్టం లేని గర్భాన్ని కొనసాగించమని బలవంతం చేయడం వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని లోక్ భవన్‌కు వెళ్లారు.
ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది.
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే, కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.