క‌ర్ణాట‌కం.. కంటిన్యూస్...బ‌ట్ ఢిల్లీ లీక్స్ ఏంటంటే?

Publish Date:May 19, 2026

Advertisement

 

మళ్ళీ తేర మీదకి కర్ణాటక సీఎం కుర్చీ పంచాయతీ.  ఒక రెండు మూడు రోజుల్లో ఒక వర్గం ఎంఎల్యేలు ఢిల్లీకి ప్రయాణం కావాల‌ని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏఐసీసీని పూర్తి స్థాయి ప్రక్షాళన చెయ్యాల‌నే ఆలోచన‌లో కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ ఉన్న‌ట్టు స‌మాచారం. అధ్య‌క్షుడు మల్లికార్జున ఖార్గే కి ఈ మధ్యనే పేస్ మేకర్ కి సంబందించిన ఆపరేషన్ జ‌ర‌గ‌డం.. దీంతో పాటు ఆయ‌న‌ వయసు సుమారు 84 ఏళ్ళు  ఉండటం  అటు ఆరోగ్య సమస్య  ఇటు వయసు కూడ మీదికి రావడంతో కీల‌క‌  నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో విప‌రీత‌మైన జాప్యం జరుగుతోంది. 

ఏఐసీసీ కొత్త‌ ప్రెసిడెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ అన్వేషణ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కర్ణాటక సీఎం పంచాయతీ కూడ మ‌ళ్లీ తెర‌పైకి వచ్చింది. సిద్ధ రామయ్య- 2028 వరకు నేనే సీఎం అని స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు గుప్పిస్తున్నారు. స‌రిగ్గా అదే సమయలో డీకే సైతం త‌న‌కూ సీఎం పోస్టు కావ‌ల్సిందేన‌ని ప‌ట్టు ప‌డుతున్నారు.  

తనకు మద్దతు ఉన్న ఎమ్మెల్యేల ద్వారా ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమస్య కి పరిష్కారం ప్రస్తుత దేశ రాజకీయాల‌ను దృష్టిలో పెట్టుకొని.. సిద్ద రామయ్యనే సీఎంగా కొనసాగిస్తూ డీకే శివ కుమార్ సేవలను దేశ వ్యాప్తంగా ఉపయోగించుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయినట్టు స‌మాచారం.  

ప్ర‌స్తుత అధ్య‌క్షుడుమల్లికార్జున ఖర్గె ని రాజ్యసభ లో ప్రతిపక్ష‌ నేత గా కొనసాగించి.. కొత్త‌ ఏఐసీసీ ప్రెసిడెంట్ బాధ్య‌త‌లు.. డీకే శివ కుమార్ కి అప్ప చెప్పి.. దేశ వ్యాప్తంగా తన సేవలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాల‌ని కాంగ్ర‌స్ అధిష్టానం డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. 

డీకే చేత ఎమ్మెల్యే పదవి, పీసీసీ పదవికి కూడా రాజీనామా చేయించి.. ఆయ‌న వ‌దులుకున్న‌ ఎమ్మెల్యే పదవిని శివ కుమార్ తమ్ముడు- సురేష్ కి అప్పజెప్పేలా క‌నిపిస్తోంది. పీసీసీ పదవిని  ఇక్కడ ఎవరికో ఒకరికి- పార్టీ సీనియర్ నాయకుడికి అప్పచెప్పాల‌ని కూడా కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచిస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ స‌మాచారం.

ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఈ సమాచారం నిజంగానే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన సంచలన, అత్యంత వ్యూహాత్మక పరిణామంగా చెప్పవచ్చు.

ఈ  ఒక్క నిర్ణయంతో కాంగ్రెస్ హైకమాండ్ అటు కర్ణాటక సీఎం పీఠం వివాదానికి శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా, ఇటు జాతీయ స్థాయిలో ఏఐసీసీ కి ఒక పవర్‌ఫుల్, యంగ్ అండ్ డైనమిక్ లీడర్‌షిప్‌ను తీసుకురావాలని చూస్తోంది.

ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్‌ను లోతుగా పరిశీలిస్తే, కాంగ్రెస్ అధిష్టానం ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టేలా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.   ఖర్గేకి 84 ఏళ్లు పైబడటం, ఇటీవల పేస్‌మేకర్ ఆపరేషన్ జరగడం వల్ల ఆయనపై జాతీయ స్థాయి పార్టీ బాధ్యతల భారాన్ని తగ్గించడం ఇటు రాజకీయంగా, అటు మాన‌వీయ కోణంలో చూసినా అవసరంగా క‌నిపిస్తోంది. అయితే ఆయనకున్న సీనియారిటీ, గౌరవాన్ని కాపాడుతూ ఆయన్ను రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా కొనసాగించడం ద్వారా పార్లమెంట్‌లో పార్టీ పట్టు చేజారకుండా చూసుకోవచ్చ‌ని కూడా అంచ‌నా వేస్తున్నారు.

కర్ణాటకలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం కుర్చీ కోసం జరుగుతున్న అంతర్గత పోరు  మ‌రీ ముఖ్యంగా కేబినెట్ మార్పులు, కొందరు ఎమ్మెల్యేల ఢిల్లీ పర్యటనల నేపథ్యంలో.. పార్టీకి తలనొప్పిగా మారింది.

సిద్ధరామయ్య ప్లస్ పాయింట్స్ ఏంటో చూస్తే,  వెనుకబడిన వర్గాలు, దళితులు, మైనారిటీల.. ఓటు బ్యాంకుపై సిద్ధరామయ్యకు ఉన్న పట్టును కాంగ్రెస్ వదులుచుకోలేదు. ఆయన్ను 2028 ఎన్నికల వరకు సీఎంగా ఉంచడం ద్వారా కర్ణాటక ప్రభుత్వ స్థిరత్వానికి ఢోకా ఉండద‌ని భావిస్తోంది హ‌స్తం పార్టీ.

ఇక డీకే శివకుమార్‌కు కేవలం కర్ణాటక డిప్యూటీ సీఎం పదవి చాలా చిన్నది. ఆయనకున్న  ట్రబుల్ షూటర్ ఇమేజ్, ఆర్గనైజేషనల్ స్కిల్స్,  ఆర్థిక వనరులను సమకూర్చగల సామర్థ్యం.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చాలా చాలా అవసరం. ఆయన్ను నేరుగా ఏఐసీసీ ప్రెసిడెంట్  చేయడం ద్వారా దేశవ్యాప్తంగా క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కూడా  నింపిన‌ట్టు అవుతుంది.

డీకే శివకుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే ఆయన ఎమ్మెల్యే పదవికి, కర్ణాటక పీసీసీ  అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి ఆయన తమ్ముడు, మాజీ ఎంపీ అయిన డీకే సురేష్‌ను అసెంబ్లీకి పంపడం ద్వారా కనకపుర నియోజకవర్గంలో డీకే ఫ్యామిలీ పట్టు అలానే ఉంటుంది.

పీసీసీ పదవిని డీకే వర్గానికి చెందిన లేదా సిద్ధరామయ్యకు నమ్మకస్తుడైన ఒక సీనియర్ నేతకు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో సమతుల్యత  దెబ్బతినకుండా చూసుకోవచ్చు.

ఈ వ్యూహం సక్సెస్ అయితే కాంగ్రెస్‌కు వచ్చే లాభాలు.. ఎలాంటివో చూస్తే.. సౌత్ ఇండియా సెంటిమెంట్ బాగా వ‌ర్క‌వుట్ అవుతుంది.  ఖర్గే  తర్వాత మళ్లీ సౌత్ ఇండియా.. అది కూడా కర్ణాటక నుంచే మరో పవర్‌ఫుల్ లీడర్ ఏఐసీసీ పగ్గాలు చేపట్టినట్టు అవుతుంది.

ఆగ్ర‌స్సివ్ పాలిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే.. బీజేపీని వారి శైలిలోనే ఢీకొట్టడానికి డీకే శివకుమార్ లాంటి దూకుడున్న నాయకుడు ఏఐసీసీ చీఫ్‌గా పర్ఫెక్ట్ ఛాయిస్.

ఈ కుర్చీ లాటరీకి ఎండ్ కార్డ్ పడితే, సిద్ధరామయ్య ప్రభుత్వం పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చు. ఈ ఢిల్లీ లీక్స్  గనుక నిజమైతే, రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంతర్గత నిర్మాణంలో చాలా పెద్ద మార్పులు చూడబోతున్నాం. డీకే శివకుమార్ జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి పార్టీని ఏ మేరకు ముందుకు నడిపిస్తారనేది అత్యంత ఆసక్తికరం!

By
en-us Political News

  
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
కేవలం తన కోటరీ మాటలు నమ్మి ప్రజా క్షేత్రానికి దూరం కావడం వల్లే ఘోర పరాజయాన్ని చవిచూశారు. అయితే 2024 ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిత్వం ప్రజలకు చేరువగానే ఉంటోంది. ఇక తాజాగా ఈ నెల 9 నుంచి 15 వరకూ ప్రజాబాట కార్యక్రమాలను నిర్వహించనుంది.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పై తన విమర్శల మోతాదు పెంచారు. ఒక భూమి విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెరు లాగి మీడియా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అధికార తెలుగుదేశం పార్టీ (టీడీపీ) తమ అభ్యర్థుల ఎంపికను అధికారికంగా పూర్తి చేసింది.
ఈ గ్లోబల్ ఎక్స్‌పోజర్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేడు ఆయనను జాతీయ స్థాయి రాజకీయాలకు, ముఖ్యంగా రాజ్యసభ కు సమర్థుడైన అభ్యర్థిగా నిలబెడుతున్నాయి. 2019 ఎన్నికలలో తెలుగుదేశం ఓటమి తరువాత టీడీపీ తీవ్ర సంక్షోభంలో ఉన్న తరుణంలో.. సాంప్రదాయ మీడియా కంటే డిజిటల్ మీడియా ద్వారా అధికార పక్షాన్ని ఎదుర్కోవడం ముఖ్యమని పార్టీ గుర్తించింది
ప్రస్తుత జాతీయ రాజకీయాల పరిస్థితులు, పార్టీ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకుని చింతకాయల విజయ్ రాజ్యసభకు పంపడమే సముచితమని ఆయన నిర్ణయించారు. ప్రస్తుతం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోంది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న తరుణంలో పార్లమెంట్‌లో పార్టీ గళాన్ని బలంగా వినిపించగల యువ, విద్యావంతులైన నాయకత్వం అవసరమని చంద్రబాబు భావించినట్లు కనిపిస్తోంది.
అన్నామలై ఇప్పుడు నేరుగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో చేతులు కలపబోతున్నారనే వార్త దావానలంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ కలిసి తమిళనాడులో ఒక సరికొత్త ప్రాంతీయ పార్టీని స్థాపించేందుకు సన్నాహాలు చేస్తున్నారనే వదంతులు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
అలాగే అంతర్జాతీయ వాణిజ్యాన్ని ఊహించని రేంజ్‌లో పెంచడానికి ఈ ప్రాజెక్ట్ దేశానికి ఎంతో రక్షణ, ఆర్థిక ప్రయోజనకరమని కేంద్ర ప్రభుత్వం బలంగా చెప్తోంది. అయితే ఈ మెగా ప్రాజెక్టుపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ, ఇది దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందన్న పవన్ కల్యాణ్ ప్రకటనపై స్పందించిన ప్రకాశ్ రాజ్ సింగిల్ గానా, పొత్తుతోనా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు.
పవన్ రాజకీయ అవగాహనారాహిత్యానికి ఆయన వ్యాఖ్యలే తార్కానమన్నారు. ప్రపంచ పరిణామాలు ఏదిశగా నడుస్తున్నాయో కూడా ఆయనకు అర్థం కావడం లేదన్న వీ శ్రీనివాసరావు. . తమిళనాడులో సినీ నటుడు విజయ్ గెలుపు తర్వాత పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి తీవ్రంగా ఉండడంతో ఆయన నిస్పృహనకు లోనవుతూ.. దీనివల్ల ఆయన ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.
తమిళనాట విజయ్ సునామీ ప్రకంపనలు సద్దుమణగక ముందే, తమిళనాట మరో సీనియర్ సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు పొలిటికల్ స్క్రీన్ పైకి రావడం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.