శబరిమల ఆలయం సమీపంలో హెలికాప్టర్ చక్కర్లు.. విచారణకు ప్రభుత్వం ఆదేశం

Publish Date:Apr 25, 2026

Advertisement

కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంపై ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ చాలా తక్కువ ఎత్తులో ప్రయాణించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అత్యంత సున్నితమైన,  రక్షణ పరంగా కట్టుదిట్టమైన భద్రత ఉండే శబరిమల క్షేత్రంపై ఇలా నిబంధనలకు విరుద్ధంగా హెలికాప్టర్ ఎగరడంపై కేరళ ప్రభుత్వం స్పందించి,  ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది.

సాధారణంగా శబరిమల ఆలయ పరిసరాలను  నో ఫ్లై జోన్ గా పరిగణిస్తారు. ఇక్కడ ఎటువంటి విమానాలు లేదా హెలికాప్టర్లు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే,   కోస్ట్ గార్డ్‌కు చెందిన హెలికాప్టర్ ఆలయ గోపురం మరియు పరిసర ప్రాంతాల్లో చాలా తక్కువ ఎత్తులో పదేపదే చక్కర్లు కొట్టినట్లు భక్తులు, ఆలయ సిబ్బంది గుర్తించారు. ఇది భద్రతా పరమైన ప్రోటోకాల్‌ను ఉల్లంఘించడమేనని దేవస్థానం బోర్డు అంటోంది.  

ఈ పరిణామంపై ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయ పవిత్రతకు, భద్రతకు భంగం కలిగించేలా ఉన్న ఈ చర్యపై పోలీసు శాఖ మరియు పౌర విమానయాన సంస్థలకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతోంది.   కేరళ దేవాదాయ శాఖ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని సమగ్ర విచారణకు ఆదేశించింది. 

ఇలా ఉండగా.. అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల శబరిమల సన్నిధానం మీదుగా కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ ప్రయాణించిన ఘటనలో ఎలాంటి భద్రతా లోపం లేదని తెలిసింది.  హెలికాప్టర్ ప్రయాణిస్తున్న సమయంలోనే అధికారులకు సమాచారం అందిందనీ..  సాంకేతిక సమస్యల కారణంగా హెలికాప్టర్ దిశ మార్చుకుందని  అధికారులు తెలిపారు.  పెరియార్ టైగర్ రిజర్వ్   అడవుల మధ్యలో ఉన్న శబరిమల ఆలయ ధ్వజస్తంభానికి కేవలం కొన్ని మీటర్ల ఎత్తులో గురువారం (ఏప్రిల్ 23) మధ్యాహ్నం  సీజీ 821 చేతక్ హెలికాప్టర్ ఎగురుతున్న దృశ్యాలను ఆలయ సిబ్బంది ఒకరు వీడియో తీశారు. 

కాగా దీనిపై భారత కోస్ట్ గార్డ్  అధికారులు వివరణ ఇచ్చారు. కొచ్చి నుండి సాధారణ శిక్షణ  విమానయానంలో ఉన్న సీజీ 821 హెలికాప్టర్, ఆ ప్రాంతంలో  ఎత్తైన మేఘాలు ప్రతికూల వాతావరణం కారణంగా.. పంపాలోని ఆలయం కొండల మీదుగా ప్రయాణించిందని భారత కోస్ట్ గార్డ్ అధికారులు తెలిపారు. 

By
en-us Political News

  
భారతదేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు అత్యంత కీలమైన పెన్షన్ విధానంలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి.
ఇప్పటికిప్పుడు ఉద్యోగాలకు ఎలాంటి ముప్పూ లేదని అంటున్నారు కొలంబియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విశాల్ మిశ్రా. మనుషులతో సమానమైన సృజనాత్మకత, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ప్రస్తుత ఏఐకి లేవని మిశ్రా కుండబద్దలు కొట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలోని లోక్ భవన్‌కు వెళ్లారు.
ఈ అసాధారణ పరిణామం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పెట్రోల్ ధర లీటరుకు సగటున 1.22 డాలర్లకు, డీజిల్ ధర 1.238 డాలర్లకు చేరింది.
తెలంగాణ రాజకీయాల్లో మరో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. క
48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు.
ప్రధానంగా మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు ఈ స్కామ్‌లో కీలక సూత్రధారిగా భావిస్తున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు.
ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్‌కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
అమెరికా ప్రతినిధుల బృందంలో ట్రంప్ సన్నిహితుడు జారెడ్ కుష్నర్‌తో పాటు ప్రత్యేక దూత స్టీవ్ విట్‌కాఫ్ ఉన్నారు. వీరిద్దరూ ఇస్లామాబాద్ చేరుకుని, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ముఖాముఖి భేటీ అవుతారు. ఈ పర్యటన ద్వారా ఇరాన్‌తో ఉన్న విభేదాలను దౌత్యపరంగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ భావిస్తోంది.
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించగా, మరోవైపు గుజరాత్ యువ సంచలనం సాయి సుదర్శన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో దిగ్గజాల రికార్డులను తిరగరాశాడు. అభిమానులకు కనువిందు చేసిన ఈ పోరులో ఇరు జట్ల ఆటగాళ్లు వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించారు.
సమ్మె విరమిస్తున్నట్లు కార్మిక సంఘాల ఐక్యకార్యాచరణ సమితి (జేఏసీ) ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి వరకు కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు ఫలప్రదమవ్వడంతో, శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి.
చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు కేవలం 47 బంతుల్లోనే 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి మ్యాచ్‌ను గుజరాత్ నుంచి లాగేసుకున్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.