స్వంత దేశంలో హిందువులు శరణార్థులు అవుతున్నారా? 

Publish Date:Sep 23, 2016

Advertisement

 

మన దేశంలో హిందూ అతివాదులు వున్నారు నిజమే. వాళ్ల నుంచి మైనార్టీలకు ప్రమాదం వుంటే వుండొచ్చు కూడా! కాని, మన దేశంలో కుహనా లౌకికవాదం కూడా వుంది. ఈ సూడో సెక్యులరిజమ్ మనం గుర్తించలేనంత పెద్ద ప్రమాదం. పైగా దీనికి కారణం ఏ ముస్లిమ్ లో, క్రిస్టియన్లో కాదు. వ్యక్తిగతంగా హిందువులే అయిన మన అతి సెక్యులర్ నేతలు! 

 

ఎన్నికల సమయంలో మైనార్టీలు మూకుమ్మడిగా ఓటు వేస్తారు. అందుకే, వాళ్లను ప్రసన్నం చేసుకోటానికి మన నాయకులు బోలెడన్ని జిమ్మిక్కులు చేస్తుంటారు. నిజంగా మైనార్టీల జీవితాల్ని బాగు చేసే పనులు కాకుండా వింత వింత హామీలు ఇస్తుంటారు. ఇఫ్తార్ విందుల్లో ఫోటోలు దిగటం మొదలు హజ్ యాత్రకు సబ్సిడీ వరకూ మన నాయకులు చేయని మైనార్టీ అపీస్ మెంట్ లేదు. కాని, కొన్ని రాష్ట్రాల్లో ఇది మరీ దారుణంగా తయారవుతోంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో నేతల సెక్యులర్ ఛాందసవాదం మరీ మితిమీరుతోంది. ఇందుకు తాజాగా వెలువడిన జాతీయ మానవ హక్కుల కమీషన్ నివేదికే మంచి ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ లో సమాజ్ వాది పార్టీ అధికారంలోకి వస్తే ఆజం ఖాన్ లాంటి ముస్లిమ్ నేతల అరాచకం పెరిగిపోతుంది. సామాన్య పేద ముస్లిమ్ లకు ఏం చేయకున్నా హిందువులపై దాడులు చేసేస్తుంటారు సమాజ్ వాది గుండాలు. దాని ఫలితమే గత నాలుగేళ్లలో వందల సంఖ్యలో జరిగిన మత కలహాలు. ఉత్తర్ ప్రదేశ్ లో ముజఫర్ నగర్ మత కలహాలు సహా ఎన్నో జరిగాయి ఈ మధ్య. అయితే , అవేవీ చాలా వరకూ ప్రధాన స్రవంతిలోని మీడియా దాకా రాలేదు. చాలా సార్లు మీడియాలో కూడా వున్న ఆదర్శవాద, అభ్యుదయవాద, లెఫ్ట్ జర్నలిస్టులు వాట్ని చూసీ చూడకుండా వదిలేశారు. దాంతో ఉత్తర్ ప్రదేశ్ లో అరాచకం అడ్డు లేకండా పోయింది!

 

కొన్నాళ్ల కింద బీజేపి ఎంపీ హుకుమ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా ప్రాంతం నుంచి హిందువులు వలసపోవాల్సి వస్తోందని ప్రకటన చేశాడు. వందల సంఖ్యలో హిందూ కుటుంబాలు స్థానిక మైనార్టీ రౌడీల భయంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని ఆయన అన్నాడు. సమాజ్ వాది నేతల అండతో మైనార్టీ గూండాలు రెచ్చిపోతున్నారని చెప్పుకొచ్చాడు. కాని, అప్పుడు మీడియా, మేధావులు అంతా అతడ్ని తిట్టిపోశారు. వెటకారం చేశారు. బీజేపి ఎంపీ కాబట్టి హిందూ ఓట్ల కోసం అలా మత భావనలు రెచ్చగొడుతున్నాడని ఆరోపించారు! 

 

కైరానాలో నిజంగా హిందువులు మైనార్టీ వర్గానికి చెందిన సంఘ వ్యతిరేక శక్తులకి భయపడి వలసపోయారా? ఈ ప్రశ్నకి సమాధానం కనుక్కునేందుకే జాతీయ మానవ హక్కుల కమీషన్ విచారణ జరిపింది. తన రిపోర్ట్ సిద్ధం చేసింది. దాంట్లో కైరానాలో హిందువుల వలసలు నిజమేనని తేల్చింది! 

 

ఉత్తర్ ప్రదేశ్ లోనే కాదు బెంగాల్ లోనూ మమతా బెనర్జీ మార్కు లౌకికవాద ఓటు బ్యాంకు పాలన నడుస్తోంది. అక్కడి మాల్డా ప్రాంతంలో ఆ మధ్య మైనార్టీలు భీకరంగా హిందువుల ఆస్తులపై దాడులు చేశారు. అయినా మమతా బెనర్జీ ఎటువంటి గట్టి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నిజానికి బంగ్లాదేశ్ అక్రమ చొరబాట్ల కారణంగా బెంగాల్లో అనేక చోట్ల మైనార్టీలే మెజార్జీలుగా మారిపోతున్నారు. ఇలా జనాభాలో అసహజంగా మార్పులు చేసుకుంటే అది దేశ భవిష్యత్తు కే ప్రమాదం. కాని, మన ఓటు బ్యాంకు రాజకీయ నేతలకు అవేవీ పట్టటం లేదు! 

 

ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన హిందువుల వలసల కారణంగా దేశంలోని ముస్లిమ్ లను తప్పు పట్టటానికి ఏం లేదు. వాళ్లు ఎప్పటిలాగే పేదరికంలో మగ్గిపోతున్నారు. కాని, వాళ్లను, వాళ్ల ఓట్లను, వాళ్ల భయాన్ని అడ్డుపెట్టుకుని స్వార్థ రాజకీయ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు! ఇదే విషాదం. అటు మైనార్టీలు, ఇటు మెజార్జీలు ఇద్దరూ ఇబ్బందుల్లో, భయాల్లో మునిగిపోతుంటే ... నేతలు మాత్రం అధికారం మరుగుతున్నారు! 

By
en-us Political News

  
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. సొంత రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న వేళ, ఆమె ప్రారంభించబోయే పార్టీ పేరుపై గత కొంత కాలంగా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ సాగింది. కల్వకుంట్ల కవితకు తెలంగాణ సమాజంలో ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన తెలంగాణ జాగృతి పేరునే ఆమె తన కొత్త పార్టీకి పెట్టబోతున్నట్లు మొదట్లో వార్తలు వినవచ్చినా.. కవిత తాజా వ్యాఖ్యలతో ఆమె టీఆర్ఎస్ పేరుతోనే కొత్త పార్టీ ఏర్పాటు చేయనున్నారన్న వాదనకు బలం చేకూరింది.
ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో పలు రాష్ట్రాల అధ్యక్షులతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు ఇరు రాష్ట్రాల ఇన్‌చార్జ్ కార్యదర్శులు హాజరయ్యారు. పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాని ముందు ఉన్న గడువులో అన్ని రాష్ట్రాలలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో స్పష్టమైంది. సుమారు 125 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఆడుదాం ఆంధ్రలో 40 నుండి 60 కోట్ల రూపాయల మేర అక్రమాలు జరిగాయని అంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీ షోర్ హైవే ప్రాజెక్టుతో పాటు, రాజధాని అమరావతిని అనుసంధానిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హై-స్పీడ్ రైల్ కారిడార్లు రాష్ట్ర ప్రగతికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. తీర ప్రాంత అభివృద్ధిని, రాజధాని రవాణా సౌకర్యాలను ఏకకాలంలో మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
పొంగులేటి ప్ర‌స్తుతం మంత్రిగా నిర్వహిస్తున్న మైనింగ్ శాఖ‌, గ‌తంలో కేటీఆర్ నిర్వ‌హించ‌గా.. ఆ స‌మ‌యంలో ఎన్ని అక్ర‌మాలు జ‌రిగాయో.. ఎన్నేసి అరాచ‌కాలు న‌డిచాయో.. గ‌త అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చ‌దివి వినిపించిన సంగ‌తి తెలిసిందే. వీటిపై సీబీసీఐడీ ఎంక్వ‌యిరీ కూడా వేస్తామ‌ని సీఎం ప్ర‌క‌టించిన సంగ‌తీ విదిత‌మే. ఈ అక్ర‌మాల్లో త‌న సోద‌రుడి ప్ర‌మేయం కూడా ఉండ‌టంతో.. ఉలిక్కి ప‌డ్డ హ‌రీష్ రావు, ఈ శాఖామాత్యుడైన‌ పొంగులేటిని త‌న టార్గెట్ గా ఫిక్స్ చేసిన‌ట్టు స‌మాచారం.
ది ఉద్యోగాల కోసం వంద‌లాది మంది ఫీజులు క‌ట్టి మ‌రీ రాస్తుంటే ఆ వ‌చ్చే ప‌ది ఉద్యోగాలు పొందిన వారినుంచి ఫీజు వ‌సూళ్ల‌ వ‌ర‌కూ ఓకే.. మిగిలిన అంద‌రి ఫీజులు వాప‌స్ ఎందుకివ్వ‌ర‌ని ప్రశ్నించారు. అంతే కాదు సామాన్యుడి త‌రఫున కూడా విలక్షణ శైలిలో తన గళమెత్తుతున్నారు. టికెట్ కొని కూడా రైల్లో ఒక సాధార‌ణ ప్ర‌యాణికుడు నిల‌బ‌డి ప్ర‌యాణించాల్సి పరిస్థితి ఏంటి? వంటి ప్ర‌శ్న‌లతో రాఘవ్ చద్దా సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.