పాకిస్తాన్ కు ఇక 'మోది'నట్టే!

Publish Date:Sep 23, 2016

Advertisement

 

పాకిస్తాన్ కు భారత్ ని కవ్వించటం ఇప్పుడు కొత్త కాదు. అసలు అది ఏర్పడ్డప్పటి నుంచే ఇండియాని టార్గెట్ చేసుకుని బతికేస్తోంది. 1947లో రెండూ స్వతంత్ర దేశాలుగా ఉనికిలోకి వస్తే అదే సంవత్సరం కాశ్మీర్ ఆక్రమణ కారణంగా పాక్ తో యద్ధం చేయాల్సి వచ్చింది భారత్. అప్పట్నుంచి మొదలైన పాక్ కవ్వింపులు మొన్నటి యూరి అమానుషం దాకా కొనసాగుతూనే వున్నాయి. కాని, ఇలాంటి కవ్వింపులు పాతవే అయినా... మోదీ మార్కు జవాబు పాకిస్తాన్ కు కొత్తగా వుంది. దాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది నమో దండోపాయం!

 

పాక్ ఎప్పటిలాగే నలుగురు ఉగ్రవాదుల్ని పంపి మన జవాన్లు ఇరవై మందిని పొట్టన పెట్టుకుంటే కొన్నాళ్లకు అంతా సర్దుకుంటుందని భావించింది. కాని, ఈ సారి ఇటు జనం , అటు ప్రభుత్వం రెండు వైపులా ఆగ్రహంతో వున్నారు. అందుకే, మోదీ మౌనంగా పాక్ ను అధః పాతాళానికి తొక్కే ప్రయత్నం మొదలు పెట్టాడు! అంతా భావించినట్టుగా ప్రత్యక్ష యుద్ధం జోలికి పోకుండా అంతర్జాతీయ సమాజంలో పాక్ ను ఒంటరిని చేసే కార్యక్రమం మొదలు పెట్టింది మోదీ సర్కార్. యూఎస్ మొదలు బంగ్లాదేశ్ వరకూ దాదాపు అన్ని దేశాలు ఇప్పుడు పాక్ ని ఛీకొడుతున్నాయి. అమెరికా అయితే ఏకంగా పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటిస్తూ బిల్లు కూడా పాస్ చేసే ఆలోచనలో వుంది. మరో వైపు రష్యా పాకిస్తాన్ తో మిలటరీ విన్యాసాలు మానుకుంది. ఇలా అన్ని దేశాల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది పాక్ కి. 

 

పాకిస్తాన్ కి తాజాగా జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మీటింగ్లో కూడా దిమ్మ తిరిగిపోయింది. ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ ఎప్పటిలాగే బూతు మాటలు మాట్లాడాడు తన స్పీచ్ లో. మరీ దిగజారిపోయి హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ నాయకుడైన బుర్హాన్ వనీని కాశ్మీరీ ఉద్యమకారుడంటూ పేర్కొన్నాడు. ఒక దేశ ప్రధాని ఇలా నిస్సిగ్గుగా ఉగ్రవాదిని వెనకేసుకు రావటం పాక్ దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పుడిక పాకిస్తాన్ కు మిగిలిన ఏకైక మిత్ర దేశం చైనానే! 

 

చైనా కూడా పాక్ తో జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. యూఎన్ మీటింగ్ జరిగాక చైనా పీఎంతో భేటీ అయిన నవాజ్ షరీప్ చర్చలు ఫలప్రదం అయ్యాయంటే చైనీస్ వారు మాత్రం పాక్ తమకు మంచి మిత్రదేశం అని మాత్రమే కామెంట్ చేశారు. కాశ్మీర్ సమస్య గురించి, ఇండియా గురించి వారు ఎక్కడా మాట్లాడలేదు. అసలు కాశ్మీర్, ఉగ్రవాదాల విషయంలో చైనా కూడా పాక్ కు పూర్తి మద్దతు ఇస్తుందన్న భరోసా లేకుండా పోయింది ఇస్లామాబాద్ కి! ఇది ఖచ్చితంగా మోదీ మార్కు అంతర్జాతీయ దౌత్యమే అనాలి. ఆయన పదే పదే చేసిన ప్రపంచ పర్యటనల ఫలితం అనే చెప్పుకోవాలి!

 

పైకి స్పష్టంగా చెప్పకపోయినా ఆల్రెడీ మన ఆర్మీ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ప్రవేశించి అక్కడి ఉగ్రవాద క్యాంపులపై దాడి చేసిందని అంటున్నారు. ఇలాంటి సీక్రెట్ ఆపరేషన్స్ ఏ దేశం కూడా తనంత ఒప్పుకోదు కాబట్టి నిజంగా జరిగిందా లేదా తెలియదు. కాని, ఇండియా ఏ క్షణంలో అయినా తన మీద దాడి చేస్తుందని పాక్ భయపడుతున్న మాట మాత్రం వాస్తవం. అందుకు తగ్గట్టే యుద్ధ సన్నాహాలు చేసుకుంటోంది ఆ దేశం! 

 

ఒకవైపు దౌత్య, ఆర్మీ పరమైన ఒత్తిళ్లు పెంచుతూనే మోదీ ఉగ్రదేశం పాక్ పై ఇంకో రూట్ లోనూ ప్రెషర్ పెంచుతున్నారు. ఎప్పుడో నెహ్రు టైంలో పాక్ మనతో సింధు జలాల విషయమై ఒప్పందం చేసుకుంది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీని కూడా పునః సమీక్షిస్తామని ప్రకటించారు ఇండియన్ అధికారులు! దీనర్థం భారత్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే సింధు జలాలు ఇంత కాలం వంద శాతం వాడుకునేది పాక్. ఇకపై అలా జరగకుండా నీటిని అడ్డుకుంటాం అని అర్థం! ఇండియా ఈ పని చేస్తే పాక్ ఆకలితో నకనకలాడిపోవాల్సి వస్తుంది. సింధు నది పాకిస్తాన్ కి అతి పెద్ద జీవనాధారం. కాని, ఇప్పటి వరకూ మన ప్రభుత్వాలు ఆ నదిపై ఎలాంటి హక్కునూ కోరలేదు. మొత్తం నీరంతా పాక్ వాడేసుకుంటోంది. మోదీ ఇండస్ నదిపై చూపు పెట్టడంతో పాక్ గడగడలాడిపోతోంది.. 

 

పాకిస్తాన్ ఇండియా వచ్చి యుద్ధం చేస్తుందేమో అన్న భయంలో ఎంతగా వుందంటే.. అసలు ఎలాంటి ప్రకటనా మన వద్ద నుంచి ఇప్పటి వరకూ రాకుండానే ఆ దేశ స్టాక్ ఎక్స్ ఛేంజ్ కుప్పకూలిపోయింది! అసలు పాక్ కు స్టాక్ ఎక్స్ ఛేంజ్ వుందా అంటారా? సోషల్ మీడియాలో చాలా మంది ఇదే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అసలు అత్యంత దారుణమైన ఆర్దిక స్థితిలో వున్న దాయాది దేశం ఇండియా ఆగ్రహాన్ని పదే పదే రెచ్చగొట్టి ఇంత కాలం తప్పు చేసింది. ఇప్పుడిక ఫైనల్ గా మోదీ శకంలో అంతిమ ఫలితం చవి చూడబోతోంది! చేసుకుంటూ వచ్చిన పాపాలకి మూల్యం చెల్లించబోతోంది! 

By
en-us Political News

  
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.